లైబీరియా: ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం

6°30′N 9°30′W / 6.500°N 9.500°W / 6.500; -9.500

రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా

Flag of లైబీరియా
జండా
Coat of arms of లైబీరియా
Coat of arms
నినాదం: "The love of liberty brought us here"
గీతం: All Hail, Liberia, Hail!
Location of  లైబీరియా  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  లైబీరియా  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

Location of లైబీరియా
రాజధాని
and largest city
Monrovia
6°19′N 10°48′W / 6.317°N 10.800°W / 6.317; -10.800
అధికార భాషలుEnglish
Spoken and national languages
  • Liberian English
జాతులు
(2008)
  • 20.3% Kpelle
  • 13.4% Bassa
  • 10.0% Grebo
  • 8.0% Gio
  • 7.9% Mano
  • 6.0% Kru
  • 5.1% Lorma
  • 4.8% Kissi
  • 4.4% Gola
  • 20.1% others
మతం
Christianity (85.6%), Islam (12.2%), Others (2.2%)
పిలుచువిధంLiberian
ప్రభుత్వంUnitary presidential republic
• President
Ellen Johnson Sirleaf
• Vice President
Joseph Boakai
• Speaker of the House
Alex J. Tyler
• Chief Justice
Francis Korkpor, Sr.
శాసనవ్యవస్థLegislature of Liberia
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
House of Representatives
Formation and Independence
• Settlement by the American Colonization Society
January 7, 1822
• Liberian Declaration of Independence
July 26, 1847
• Annexation of Republic of Maryland
March 18, 1857
• Recognition by the United States
February 5, 1862
• Current constitution
January 6, 1986
విస్తీర్ణం
• మొత్తం
111,369 km2 (43,000 sq mi) (103rd)
• నీరు (%)
13.514
జనాభా
• 2015 estimate
4,503,000 (125th)
• 2008 census
3,476,608 (130th)
• జనసాంద్రత
40.43/km2 (104.7/sq mi) (180th)
GDP (PPP)2017 estimate
• Total
$3.879 billion
• Per capita
$881
GDP (nominal)2017 estimate
• Total
$2.106 billion
• Per capita
$478
జినీ (2007)38.2
medium
హెచ్‌డిఐ (2015)Steady 0.427
low · 177th
ద్రవ్యంLiberian dollara (LRD)
కాల విభాగంUTC+0 (GMT)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+231
Internet TLD.lr

లైబీరియా అధికారికంగా " రిపబ్లికు ఆఫ్ లైబీరియా " పశ్చిమ ఆఫ్రికా తీరంలో ఒక దేశం. దేశ పశ్చిమసరిహద్దులో సియెర్రా లియోన్, ఉత్తర సరిహద్దులో గినియా, తూర్పు సరిహద్దులో ఐవరీ కోస్ట్ సరిహద్దులుగా ఉన్నాయి. దేశ వైశాల్యం 1,11,369 చదరపు కిలో మీటర్ల (43,000 చ.మై), జనసంఖ్య 45,03,000 ఉన్నాయి. భాష అధికారిక భాష ఆగ్లం. దేశ ప్రజలలో 20 కంటే అధికమైన దేశీయ భాషలు (95% కంటే ఎక్కువ మంది) వాడుకలో ఉన్నాయి. దేశం రాజధాని అతిపెద్ద నగరం మన్రోవియా.

తీరప్రాంతాల్లోని అడవులు ఎక్కువగా ఉప్పును తట్టుకోగల మడ అడవులు ఉంటాయి. స్వల్పంగా జనసాంధ్రత కలిగిన లోతట్టు ప్రాంతాలలో ఆరిన శుష్కగడ్డి మైదానంతో అరణ్యప్రాంతాలు ప్రారంభమవుతుంది. మే - అక్టోబరు వరకూ కొనసాగే వర్షాకాలంలో గణనీయంగా వర్షపాతం నమోదౌతూ ఉంటుంది. మిగిలిన సంవత్సరంలో కఠినమైన హార్మట్టను గాలులు. ఉన్నత గినియా నది వర్షారణ్యంలో 40% లైబీరియా ఉంటాయి. లైబిరియా 20 వ శతాబ్దం ప్రారంభంలో ముఖ్యమైన రబ్బరు ఉత్పత్తి దేశంగా అభివృద్ధి చెందింది.

నల్లజాతీయులు మంచి అవకాశాల కొరకు అమెరికా వలసరాజ్యాల కంటే ఆఫ్రికాస్వేచ్ఛ కొరకు అధికమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్వసించిన లైబిరియా " అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ (ఎ.సి.ఎస్.) " స్థాపించింది. 1847 జులై 26 న దేశం స్వాతంత్రం ప్రకటించింది. యునైటెడు కిండం లైబీరియా స్వాతంత్రాన్ని గుర్తించిన మొదటి దేశంగా ప్రత్యేకత సంతరించుకుంది. 1862 ఫిబ్రవరి 5 న అమెరికా అంతర్యుద్ధం వరకు యు.ఎస్. లైబీరియా స్వాతంత్రాన్ని గుర్తించలేదు. 1822 జనవరి 7 న అమెరికా అంతర్యుద్ధం తరువాత యు.ఎస్. శాసన పరిమితులను ఎదుర్కొన్న 15,000 కంటే అధికమైన నల్లజాతీయులు, 3,198 ఆఫ్రో-కారిబ్బియన్లు స్థావరానికి మార్చాబడ్డారు. నల్లజాతి సెటిలర్లు వారితో వారి సంస్కృతిని లైబీరియాతో తీసుకెళ్లారు. సంయుక్త రాష్ట్రాల తర్వాత లైబ్రేరియన్ రాజ్యాంగం, జెండా రూపొందించబడ్డాయి. 1848 జనవరి 3 న లైబీరియాలో స్థిరపడిన వర్జీనియాకు చెందిన సంపన్నమైన ఆఫ్రికా అమెరికన్ " జోసెఫు జెంకిన్సు రాబర్ట్సు " లిబెరియా మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

ఏ ఇతర శక్తి నుంచి తిరుగుబాటు ద్వారా స్వాతంత్ర్యం పొందకుండా స్వీయ-ప్రకటిత స్వాతంత్రాన్ని కలిగి ఉన్న ఏకైక ఆఫ్రికన్ రిపబ్లికుగా లైబీరియా ప్రత్యేకత సంతరించుకుంది. ఆఫ్రికా ఆధునిక గణతంత్ర దేశాలలో లైబీరియా మొట్టమొదటి పురాతన గణతంత్ర దేశంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఆఫ్రికా కొరకు వలసరాజ్యాలు పెనుగులాడుతున్న సమయంలో కూడా లైబీరియా స్వాతంత్రాన్ని నిలుపుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో లైబీరియా జర్మనీకి వ్యతిరేకంగా అమెరికా సంయుక్తరాష్ట్రాల యుద్ధ ప్రయత్నాలకు మద్దతిచ్చింది. బదులుగా యు.ఎస్. లైబీరియాలో గణనీయమైన మౌలిక సదుపాయాల నిర్మాణం కొరకు పెట్టుబడులు పెట్టింది. దీంతో దేశం ప్రధాన వైమానిక రవాణా సౌకర్యాలను ఆధునీకరించడానికి, మెరుగుపర్చడానికి ఇది సహాయపడింది. అదనంగా అధ్యక్షుడు విలియం టబ్మాన్ ఆర్ధిక మార్పులకు ప్రోత్సహం అందించాడు. అంతర్జాతీయంగా లైబీరియా లీగ్ ఆఫ్ నేషన్స్, ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ సంస్థలకు వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.

1980 లో విలియం ఆర్. టోల్బర్టు పాలనకు ఎదురైన వ్యతిరేకత రాజకీయ ఉద్రిక్తతలు సైనిక తిరుగుబాటుకు కారణమయ్యాయి. తిరుగుబాటులో ఆయన నాయత్వన్ని త్రీసిపుచ్చింది. ఆయన మరణం తరువాత సంవత్సరాల కాలం రాజకీయ అస్థిరత్వం ప్రారంభమైంది. తరువాత పీపుల్సు రిడంప్షన్ కౌన్సిలు పేరుతో 5 సంవత్సరాల సైనిక పాలన, తరువాత నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ లైబీరియా ఐదు సంవత్సరాల పౌర పాలన తరువాత మొదటి, రెండవ లైబరియా పౌర యుద్ధాలు జరిగాయి. ఈ ఫలితంగా పలు మరణాలు, మిలియన్ల మందికి కంటే అధికంగా ప్రజల స్థానభ్రంశం సంభవించాయి. అంతర్యుద్ధాలు లైబీరియా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసాయి. 2003 లో ఒక శాంతి ఒప్పందం 2005 లో ప్రజాస్వామ్య ఎన్నికలకు దారితీసింది. అందులో ఎల్లెను జాన్సను సర్లీఫు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. పునరుద్ధరణ కొనసాగుతున్నప్పటికీ 85% ప్రజలు అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. ఎబోలా వైరసు అంటువ్యాధి ద్వారా లైబీరియా ఆర్థిక, రాజకీయ స్థిరత్వం 2010 లో ప్రమాదంలో పడింది. 2013 డిసెంబరులో గినియాలో ఇది ప్రారంభమై 2014 మార్చిలోలో లైబీరియాలోకి ప్రవేశించింది. 2015 మే 8 న ఇది అధికారికంగా ముగింపుకు వచ్చింది.

చరిత్ర

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
A European map of West Africa and the Grain Coast, 1736. It has the archaic mapping designation of Negroland.

12 వ శతాబ్దం నాటికి పెప్పరు కోస్టు ( గ్రెయిన్ కోస్టు అని కూడా పిలుస్తారు) ఆఫ్రికా దేశీయ ప్రజలకు నివసప్రాంతం అయింది. మెండే భాషా వాడుకరులు ప్రజలు సూడాన్కు పశ్చిమంగా విస్తరిస్తూ అనేక చిన్న జాతుల సమూహాలు దక్షిణంలో అట్లాంటికు సముద్రం వైకు తరలి వెళ్ళేలా బలవంతం చేయబడ్డారు. ది డె, బస్సా, క్రు, గోలా, కిస్యిలు ఈ ప్రాంతం లోని మొట్టమొదటి ప్రజలుగా నమోదు చేయబడ్డారు.

1375 లో - 1591 లో ఈ సమూహాల ప్రవాహం పాశ్చాత్య సుడానిక్ మాలి సామ్రాజ్యం, థాయిలాండు సామ్రాజ్యం క్షీణతకు కారణం అయింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలలో ఎడారీకరణ జరిగింది. నివాసులు తేమభూములు ఉన్న తీరప్రాంతాలకు తరలిపోయారు. ఈ కొత్త నివాసులు మాలి, సంఘై సామ్రాజ్యాల నుండి కాటన్ స్పిన్నింగ్, వస్త్రం నేత, ఇనుప కట్టడం, బియ్యం, జొన్న సాగు, సామాజిక, రాజకీయ సంస్థలు వంటి నైపుణ్యాలను తీసుకువచ్చారు. మానే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న కొంతకాలం తర్వాత మాజీ మాలి సామ్రాజ్యానికి చెందిన వాయి ప్రజలు గ్రాండు కేపు మౌంటు కౌంటీ ప్రాంతానికి వలస వచ్చారు. క్రూ వాయి సమూహానికి చెందిన ప్రజలు ఈ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తూ, మానెతో సంకీర్ణమై వాయి ప్రజలను ఆపడానికి ప్రయత్నించారు.


