సియెరా లియోన్: ఆఫ్రికాలోని ఒక దేశం

సియెరా లియోన్ వెస్టు నైరుతి తీరంలో ఉన్న ఒక దేశం.అధికారికంగా సియెరా లియోన్ రిపబ్లిక్ అనధికారికంగా సలోను సియెరా లియోన్.

ఇది ఉష్ణమండల శీతోష్ణస్థితిని కలిగి ఉంది. సవన్నా, వర్షారణ్యాలతో విభిన్న పర్యావరణం కలిగి ఉంటుంది. దేశం మొత్తం వైశాల్యం 71,740 చ.కి.మీ. (27,699 చ.మై) 2015 గణాంకాల ఆధారంగా దేశ జనాభా 70,75,641. సియెరా లియోన్ ఒక రాజ్యాంగ రిపబ్లిక్, ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు, ఏక శాసనసభతో నిర్వహించబడుతుంది. సియెరా లియోన్ ఒక ఆధిపత్య కేంద్ర ప్రభుత్వంగా ఉంది. అధ్యక్షుడు ప్రభుత్వ అధిపతిగా ఉంటాడు. దేశం రాజధాని, అతిపెద్ద నగరం ఫ్రీటౌన్. సియెరా లియోన్‌లో ఐదు పరిపాలనా ప్రాంతాలున్నాయి: ఉత్తర ప్రావిన్సు, వాయవ్య ప్రావిన్సు, తూర్పు ప్రావిన్సు, దక్షిణ ప్రావిన్సు, పశ్చిమ ప్రాంతం. ఈ ప్రాంతాలను మళ్ళీ పదహారు జిల్లాలుగా విభజించారు.

Republic of Sierra Leone

Flag of Sierra Leone
జండా
Coat of arms of Sierra Leone
Coat of arms
నినాదం: "Unity, Freedom, Justice"
గీతం: "High We Exalt Thee, Realm of the Free"
Location of  సియెరా లియోన్  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)  —  [Legend]
Location of  సియెరా లియోన్  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)  —  [Legend]

Location of Sierra Leone
రాజధానిFreetown
8°29.067′N 13°14.067′W / 8.484450°N 13.234450°W / 8.484450; -13.234450
అధికార భాషలుEnglish
Spoken languages
  • Temne
  • Mende
  • Krio
పిలుచువిధంSierra Leonean
ప్రభుత్వంUnitary presidential constitutional republic
• President
Julius Maada Bio (SLPP)
• Vice-President
Mohamed Juldeh Jalloh (SLPP)
• Chief Minister
David J. Francis (SLPP)
• Speaker of Parliament
Abass Bundu (SLPP)
• Chief Justice
Desmond Babatunde Edwards[1]
శాసనవ్యవస్థParliament
Independence
• from the United Kingdom
27 April 1961
• Republic declared
19 April 1971
విస్తీర్ణం
• మొత్తం
71,740 km2 (27,700 sq mi) (117th)
• నీరు (%)
1.1
జనాభా
• 2015 census
7,075,641 (103rd)
• జనసాంద్రత
79.4/km2 (205.6/sq mi) (114tha)
GDP (PPP)2018 estimate
• Total
$12.177 billion
• Per capita
$1,608
GDP (nominal)2018 estimate
• Total
$3.824 billion
• Per capita
$505
జినీ (2011)35.4
medium
హెచ్‌డిఐ (2015)Decrease 0.420
low · 179th
ద్రవ్యంLeone (SLL)
కాల విభాగంUTC+0 (GMT)
వాహనాలు నడుపు వైపుrightb
ఫోన్ కోడ్+232
ISO 3166 codeSL
Internet TLD.sl
  1. Rank based on 2007 figures
  2. Since 1 March 1971

1808 నుండి 1961 వరకు సియెరా లియోన్ బ్రిటిష్ క్రౌన్ కాలనీగా ఉంది. 1961 ఏప్రిల్ 27 న సర్ మిల్టను మార్గాయి (మొట్టమొదటి ప్రధాన మంత్రి) నేతృత్వంలో సియెరా లియోన్ యునైటెడు కింగ్డం నుండి స్వతంత్రం పొందింది. 1962 మేలో సియెరా లియోన్ ఒక స్వతంత్ర దేశంగా తన మొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించింది. 1971 ఏప్రిల్ 19 న సియకా స్టీవెన్సు ప్రభుత్వం సియెరా లియోన్ పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేసి సియెరా లియోన్ను ఒక అధ్యక్ష రిపబ్లికుగా ప్రకటించింది. 1978 నుండి 1985 వరకు సియెరా లియోన్ ఒక పార్టీ దేశంగా ఉంది. ఇందులో స్టీవెన్సు 'ఎ.పి.సి. పార్టీ దేశంలో ఏకైక చట్టపరమైన రాజకీయ పార్టీగా ఉంది. బహుళపార్టీ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్న సియెరా లియోన్ ప్రస్తుత రాజ్యాంగం 1991 లో అధ్యక్షుడు జోసెఫు సైడు మోమోహు (స్టీవెన్సు ఎన్నుకున్న వారసుడు) ప్రభుత్వం స్వీకరించింది. 1991 మార్చి 23 న మాజీ సియెరా లియోన్ సైన్యాధికారి ఫోడే సంకో నేతృత్వంలోని రివల్యూషనరీ యునైటెడు ఫ్రంటుగా పిలువబడిన ఒక తిరుగుబాటు బృందం దేశంలో ఒక 11 సంవత్సరాల క్రూరమైన పౌర యుద్ధానికి తెరతీసింది. అయినప్పటికీ సియెరా లియోన్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విజయవంతం కాలేదు.

1992 ఏప్రెలులో సియారా లియోన్ సైన్యాధికారి మోమోను అధికారం స్వీకరించాడు. 1996 జనవరిలో బ్రిగేడియరు జనరలు జూలియసు మాడ బయో నేతృత్వంలో మిలిటరీ ప్రభుత్వం దేశాన్ని తిరిగి బహుళజాతి ప్రజాస్వామ్యానికి తీసుకుని వచ్చింది. 1991 రాజ్యాంగం పునఃస్థాపన చేయబడింది. 1996 సియెరా లియోన్ ప్రెసిడెన్షియలు ఎన్నికలో అతని విజయం తర్వాత బయో " అహ్మదు టీజను కబ్బా " అధికారాన్ని బదిలీ చేసాడు. 1997 లో సైనిక అధ్యక్షుడు కబ్బాను పడగొట్టాడు. అయినప్పటికీ 1998 ఫిబ్రవరిలో నైజీరియా నేతృత్వంలోని పశ్చిమ ఆఫ్రికా ఎకోవాసు సైనిక దళాల సంకీర్ణ శక్తి సైనిక అధికారాన్ని తొలగించి కబ్బాను తిరిగి అధ్యక్షుడిగా నియమించింది. 1998 నుండి ఇప్పటి వరకు సియెరా లియోన్ నిరంతరాయ ప్రజాస్వామ్యంగా ఉంది. 2002 జనవరిలో అధ్యక్షుడు అహ్మదు టీజను కబ్బా తన ప్రచార వాగ్దానాన్ని నెరవేర్చడంతో అధికారికంగా అంతర్యుద్ధం ముగిసింది. తిరుగుబాటుదారులు ఎకోసు, బ్రిటిషు ప్రభుత్వం, ఆఫ్రికను సమాఖ్య, ఐక్యరాజ్య సమితి సహాయ సైనిక బలగాలు మద్దతుతో ఓడించబడింది.

