ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము.
ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి ఉంది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయలలో వర్గాలూ ఉంటాయి. మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తాలు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10,580 ఋక్కులు 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి. అవి 1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన. వీటిలో మొదటిదైన శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాథలు తెలుపుతాయి. దీనిలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది. ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదంగా పరిగణిస్తారు. వర్షాలు పడాలంటే పర్జన్య సూక్తాలు పఠించాలని సూచింపబడింది. "ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వత" అనే సూక్త పఠనం మానవులను దీర్ఘాయుష్కులను చేస్తుందని నమ్ముతారు. శంకరాచార్యులు ఋగ్వేదాన్ని ప్రశంసించారు.
ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వినీసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి... ఖేలుడు అనే రాజు భార్య, యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.
ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిఃలో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను ఆధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం" మొదలైన మంత్రాలలో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.
మండలాలు | మండల విభాగం సూక్తసంఖ్య | ఋక్కులు |
1 | 191 | 2006 |
2 | 43 | 429 |
3 | 62 | 617 |
4 | 58 | 589 |
5 | 87 | 727 |
6 | 75 | 765 |
7 | 104 | 842 |
8 | 92 | 1635 |
9 | 114 | 1108 |
10 | 191 | 1754 |
మొత్తం | 1,017 | 10,472 |
వాలఖిల్య సూక్తాలు | 11 | 80 |
మొత్తం | 1,028 | 10,552 |
అష్టకం | సూక్తాలు | అష్టక విభాగం వర్గలు | ఋక్కులు | అక్షరాలు |
1 | 121 | 265 | 1370 | 48,931 |
2 | 119 | 221 | 1147 | 51,718 |
3 | 122 | 225 | 1209 | 47,636 |
4 | 140 | 250 | 1289 | 49,762 |
5 | 129 | 238 | 1263 | 48,022 |
6 | 124 | 313 | 1650 | 48,412 |
7 | 116 | 248 | 1263 | 47,562 |
8 | 146 | 246 | 1281 | 52,178 |
మొత్తం | 1,017 | 2006 | 10,472 | 3,94,221 |
వాలఖిల్య సూక్తాలు | 11 | 18 | 80 | 3,044 |
మొత్తం | 1,028 | 2024 | 10,552 | 3,97,265 |
బుగ్వేదంలో తెల్పబడినట్లు దేవపదము, దేవతలు అంటే యుస్కముని అర్థమును నిరుక్తమున వ్రాసియున్నాడు. 1. దానము: తమకున్నవి ఇతరులకు ఇచ్చుట దానము. వీరిని దేవపద మని పిలుస్తారు. 2. దీపనాత్: ప్రకాశింప చేయుట వలన సూర్యాదిలోకాలు దేవపదముచే పిలువబడుచున్నవి. 3. ద్యోతనము: సత్యమును, విద్యను ఉపదేశించుటచే పెద్దలు దేవపద మనబడుచున్నారు. 4. ధ్యుస్థానము: అంతరిక్షమున ప్రకాశించు కిరణాలు ప్రాణములు, ప్రకాశకిరణాలు. అందుచేత దేవపదమని పిలువబడుచున్నవి. దేవతలు: శతపధ బ్రాహ్మణమున యాజ్ఞవల్క్యుడు శాకల్యునితో త్రయస్త్రింశ దేవ దేవాః సంతి అని వ్యావహారికమున 33 దేవతలు కలరు. 8 మనువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి కలిసి 33 గా దేవతలు భగవంతుని సృష్టిగా చెప్పబడింది. 1,అష్టమవసువులు: అగ్ని, భూమి, వాయువు, ఆకాశము, ప్రకాశమయుద్యువాకం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అనేవి 8 ఉన్నాయి. 2, ఏకాదశరుద్రులు: ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అని దశప్రాణములు, మనస్సు కలిసి పదకొండు. 3, ద్వాదశాదిత్యులు: చైత్రము మొదలు ఫాల్గుణం వరకు 12 నెలలు. 4, ఇంద్రుడు: విద్యుత్తు (మెరుపు) 5, ప్రజాపతి: యజ్ఞము పదార్థములు అన్నియు వీనియందు వుండుట వలన వస్తువులు అన్నారు. ఇవి శరీరము నుండి వెడలి పోవునపుడు మరణములన్నారు. బంధువులు రోదింతురు కావున రుదృలు అన్నారు. పండ్రెడు మాసాలు ఆయువును గ్రహించును గతించును కావున ఆదిత్యులన్నారు. జీవితో శరీరం విద్యుత్తు (మెరుపు) కల్గి వుండటం ఇంద్రుడు, వాయువు, వర్షజలము శుద్ధి చేయబడుటచే యజ్ఞముగా ప్రజాపతిగా పిలవబడుచున్నారు. మానవులు తమ జ్ఞాననేత్రంతో సర్వం గ్రహించవచ్చు. ఆచరించనూ వచ్చు. తమ నమ్మకమే నిజం మాత్రం కాదు. మతం అనేది మేలుకొలుపు కావాలి. దైవత్వం సృష్టి అనేదే దేవుడు అని భావించాలి.
This article uses material from the Wikipedia తెలుగు article ఋగ్వేదం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.