తీరప్రాంత ప్రజలు కానోలను నిర్మించి కాప్-వర్ట్ నుండి గోల్డ్ కోస్ట్ వరకు ఇతర పశ్చిమ ఆఫ్రికన్లతో కలిసి వాటిని విక్రయించారు. ఉత్తరప్రాంతం నుండి అరబు వర్తకులు ఈ ప్రాంతానికి వచ్చారు. దీర్ఘ-కాల బానిస వాణిజ్యం ఉత్తర, తూర్పు ఆఫ్రికాకు బంధీలను తీసుకుంది.

Early settlement

1461 నుండి 17 వ శతాబ్దం మధ్యలో పోర్చుగీసు, డచ్చి, బ్రిటీషు వర్తకులు ఈ ప్రాంతంలోని సంబంధాలు, వర్తక స్థావరాలు కలిగి ఉన్నారు. పోర్చుగీసు ఈ ప్రాంతానికి కోస్టా డీ పిటినా ("పెప్పర్ కోస్ట్") అనే పేరు పెట్టింది. కానీ తరువాత అది మెలెగెటా మిరియాలు గింజల సమృద్ధి కారణంగా ఇది గ్రెయిను కోస్టు అని పిలువబడింది. యూరోపియన్ వర్తకులు స్థానిక ప్రజల వస్తువుల సరఫరా, వస్తువులను రవాణా చేస్తారు.

యునైటెడు స్టేట్సులో స్వేచ్ఛను పొందిన నల్లజాతీయులకు జన్మించిన ప్రజలపట్ల చూపుతున్న జాతి వివక్షతను వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలైంది. సంయుక్త రాష్ట్రాలలో నల్లజాతీయులకు పౌర, మత, సామాజిక అధికారాలను తిరస్కరించడానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. చాలామంది శ్వేతజాతీయులు, నల్ల జాతీయుల చిన్నస్థాయి కార్యకర్తలు, నల్లజాతీయుల వారు యు.ఎస్. లో కంటే ఆఫ్రికాలో స్వేచ్ఛాయుతమైన అవకాశాలున్నాయని అని భావించారు.1816 లో వాషింగ్టను డి.సిలో ఈ ప్రయోజనం కోసం ప్రముఖ రాజకీయ నాయకులు, బానిసల సమూహంచే " అమెరికన్ వలసరాజ్యాల సమాజం " స్థాపించబడింది. కానీ బానిసత్వం రద్దు చేయడాన్ని సమర్ధించే వ్యక్తులతో సభ్యుల సంఖ్య అధికరించింది. దక్షిణప్రాంతం వెలుపల బానిసలను ఉపయోగిస్తున్న వారు బానిసత్వం నుండి విముక్తి పొందిన ప్రజలను కోరుకున్నారు. వారు బానిస సంఘాలను బెదిరించడానికి అవకాశం ఉందని భావించారు. కొందరు నిర్మూలనకారులు విముక్తులైన నల్లజాతీయులను తిరిగి ఉపయోగించవచ్చని భావించారు. నల్లజాతి ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న జాతి వివక్షకు నిరుత్సాహపరచబడతారని వారు పెద్ద సమాజంలో ఎన్నటికీ ఆమోదించబడరని వారు విశ్వసించారు. ఈ సమయంలో జన్మించిన చాలామంది నల్లజాతీయులు యునైటెడ్ స్టేట్సు నుండి వలస వెళ్ళడం కంటే న్యాయం వైపు పని చేయాలని కోరుకున్నారు.ఉత్తరంలో ప్రముఖ కార్యకర్తలు ఎ.సి.ఎసు.ను గట్టిగా వ్యతిరేకించారు. కానీ కొంతమంది విముక్తులైన నల్లజాతీయులు వేరొక పర్యావరణాన్ని ఎదుర్కొనడానిక్ సిద్ధంగా ఉన్నారు.

1822 లో " అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ " నల్లజాతి వాలంటీర్లను పెప్పరు కోస్టుకు పంపించటం ప్రారంభించారు. 1867 నాటికి ఎసిఎస్ (రాష్ట్ర-సంబంధిత అధ్యాయాలు) 13,000 కన్నా ఎక్కువ నల్లజాతీయుల లైబీరియాకు పంపింది. ఈ విముక్త ఆఫ్రికా-అమెరికన్లు వారి వారసులు వారి సమాజంలో వివాహం చేసుకున్నారు. అమెరికా-లైబీరియన్లుగా గుర్తించబడ్డారు. అనేకమంది మిశ్రమ జాతి ప్రజలు అమెరికా సంస్కృతిలో చదువుకున్నారు. వారు స్థానిక గిరిజనులుగా గుర్తించబడలేదు. వారు అధికంగా వలసవాదుల సమాజంలోని వారితో జాత్యంతర వివాహం చేసుకున్నారు. వారు రాజకీయ రిపబ్లికనిజం, ప్రొటెస్టంటు క్రైస్తవ మతం అమెరికా భావాలతో నిండిన ఒక సాంస్కృతిక సాంప్రదాయాన్ని కలిగి ఉన్న ఒక జాతి సమూహాన్ని అభివృద్ధి చేశారు.

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
ఎసిఎస్ సృష్టించిన 1830 లలో లైబీరియా కాలనీ మ్యాపు, మిస్సిస్సిప్పి కాలనీ, ఇతర ప్రభుత్వ కాలనీలను కూడా చూపిస్తుంది

అబ్రహం లింకను, హెన్రీ క్లే, జేమ్సు మన్రో వంటి ప్రసిద్ధ అమెరికా రాజకీయ నాయకులు ప్రైవేట్ సంస్థ ఎ.సి.ఎసుకు మద్దతిచ్చారు. ప్రభుత్వ ఆధారిత సంస్థలు మిస్సిస్సిప్పి-ఇన్-ఆఫ్రికాలో కాలనీలను స్థాపించారు. తరువాత ఇవి లైబీరియాచే విలీనం చేయబడ్డాయి.

అమెరికన్-లైబీరియన్ నివాసులు స్థానిక ప్రజలుగా గుర్తించబడలేదు. ప్రత్యేకించి మరింత ఏకాంతంగా ఉండే "బుష్" సంఘాల్లో. వారికి సంస్కృతులు, భాషలు, మత విశ్వాసాల గురించి ఏమీ తెలియదు. బుషులో గిరిజన ఆఫ్రికన్లతో కలహాలు తరచుగా హింసాత్మక ఘర్షణలుగా అభివృద్ధి చెందాయి. వలసరాజ్యాల స్థావరాలు క్రు, గ్రోబో వారి అంతర్గత సంస్థానాధీసుల నుండి దాడులు జరిగాయి. స్వదేశీ ప్రజలకు వారి సంస్కృతి, విద్యాధిఖ్యత అనుభవించిన కారణంగా, అమెరికా-లైబీరియన్లు రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్న ఒక చిన్న ఉన్నత సమాజంగా అభివృద్ధి చెందారు. స్థానిక అమెరికన్లుగా వారు యునైటెడు స్టేట్సులో ఎదుర్కొన్న వివక్ష పునరావృతం అయినట్లు భావించబడింది. 1904 వరకు వారి సొంత భూభాగాల్లో పౌరసత్వం నుండి వారిని మినహాయించింది. ఎథోనోసెంట్రిం, సాంస్కృతిక శూన్యత కారణంగా అమెరికా-లైబీరియన్లు గిరిజనులను ఏకీకరించడానికి పశ్చిమ దేశాల శైలిని సృష్టించేందుకు ఊహించారు. వారు స్థానిక ప్రజలను విద్యావంతులను చేసేందుకు మిషన్లు, పాఠశాలలను ఏర్పాటు చేయడానికి మత సంస్థలను ప్రోత్సహించారు.

ప్రభుత్వం

1847 జూలై 26 న స్థిరపడినవారు స్వతంత్ర ప్రకటనను ప్రకటించి ఒక రాజ్యాంగాన్ని ప్రకటించారు. యునైటెడు స్టేట్సు రాజ్యాంగంలోని రాజకీయ సూత్రాల ఆధారంగా వారు " లిబెరయ స్వతంత్ర రిపబ్లికు " ను స్థాపించారు. యునైటెడు కింగ్డం లిబెరియా స్వాతంత్రాన్ని గుర్తించిన మొట్టమొదటి దేశంగా ప్రత్యేకత సంతరించుకుంది.

నూతన దేశానికి అమెరికాలో-లైబీరియన్లు నాయకత్వం వహించారు. ప్రారంభంలో ఎ.సి.ఎసు. కొనుగోలు చేసిన తీర ప్రాంతాలలో రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని స్థాపించారు. వారు ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో యునైటెడు స్టేట్సుతో సంబంధాలు కొనసాగించారు. ఫలితంగా వర్తకం అభివృద్ధి చేశారు. ఎంట్రీ యాక్టు 1865 పోర్టుల పాస్పోర్టులలో గిరిజనులతో విదేశీ వాణిజ్యాన్ని నిషేధించింది. ఈ ప్రాంతంలో ఇటువంటి వాణిజ్యం అనుమతించబడటానికి ముందు "నాగరిక విలువలు వృద్ధి చెందడానికి ప్రోత్సహిస్తాయి".

1877 నాటికి అమెరికో-లైబీరియన్ ట్రూ విగ్ పార్టీ దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఉంది.

20 వ శతాబ్దంలో అమెరికన్-లైబీరియన్ జాతి సమూహం సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని బాగా నిర్వహించారు. వీరు ఆఫ్రికాలోని ఇతర దేశాలలో ఉన్న ఐరోపా కాలనీవాసుల నమూనాలను పునరావృతం చేసారు.కార్యాలయంలో పోటీ సాధారణంగా పార్టీలో ఉంటుంది. వాస్తవంగా ఒక పార్టీ నామినేషను ఎన్నికలను నిర్ధారించింది.

యునైటెడు కింగ్డం నుండి ఒత్తిడి పశ్చిమాన సియెర్రా లియోనెను నియంత్రించింది. ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఫ్రాన్సు జోక్యంతో లైబీరియా విస్తారమైన భూభాల నియంత్రణను కోల్పోయింది. సియెర్రా లియోనె, ఐవరీ కోస్టు రెండూ కొన్ని భూభాగాలను విలీనం చేసుకున్నాయి. లైబీరియా మౌలిక సదుపాయాలను, పెద్ద, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిని ఆకర్షించడానికి కష్టపడింది.