సియెరా లియోన్లో 16 జాతి సమూహాలు నివసిస్తాయి. ప్రతి ఒక్కటి దాని స్వంత భాష, ఆచారాలతో ఉన్నాయి. వీటిలో టెమ్నే, మెండే రెండు అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన జాతులుగా ఉన్నాయి. ఇవి ప్రధానంగా దేశానికి వాయవ్య ప్రాంతంలో కనిపిస్తాయి. మెండే ప్రధానంగా ఆగ్నేయంలో ఉన్నారు. సుమారు 2% క్రిపు ప్రజలు, ఆఫ్రికా-అమెరికన్లు, పశ్చిమ భారతీయ బానిసల వారసులు అల్పసంఖ్యాక ప్రజలుగా ఉన్నారు. ఇంగ్లీషు అధికారిక భాష అయినప్పటికీ పాఠశాలలు, ప్రభుత్వ పరిపాలనలో ఉపయోగించినప్పటికీ, క్రియోలు, ఇంగ్లీషు ఆధారిత క్రియోలు, సియెరా లియోన్ అంతటా విస్తృతంగా వాడుక భాషగా (దేశ జనాభాలో 97% మందికి) ఉంది. దేశంలోని వివిధ జాతుల సమూహాలు మొత్తం వారి వర్తకం, సాంఘిక పరస్పర సంబంధాలలో క్రియోలు భాష వాడుకలో ఉంది.

సియెరా లియోన్ ఒక ముస్లిం దేశంగా (78%) ఉంది. అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో క్రైస్తవులు 21% ఉంది. సియెరా లియోన్ ప్రపంచంలో అత్యంత మతపరంగా సహనం కల్గిన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు, క్రైస్తవులు సహజీవనంతో పరస్పరం సహకరించుకుంటారు, మతపరమైన హింస చాలా అరుదు. ప్రధాన క్రైస్తవ, ముస్లిం సెలవులు క్రిస్మస్, ఈస్టర్, ఈద్ అల్-ఫితరు, ఈదు అలు అధాలతో సహా దేశంలో అధికారికంగా ప్రజా సెలవుదినాలు ఉంటాయి. రాజకీయాలలో అభ్యర్థికి ముస్లిం, క్రైస్తవుడు అనేవివక్ష చూపకుండా సియెరా లెయోనన్సు అభ్యర్థికి ఓటు వేస్తారు.

సియెరా లియోన్ మైనింగు (ముఖ్యంగా వజ్రాలు) దాని ఆర్థికరంగానికి పునాదిగా ఉంది. టైటానియం, బాక్సైటు అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఇది కూడా ఒకటి. ఇది బంగారం అతిపెద్ద ఉత్పత్తి దారుగా ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద నిక్షేపాలు కలిగిన దేశాలలో ఇది ఒకటి. సియెరా లియోన్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద సహజ నౌకాశ్రయానికి నిలయంగా ఉంది. ఈ సహజ సంపద ఉన్నప్పటికీ 2011 లో 53% జనాభా పేదరికంలో నివసించారు. సియెరా లియోన్ ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా సమాఖ్య, వెస్టు ఆఫ్రికా స్టేట్సు (ECOWAS), మానో రివరు యూనియను, కామన్వెల్తు ఆఫ్ నేషన్సు, ఆఫ్రికన్ డెవలప్మెంటు బ్యాంకు, ఇస్లామికు సహకార సంస్థలలో సభ్యదేశంగా ఉంది.

పేరు వెనుక చరిత్ర

15 వ శతాబ్దంలో పశ్చిమ ఆఫ్రికాలో మొట్టమొదటిగా సియెరా లియోన్, ఐరోపా సమాఖ్య సంబంధాలు ప్రారంభం అయ్యాయి. 1462 లో పోర్చుగీసు అన్వేషకుడు పెడ్రో డి సింత్ర ప్రస్తుత ఫ్రీటౌన్ నౌకాశ్రయం పరిసరప్రాంతాలలోని కొండల ఆకారాన్ని " సెర్రా లియోవా " (సెర్రా లీయో) (పోర్చుగీసు భాషలో లియోన్సు పర్వతాలు) గా తాను చిత్రీకరించిన మ్యాపులో పేర్కొన్నాడు. ఈ భౌగోళిక ఆకృతి స్పానిషు అనువాదం సియెరా లియోనా. ఇది తరువాత స్వీకరించబడి పొరపాటుగా ఉచ్ఛరించబడింది. ఇది దేశం ప్రస్తుత పేరుగా మారింది. ప్రొఫెసర్ సి. మాగ్బెలి ఫైలు అభిప్రాయం ప్రకారం ఇది చరిత్రకారుల పొరపాటుగా చెప్పవచ్చు: ఆయన అభిప్రాయం ప్రకారం 1462 కు ముందుగా ఈ ప్రాంతానికి మొదటిసారి వచ్చిన పర్యాటకులు ఈ ప్రాంతాన్ని " సెర్రా లియోవా " అని పిలవబడిందని ప్రయాణికుల సాక్ష్యం ఉంది. ఇది సియెరా లియోన్ అనే వ్యక్తి గుర్తుగా ఈ పేరు పెట్టబడిందనే కథనం ఇప్పటికీ అస్పష్టంగానే ఉందని భావిస్తున్నారు.

చరిత్ర

ఆరంభకాల చరిత్ర

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Fragments of prehistoric pottery from Kamabai Rock Shelter
సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
An 1835 illustration of liberated Africans arriving in Sierra Leone
సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
The colony of Freetown in 1856
సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Houses at Sierra-Leone (May 1853, X, p.55)

సియెరా లియోన్ కనీసం 2,500 సంవత్సరాలు పూర్వం నుండి మానవనివాసితంగా ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన సమాజాలు ఈ ప్రాంతాన్ని నిరంతరం మానవనివాసిత ప్రాంతంగా మార్చింది. 9 వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంనికి చెందిన ఇనుము వాడకాన్ని ఆరంభించారు. సా.శ.. 1000 నాటికి వ్యవసాయం చేపట్టారు. వాతావరణం గణనీయంగా మారింది. విభిన్న పర్యావరణ మండలాలలో సరిహద్దులు మారాయి. వలసలు, విజయాలను ప్రభావితం చేశాయి.

