K A పాల్ (జ.
1963 సెప్టెంబరు 25) ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు, మత ప్రచారకుడు, శాంతి దూత, మానవతావాది. అతను యు.ఎస్ లో గల గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI), గోస్పెల్ టు ద అన్ రీచ్డ్ మిలియన్స్ (GUM) సంస్థల వ్యవస్థాపకుడు. అతను ఛారిటీ సిటీ తో పాటు అనేక అనాధ శరణాలయాలను హైదరాబాదులో నిర్వహిస్తున్నాడు. అతను అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని టెక్సాస్లో ఇతడి నివసిస్తుంటాడు. భారత దేశానికి వచ్చినప్పుడు. హైదరాబాదులో సాధారణంగా బస చేస్తాడు.
కిలారి ఆనంద్ పాల్ | |
---|---|
జననం | |
వృత్తి | మత ప్రచారకుడు రచయిత వక్త |
జీవిత భాగస్వామి | మేరీ |
పిల్లలు | గ్రేస్, పీస్ , జాన్ పౌల్ |
తల్లిదండ్రులు | బర్నబస్ సంతోషమ్మ |
కిలారి ఆనంద పాల్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో విశాఖ జిల్లా చిట్టివలస అనీ గ్రామంలో బర్నదాస్, సంతోసమ్మ దంపతులకు 1963 సెప్టెంబరు 25న జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు మొదట హిందూ మతానికి చెందినవారు. తరువాత 1966లో క్రైస్తవ మతంలోకి మారారు. పాల్ మార్చి 1971లో తన ఎనిమిదవ యేట క్రైస్తవ మతంలోకి మారాడు. క్రైస్తవ మతంలో అతను ఇవాంజెలిస్టు ఫాదర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తన ప్రస్థానంలో భారతదేశంలోని అనేక గ్రామాలలో సువార్త లను ప్రబోధించాడు. తన 19వ యేట అతను పూర్తి స్థాయి క్రిస్టియన్ మినిస్ట్రీ లో చేరాడు.
అతని భార్య మేరీ కిలారి. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని తల్లి 2019 ఫిబ్రవరి 12న విశాఖపట్నంలో చికిత్స పొందుతూ మరణించింది.
డాక్టర్ కె.ఏ.పాల్ మంచి వక్త, తెలుగు, ఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు రాష్ట్రానికి చెందిన పాల్ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించాడు. పాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి పరిచయం.
ఆయన 10+2 (ఇంటర్) పూర్తి చేసాడు. అతను కెనడా లోని స్వాన్ రివర్, మానిటోబా లోని లివింగ్ వర్డ్ బైబిల్ కళాశాల నుండి గౌరవ డిగ్రీని పొందాడు.
”గ్లోబల్ పీస్ చారిటి” Boeing 747SP చారిట విమానంలో 148 దేశాల్లో తిరుగుచు ”గ్లోబల్ పీస్ చారిటి” ద్వారా క్రైస్తవ మతప్రచారం చేస్తున్నాడు.
2008లో ప్రజాశాంతి పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 2009లో ఎక్కడా పోటీ చెయ్యలేదు.2014 లోనూ పోటీ చెయ్యలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సుమారు డెబ్బయి స్థానాల్లో పోటీ చేసినా అన్నిచోట్ల పాల్ తో సహా అందరు అభ్యర్థులు ధరవత్ (డిపాజిట్లు) కోల్పోయారు.
పాల్ సోదరుని హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న పాల్ అనుచరుడైన కోటేశ్వరరావును అపహరించి హత్య చేయాలన్న కుట్ర చేసారనే అభియోగంపై పాల్ను 2012 మే 21న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసారు.
అతని మాటతీరు హాస్యంగాను నిజం కలిపి వివాదస్పదంగాను ఉంటాయి.
కె. ఏ. పాల్ జీవితం ఆధారంగా యస్.బి. ఫిలింస్ పతాకంపై తిమోతి దర్శకుడిగా సంతోషమ్మ నిర్మించిన 'విశ్వవిజేత' అనే సినిమా తీసారు.
This article uses material from the Wikipedia తెలుగు article కిలారి ఆనంద్ పాల్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.