19 వ శతాబ్దం చివర్రిలో లైబీరియన్ వస్తువుల ఉత్పత్తిలో క్షీణత సంభవించింది. ప్రభుత్వం ఆర్ధికంగా పోరాడుతూ, వరుస అంతర్జాతీయ రుణాల మిద ఆధారపడడం అధికరించింది. 1892 జూలైన మార్తా అన్ ఎర్కిను రిక్సు విండ్సరు కోట వద్ద విక్టోరియా రాణిని కలుసుకుని లైబీరియా మొట్టమొదటి దౌత్య బహుమతిగా చేతితో చేసిన కళాఖండాన్ని అందజేశాడు. టేనస్సీ లో బానిసకు జన్మించిన రిక్సు "నేను క్వీన్ నా ప్రజలకు ఎంత మంచి చేసారో తరచుగా విన్నారు - బానిసల విముక్తి కొరకు ఆమె కోరుకుంది " అని పేర్కొన్నాడు.

20th century

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
Charles D. B. King, 17th President of Liberia (1920–1930), with his entourage on the steps of the Peace Palace, The Hague (the Netherlands), 1927.

20 వ శతాబ్దం ప్రారంభంలో అమెరికా, ఇతర అంతర్జాతీయ దేశాలు రబ్బరు ఉత్పత్తిని ఒక ప్రధాన పరిశ్రమకు ప్రాధాన్యత ఇచ్చాయి.

20 వ శతాబ్దం మధ్యకాలంలో క్రమంగా అమెరికా సహాయంతో లైబీరియాలో ఆధునీకరణ ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడు స్టేట్సు నాజీలకు వ్యతిరేకంగా తన సైనిక ప్రయత్నాలకు మద్దతుగా ఆఫ్రికా, ఐరోపాలో ప్రధాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రవేశించడానికి ముందు లాండ్-లీజ్ కార్యక్రమంలో ఫ్రీపోర్టు ఆఫ్ మొరోవియా, రాబర్టు ఇంటర్నేషనలు ఎయిర్పోర్టును నిర్మించింది.

యుద్ధం తరువాత అధ్యక్షుడు విలియం టబ్మాన్ దేశంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు. 1950 వ దశకంలో లైబీరియా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వృద్ధి రేటును కలిగి ఉంది.

అంతర్జాతీయ వ్యవహారాలలో లైబీరియా మరింత చురుకైన పాత్ర పోషించటం ప్రారంభించింది. ఇది 1945 లో ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యదేశంగా దక్షిణాఫ్రికా వర్ణవివక్ష పాలనకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం ప్రారంభించింది. ఐరోపా వలస రాజ్యాలు ఆఫ్రికన్ స్వాతంత్ర్యం, పాన్-ఆఫ్రికలిజం వ్యతిరేకంగా పోరాడుతూ లైబీరియా ఆఫ్రికా ఐక్యత సంస్థకు నిధులు సమకూర్చటానికి సహాయపడింది.

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
యునైటెడ్ స్టేట్స్ కు సందర్శించిన సందర్భంగా కాస్పర్ వీన్బెర్గితో శామ్యూల్ డో, 1982
లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
రెండవ లైబరియన్ పౌర యుద్ధం సమయంలో మోన్రోవియాలో ఒక సాంకేతికత

1980 ఏప్రెలు 12 న క్రాంన్ జాతి సమూహం మాస్టరు సెర్జెంటు శామ్యూలు డో నేతృత్వంలో నిర్వహించిన సైనిక తిరుగుబాటులో అధ్యక్షుడు విలియమ్ ఆర్. టోల్బర్టు, జూనియరు హతమార్చబడ్డాడు. తర్వాత డో, ఇతర కుట్రదారులు టోల్బర్టు మంత్రి మండలిని, ఇతర అమెరికో-లైబీరియా ప్రభుత్వాధికారులను, ట్రూ విగ్ పార్టీ సభ్యులను హతమార్చింది. తిరుగుబాటు నాయకులు దేశాన్ని పాలించటానికి పీపుల్సు రిడంప్షను కౌన్సిలును స్థాపించారు. పశ్చిమదేశాల వ్యూహాత్మక మిత్రుడు డో యునైటెడు స్టేట్సు నుండి గణనీయమైన ఆర్ధిక సహాయాన్ని పొందాడు. అయినప్పటికీ విమర్శకులు అవినీతి, రాజకీయ అణచివేతను వ్యతిరేకిస్తూ పి.ఆర్.సి.ను ఖండించారు.

1985 లో లైబీరియా కొత్త రాజ్యాంగంను స్వీకరించిన తరువాత నిర్వహించిన ఎన్నికలలో డో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎన్నికలు మోసపూరితమైనవిగా అంతర్జాతీయంగా ఖండించబడ్డాయి. 1985 నవంబరు 12 న థామసు క్వివొంక్పా ప్రారంభించిన తిరుగుబాటు విఫలమైంది. తిరుగుబాటు సైనికులు కొంతకాలం జాతీయ రేడియో స్టేషనును ఆక్రమించారు. ప్రతిస్పందనగా ప్రభుత్వ అణచివేత తీవ్రమైంది. డో దళాలు నింబా కౌంటీలోని గియో, మానో జాతి సమూహాల సభ్యులకు మరణశిక్ష అమలు చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి.

1989 డిసెంబరులో బుర్కినా ఫాసో, ఐవరీ కోస్టు వంటి పొరుగుదేశాల నేపథ్య మద్ధతుతో చార్లెసు టైలరు నేతృత్వంలోని నేషనలు పేట్రియాటికు ఫ్రంటు తిరుగుబాటు సంఘం డో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటును ప్రారంభించింది. ఇది మొట్టమొదటి లైబీరియన్ పౌర యుద్ధానికి ప్రేరణ కలిగించింది. 1990 సెప్టెంబరు నాటికి డో బలగాలు రాజధాని వెలుపల కేవలం ఒక చిన్న ప్రాంతాన్ని మాత్రమే నియంత్రించాయి. తరువాత తిరుగుబాటు దళాలు డోను బంధించి ఆ నెలలోనే మరణశిక్షను అమలు చేసాయి.

తిరుగుబాటుదారులు త్వరలోనే ఒకరితో ఒకరు పోరాడుతూ వివిధ వర్గాలుగా విడిపోయారు. సంక్షోభంలో జోక్యం చేసుకోవడానికి వెస్టు ఆఫ్రికా స్టేట్సు ఆర్థిక సంఘం పర్యవేక్షణ గ్రూపు ఒక మిలటరీ టాస్క్ ఫోర్సును నిర్వహించింది. 1989 నుండి 1996 వరకు ఆఫ్రికాలో అత్యంత రక్తపాత పౌర యుద్ధాలు జరిగాయి. 2,00,000 మందికిపైగా లైబేరియన్లు ప్రాణాలు కోల్పోయారు, మిలియన్ల మంది పౌరులు పొరుగుదేశాలలోని శరణార్ధ శిబిరాలకు చేరుకున్నారు. 1995 లో పోరాడుతున్న పార్టీల మధ్య ఒక శాంతి ఒప్పందం జరిగింది. 1997 లో టేలర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


టైలరు నాయకత్వంలో లైబీరియా సియెర్రా లియోనె అంతర్యుద్ధంలో " రివల్యూషనరీ యునైటెడు ఫ్రంటు "కు నిధులు అందజేయడానికి " బ్లడ్ డైమండ్సు ", చట్టవిరుద్ధ కలప ఎగుమతులు ఉపయోగించడం వలన అంతర్జాతీయంగా ఒక వెలివేసిన దేశంగా గుర్తించబడింది. 1999 లో " లైబీరియన్సు యునైటెడు ఫర్ రీకాంసిలేషన్ అండ్ డెమాక్రసీ " పేరుతో దేశంలోని వాయువ్య ప్రాంతంలోని తిరుగుబాటు సంఘం టేలరుకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు ప్రారంభించడంతో లైబీరియా రెండవ అంతర్యుద్ధం ప్రారంభం అయింది.

2000

2003 మార్చిలో రెండవ తిరుగుబాటు బృందాలు " మూవ్మెంటు ఫర్ డెమోక్రసీ ఇన్ లైబీరియా " ఉద్యమం ఆరంభించి ఆగ్నేయం నుండి టేలరుకు వ్యతిరేకంగా దాడులు ప్రారంభించాయి. అదే సంవత్సరం జూనులో అక్రలో వర్గాల మధ్య ప్రారంభమైన శాంతి చర్చలు మొదలయ్యాయి. అదే నెలలో మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు టేలరు మీద సియెర్రా లియోనె ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగాలు మోపారు. 2003 జూలైనాటికి, తిరుగుబాటుదారులు మోన్రోవియాపై దాడి చేశారు. అంతర్జాతీయ సమాజం, " విమెన్ ఆఫ్ లైబీరియా మాస్ యాక్షన్ " వత్తిడి కారణంగా, టేలరు 2003 ఆగస్టులో రాజీనామా చేసి దేశం వదిలి నైజీరియాకు చేరుకున్నాడు. ఆ నెల తరువాత ఒక శాంతి ఒప్పందం సంతకం చేయబడింది. 2003 సెప్టెంబరులో భద్రత కల్పించడానికి, శాంతి ఒప్పందంపై పర్యవేక్షించడానికి " యునైటెడు నేషంసు మిషను ఇన్ లైబీరియా " వచ్చింది. అక్టోబరులో ఒక తాత్కాలిక ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది.


తరువాతి నిర్వహించిన 2005 ఎన్నికలు అంతర్జాతీయంగా లైబీరియన్ చరిత్రలో అత్యంత స్వేచ్ఛాయుతమైన, న్యాయమైనవిగా గుర్తించబడ్డాయి. ఎన్నికల ద్వారా హార్వర్డ్-శిక్షణ పొందిన ఆర్ధికవేత్త, మాజీ ఆర్థిక మంత్రి ఎల్లెన్ జాన్సన్ సిర్లీఫ్ ఆఫ్రికాలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. పదవీప్రమాణం సందర్భంలో సర్లఫ్ నైజీరియా నుండి టేలరును రప్పించమని అభ్యర్థించి అతడిని హేగ్లో విచారణ కోసం ఎస్.సి.ఎస్.ఎల్ కు బదిలీ చేసాడు. 2006 లో ప్రభుత్వం అంతర్యుద్ధానికి యుద్ధం కారణాలు తెలుసుకోవడానికి, నేరాలను పరిష్కరించడానికి ట్రూత్ అండ్ రికన్సిలిలేషన్ కమిషనును ఏర్పాటు చేసింది.

భౌగోళికం

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
A map of Liberia
లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
Liberia map of Köppen climate classification.

లైబీరియా పశ్చిమాఫ్రికాలో ఉంది. దేశం నైరుతీసరిహద్దులో ఆట్లాంటికు మహాసముద్రం ఉంది. 4-9 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 7-12 పశ్చిమ రేఖాంశంలో ఉంది.

లైబీరియా నైసర్గిక స్వరూపం అధికంగా వర్షారణ్యాలతో నిండిన సముద్రతీర మైదానాలు, చిత్తడి నేలలను కలిగి ఉంది. తీర ప్రాంత మైదానాలతో మొదలై ఈశాన్య ప్రాంతంలో కొంచెం ఎత్తైన పీఠభూమి, తక్కువ ఎత్తైన పర్వతాలు ఉంటాయి.