సియెరా లియోన్ దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యం, చిత్తడి పర్యావరణం అభేద్యమైనవిగా పరిగణించబడంది; ఇది గుర్రాలను, మండే ప్రజలు ఉపయోగించే జీబూ పశువులకు ఒక ప్రాణాంతక వ్యాధిని కలిగించే ట్సెట్సె కీటకానికి నిలయంగా ఉంది. ఈ పర్యావరణం కారణంగా మండే మీద ఇతర ఆఫ్రికా సామ్రాజ్యాల దాడి నుండి దాని ప్రజలను రక్షించింది. మాలి సామ్రాజ్యంలో సుసి వర్తకులు, ఉత్తర, తూర్పు ప్రాంతాల వ్యాపారులు, వలసదారులు పరిచయం చేసిన (18 వ శతాబ్దంలో విస్తృతంగా స్వీకరించబడింది) ఇస్లాం మతం ఇస్లామికు ప్రభావాన్ని కూడా ఇది తగ్గించింది.

ఐరోపా వాణిజ్యం

సిన్త్రా సాహసయాత్ర తరువాత పోర్చుగీసు వ్యాపారులు నౌకాశ్రయానికి వచ్చారు. 1495 నాటికి వారు తీరంలో ఒక బలమైన వ్యాపార స్థవరాన్ని నిర్మించారు. డచ్చి, ఫ్రెంచి కూడా ఇక్కడ వాణిజ్యాన్ని ఏర్పరుచుకున్నాయి. గిరిజన యుద్ధాలు, భూభాగ వివాదాలకు గురైన అంతర్గత ప్రాంతాల నుండి ఆఫ్రికా వర్తకులు తీసుకువచ్చిన బానిసల వ్యాపార కేంద్రంగా మారిన సియెరా లియోనును అన్ని దేశాల వర్తకులు ఉపయోగించారు. 1562 లో రాయలు నేవీకి చెందిన అడ్మిరలు సర్ జాన్ హాకిన్సు 300 మంది ఆఫ్రికా బానిసలను "కత్తి, ఇతర మార్గాల ద్వారా" స్వాధీనం చేసుకున్న తరువాత ఇంగ్లీషు ట్రయాంగిలు ట్రేడును ప్రారంభించింది. కారిబియా సముద్రం ప్రాంతంలో వెస్ట్ ఇండీస్ దీవులు హిస్పానియోలాలోని సాన్టో డొమింగో (స్పానిషు కాలనీకి)కు ఆయన వారిని విక్రయించాడు.

వలస స్థావరాలు

అమెరికా రివల్యూషనరీ యుద్ధం తరువాత బ్రిటిషువారు వేలమంది విముక్తి పొందిన ఆఫ్రికా-అమెరికా బానిసలను కెనడా, కరేబియా కాలనీలు లండనులలో వారికి పునరావాసం కల్పించారు. అది వారికి కొత్త జీవితాలను ఇచ్చింది. 1787 లో బ్రిటిషు క్రౌన్ సియెరా లియోన్లో "ఫ్రీడం ప్రావిన్సు"గా పిలువబడిన ఒక స్థావరాన్ని స్థాపించింది. ఇది "లండను బ్లాక్ పూరు" లోని కొంతమంది పునరావాసానికి ఉద్దేశించబడింది. అధికంగా యుద్ధ సమయంలో బ్రిటిషు వారు విముక్తి చేసిన ఆఫ్రికా- అమెరికన్ల పునరావాసం కొరకు ఉద్ద్డేశించబడింది. 1787 మే 15 న సుమారుగా 400 మంది నల్లజాతీయులు, 60 మంది శ్వేతజాతీయులు సియెరా లియోన్కు చేరుకున్నారు. ఈ సమూహంలో లండను నుండి ఆఫ్రికా సంతతికి చెందిన కొంతమంది పశ్చిమ భారతీయులను కూడా కలిగి ఉంది. వారు గ్రాన్విల్లె టౌనును స్థాపించిన తర్వాత వారి ఆక్రమణకు ప్రతిఘటించిన స్థానిక ఆఫ్రికా ప్రజలు, (టెమ్నే) వ్యాధి, యుద్ధాల వలన దాదాపు మొదటి వలస సమూహం మరణించింది. మిగిలిన వలసవాదులు రెండవ గ్రాన్విల్లే పట్టణాన్ని స్థాపించారు.

విప్లవం తరువాత నోవా స్కోటియాలో 3,000 కన్నా ఎక్కువ మంది " బ్లాక్ లాయలిస్టులు " కూడా స్థిరపడ్డారు. అక్కడ వారికి చివరకు భూమిని మంజూరు చేశారు. వారు బిర్చి టౌను, నోవా స్కోటియాను స్థాపించారు. కాని సమీపంలోని షెల్బర్నె, నోవాస్కోటియా ప్రజల జాతివివక్ష, కఠినమైన శీతాకాలాలను ఎదుర్కొన్నారు. థామసు పీటర్సు ఉపశమనం, మరింత సహాయం కోసం బ్రిటిషు అధికారులను ఒత్తిడి చేశారు; బ్రిటిషు నిర్మూలనకు చెందిన జాన్ క్లార్కన్లతో కలిసి, పశ్చిమ ఆఫ్రికాలో తమ అవకాశాలను కోరుకునే బ్లాక్ లాయలిస్టులను తరలించడానికి సియెరా లియోన్ కంపెనీ స్థాపించబడింది. 1792 1792 మార్చి 11 న సియారా లియోన్ రెండవ (శాశ్వత) కాలనీ, ఫ్రీటౌన్ స్థాపనకు నోవా స్కోటియా నుండి దాదాపు 1200 మంది అట్లాంటికు దాటిపోయారు. సియెరా లియోన్లో వారు నోవా స్కాటియనె సెటిలర్సు అని పిలువబడ్డారు.

