కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
ఆయన నవంబర్ 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైయ్యారు. ఆయన 01 డిసెంబర్ 2021 నుండి 9 డిసెంబర్ 2023 వరకు పని చేశాడు.
కడియం శ్రీహరి | |||
| |||
ఎమ్మెల్సీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 01 డిసెంబర్ 2021 నుండి 9 డిసెంబర్ 2023 | |||
ముందు | జి. విజయ రామారావు | ||
---|---|---|---|
తరువాత | టి.రాజయ్య | ||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ | |||
నియోజకవర్గం | స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | పర్వతగిరి , వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | 1952 జూలై 8||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | కె.వినయరాణి | ||
సంతానం | కడియం కావ్య, దివ్య , రమ్య | ||
నివాసం | హైదరాబాద్ | ||
మతం | హిందూ |
కడియం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి గ్రామంలో 8 జులై 1958 లో లక్ష్మీ నర్సింహ, వినయ రాణి దంపతులకు జన్మించారు. కడియం శ్రీహరి వరంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైదరాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. 1975-77 నుండి నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంక్ లో మేనేజర్గా పనిచేశాడు. 1977-1987 మధ్యకాలంలో టీచర్గా, జూనియర్ లెక్చరర్గా పనిచేశాడు.
ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వరంగల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. 1988 లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారటీ చైర్మన్ గా పని చేశాడు. కడియం శ్రీహరి 1994 లో తొలిసారిగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశాడు. నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుదల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వరంగల్ నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు.
కడియం శ్రీహరి 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం 3 జూన్ 2021న ముగిసింది. కడియం శ్రీహరి తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
ఆయన 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో గెలిచి, డిసెంబర్ 14న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.
కడియం శ్రీహరి 2024 మార్చి 31న బీఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
This article uses material from the Wikipedia తెలుగు article కడియం శ్రీహరి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.