కొండలను ఉష్ణమండల వర్షారణ్యాలు కప్పివేస్తాయి. ఏనుగు గడ్డి, పాక్షిక-ఆకురాల్చు అడవులు ఉత్తర విభాగాలలోని వృక్షాలలో ఆఫ్హిఖ్యత కలిగి ఉంటాయి. భూమధ్యరేఖా సామీపప్రాంతం కనుక వాతావరణం సంవత్సరం పొడవునా వేడిగా ఉంటుంది. మే నుండి అక్టోబరు వరకు కొనసాగే అధిక వర్షపాతంలో జూలై నుండి ఆగస్టు వరకు మధ్యలో ఒక చిన్న విరామం ఉంటుంది. నవంబరు నుండి మార్చి వరకు శీతాకాలంలో పొడి దుమ్ముతో కూడిన హానికరమైన గాలులు వీస్తుంటాయి. దీని కారణంగా నివాసితులకు అనేక సమస్యలు ఏర్పడతాయి.

లైబీరియా వాటర్ షెడ్ సముద్రం వైపు నైరుతి వైపు కదులుతుంది. ఎందుకంటే గినియాలోని గైనీ అరణ్యప్రాంతంలో దిగువ పర్వత శ్రేణి నుండి మేఘాలు ఎగువ అటవీ భూభాగం వైపు పయనిస్తాయి. సియర్రా లియోనెతో సరిహద్దు దగ్గర కేప్ మౌంట్ దేశంలో అత్యంత అధికమైన అవపాతనం పొందుతుంది.

లైబీరియా ప్రధాన వాయువ్య సరిహద్దున మనో నది ప్రవహించగా, దాని ఆగ్నేయ సరిహద్దున కావల్ల నది ప్రవహిస్తుంది. లైబీరియా లోని మూడు అతిపెద్ద నదులు సెయింటు పాలు మోన్రోవియా నది (మొంరోవియా), సెయింటు జాను నది (బుచనన్), సెస్టోసు నది ఉన్నాయి. ఈ నదులు అన్నీ అట్లాంటికు మహాసముద్రంలో సంగమిస్తుంటాయి. 515 కిలోమీటర్లు (320 మైళ్ళు) పొడవుతో కావాలా దేశంలో అతి పొడవైన నదిగా గుర్తించబడుతుంది.


లైబీరియాలో ఉన్న ఎత్తైన ప్రదేశం వుతెవె పర్వతం. ఇది పశ్చిమ ఆఫ్రికా పర్వతాలు, గినియా హైలాండ్సు లోని వాయువ్య లైబీరియా పరిధిలో సముద్ర మట్టానికి 1,440 మీటర్లు (4,724 అడుగులు) ఎత్తున ఉంటాయి. అయినప్పటికీ యెకెపా దగ్గర ఉన్న నింబ పర్వతం సముద్ర మట్టానికి 1,752 మీటర్లు (5,748 అడుగులు) ఎత్తులో ఉంది. అయితే ఇవి పూర్తిగా లైబీరియాలో లేవు. నింబ పర్వతాలు గినియా, ఐవరీ కోస్టులతో సరిహద్దులను పంచుకుంటుంది.

కౌంటీలు, జిల్లాలు

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
A view of a lake in Bomi County

లైబీరియా పదిహేను కౌంటీలుగా విభజించబడింది. ఇది మొత్తం 90 జిల్లాలుగా ఉపవిభజన చేయబడింది. వీటిని అదనంగా క్లానులుగా ఉపవిభజన చేయబడింది. పురాతన కౌంటీలు గ్రాండు బస్సా, మొంటుసెర్రాడో. ఇవి 1839 లో లైబీరియా స్వాతంత్రానికి ముందు స్థాపించబడ్డాయి. 2001 లో గర్పోలు సరిక్రొత్త కౌంటీగా రూపొందించబడింది. 11,551 చ.కి.మీ వైశాల్యంతో ఉన్న నింబ నగరం అతిపెద్ద కౌంటీగా ఉంది. మోంటుసెర్రాడో 1,909 చ.కి.మీ. 2008 జనాభా లెక్కల ప్రకారం మొంటుసెరాడో 11,44,806 నివాసితులతో అత్యధిక జనాభా కలిగిన కౌంటీగా ఉంది.


పదిహేను కౌంటీలు అధ్యక్షుడిచే నియమించబడిన సూపరిండెంట్లచే నిర్వహించబడుతుంటాయి. రాజ్యాంగం కౌంటీలలోని స్థానిక స్థాయిలో వివిధ నాయకుల ఎన్నిక కోసం పిలుపునిచ్చినప్పటికీ 1985 నుండి ఈ ఎన్నికలు యుద్ధం, ఆర్థిక అడ్డంకులు కారణంగా జరగలేదు.

Map # County Capital Population
(2008 Census)
Area
(km2)
Number of
Districts
Date
Created
1 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Bomi Tubmanburg 82,036 1,942 km2 (750 sq mi) 4 1984
2 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Bong Gbarnga 328,919 8,772 km2 (3,387 sq mi) 12 1964
3 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Gbarpolu Bopolu 83,758 9,689 km2 (3,741 sq mi) 6 2001
4 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Grand Bassa Buchanan 224,839 7,936 km2 (3,064 sq mi) 8 1839
5 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Grand Cape Mount Robertsport 129,055 5,162 km2 (1,993 sq mi) 5 1844
6 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Grand Gedeh Zwedru 126,146 10,484 km2 (4,048 sq mi) 3 1964
7 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Grand Kru Barclayville 57,106 3,895 km2 (1,504 sq mi) 18 1984
8 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Lofa Voinjama 270,114 9,982 km2 (3,854 sq mi) 6 1964
9 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Margibi Kakata 199,689 2,616 km2 (1,010 sq mi) 4 1985
10 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Maryland Harper 136,404 2,297 km2 (887 sq mi) 2 1857
11 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Montserrado Bensonville 1,144,806 1,909 km2 (737 sq mi) 4 1839
12 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Nimba Sanniquellie 468,088 11,551 km2 (4,460 sq mi) 6 1964
13 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Rivercess Rivercess 65,862 5,594 km2 (2,160 sq mi) 6 1985
14 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  River Gee Fish Town 67,318 5,113 km2 (1,974 sq mi) 6 2000
15 లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు  Sinoe Greenville 104,932 10,137 km2 (3,914 sq mi) 17 1843

పర్యావరణ సమస్యలు

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
ఆహారం కోసం చట్టవిరుద్ధంగా వేటాడే జంతువులలో పిగ్మీ హిప్పోలు. వైల్డు కన్జర్వేషను యూనియన్ అంచనా ప్రకారం 3,000 పైగోమి హిప్పోస్ అడవిలో ఉన్నాయి.

లైబీరియాలో బుషుమీటుగా వాడుకోవడానికి అంతరించిపోతున్న జంతువులు వేటాడబడుతున్నాయి. ఆహారం కోసం చట్టవిరుద్ధంగా వేటాడే జంతువులలో పిగ్మీ హిప్పోలు, ఏనుగులు, చింపాజీలు, చిరుతపులులు, డ్యూకర్లు, ఇతర కోతులు ఉన్నాయి. సరిహద్దుదాటి అడవి జంతువుల విక్రయానికి నిషేధం విధించినప్పటికీ బుష్మీటు తరచుగా పొరుగున ఉన్న సియెర్రా లియోనె, ఐవరీ కోస్టులకు ఎగుమతి చేయబడుతుంది.

వేటమాసం లైబీరియాలో విస్తారంగా తింటారు. లైబీరియన్లు ఇది సున్నితమైనదిగా భావిస్తారు. 2004 లో రాజధాని మోన్రోవియా నివాసితులలో నిర్వహించిన ఒక ప్రజా అభిప్రాయం సర్వేలో మాంసకృత్తుల ప్రాధాన్యం కలిగిన వేటమాంసం చేపల తరువాత స్థానంలో తేలింది. 80% మంది నివాసితులు దీనిని "ఎప్పుడో ఒకసారి" వండుతారు, కొంతమంది 13% వారానికి ఒకసారి వండుతారు 7% వండిన బుష్మీట్ రోజువారీ వండినట్లు పేర్కొన్నారు. ఈ సర్వే గత పౌర యుద్ధం సమయంలో నిర్వహించబడింది. వేటమాంసం వినియోగం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని విశ్వసిస్తున్నారు.

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
లాగర్సు, లాగింగు ట్రక్కు 1960 ల ప్రారంభంలో

లైబీరియా ప్రపంచ జీవవైవిధ్య హాట్స్పాటుగా ఉంది. మానవుల నుండి ముప్పు ఉన్న జీవవైవిధ్యం ముఖ్యమైన సంరక్షకప్రాంతంగా ఉంది. లైబీరియా ఆంతరించిపోతున్న పశ్చిమ చింపాంజీలు, అటవీ ఏనుగులు, చిరుతలు వంటి కొన్ని జాతుల జంతుజాలం ఉంది. పశ్చిమాఫ్రికాలోని వర్షారణ్యంలో లైబీరియా గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. ఎగువ గినియా అడవిలో 43% - (అనేక పశ్చిమ ఆఫ్రికా దేశాలకు విస్తరించే ఒక ముఖ్యమైన అటవీ ప్రాంతం) ఉంది.

లైబీరియా సహజ అటవీప్రాంతాన్ని నాశనం చేస్తున్న మానవ కార్యకలాపాలలో స్లేషు అండ్ బర్ను వ్యవసాయం ఒకటి. 2004 లో ఐఖ్యరాజ్యసమితి నివేదికలో 99% మంది లైబీరియన్లు బొగ్గులను, కట్టెలను వంటచేయడానికి, వేడిని కలిగించడానికి చెట్లను నరికివేస్తున్న కారణంగా అటవీ నిర్మూలన జరిగింది.


2003 లో రెండవ అంతర్యుద్ధం ముగిసిన తరువాత లైబీరియాలో అక్రమ లాగింగు పెరిగింది. 2012 లో అధ్యక్షుడు ఎల్లెను జాన్సను సిర్లీఫు చెట్లను నరికివేయడానికి కంపెనీలకు లైసెన్సులను మంజూరు చేయడంతో లైబీరియాలో మిగిలి ఉన్న ప్రాధమిక వర్షారణ్యం 58% క్షీణించింది. అంతర్జాతీయ నిరసనలు తరువాత ఆ లాగింగు అనుమతి అనేక రద్దు చేయబడింది.2014 సెప్టెంబరులో లైబీరియా నార్వేలు ఒప్పందం కుదుర్చుకునన్న ఫలితంగా లైబీరియా అభివృద్ధి కొరకు $ 150 మిలియన్లు అందుకుని లాగింగుకు ముగింపు పలికింది.

లైబీరియా రాజధాని నగరమైన మోన్రోవియాలో కాలుష్యం ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. 2006 నుండి ప్రపంచ బ్యాంకు ద్వారా మోన్రోవియాలో చెత్త సేకరించి పారవేయడం కోసం అంతర్జాతీయ సమాజం నిధులు అందించింది.