సెటిలర్లు అమెరికన్ సౌత్లో వారి జీవితాల నుండి వారు తెలుసుకున్న శైలులలో ఫ్రీటౌన్ నిర్మించారు; వారు అమెరికా ఫ్యాషను, అమెరికా మర్యాదలను కూడా కొనసాగించారు. అదనంగా చాలామంది ఫ్రీటౌన్‌లో మెథడిజాన్ని కొనసాగించారు. సియెరా లియోన్ బ్లాక్ సెటిలర్లు మరింత ఎక్కువ స్వయంప్రతిపత్తి కలిగివుండటంతో వారు మరింత రాజకీయంగా నిమగ్నమయ్యారు. నల్లజాతీయుల వలసదారులందరూ రాజకీయ స్థాయి ప్రతినిధులు, ప్రతి 12 మందికి ఒక " టిథింగు మాన్ " ప్రాతినిధ్యం వహించారు, హండ్రెడర్లు పెద్ద మొత్తంలో ప్రాతినిధ్యం వహించారు. ఈ రకమైన ప్రాతినిధ్యం నోవా స్కోటియాలో అందుబాటులో లేదు. ఫ్రీటౌన్‌లో సమాజ నిర్మాణం ప్రాథమిక ప్రక్రియ ఒక కఠినమైన పోరాటం. క్రౌను తగినంత ప్రాథమిక సరఫరా చేయలేదు. సెటిలర్లు నిరంతరంగా అక్రమ బానిస వాణిజ్యం, తిరిగి బానిసత్వ ప్రయత్నాల ప్రమాదం చేత బెదిరించబడ్డారు. 1790 వ శతాబ్దంలో వయోజన మహిళలతో సహా సెటిలర్లు ఎన్నికలలో మొట్టమొదటిసారిగా ఓటు వేశారు. స్థిరనివాసుల భూమిని ఖాళీ చేయటానికి లండను పెట్టుబడిదారులచే నియంత్రించబడే సియెరా లియోన్ కంపెనీ నిరాకరించింది. 1799 లో కొందరు సెటిలర్లు తిరుగుబాటు చేశారు. కివోన్ 1800 లో నోవా స్కోటియా ద్వారా కుడ్జో టౌను (ట్రెలానీ టౌన్) నుండి రవాణా చేయబడిన 500 కి పైగా " జమైకను మరూన్ల " దళాలను తీసుకురావడం ద్వారా తిరుగుబాటును అణిచివేసారు. కల్నలు మాంటేగు జేమ్సు నాయకత్వం మరూన్లు తిరుగుబాటును అణిచివేసేందుకు వలసరాజ్యాలకు సహాయపడ్డారు. ఈ ప్రక్రియలో వారు ఉత్తమ నివాసాలు, పొలాలును పొందారు.

1808 జనవరి 1 న సియెరా లియోన్ కంపెనీ గవర్నరు థామసు లుదుం, ప్రముఖ అబాలిషనిస్టు సంస్థ, కంపెనీ చార్టరుకు లొంగిపోయారు. 16 సంవత్సరాల కాలనీకి ఇది ముగింపుగా మారింది. బ్రిటిష్ క్రౌను సియెరా లియోన్ కంపెనీను ఆఫ్రికన్ ఇంస్టీట్యూషనుగా పునర్వ్యవస్థీకరించింది; ఇది స్థానిక ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉద్దేశించబడింది. దీని సభ్యులు వీరు స్థానిక ఔత్సాహికులకు, సియారా లియోన్ వర్తకం మీద బ్రిటిషు గుత్తాధిపత్యం కలిగిన మాకాలే & బాబింగ్టను కంపెనీలో ఆసక్తిని కలిగిన వారికీ ప్రాతినిథ్యం వహించారు.

అదే సమయంలో (1807 లో బానిస వాణిజ్యం రద్దు చేయబడిన తరువాత), బ్రిటిషు బృందాలు అక్రమ బానిస ఓడల నుండి విడిపించిన వేలమంది స్వేచ్ఛాయుత ఆఫ్రికన్లను ఫ్రీటౌన్‌కు పంపాను. విముక్తి పొందిన బానిసలు (రీకాప్చర్లు) లను శ్వేతజాతి సేటిలర్లకు, నోవా స్కాటియను సెటిలర్లకు, జమైకను మరూన్లకు తలకు 20 అమెరికా డాలర్ల ధరకు అప్రెంటీసులుగా విక్రయించారు.[ఆధారం చూపాలి] అప్రెంటిసులుగా విక్రయించబడని కొందరు రీకాప్చర్లు బలవంతంగా నౌకాదళంలో చేరవలసి వచ్చింది. చాలామంది రీకాప్చర్యులు పేలవంగా చూడబడ్డారు. దుర్వినియోగం చేయబడ్డారు ఎందుకంటే కొందరు స్థానిక స్థిరనివాసులు వారిని తమ ఆస్తిగా భావించారు. వారి వివిధ మాతృభూములు, సంప్రదాయాల నుండి విడదీయబడిన స్వేచ్ఛాయుత ఆఫ్రికన్లు సెటిలర్లు, మరూన్ల పాశ్చాత్య శైలులకు అనుగుణంగా ఉండేలా బలవంతం చేయబడ్డాయి. ఉదాహరణకు కొందరు రీకాప్చర్లు వారి పేర్లను పాశ్చాత్య ఉచ్ఛారణకు అనుగుణంగా మార్చుకోలన్న వత్తిడికి గురయ్యారు. కొందరు సంతోషంగా ఈ మార్పులను స్వీకరించారు. ఎందుకంటే వారు దీనిని సమాజంలో భాగమని భావించారు. కొందరు ఈ మార్పలకు అసంతృకి లోనయ్యారు. తమ సొంత గుర్తింపును కావాలని కోరుకున్నారు. చాలామంది రీకాప్చర్లు చాలా సంతోషంగా ఉన్నారు. వారు సియెరా లియోన్ను విడిచిపెట్టి, వారి అసలు గ్రామాలకు వెళ్ళడం ద్వారా తిరిగి బానిసలుగా విక్రయించబడటానికి అవకాశం ఉంటుందని భావించారు. వారు వెస్టు ఆఫ్రికా తీరంలో అభివృద్ధి చెందుతున్న పువ్వులు, పూసలు వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించారు.

ఈ రీకాప్చర్ల ఆఫ్రికన్లు ఆఫ్రికా అనేక ప్రాంతాల నుండి (ప్రధానంగా పశ్చిమ తీరం) వచ్చారు. 19 వ శతాబ్దంలో నల్లజాతి అమెరికన్లు కొంతమంది అమెరికో లైబీరియన్ 'శరణార్థులు', ముఖ్యంగా వెస్టిండియన్లు విముక్తి పొంది ఫ్రీటౌన్‌కు వలస వచ్చారు. ఈ ప్రజలు క్రియో ప్రజలను (మొదట క్రియోల్స్ అని పిలిచేవారు), ఒక వాణిజ్య భాష అయిన క్రియోలు భాషను, ఒక కొత్త క్రియోలు జాతిని సృష్టించారు. ఇది దేశంలో అనేక జాతులలో సాధారణంగా ఉపయోగించబడింది.

