వినుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని ఒక పట్టణం, వినుకొండ మండలానికి కేంద్రం.
వినుకొండ విష్ణుకుండినపురం, శ్రుతగిరి | |
---|---|
పట్టణం | |
Coordinates: 16°03′N 79°45′E / 16.05°N 79.75°E | |
Country | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
పట్టణం | 29 May 2015 |
Government | |
• Type | పురపాలక సంఘం |
Area | |
• Total | 22.82 km2 (8.81 sq mi) |
Elevation | 95 మీ (312 అ.) |
Population (2011) | |
• Total | 59,725 |
• Density | 2,600/km2 (6,800/sq mi) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 522 647 |
Vehicle registration | AP-07 |
వినుకొండ అన్న పేరు, శ్రీరాముడు సీతాదేవి అపహరణ గురించి వినడం జరిగింది కాబట్టి విను అన్న క్రియను బట్టి ఆ పేరు వచ్చిందని లోకనిరుక్తి ఉంది. ఈ నిరుక్తిని అనుసరించి తెలుగు, సంస్కృత పండితులు ఈ పేరును సంస్కృతీకరించి శృతగిరి పురం (శృత= విను, గిరి= కొండ, పురం= పట్టణం/నగరం) అన్న పదం కల్పించారు.
మెగాలిథిక్ కట్టడాలు పట్టణం చుట్టుప్రక్కల కనుగొనబడ్డాయి.[ఆధారం చూపాలి] 1000–1400 CE నాటి శిలాశాసనాలు చాలా పురాతన దేవాలయాలలో వున్నాయి. విష్ణుకుండినులనబడే రాజులు ఈ ప్రాంతాన్ని 1000 CE కాలంలో పరిపాలించారు. [ఆధారం చూపాలి] మధ్యయుగంలో కొండపై కోట వుండేది. 1640 లో నిర్మించిన జామియా మసీదు మహమ్మదీయ పాలకుల గుర్తుగా మిగిలివుంది.
జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి నైరుతి దిశలో 44 కి.మీ. దూరంలో వుంది.
2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 59,725.
1952లో వినుకొండ శాసనసభ్యులుగా గెలుపొందిన పులుపుల వెంకటశివయ్య, 1953లో వినుకొండ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైనాడు. రెండు పదవులలో 1955 దాకా ఉన్నాడు. సర్పంచిగా 1964 వరకూ పనిచేశాడు. 1962లో మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొంది శాసనసభ్యులుగా 8 ఏళ్ళు పనిచేశాడు. సర్పంచిగా 11 ఏళ్ళు పనిచేశాడు. నిరాడంబరుడైన ఇతని స్మృతి చిహ్నంగా పట్టణం నడిబొడ్డున స్మారకస్థూపం ఏర్పాటుచేశారు. పఠాన్ కాశింఖాన్ వినుకొండ గ్రామ సర్పంచిగా 20 ఏళ్ళు పనిచేశాడు. 29.1.2018 న ఇతని విగ్రహం కోటనాల బజారులో నెలకొల్పారు. ఇతను పులుపుల వెంకటశివయ్య శిష్యుడు.
2005 మే 29 న మూడవ గ్రేడ్ పురపాలక పట్టణం గా గుర్తింపు పొందింది. 2018 లో రెండవ గ్రేడ్ పురపాలక పట్టణం గా మార్చబడింది. మాచర్ల పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
పట్టణం రోడ్ల మొత్తం నిడివి106.70 km (66.30 mi). ఈ పట్టణం గుంటూరు -కర్నూలు -బళ్లారి ప్రధాన రహదారిపై వుంది. రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే లోని గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గుంటూరు - గుంతకల్ రైలు మార్గం పై వుంది.
వరి, అపరాలు, కాయగూరలు
నాణ్యత, రుచికి వినుకొండ పాలు ప్రసిద్ధి. మెట్ట ప్రాంతం కావడంతో పాలు నాణ్యంగా, అత్యంత ప్రత్యేకంగా ఉంటాయని పశు వైద్యాధికారులు నిర్ధారించారు. పాలలో వెన్న, ఇతర పదార్థాలు (ఎస్.ఎన్.ఎఫ్.) అత్యధికంగా ఉండటంతో 90 శాతం డెయిరీలు ఇక్కడి పాలను సేకరించేందుకు మక్కువ చూపుతున్నాయి. ఇక్కడి పాలు గది ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. సంగం డెయిరీ, హెరిటేజ్, తిరుమల, జెర్సీతోపాటు మొత్తం ఆరు పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
This article uses material from the Wikipedia తెలుగు article వినుకొండ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.