రాజకీయాలు

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
President Ellen Johnson Sirleaf

రాజ్యాంగం చేత స్థాపించబడిన లైబీరియా ప్రభుత్వం అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం నమూనాగా, ఒక ఏకీకృత రాజ్యాంగ రిపబ్లికు, ప్రతినిధి ప్రజాస్వామ్యంగా పనిచేస్తుంది. ప్రభుత్వానికి మూడు సహ-శాఖలు ఉన్నాయి: అధ్యక్షుడి నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్; లైబీరియా ద్విసభ శాసనసభతో కూడిన చట్టసభ; సుప్రీంకోర్టు, పలు ఉన్నత న్యాయస్థానాలతో కూడిన న్యాయవ్యవస్థ ఉన్నాయి.

అధ్యక్షుడు ప్రభుత్వ అధిపతిగా, సైనిక దళాల కమాండరు-ఇన్-ఛైర్మను లైబీరియాకు నాయకత్వం వహిస్తాడు.

అధ్యక్షుడు శాసన బిల్లులు, క్షమాపణలు మంజూరు చేయడం, క్యాబినెటు సభ్యులు, న్యాయమూర్తులు, ఇతర ప్రభుత్వ అధికారులను నియమించడం, తొలగించడం మొదలైన బాధ్యతలు నెరవేరుస్తాడు. ఉపాధ్యక్షుడితో కలిసి, అధ్యక్షుడు ఆరు సంవత్సరాల కాలానికి మెజారిటీ ఓటు ద్వారా రెండు రౌండ్ల వ్యవస్థలో ఎన్నికవుతారు. కార్యాలయంలో రెండు విడతలు సేవలను అందించడానికి రాజ్యాంగం వీలుకల్పిస్తుంది.


శాసనసభలో సెనేటు, ప్రతినిధుల సభ ఉన్నాయి. స్పీకరు నేతృత్వంలో ఉన్న హౌసు, జాతీయ జనాభా గణాంకాల ఆధారంగా 15 కౌంటీలలో 73 మంది సభ్యులను కలిగి ఉంది. ప్రతి కౌంటీలో కనీసం రెండు సభ్యులను స్వీకరించబడుతుంటారు. ప్రతి సభ్యుడు ఒక ఎన్నికల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. జాతీయ ఎన్నికల కమిషను అంగీకారంతో, జిల్లా ఆరు సంవత్సరాల కాలపరిమితితో ఓటు ద్వారా ఎన్నికచేయబడతాడు. ప్రతి సెనేటుకు ఇద్దరు సెనేటర్లు ఉన్నారు. మొత్తం 30 మంది సెనేటర్లు ఉన్నారు. సెనేటర్లు తొమ్మిది సంవత్సరాల వ్యవధికి సేవలు అందిస్తారు. వైసు ప్రెసిడెంటు సెనేటు అధ్యక్షుడిగా పనిచేస్తాడు.

లైబీరియా అత్యున్నత న్యాయవ్యవస్థగా సుప్రిం కోర్టు బాధ్యత వహిస్తుంది. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇది లైబీరియా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో పనిచేస్తుంది. అధ్యక్షుడు నామినేటు చేసిన కోర్టుకు సభ్యులను సెనేటు నిర్ధారిస్తుంది. సభ్యులు 70 సంవత్సరాల వరకు పనిచేయవచ్చు. న్యాయవ్యవస్థలో ప్రత్యేక కోర్టులు, మేజిస్ట్రేటు కోర్టులు, " జస్టిసు ఆఫ్ పీస్ " శాఖలుగా విభజించబడింది. న్యాయ వ్యవస్థ అనేది ఆంగ్లో-అమెరికన్ చట్టం, కామన్ లా (సాధారణ చట్టం), కస్టమరీ లా మిశ్రమంగా ఉంటుంది. దేశీయ గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయిక న్యాయస్థానాలు ఒక అనధికారిక వ్యవస్థగా ఇప్పటికీ పనిచేస్తుంటాయి. అధికారికంగా చట్టవిరుద్ధంగా ఉన్నప్పటికీ సాధారణ విచారణ జరుగుతూ ఉంటుంది.


1877 - 1980 మధ్యకాలంలో ప్రభుత్వం ట్రూ విగు పార్టీ అధిఖ్యత వహించింది. ప్రస్తుతం దేశంలో 20 రాజకీయ పార్టీలు నమోదయ్యాయి. అధికంగా వ్యక్తులు, జాతి సమూహాల ఆధారంగా పార్టీలు స్థాపించబడుతుంటాయి. చాలా పార్టీలు పేలవమైన సంస్థాగత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.2005 ఎన్నికలలలో మొదటి సారిగా అధ్యక్షుడి పార్టీ మెజారిటీ స్థానాలను పొందలేదు.

అవినీతి

లైబీరియా ప్రభుత్వానికి చెందిన ప్రతి స్థాయిలో అవినీతి ఉంది. 2006 లో అధ్యక్షుడు సర్లెఫు కార్యాలయ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆమె అవినీతి "ప్రధాన ప్రజా శత్రువు" అని ప్రకటించింది. 2014 లో లిబెరరియాకు చెందిన అమెరికా రాయబారి "అవినీతి ప్రజలకు హాని కలిగించిందని. అనేక మంది లైబీరియన్లు ఉత్పత్తులకు అనవసరమైన ధరను చెల్లించడం లైబీరియన్లకు పెద్ద సమస్యగా మారిందని " అభిప్రాయపడ్డాడు.


2010 అవినీతి పర్చేప్షన్ ఇండెక్సులో లైబీరియా 3.3 లో ఉందని తెలియజేస్తుంది. ఈ స్కోరు 10 (అత్యంత పరిశుభ్రత) నుండి 0 (అత్యంత అవినీతికి) వరకు గణించబడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 178 దేశాల 87 వ ర్యాంకును, సబ్ సహారా ఆఫ్రికాలో 47 వ స్థానంలో నిలిచింది. 2007 లో దేశం 2.1 స్కోరుతో లైబీరియా 150 దేశాలలో 150 వ స్థానంలో నిలిచింది. బహిరంగ ప్రభుత్వాధికారులతో వ్యవహరిస్తున్నప్పుడు 89% మంది లైబీరియన్లు తాము లంచం చెల్లించవలసి ఉందని చెబుతున్నారు. సేవాసంస్థ " 2010 గ్లోబల్ బారోమీటరు " నివేదిక ఆధారంగా ప్రపంచంలో ఇది అత్యధిక శాతం అని భావిస్తున్నారు.

సైన్యం

" ది ఆర్ండు ఫోర్సెసు ఆఫ్ లైబీరియా " రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా సైనిక దళంగా ఉంది. 1908 లో లైబీరియన్ ఫ్రాంటియర్ ఫోర్సుగా స్థాపించబడిన ఈ సైనిక స్థావరం 1956 లో మార్చబడింది. వాస్తవంగా దాని చరిత్ర మొత్తం (1941-8 వరకు చాలా వరకు) ఎ.ఎఫ్.ఎల్. యునైటెడు స్టేట్సు నుండి గణనీయమైన భౌతిక శిక్షణా సహాయాన్ని పొందింది.

Foreign relations

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
బ్రిటిషు ప్రధానమంత్రి డేవిడ్ కామెరానుతో అధ్యక్షుడు జాను కెర్రీ

మొదటి, రెండవ లైబరియా అంతర్యుద్ధాల తరువాత సంక్షోభం మొదలైంది. 21 వ శతాబ్దంలో లైబీరియా అంతర్గత స్థిరీకరణ పొరుగు దేశాలు, పాశ్చాత్య దేశాలతోనూ సుదీర్ఘ సంబంధాలు ఏర్పడ్డాయి.

గతంలో లిబెరియా ఇరుగుపొరుగు దేశాలైన గినియా, సియెర్రా లియోనె ఇద్దరూ లైబీరియా తమ దేశాల్లోని తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తుందని ఆరోపించారు.

చట్టం అమలు

లైబీరియా జాతీయ పోలీస్ దేశంలోని జాతీయ పోలీసు వ్యవస్థగా సేవలు అందిస్తుంది. 2007 అక్టోబరు నాటికి రాజధాని మోన్రోవియా నగరం ఉన్న మోంటుసెరాడో కౌంటీలోని 33 స్టేషన్లలో 844 అధికారులు ఉన్నారు. నేషనల్ పోలీస్ ట్రైనింగ్ అకాడెమి మోంటుసెరాడో కౌంటీలోని పేనెసువిల్లె సిటీలో ఉంది.

ఆర్ధికరంగం, మౌలికసౌకర్యాలు

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
A proportional representation of Liberian exports. The shipping related categories reflect Liberia's status as an international flag of convenience – there are 3,500 vessels registered under Liberia's flag accounting for 11% of ships worldwide.
లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
Liberia, trends in the Human Development Index 1970–2010.

లిబెరియాలో కరెన్సీ ప్రాథమిక రూపం అయిన లైబీరియా డాలరు ముద్రణకు సెంట్రలు బ్యాంకు ఆఫ్ లైబీరియా బాధ్యత వహిస్తుంది. లైబీరియా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటి. అధికారిక ఉద్యోగ శాతం 15%. 1980 లో తలసరి జి.డి.పి. 1980 లో $ 496 అమెరికా డాలర్లకు చేరుకుంది. అది ఈజిప్టు (ఆ సమయంలో) కు సమానంగా పోల్చబడింది. 2011 లో దేశం నామినల్ జి.డి.పి. $ 1.154 బిలియన్ల అమెరికా డాలర్లు. నామినల్ తలసరి జి.డి.పి. $ 297 అమెరికా డాలర్లు. ప్రపంచంలో మూడవ అతి తక్కువ. చారిత్రాత్మకంగా లైబీరియా ఆర్థిక వ్యవస్థ విదేశీ సాయం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, ఇనుప ఖనిజం, రబ్బరు, కలప వంటి సహజ వనరుల ఎగుమతులపై ఆధారపడింది.

1979 లో శిఖరాగ్రానికి చేరుకున్న లైబీరియా ఆర్ధికరంగంలో 1980 తరువాత ఆర్థిక వ్యవస్థ నిర్వహణాలోపంతో నిదానంగా తిరోగమనం ప్రారంభమైంది. ఈ తిరోగమనం 1989 లో పౌర యుద్ధం సంభవించడం కారణంగా వేగవంతమైంది. 1989 - 1995 మధ్యకాలంలో చరిత్రలో వేగవంతంగా 90% జి.డి.పి. (చరిత్రలో ఇది అతివేగవంతమైన క్షీణతగా భావించబడింది) క్షీణించింది. 2003 లో యుద్ధం ముగిసిన తరువాత జి.డి.పి. అభివృద్ధి 2007 లో 9.4% కు చేరింది. 2009 లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా జిడిపి వృద్ధి 4.6% కు క్షీణించింది. వ్యవసాయ రంగాన్ని బలపరచడం ద్వారా రబ్బరు, కలప ఎగుమతులు అభివృద్ధి చెంది 2010 లో 5.1% కు అభివృద్ధి జరిగింది. 2011 లో 7.3% అభివృద్ధి చెందగలదని అంచనా వేయబడింది. ప్రపంచంలో 20 వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న ఆర్ధికవ్యవస్థలో ఒకటిగా లైబీరియా ఆర్ధిక వ్యవస్థ గుర్తించబడింది.