వలస పాలన (1800–1960)

1800 లలో సియెరా లియోన్ వలస స్థావరం ప్రత్యేకమైనది. 1807 లో స్పెయిన్ బానిస వాణిజ్యం రద్దు చేసిన తరువాత వలస వచ్చిన ఆఫ్రికన్ల జనాభాను కలిగి ఉంది. సియెరా లియోన్లోకి వచ్చిన తరువాత ప్రతి "రికాంప్టివ్"కు నమోదిత సంఖ్య ఇవ్వబడింది. విడుదల చేయబడిన ఆఫ్రికాప్రజల నమోదులో వారి శారీరక లక్షణాలపై సమాచారం చేర్చబడుతుంది. అయినప్పటికీ తరచూ ఈ డాక్యుమెంటేషను అధిక వివరణలతో కూడినదై నమోదుప్రక్రియను క్లిష్టం చేసింది. 1808 నాటి లిబరేటెడు ఆఫ్రికన్ల రిజిస్ట్రేషను, 1812 పట్టుబడిన నీగ్రోసు, జాబితా (1808 పత్రాన్ని సంరక్షిస్తుంది) మధ్య విభేదాలు ప్రత్యేకంగా పేర్లలోని రీకాప్టివులలో కొన్ని అసమానతలు వెల్లడించాయి; చాలామంది రీకాప్టివులు ఇచ్చిన పేర్లను మరింత ఆంగ్లీకృత సంస్కరణలకు మార్చాలని నిర్ణయించుకున్నారు. అది సియెరా లియోనుకు వచ్చిన తర్వాత వాటిని గుర్తించడం అసాధ్యం కావడానికి కారణం అయింది.

1807 లో బానిస వాణిజ్యం రద్దు కొరకు బ్రిటిషు చట్టం ప్రకారం, ఈ రీకాప్టివులు సియెరా లియోన్లో బ్రిటిషు వలసవాదుల నాయకత్వంలో శిక్షణ పొందిన పురుషులు సైన్యం లేదా నౌకాదళంలోకి చేర్చుతారు. అనేక సందర్భాలలో $ 20 అమెరికా డాలర్లకు విక్రయించడం బానిసత్వానికి సమానంగా ఉంది. ఇది రీకాప్టివు అప్రెంటీసులకు వారిని క్రమశిక్షణలో ఉంచడానికి కర్రలను వాడారని డాక్యుమెంటు చేయబడింది. 1808 జూన్లో వలసరాజ్య సియెరా లియోన్ చరిత్రకారుడైన సుజానే స్క్వార్టుజు " 21 మంది పురుషులు, మహిళలు 21 మంది రాబిసు సమీపంలోని స్థానిక స్థావరానికి పారిపోయారు. తిరిగి స్వాధీనం చేసుకున్న సమయంలో సియెరా లియోన్లో స్థిరపడినవారిచే ఖైదు చేయబడ్డారు " అని పేర్కొన్నాడు. తద్వారా బానిసత్వంలాంటి అప్రెంటీసు వ్యవస్థ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా " 1898 నాటి హట్ టాక్ వార్ " టెంనె నాయకుడు బై బూర్హు

19 వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రీటౌన్ ప్రాంతం బ్రిటిషు కాలనీ గవర్నరు నివాసంగా ఉంది. ఆయన " గోల్డు కోస్టు (ప్రస్తుతం ఘనా)", గాంబియా స్థావరాలను కూడా పాలించాడు. సియెరా లియోన్ బ్రిటిషు పశ్చిమ ఆఫ్రికా విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది. బ్రిటిషు వారు 1827 లో ఇక్కడ ఫౌరా బే కాలేజీని స్థాపించారు. ఇది వెస్టు కోస్టులో ఆంగ్ల భాష మాట్లాడే ఆఫ్రికన్లను వేగంగా ఆకర్షించింది. ఒక శతాబ్దానికంటే ముందుగా పశ్చిమ ఉప-సహారా ఆఫ్రికాలలో ఐరోపా-శైలి విశ్వవిద్యాలయాలలో పురాతనమైనదిగా గుర్తించబడుతుంది.

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Temne leader Bai Bureh seen here in 1898 after his surrender, sitting relaxed in his traditional dress with a handkerchief in his hands, while a Sierra Leonean Royal West African Frontier soldier stands guard next to him

స్థానిక ప్రజలతో వర్తకం అధికంగా ఎవరు చేయాలన్న విషయంలో పోటీ కారణంగా బ్రిటిషు, ఫ్రీటౌన్‌లో క్రియోల మద్య సంఘర్షణ మొదలైంది. అంతేకాకుండా విద్యావంతులైన క్రియోలు వలసరాజ్య ప్రభుత్వంలో అనేక హోదాలను కలిగి ఉన్నారు. వారికి హోదా, సౌకర్యవంతమైన చెల్లింపు స్థానాలు ఇచ్చారు. 1884-1885 నాటి బెర్లిను సదస్సు తరువాత భూభాగాలమీద ఆధిపత్యం మరింత విస్తరించాలని యు.కె. నిర్ణయించుకుంది. ఐరోపా శక్తులు భూభాగాల "సమర్థవంతమైన ఆక్రమణ"గా వర్ణనలను సంతృప్తి పరచాలని యు.కె. నిర్ణయించింది. 1896 లో ఈ ప్రాంతాలను ఆక్రమించి, వాటిని సియెరా లియోన్ ప్రొటెక్టరేటుగా ప్రకటించింది. ఈ మార్పుతో బ్రిటిషువారు తమ పరిపాలనను ఈ ప్రాంతంలో విస్తరించడం ప్రారంభించారు. క్రియోలను వారి పదవుల నుండి తొలగించి బ్రిటిషు పౌరులను ఆయా పదవులలో నియమించారు. ఫ్రీటౌన్లోని ఇష్టపడే నివాస ప్రాంతాల నుండి కూడా క్రియోలను తొలగించారు.

అంతేకాక సంరక్షిత బ్రిటిషు విలీనం దేశీయ నాయకుల సార్వభౌమత్వం జోక్యం చేసుకుంది. వారు పూర్వ ప్రాక్టీసులో ఉన్నట్లు వ్యక్తిగతంగా వ్యవహరించే బదులు స్థానిక ప్రభుత్వాల విభాగాలుగా వారు నియమించబడ్డారు. వారు దీర్ఘకాలిక మిత్ర దేశాలతో కూడా సంబంధాలను కొనసాగించలేదు. ఉదాహరణకు బాయి బూరేహు ప్రధాన అధికారి కస్సే (స్మాల్ స్కార్రియస్ నదిలో ఒక వర్గం)ను 1898 లో హట్ పన్ను యుద్ధం ప్రధాన ప్రేరేపకుడిగా అన్యాయంగా చిత్రీకరించబడ్డాడు. ప్రొటెక్టరేటు సైనిక గవర్నరు కల్నలు ఫ్రెడరికు కార్డే 1898 లో నివాసాలపై కొత్త పన్నును ఏర్పాటు చేశాడు. నాయకులు రోడ్లు నిర్వహించడానికి వారి ప్రజలను ఉపయోగించాలని నిర్బంధించాడు. పన్నులు తరచుగా నివాసాల విలువ కంటే అధికంగా ఉన్నాయి. 24 చీఫ్లు ఇది విధ్వంసకరమైనవిగా పేర్కొంటూ కార్డ్యూ పిటిషనుమీద సంతకం చేశారు; వారి ప్రజలు వారి జీవనాధార వ్యవసాయం నుండి సమయాన్ని వెచ్చించలేక పోయారు. వారు పన్నుల చెల్లింపును వ్యతిరేకించారు. కొత్త వలసవాద అవసరాల మీద ఉద్రిక్తతలు, నాయకుల గురించి పాలకుల అనుమానాలు 1898 నాటి హట్ పన్ను యుద్ధానికి దారితీశాయి. ఇవి కూడా టెమ్నే-మెండే యుద్ధం అని కూడా పిలువబడ్డాయి. బ్రిటిషు మొదట యుద్ధం ప్రారంభించారు. ఉత్తరప్రాంతాలో ప్రజలకు బాయిబరేహు నాయకత్వం వహించాడు. మెండే ప్రజలు అధికంగా ఉన్న దక్షిణ ప్రాంతం, కొంతకాలం తరువాత, విభిన్న కారణాలతో సంఘర్షణలోకి ప్రవేశించింది.