అభివృద్ధికి ప్రస్తుతం చిన్న దేశీయ మార్కెట్టు, మౌలిక వసతులు లోపం, అధిక రవాణా ఖర్చులు, పొరుగు దేశాలతో బలహీనమైన వర్తక సంబంధాలు, ఆర్ధికవ్యవస్థ అధికంగా డాలరులో నిర్వహించడం పెద్ద అడ్డకిగా ఉన్నాయి. లైబీరియా 1943 నుండి 1982 వరకూ యునైటెడ్ స్టేట్సు డాలరును కరెన్సీగా ఉపయోగించుకొని లైబీరియా డాలరుతో డాలరును ఉపయోగించడం కొనసాగించింది.

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
చెరకు గ్రౌండింగు చేస్తున్న ఒక బాలుడు

2003 లో ఆర్ధికక్షీణత మొదలైన తరువాత 2007-2008 లో తరువాత ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆహార, శక్తి సంక్షోభాల కారణంగా ద్రవ్యోల్బణం మొదలైంది. ఫలితంగా 2008 లో ద్రవ్యోల్బణం 17.5% కి చేరుకుని 2009 లో ఇది 7.4% కు తగ్గింది. లైబీరియా విదేశీ రుణం 2006 లో సుమారు $ 4.5 బిలియన్లు జిడిపికి 800% గా అంచనా వేయబడింది. 2007 నుండి 2010 వరకు ద్వైపాక్షిక, బహుపాక్షిక వాణిజ్య రుణాల ఉపసంహరణ వలన దేశం విదేశీ రుణం 2011 నాటికి $ 222.9 మిలియన్లకు తగ్గించబడింది.

1990 లలో అంతర్యుద్ధం కారణంగా అనేకమంది పెట్టుబడిదారులు యుద్ధం నుంచి పారిపోతున్నప్పుడు అధికారిక వస్తువుల ఎగుమతులు క్షీణించిన కారణంగా లైబీరియా యుద్ధవ్యవస్థ వజ్రాల సంపదను దుర్వినియోగం చేసింది. సియెర్రా లెయోనె ఎర్ర వజ్రాలకు లైబీరియా ప్రధాన వాణిజ్యవేత్తగా వ్యవహరించింది. 1999 లో $ 300 మిలియన్ల అమెరికా డాలర్ల వజ్రాలను ఎగుమతి చేసింది. 2001 లో లైబీరియా వజ్రాల ఎగుమతులపై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించింది. 2007 లో కింబర్లీ ప్రాసెసు సర్టిఫికేషన్ పథకంలో లైబీరియా ప్రవేశం తరువాత నిషేధం ఎత్తివేయబడింది.

2003 లో 1997 లో US $ 5 మిలియన్ల అమెరికా డాలర్ల నుండి 2002 లో US $ 100 మిలియన్ల అమెరికా డాలర్లకు అధికరించింది. ఈ నిధులు ఆధారంతో సియెర్రా లియోనెలోని తిరుగుబాటుదారులకు నిధులు సమకూర్చబడ్డాయని విశ్వసించి 2003 లో ఐఖ్యరాజ్యసమితి అదనపు నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 2006 లో ఎత్తివేయబడ్డాయి. విదేశీయుల సహాయం, పెట్టుబడులు చాలా వరకు నిలిపివేయబడిన కారణంగా యుద్ధం ముగిసేనాటికి లైబీరియా పెద్ద ఆర్ధికప్రణాళికా లోటును అనుభవించింది. ఇది 2008 లో దాదాపు 60% ఉంది. 2010 లో లైబీరియా వరల్డు ట్రేడు ఆర్గనైజేషనులో పరిశీలక హోదాను పొంది పూర్తి స్థాయి హోదాను పొందే ప్రక్రియలో ఉంది.

2006 లో $ 16 బిలియన్ల విదేశీ పెట్టుబడితో లైబీరియా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అత్యధిక నిష్పత్తి కలిగిన దేశంగా గుర్తించబడింది. 2006 లో సిర్లీఫు పరిపాలన ప్రారంభం తరువాత ఇనుప ఖనిజం, పామాయిలు పరిశ్రమలలో పలు డాలర్ల విలువైన ఒప్పందల మీద లిబెరరియా సంతకం చేసింది. వీటిలో బి.హెచ్.పి. బిల్లిటను, ఆర్సెలారు మిట్టలు, సిమె డార్బీ వంటి అనేక బహుళజాతీయ సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా పాం నూనె కంపెనీలైన సిమె డార్బి (మలేషియా), గోల్డెను వేరోలియం (యు.ఎస్.ఎ) సంస్థలు ప్రభుత్వ రాయితీలతో శక్తివంతమై జీవనోపాధిని నాశనం చేస్తూ, స్థానిక సంప్రదాయాలకు చెందిన ప్రజలను స్థానభ్రంశం చేస్తున్నాయని విమర్శలను ఎదుర్కొన్నాయి. 1926 నుండి " ఫైరుస్టోను టైరు అండ్ రబ్బరు కంపెనీ " సంస్థ లైబీరియాలో ప్రపంచంలో అతిపెద్ద రబ్బరు తోటలను నిర్వహించింది.

అషిప్పింగు ఫ్లాగు

లైబీరియా " ఫ్లాగ్ ఆఫ్ కంవీనియంసు " స్థితి కారణంగా లైబీరియా (పనామా తరువాత) ప్రపంచంలో రెండవ అతి పెద్ద సముద్ర రిజిస్ట్రీని కలిగి ఉంది. ఇది తన జండాతో 3500 నమోదు చేయబడిన నౌకలను కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నౌకలలో 11%.

సమాచార రంగం

లైబీరియాలో ఆరు ప్రధాన వార్తాపత్రికలు ఉన్నాయి. జనాభాలో 45% మంది మొబైల్ ఫోన్ సేవలను కలిగి ఉన్నారు. లైబీరియా సమాచార ప్రసార మౌలిక సదుపాయాలన్నీ రెండు అంతర్యుద్ధాల (1989-1996, 1999-2003) సమయంలో ధ్వంసం చేయబడడం, దోపిడీ చేయబడడం జరిగింది. వయోజన అక్షరాస్యత, అధిక పేదరిక శాతం, పరిమితమైన టెలివిజను, వార్తాపత్రిక ఉపయోగం కారణంగా ప్రజలకు సమాచారం అందజేయడానికి ప్రధానమైన మార్గంగా రేడియో ఉపయోగించబడింది.

రవాణా

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
The streets of downtown Monrovia, March 2009.

లైబీరియాతో ప్రధాన ఆర్థిక సంబంధాలు ఉన్న విదేశీప్రముఖులు రాజధాని మొన్రోవియా పోర్టు, విమానాశ్రయం ద్వారా దేశంలో ప్రవేశిస్తారు.

విద్యుచ్చక్తి

అధికారిక విద్యుత్తు సేవలను ప్రభుత్వానికి స్వంతమైన " లైబీరియా ఎలక్ట్రిసిటీ కార్పొరేషను " మాత్రమే అందించింది. ఇది గ్రేటరు మోన్రోవియా జిల్లాలో దాదాపుగా ఒక చిన్న గ్రిడ్డును నిర్వహిస్తుంది. ప్రైవేట్ యాజమాన్యంలోని జనరేటర్లు అత్యధికంగా విద్యుత్తు శక్తి సేవలను అందిస్తున్నాయి. ఈ సంస్థలు కిలోవాటు విద్యుత్తుకు $ 0.54 అమెరికా డాలర్ల రుసుముతో అందిస్తుంది. లైబీరియాలో విద్యుత్తు సుంకం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. 2013 లో మొత్తం వ్యవస్థాగత సామర్థ్యం 20 మెగావాట్ల ఉంది. యుద్ధసమయాలలో 1989 లో 191 మెగావాట్ల గరిష్ట స్థాయికి పడిపోయింది.

80 మెగావాట్ల గరిష్ట సామర్ధ్యం కలిగిన మౌంటు కాఫీ హైడ్రోపవరు ప్లాంటు మరమ్మత్తు, విస్తరణ పూర్తి చేయడం 2018 నాటికి పూర్తి చేయబడుతుందని భావించబడింది. మూడు కొత్త భారీ ఇంధన చమురు కర్మాగారాల నిర్మాణం 38 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం పెంచుతుందని భావిస్తున్నారు. 2013 లో లైబీరియా వెస్టు ఆఫ్రికా పవరు పూల్ ద్వారా ఐవరీ కోస్టు, గినియా నుండి విద్యుచ్చక్తిని దిగుమతి చేయడం ప్రారంభించింది.


లైబీరియాలో ఆఫ్షోరు ఆయిలు కోసం అన్వేషణ ప్రారంభమైంది. చమురు నిల్వలు ఒక బిలియను బారెల్సు కంటే ఎక్కువగా చమురు ఉండవచ్చని విశ్వసించబడింది. ప్రభుత్వం ఆఫ్షోరు వాటర్లను 17 బ్లాక్లుగా విభజించింది. 2004 లో బ్లాకులకు అన్వేషణ లైసెంసులను వేలం వేసింది. అదనంగా 2007-2008 లో వేలం నిర్వహించబడింది. 2011 లో అదనంగా 13 ఆల్ట్రా-డీప్ ఆఫ్షోరు బ్లాకులను విభజించి వేలం వేయడానికి ప్రణాళిక వేశారు. లైసెన్సులు గెలిచిన కంపెనీలలో రెప్సాలు, చెవ్రాను, అనడార్కో, వుడ్సైడు పెట్రోలియం సంస్థలు ఉన్నాయి.

గణాంకాలు

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
Liberia's population from 1961–2013. Liberia's population tripled in 40 years.
లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
Liberia's population pyramid, 2005. 43.5% of Liberians were below the age of 15 in 2010.

2017 జాతీయ జనాభా లెక్కల ఆధారంగా లైబీరియాలో 4,694,608 మంది పౌరులు నివసిస్తున్నారు. వీరిలో 1,118,241 మంది దేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన మోంటుసెరాడో కౌంటీలో నివసిస్తున్నారు. ఈ కౌటీలోనే రాజధాని నగరం మోన్రోవియా ఉంది. గ్రేటరు మోన్రోవియా జిల్లాలో 9,70,824 నివాసితులు ఉన్నారు. 4,62,026 మంది నివాసితులతో నింబా కౌంటీ తరువాతి అత్యధిక జనాభా కలిగిన కౌంటీగా ఉంది. 2008 జనాభా గణనలో వెల్లడించినట్లుగా మోన్రోవియా అన్ని కౌంటీ రాజధానుల జసంఖ్య కంటే నాలుగు రెట్లు ఎక్కువ జనాభా కలిగి ఉంది.


2008 జనాభా లెక్కలకు ముందు చివరి జనాభా గణన 1984 లో నిర్వహించారు. ఆసమయంలో జనసంఖ్య 21,01,628 ఉన్నట్లు పేర్కొన్నారు. 1962 లో లైబీరియా జనసంఖ్య 10,16,443, 1974 లో 15,03,368 కు అధికరించింది. 2006 నాటికి లైబీరియా ప్రపంచంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటును కలిగి ఉంది (సంవత్సరానికి 4.50%). 2010 లో లైబీరియాలో 15 సంవత్సరా లోపు వయసున్న ప్రజలు 43.5% మంది ఉన్నారు.