శక్తివంతమైన బ్రిటిషు దళాల మీద బురేహు యోధుల చాలా నెలలు ఆధిక్యత చూపారు. యుద్ధంలో వందలమంది బ్రిటిషు దళాలు, బురేహు యోధులు మరణించారు. బాయి బురేహు చివరికి 1898 నవంబరు 11 న లొంగిపోవడంతో తన ప్రజల భూభాగం, నివాసాలు విధ్వంసానికి గురైయ్యాయి. బ్రిటిషు ప్రభుత్వం మర్యాదపూర్వకంగా సిఫార్సు చేసినప్పటికీ చీఫ్, ఇద్దరు మిత్రులను గోల్డ్ కోస్టుకు బహిష్కరించాలని కార్డేవు పట్టుబట్టారు; ఆయన ప్రభుత్వంలోని 96 మంది ప్రధాన నాయకులను ఉరితీసింది. 1905 లో కైసే తన అధికారాన్ని తిరిగి ప్రారంభించినప్పుడు బాయి బూరేహు తిరిగి అనుమతించబడ్డాడు.

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Moa River Bridge, Sierra Leone. Lisk-Carew Brothers, Freetown, Sierra Leone
సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
British West African Campaign troops in Freetown, 1914–1916. Published caption: "British expeditionary force preparing to embark at Freetown to attack the German Cameroons, the main object of the attack being the port of Duala. Auxiliary native troops were freely used in African warfare."
సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
African Naval ratings march past the Governor of Sierra Leone, Hubert Stevenson.

హట్ పన్ను యుద్ధంలో టెమ్నే, మెండే ఓటమి తరువాత రక్షిత వలసరాజ్య ప్రభుత్వానికి ప్రతిఘటనను ఎదుర్కుంది. అయినప్పటికీ వలసపాలన కాలం అంతా అల్లర్లకు, శ్రామిక అశాంతి కొనసాగింది. 1955 - 1956 లలో జరిగిన అల్లర్లుకు మద్దతుగా అనేక వేల మంది సియారా లియోనియన్లు పాల్గొన్నారు.

స్థానిక ఆఫ్రికా సామ్రాజ్యవాదులు దేశీయ బానిసత్వం కొనసాగించారు. ఇది 1928 లో రద్దు చేయబడింది. 1935 లో ఒక ముఖ్యమైన సంఘటన డీ బీర్సు నిర్వహిస్తున్న సియెరా లియోన్ సెలెక్షను ట్రస్టుకు ఖనిజ త్రవ్వకాలలో గుత్తాధిపత్యం ఇవ్వబడింది. గుత్తాధిపత్యం 98 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. తూర్పు, ఇతర ఖనిజాల వజ్రాల మైనింగు విస్తరించబడింది. దేశంలోని ఇతర ప్రాంతాల నుండి అక్కడ కార్మికులరాక అధికరించింది.

1924 లో యు.కె. ప్రభుత్వం సియెరా లియోన్ ఒక కాలనీ, ప్రొటెక్టెటుగా విభజించింది. రెండింటినీ రాజకీయ వ్యవస్థలను రాజ్యాంగబద్ధంగా ప్రత్యేకంగా నిర్వహించారు. కాలనీ ఫ్రీటౌన్ దాని తీర ప్రాంతం; స్థానిక అధిపతులు ఆధిపత్యం చెలాయించిన ప్రాంతాలుగా పరిరక్షకత ప్రాంతంగా నిర్వచించబడింది. కాలనీ, ప్రొటెక్టరేటు రెండింటికీ ఒకే రాజకీయ వ్యవస్థ కొరకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టబడినప్పుడు, రెండు సంస్థల మధ్య విరోధం 1947 లో తీవ్రమైన చర్చకు దారితీసింది. ప్రతిపాదనలు అధికంగా ప్రొటెక్టెట్ నాయకుల నుండి వచ్చాయి. దీని జనాభా కాలనీలో చాలా మించిపోయింది. ఐజాకు వాలేసు-జాన్సను నేతృత్వంలోని క్రియోలు ప్రతిపాదనలను వ్యతిరేకించారు. వారు కాలనీలో క్రియోల రాజకీయ శక్తిని తగ్గించగలిగారు.

1951 లో సర్ మిల్టను మార్గాయి, లమినా సంకో, సికా స్టైవెన్సు, మొహమ్మదు సానుసి ముస్టాఫా, జాన్ కరీఫా-స్మార్టు, కండే బురెహు, సర్ ఆల్బర్టు మార్గాయి, అమడు వూరి, సర్ బాన్జ టీజను-సియ్ సహా వివిధ గ్రూపుల నుండి విద్యావంతులైన నాయకులు, ప్రొటక్టరేటు పార్టీగా సియెరా లియోన్ పీపుల్సు పార్టీ లేదా ఎస్.ఎల్.పి.పిని ఏర్పరచాలని నిర్ణయించుకున్నారు. సర్ మిల్టను మార్గై నాయకత్వంలోని ఎస్.ఎల్.పి.పి. నాయకత్వం, బ్రిటిషుతో స్వతంత్రతను సాధించడానికి ఫ్రీటౌన్‌లో ఉన్న విద్యావంతులైన క్రియో-ఆధిపత్యం కలిగిన కాలనీతో చర్చలు జరిపింది.

మెండి మిల్టను మార్గాయి గందరగోళ రాజకీయాలలో విద్యావంతులైన ప్రొటెక్టరేటు ప్రముఖులు క్రోయో పారామౌంటు నాయకులతో చేరారు. తర్వాత మార్గరీ యు.కె నుండి స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రతిపక్ష నేతలైన క్రియోలను తమవైపు త్రిప్పడానికి అదే నైపుణ్యాలను ఉపయోగించారు. 1951 నవంబరులో కొత్త రాజ్యాంగం ముసాయిదాను మార్గీ పర్యవేక్షించాడు. ఇది ప్రత్యేక కలోనియలు ప్రొటెక్టరేటు చట్టసభలను సమైక్యపరచి డీకోలనైజేషను కొరకు ఒక ప్రణాళికను అందించింది. 1953 లో సియెరా లియోన్ స్థానిక మంత్రివర్గ అధికారాలను మంజూరు చేసి సియెరా లియోన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. కొత్త రాజ్యాంగం సియెరా లియోన్ కామన్వెల్తు ఆఫ్ నేషంసులో పార్లమెంటరీ వ్యవస్థలో చేరడానికి ప్రయత్నింది. 1957 మేలో సియెరా లియెనె మొదటి పార్లమెంటరీ ఎన్నికను నిర్వహించింది. సియెరా లియోన్ కాలనీలో అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ పార్టీ, అలాగే రాష్ట్రాలలో శక్తివంతమైన పారామౌంటు అధికారుల మద్దతుతో ఉన్న ఎస్.ఎల్.పి.పి పార్లమెంటులో అధిక సీట్లను గెలుచుకుంది. మార్గాయి మెజారిటీతో ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు.

1960 స్వతంత్ర సమావేశం

లండన్లో స్వాతంత్ర్యం కోసం చర్చలు జరిపిన క్వీన్ ఎలిజబెత్ II, బ్రిటిషు కలోనియల్ సెక్రటరీ ఇయిన్ మాక్లియోడ్ జరిపిన రాజ్యాంగ సమావేశాలలో 24 మంది సభ్యులైన సియెరా లియోనన్ ప్రతినిధి బృందానికి మార్గాయి నాయకత్వం వహించాడు.

1960 మే 4 న లండనులో చర్చలు ముగిసిన తరువాత యునైటెడ్ కింగ్డం 1961 ఏప్రిల్ 27 న సియెరా లియోన్కు స్వతంత్రం మంజూరు చేయడానికి అంగీకరించింది. 

స్వతంత్ర్యం (1961), మార్గై పాలన (1961–1964)

1961 ఏప్రిల్ 27 న సర్ మిల్టను మార్గై సియెరా లియోన్ తరఫున పోరాడి గ్రేటు బ్రిటను నుండి స్వాతంత్ర్యం సాధించి దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రి అయ్యాడు. వేలాది మంది సియెరా లియెనెయన్లు స్వతంత్ర వేడుకలలో పాల్గొనడానికి వీధులకు చేరుకున్నారు. రిపబ్లిక్ ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థను నిలుపుకుంది. కామన్వెల్తు ఆఫ్ నేషన్సు సభ్యదేశం అయింది. ప్రధాన ప్రతిపక్ష ఆల్ పీపుల్సు కాంగ్రెసు (ఎ.పి.సి), సియకా స్టీవెన్సు, ఐజాకు వాలేసు-జాన్సను, ఎస్.ఎల్.పి.పి ప్రభుత్వం మరొక బహిరంగ విమర్శకుడు మొదలైన వారిని స్వాతంత్ర్యవేడుకలను భంగపరిచినందుకు మరొక 16 మందితో ఖైదుచేసి ఫ్రీటౌన్లో గృహ నిర్బంధంలో ఉంచారు.

1962 మేలో సియెరా లియోన్ స్వతంత్ర దేశంగా తన మొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించింది. సియెరా లియోన్ పీపుల్సు పార్టీ (ఎస్ఎల్పిపి) పార్లమెంటులో సీట్ల కొంత అధికమైన సంఖ్యను గెలుచుకుంది. మిల్టను మార్గాయి తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

మార్గరై అధికారంలో ఉన్న సమయంలో సియెరా లెయెనెలో చాలా ప్రాచుర్యం పొందాడు. ఆయన స్వీయ-పర్యవేక్షణకు అత్యంత ప్రసిద్ధి చెందినది. అతను అవినీతి, తన అధికారం పరిరక్షణకొరకు అధికారం ప్రదర్శించలేదు. ఆయన చట్ట పరిపాలన, అధికార విభజన, బహుళ రాజకీయ సంస్థలు, న్యాయమైన ప్రతినిథ్యం నిర్మాణాత్మక విధానాలతో ప్రభుత్వపాలన చేసాడు. మార్గరై తన సంప్రదాయవాద సిద్ధాంతాలతో సియెరా లియెనెలో కలహాలు లేకుండా దారి చేసాడు. ఆయన పలు జాతి సమూహాల వువరాలు సేకరించడానికి ప్రభుత్వ అధికారులను నియమించాడు. రాజకీయ పార్టీలు, ఆసక్తి సమూహాల మధ్య రాజకీయ అధికారాన్ని పంచుకోవడం ద్వారా మార్గరై బ్రోకరేజి పాలసీ శైలిని ఉపయోగించాడు. ప్రావింసులలో శక్తివంతమైన పారామౌంటు అధికారులు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో చాలామంది ఆయన ప్రభుత్వంలో కీలక మిత్రులుగా ఉన్నారు.[ఆధారం చూపాలి]

ప్రజాపాలన (1964–1967)

1964 లో మిల్టను మార్గాయ ఊహించని మరణం తరువాత అతని సవతి సోదరుడు సర్ ఆల్బర్టు మార్గరీ పార్లమెంటు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. సర్ ఆల్బర్టు నాయకత్వాన్ని విదేశాంగ మంత్రి జాన్ కరీఫా-స్మార్టు సవాలు చేసాడు. ఆయన సర్ ఆల్బర్టు ఎస్.ఎల్.పి.పి. వారసత్వ నాయకత్వాన్ని ప్రశ్నించాడు. ప్రధాన మంత్రిగా ఆల్బర్టు మార్గాయుకు వ్యతిరేకతగా ఎస్.ఎల్.పి.పి. పార్టీలో ఒక ప్రముఖ అల్పసంఖ్యా వర్గాన్ని (కరేఫా-స్మార్టు) నిర్వహించింది. SLPP నాయకుడిగా ఆల్బర్టు మార్గాయి, ప్రధాన మంత్రిగా బాధ్యత నుండి తొలగించి తాను ఆస్థానాలను నిలబెట్టడంలో SLPP ఆధిపత్య పార్లమెంటు సభ్యుల మద్దతు సంపాదించడంలో కరీఫా-స్మార్టు విఫలమయ్యడు. అధిక సంఖ్యలో SLPP సభ్యులు కరీఫా-స్మార్టు మీద ఆల్బర్టు మార్గైకు మద్దతు ఇచ్చారు. ఆల్బర్టు మార్గా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన అన్నయ్య మిల్టను ప్రభుత్వంలో పనిచేసిన అనేక సీనియరు ప్రభుత్వ అధికారులను తొలగించాడు. తన పరిపాలనకి వారు అడ్డుగా ఉంటారని కరీఫా-స్మార్టు భావించాడు.