సంప్రదాయ సమూహాలు

జనాభాలో 16 స్థానిక జాతి సమూహాలు, వివిధ అల్పసంఖ్యాక విదేశీ సమూహాలు ఉన్నాయి. స్థానికప్రజలు మొత్తం జనాభాలో 95% మంది ఉన్నారు. పెల్లె, బస్సా, మనొ, జియో (డాను), క్రు, గ్రోబో, క్ర్రాన్, వాయి, గోలా, మండింగో (మండిన్కా) మెండే, కిస్సి, గండీ, లోమా, ఫాంటె, డీ (డివోయిను), బెలెహు, అమెరికో -లీబీరియన్లు (కాంగో ప్రజలు).

మొత్తం ప్రజలలో కేపెల్లే 20% కంటే అధికంగా ఉన్నారు. వీరు లైబీరియాలో అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. వీరు అధికంగా బాంగు కౌంటీలో, సెంట్రలు లైబీరియాలోని ప్రక్కనే ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆఫ్రికా అమెరికన్లు, వెస్టు ఇండియా సంతతికి చెందిన అమెరికా-లైబీరియన్లు, ఎక్కువగా బార్బాడియను స్థిరనివాసులు 2.5% ఉన్నారు. 1825 లో వచ్చిన కాంగో ప్రజలు, ఆఫ్రో-కరేబియా బానిసల వారసులు సుమారు 2.5% మంది ఉన్నారు. ఈ చివరి రెండు వర్గాలు 19 వ శతాబ్దంలో రాజకీయ నియంత్రణను నెలకొల్పాయి. ఇవి 20 వ శతాబ్దంలో చక్కగా స్థిరపడ్డారు.

అనేకమంది వలసప్రజలు వ్యాపారులుగా, లెబనా, భారతీయులు, ఇతర పశ్చిమ ఆఫ్రికా జాతీయులతో సహా వ్యాపార సంఘంలో ప్రధాన భాగంగా ఉన్నారు. లైబీరియన్లు, లెబనీయుల మధ్య జాత్యాంతర వివాహం అధిక శాతం ఉంది. దీని వలన మోన్రోవియాలో ప్రత్యేకమైన మిశ్రమ-జాతి జనాభా ఏర్పడింది. దేశంలో ఐరోపా సంతతికి చెందిన వైట్ ఆఫ్రికన్లు అయిన లైబీరియన్ల అల్పసంఖ్యాక సమూహం ఉంది. లైబీరియా రాజ్యాంగం ఆఫ్రికా సంతతి ప్రజలకు పౌరసత్వాన్ని పరిమితం చేస్తుంది.

భాషలు

లైబీరియా అధికారభాష ఆగ్లం. ఇది " లింగుయా ఫ్రాంకాగా " పిలువబడుతుంది. లైబీరియాలో 31 స్థానిక భాషలు వాడుకలో ఉన్నాయి. వీటిలో ఏదీ మొదటి స్థానంలో లేదు. లైబీరియన్లు వివిధ రకాల మాండలికాలతో మాట్లాడతారు.

మతం

Religion in Liberia
Religion percent
Christianity
  
85.5%
Islam
  
12.2%
Unaffiliated
  
1.5%
Indigenous
  
0.5%
Other
  
0.1%

2008 జాతీయ జనాభా లెక్కల ప్రకారం 85.5% ప్రజలు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. క్రైస్తవులలో ప్రొటెస్టెంట్లు, లూథరను, బాప్టిస్టు, ఎపిస్కోపలు, ప్రెస్బిటేరియను, పెంటెకోస్టలు, యునైటెడు మెథడిస్టు, ఆఫ్రికా మెథడిస్టు ఎపిస్కోపలు, ఎ.ఎం.ఇ. జియాను తెగల క్రైస్తవులు ఉన్నారు. అనేకమంది ప్రొటెస్టంటు కన్ఫెషన్సు, రోమను కాథలికు చర్చి అనుచరులు ఉన్నారు. ఈ తెగల ప్రజలలో అనేకంది ఆఫ్రికన్ అమెరికా వలసప్రజలు ఉన్నారు. వీరు యునైటెడు స్టేట్సు నుండి లైబీరియాకు వచ్చి స్థిరపడ్డారు., కొంతమంది స్వదేశీయులు-ప్రత్యేకంగా పెంటెకోస్టలు, ఎవాంజెలికలు ప్రొటెస్టంటులుగా ఉన్నారు.

ముస్లింలు జనాభాలో 12.2% మంది ఉన్నారు. వీరు మండిగో, వాయి జాతి సమూహాలకు చెందినవారై ఉన్నారు. లైబీరియన్ ముస్లింలలో అధిక సంఖ్యలో సున్నీలు, షియాలు, అహ్మాదీయులు, సూఫీలు, అన్య వర్గాలకు చెందిన ముస్లింలు ఉన్నారు.

జనాభాలో 0.5% సాంప్రదాయ స్థానిక మతాలను అభ్యసిస్తున్నారు. అయితే 1.5% మంది మతంపై ఆధారపడరు. కొంతమంది బహాయి, హిందూ, సిక్కు, బౌద్ధులు ఉన్నారు. క్రైస్తవంగా ఉన్నప్పటికీ అనేకమంది లైబీరియన్లు సాంప్రదాయ, లింగ ఆధారిత స్వదేశీ మత రహస్య సమావేశాలలో పాల్గొంటారు. పురుషులు (పారో), మహిళలకు (శాండే) వంటి సమావేశాలు ఉంటాయి. అన్ని-మహిళల శాండే సమాజం మహిళల సున్నతిని అనుసరిస్తుంది.

రాజ్యాంగం మతం స్వాతంత్ర్యం అందిస్తుంది. ప్రభుత్వం సాధారణంగా ఈ హక్కును గౌరవిస్తుంది. రాజ్యాంగం చర్చి, దేశ విభజన చేసినప్పటికీ, లైబీరియా క్రైస్తవ దేశంగా పరిగణించబడుతుంది. ప్రభుత్వ పాఠశాలలు బైబిల్ అధ్యయనాలను అందిస్తాయి. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను దూరంగా ఉంచడాన్ని ఎన్నుకోవచ్చు. వాణిజ్యం ఆదివారాలు, ప్రధాన క్రైస్తవ సెలవు దినాలలో చట్టపరంగా నిషేధించబడింది. శుక్రవారం ప్రార్థనలకు ముస్లింలను అనుమతించమని ప్రభుత్వాన్ని వ్యాపారసంస్థలను, పాఠశాలలు కోరవలసిన అవసరం లేదు.

విద్య

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
Students studying by candlelight in Bong County

2010 లో లైబీరియా అక్షరాస్యత శాతం 60.8% ఉంది (పురుషులకు 64.8%, ఆడవారికి 56.8%). కొన్ని ప్రాంతాలలో నిర్బంధ ప్రాధమిక, మాధ్యమిక విద్య ఉచితంగా అందించబడుతుంది. తప్పనిసరిగా 6 నుండి 16 సంవత్సరాల వయస్సు వరకు నిర్బంధ విద్య అమలులో ఉంది. ఇతర ప్రాంతాలలో పిల్లలు పాఠశాలకు వెళ్ళటానికి ట్యూషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. సగటున పిల్లలు 10 సంవత్సరాల విద్యను (బాలురకు 11 సంవత్సరాల విద్య, బాలికలకు 8 సంవత్సరాల విద్య) అభ్యసిస్తారు. దేశ విద్యాశాఖలో అవసరమైనన్ని పాఠశాలలు లేకపోవడం, సరఫరాల కొరత, అలాగే అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత వలన విద్యావ్యవస్థ బలహీన పడుతూ ఉంది.

అనేక ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్య అందింస్తూ ఉన్నాయి. లైబీరియా విశ్వవిద్యాలయం దేశం అతిపెద్ద, పురాతన విశ్వవిద్యాలయంగా గుర్తించబడుతూ ఉంది. మొన్రోవియాలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం 1862 లో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఇందులో వైద్య కళాశాల, దేశంలోని ఏకైక న్యాయ పాఠశాల అయిన లూయిసు ఆర్థరు గ్రైమ్సు స్కూలు ఆఫ్ లాతో ఆరు కళాశాలలు ఉన్నాయి.

1889 లో USA లోని ఎపిస్కోపల్ చర్చి కట్టింగ్టను యూనివర్సిటీ స్థాపించబడినది. సుకుకో, బోంగు కౌంటీ, స్థానిక ప్రజలు మిషనరీ విద్యలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ఇది దేశంలోని పురాతన ప్రైవేటు విశ్వవిద్యాలయంగా గుర్తించబడుతుంది.

2009 లో మేరీల్యాండు కౌంటీలోని హార్పరులో టబ్మాను విశ్వవిద్యాలయం (లైబీరియాలో రెండవ ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా) స్థాపించబడింది. 2006 నుంచి ప్రభుత్వం బుకానను, సన్నెక్వెలీ, వోయోంజమాలలో కమ్యూనిటీ కళాశాలలను కూడా ప్రారంభించింది.

ఆరోగ్యం

లైబీరియాలోని ఆసుపత్రులలో మోన్రోవియాలోని జాన్ ఎఫ్. కెన్నెడీ మెడికలు సెంటరు, అనేక ఇతర ఆసుపత్రులు ఉన్నాయి. 2012 లో లైబీరియాలో ప్రజల సరాసరి ఆయుర్దాయం 57.4 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. సరాసరి జననాల శాతం 5.9%, 2010 లో 1,00,000 జననలలో 990 మంది తల్లుల మరణాలు నమోదయ్యాయి. క్షయవ్యాధి, అతిసార వ్యాధులు, మలేరియాతో సహా అనేక రకాల అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. 2007 లో 15-49 మధ్య వయస్కులలో 2% మంది హెచ్.ఐ.వి. వ్యాధిగ్రస్థులు ఉన్నారు. అయితే 2008 లో 1,00,000 మందిలో 420 మందికి క్షయవ్యాధి ఉంది. సుమారుగా 58.2% మహిళలు 66% ఖత్నాకు గురవుతున్నారని అంచనా.

లైబీరియాకు అవసరమైన బియ్యంలో 90% దిగుమతి చేయబడుతున్నాయి. ఒక ప్రధానమైన ఆహారంగా బియ్యం ఉత్పత్తి కారణంగా ఆహార కొరతకు ఏర్పడుతుంది. 2007 లో గణాంకాలు ఐదు సంవత్సరాలలోపు పిల్లలలో 20.4% మంది పిల్లలు పోషకాహార లోపంతో ఉన్నారని తెలియజేసాయి. 2008 లో జనాభాలో కేవలం 17% మంది మాత్రమే తగినంత పారిశుద్ధ్య సౌకర్యాలను పొందగలిగారు.

2003 లో అంతర్యుద్ధం ముగిసే నాటికి దేశ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో సుమారు 95% నాశనం చేయబడ్డాయి. 2009 లో తలసరి ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం $ 22 అమెరికా డాలర్లు వ్యయం చేసింది. మొత్తం జి.డి.పిలో ఇది 10.6% గా ఉంది. 2008 లో లైబీరియాలో 1,00,000 మందికి ఒక డాక్టరు, 27 నర్సులు మాత్రమే ఉన్నారు.

2014 లో గినియాలో వ్యాపించిన ఎబోలా వైరసు తరువాత లైబీరియాకు వ్యాపించింది. 2014 నవంబరు 17 నాటికి, 2,812 ఎబోలా మరణాలు సంభవించాయి. ఆగష్టు ఆరంభంలోనే గినియా, లైబీరియాకు సరిహద్దులను మూసివేసింది. ఇది వైరసు వ్యాప్తిని కట్టుబాటు చేయడానికి సహాయం చేసింది. గినియాలో కంటే లైబీరియాలో మరిన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. లైబీరియాలో ఎబోలా కేసులు నమోదు కావడం నిలిచిపోయిన ఆరు వారాల తర్వాత మే 9 న లైబీరియా ఎబోలా ఉచితంగా ప్రకటించింది. ఓవర్సీసు డెవలప్మెంటు ఇంస్టిట్యూట్ నివేదిక ప్రకారం వ్యక్తిగతంగా ఆరోగ్యం కొరకు చేస్తున్న మొత్తం వ్యయంలో 64.1% ప్రైవేటు చికిత్సకు వ్యయం చేస్తున్నారని తెలియజేసింది.


నేరం

లైబీరియాలో పోస్ట్-సంఘర్షణ శకంలో అత్యాచారం, లైంగిక వేధింపు తరచుగా జరుగుతున్నాయి. ప్రపంచంలో స్త్రీలపైన అత్యధికంగా లైంగిక హింసకు నమోదౌతున్న దేశంలో లైబీరియా ఒకటిగా ఉంది. లైంగిక హింస కేసుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ అయాచార కేసులు నమోదయ్యాయి. తరచుగా కౌమార బాలికల మీద దాడి చేస్తారు. దాదాపు 40% మంది నేరస్థులు బాధితులకు తెలిసిన వయోజనులు ఉంటారు.


లిబెరియాలో పురుష, స్త్రీ స్వలింగసంపర్కం రెండూ చట్టవిరుద్ధం. 2012 జూలై 20 న లైబీరియన్ సెనేటు స్వలింగ వివాహాలు నిషేధించటానికి, దానిని నేరంగా పరిగణించడానికి శాసనం రూపొందించడానికి ఏకగ్రీవంగా ఓటు వేసింది.

సంస్కృతి

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
Bassa culture. Helmet Mask for Sande Society (Ndoli Jowei), Liberia. 20th century. Brooklyn Museum.

అమెరికా-లైబీరియన్ల మతపరమైన ఆచారాలు, సాంఘిక ఆచారాలు, సాంస్కృతిక ప్రమాణాలు అంటెబెలం శకానికి చెందిన దక్షిణ అమెరికా మూలాలను కలిగి ఉన్నాయి. స్థిరనివాసులు టాప్ హాట్సు అండ్ టైల్సు దక్షిణ బానిసయజమానుల గృహాల నమూనాను అనుసరించి వారి గృహాలను రూపొందించారు. చాలామంది అమెరికా-లైబీరియా పురుషులు " మసోనిక్ ఆర్డరు ఆఫ్ లైబీరియా " సభ్యులుగా ఉన్నారు. ఇది దేశ రాజకీయాలలో భారీగా పాల్గొంది.

వలసప్రజలు వారితో కుట్టుపని, క్విల్టింగు నైపుణ్యాలను తీసుకువచ్చిన కారణంగా లైబీరియాకు వస్త్ర కళలలో, వజ్రాలలో సుదీర్ఘమైన గొప్ప చరిత్ర ఉంది. 1857 - 1858 లో లైబీరియా జాతీయ ఉత్సవాలకు ఆతిధ్యమిచ్చింది. ఇందులో వివిధ సూది ఆధారిత కళలకు బహుమతులు ఇవ్వబడ్డాయి. ప్రముఖమైన లైబేరియా క్విల్టెర్లలో ఒకరు మార్తా ఆన్ రిక్సు 1892 లో ప్రఖ్యాత లైబీరియా కాఫీ చెట్టును విక్టోరియా రాణికి సమర్పించబడింది. అధ్యక్షురాలు ఎల్లెను జాంసను అధ్యక్షకార్యాలయంలో ప్రవేశించగానే ఆమె లైబీరియాలో తయారుచేయబడిన క్విల్టును అధ్యక్షకార్యాలయంలో ఏర్పాటు చేసింది.


లైబీరియాలో ఒక శతాబ్దం నుండి గొప్ప సాహిత్య సాంప్రదాయం ఉంది. ఎడ్వర్డు విల్మోటు బ్లైడెను, బాయి టి. మూరు, రోలాండు టి. డెంప్‌స్టెరు, విల్టను జి. ఎసు. శంకువులూ లైబీరియా మరింత ప్రముఖ రచయితలుగా గుర్తించబడుతూ ఉన్నారు. మూరు నవల " మర్డరు ఇన్ ది కసావా పాచ్ " లైబీరియా అత్యంత ప్రసిద్ధి చెందిన నవలగా పరిగణించబడుతుంది.

బహుభార్యాత్వం

15-49 మద్య వయస్కులైన వివాహిత మహిళలలో మూడింట ఒక వంతు బహుభార్యా విధానంతో సంబంధితులై ఉంటారు. చట్టం పురుషులకు 4 భార్యలు ఉండడాన్ని అనుమతిస్తుంది.

ఆహారసంస్కృతి

లైబీరియా: చరిత్ర, భౌగోళికం, రాజకీయాలు 
A beachside barbeque at Sinkor, Monrovia, Liberia

లైబీరియా దేశం ప్రధాన ఆహారంగా బియ్యాన్ని అధికంగా ఉపయోగిస్తుంటారు. ఇతర పదార్థాలు: కాసావా, చేపలు, అరటిపండ్లు, పుల్లని పళ్లు, అరటి, కొబ్బరి, ఓక్రా, తీపి బంగాళాదుంపలు. హుపనేరో స్కాచి బానేటు మిరపకాయలతో, మసాలాదినులతో తయారుచేసే ఫుఫులను అధికంగా తింటారు. పశ్చిమ ఆఫ్రికాలో యునైటెడు స్టేట్సు నుండి దిగుమతి చేసుకున్న బేకింగు ఆహార సంప్రదాయం లైబీరియాలో కూడా ఉంది.

క్రీడలు

లైబీరియాలో అత్యంత జనాదరణ పొందిన క్రీడ ఫుట్ బాలు. - అసోసియేషన్ ఫుట్ బాలు క్రీడాకారుడు జార్జి వీహు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయరుగా గుర్తింపు పొందిన ఏకైక ఆఫ్రికనుగా ఉన్నాడు. ఆయన దేశం అత్యంత ప్రముఖ అథ్లెటుగా గుర్తించబడుతున్నాడు. లైబీరియా జాతీయ ఫుట్బాల్ జట్టు 1996, 2002 లో రెండుసార్లు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషనుకు చేరుకుంది.

లైబీరియాలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ బాస్కెట్బాలు ఉంది. లైబీరియా జాతీయ బాస్కెట్బాలు జట్టు 1983, 2007 లో రెండు సార్లు ఆఫ్రో బాస్కెటుకు చేరుకుంది.


లైబీరియాలో " సామ్యూలు కాన్యను డూ స్పోర్ట్సు కాంప్లెక్సు " బహుళప్రయోజన స్టేడియంగా పనిచేస్తుంది. ఇది అంతర్జాతీయ క్రీడలు, జాతీయ రాజకీయ సంఘటనలు, ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డు కపు క్వాలిఫైయింగు మ్యాచ్లను నిర్వహిస్తుంది.

కొలతల విధానం

కొలతల విధానం

అంతర్జాతీయ యూనిటు విధానాన్ని అనుసరించని మూడు ప్రపంచ దేశాలలో లైబీరియా ఒకటి. మిగిలిన రెండు దేశాలు యునైటెడు స్టేట్సు, మాయన్మార్ లైబీరియా ప్రభుత్వం ఇంపీరియల్ యూనిట్లను ఉపయోగించడం నుండి మెట్రికు యూనిట్లు విధానానికి మారుతూ ఉంది. అయినప్పటికీ ఈ మార్పులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇంపీరియల్, మెట్రిక్ యూనిట్లను ఉపయోగిస్తుంది.

See also

  • Outline of Liberia
  • Gender inequality in Liberia

మూలాలు

బయటి లింకులు

మూస:Liberia topics

Tags:

లైబీరియా చరిత్రలైబీరియా భౌగోళికంలైబీరియా రాజకీయాలులైబీరియా ఆర్ధికరంగం, మౌలికసౌకర్యాలులైబీరియా గణాంకాలులైబీరియా విద్యలైబీరియా ఆరోగ్యంలైబీరియా నేరంలైబీరియా సంస్కృతిలైబీరియా మూలాలులైబీరియా ఇవి కూడా చదవండిలైబీరియా బయటి లింకులులైబీరియా

🔥 Trending searches on Wiki తెలుగు:

పెరిక క్షత్రియులుపుచ్చహీమోగ్లోబిన్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళితెనాలి రామకృష్ణుడుఇంద్రుడుతేలుగోల్కొండసంస్కృతంత్రిష కృష్ణన్గ్యాస్ ట్రబుల్రౌద్రం రణం రుధిరంమహాభాగవతంషరియాశ్రావణ భార్గవి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుకూన రవికుమార్వినుకొండమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఎస్. ఎస్. రాజమౌళిస్వర్ణకమలంఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంతమిళ అక్షరమాలజవహర్ నవోదయ విద్యాలయంనువ్వుల నూనెచేపజానకి వెడ్స్ శ్రీరామ్రాశిజోర్దార్ సుజాతభారతీయ జనతా పార్టీకల్వకుంట్ల చంద్రశేఖరరావుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాసంధిరవితేజశివ కార్తీకేయన్భారత రాజ్యాంగ పీఠికతెలంగాణగుజరాత్ టైటాన్స్దసరావర్షం (సినిమా)సుడిగాలి సుధీర్భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలురమ్య పసుపులేటిఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలులావు శ్రీకృష్ణ దేవరాయలురామ్ పోతినేనిచిరంజీవులుతెలుగు శాసనాలుబొత్స సత్యనారాయణపూర్వ ఫల్గుణి నక్షత్రముతెలంగాణ చరిత్రఅమ్మశాసనసభ సభ్యుడుకాపు, తెలగ, బలిజవీరేంద్ర సెహ్వాగ్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఛందస్సుగోత్రాలు జాబితానువ్వొస్తానంటే నేనొద్దంటానానక్షత్రం (జ్యోతిషం)విభీషణుడుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఆర్తీ అగర్వాల్మానవ శరీరముతెలుగు అక్షరాలుతెలుగు సినిమాపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్చదరంగం (ఆట)తిరుపతితెలంగాణ జిల్లాల జాబితాబర్రెలక్కద్విగు సమాసముగీతాంజలి (1989 సినిమా)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునితిన్అతిసారంనరేంద్ర మోదీపేరు🡆 More