సర్ ఆల్బర్టు ప్రతిపక్షాలకు ప్రతిస్పందనగా అధికార చర్యలను చేపట్టాడు. ప్రతిపక్షం ఆల్ పీపుల్సు కాంగ్రెసు (ఎ.పి.సి) కు వ్యతిరేకంగా పలు చట్టాలను అమలుచేశాడు. ఒక పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించటానికి ప్రయత్నించాడు.[ఆధారం చూపాలి]సర్ ఆల్బర్టు పారామౌంటు చీఫ్సుకు ఎగ్జిక్యూటివు అధికారాలు కల్పించే వలసవాద పాలనా విధానాన్ని వ్యతిరేకించాడు. వీరిలో చాలామంది అతని సోదరుడు సర్ మిల్టను కీలక మిత్రులుగా ఉన్నారు. ఫలితంగా వారు సర్ ఆల్బర్టు దేశవ్యాప్తంగా పాలక సభలకు ముప్పుగా పరిగణించటం మొదలుపెట్టారు. క్రోయేలు జాతి సమూహంలోని సభ్యులు ఆధిపత్యం వహించిన రాజధానిలోని పౌర సేవలో (మార్గరై అనేకమంది క్రియోల్లను ఫ్రీటౌన్లో దేశ పౌర సేవకు నియమించారు)పూర్తిస్థాయి మార్పులు చేసాడు. దీని ఫలితంగా క్రియోలు సమాజంలో ఆల్బర్టు మార్గీ జనాదరణ పోగొట్టుకున్నాడు. వీరిలో చాలామంది సర్ మిల్టన్కు మద్దతు ఇచ్చారు. ప్రముఖ స్థానాలకు తన సొంత మెండే జాతి సమూహంలో సభ్యులకు మద్దతు ఇచ్చాడని మార్గరాయి ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

1967 లో మార్గరీ విధానాలకు వ్యతిరేకంగా ఫ్రీటౌన్‌లో అల్లర్లు చెలరేగాయి; ప్రతిస్పందనగా అతను దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. సర్ ఆల్బర్ట్ అవినీతి, తన సొంత మెండే జాతి సమూహానికి అనుగుణంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దేశం భద్రతా దళాల పూర్తి మద్దతు కలిగి ఉన్నప్పటికీ ఆయన స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికల కోసం పిలుపునిచ్చాడు.

సైనిక తిరుబాటు (1967–1968)

1967 సాధారణ ఎన్నికల పోటీలో ఎ.పి.సి. దాని నాయకుడు సియకా స్టీవెను స్వల్ప ఆధిక్యంతో ఎస్.ఎల్.పి.పి మీద విజయం సాధించాడు. 1967 మార్చి 21 న స్టీవెంసు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పదవీ స్వీకారం చేసిన కొన్ని గంటల సమయంలో సియెరా లియోన్ సాయుధ దళాల కమాండరు అయిన బ్రిగేడియరు జనరలు డేవిడు లాన్సానా నాయకత్వంలోని ఒక రక్తపాతరహిత సైనిక తిరుగుబాటులో స్టీవెనును పదవి నుండి తొలగించారు. డేవిడు లాంసానా 1964 లో ఆయనను ఈ పదవికి నియమించిన ఆల్బర్టు మార్గా సన్నిహిత మిత్రుడు. లాంసానా స్టీవెనును గృహ నిర్బంధంలో ఉంచాడు. ప్రధాని గిరిజన ప్రతినిధుల ఎన్నిక వరకు వేచి ఉండాలని పట్టుబట్టారు. విడుదలైన తర్వాత స్టీవెన్సు గినియాలో ప్రవాసంలోకి వెళ్ళాడు.

1967 మార్చి 23 న బ్రిగేడియరు జనరలు ఆండ్రూ జ్యూక్సను-స్మితు నేతృత్వంలోని సియెరా లియోన్ సైన్యంలోని సైనిక అధికారుల బృందం ఈ చర్యను ఒక తిరుగుబాటు కార్యక్రమం ద్వారా అధిగమించింది. వారు ప్రభుత్వ నియంత్రణను స్వాధీనం చేసుకున్నారు లాన్సాను అరెస్టు చేసి రాజ్యాంగాన్ని రద్దు చేశారు. ఈ బృందం ఆండ్రూ జ్యూక్సను-స్మితు దాని ఛైర్మనుగా, దేశం అధిపతిగా నేషనలు రిఫార్మేషను మండలి (ఎన్.ఆర్.సి) ని ఏర్పాటు చేసింది.

1968 ఏప్రిల్ 18 న బ్రిగేడియరు జనరలు జాన్ అమడు బంగురా నాయకత్వంలోని సియెరా లియోన్ సైన్యంలోని తక్కువ స్థాయి సైనికుల బృందం తమకురాము " అవినీతి వ్యరేక విప్లవాత్మక ఉద్యమం " (ఎ.సి.ఆర్.ఎం) గా పేర్కొంటూ ఎన్.ఆర్.సి. సైనిక ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఎ.సి.ఆర్.ఎం. సైనిక ప్రభుత్వం అనేక సీనియరు ఎన్.ఆర్.సి. సభ్యులను అరెస్టు చేసింది. వారు రాజ్యాంగాన్ని పునఃస్థాపించారు. చివరికి స్టీవెను తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా అధికార బాధ్యతను స్వీకరించారు.

ఏక పార్టీ దేశం (1968–1991)

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
An APC political rally in the northern town of Kabala outside the home of supporters of the rival SLPP in 1968

స్టీవెన్సు 1968 లో తిరిగి అధికారం చేపట్టాడు. ఇది చాలా ఆశ, ఆశయంతో.[ఆధారం చూపాలి]

ఆయన బహు-పార్టీల రాజకీయాలలో విజయం సాధించినందున ఆయన మీద చాలా విశ్వాసం ఉంచబడింది. స్టెవెన్సు తెగలను సోషలిస్టు సూత్రాల క్రింద కలపడానికి ప్రయత్నం చేశాడు. తన తొలి దశాబ్దంలో స్టీవెన్సు తన పూర్వీకుడు ఎస్.ఎల్.పి.పి ఆల్బర్టు మార్గాయి, ఎన్.ఆర్.సి. జుక్సను-స్మితులు పనికిరావాలని భావించిన ప్రణాళికలను పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు.[ఆధారం చూపాలి]

స్టీవెన్సు ప్రభుత్వం దేశం చమురు శుద్ధి కర్మాగారం, ప్రభుత్వ యాజమాన్యంలోని కేప్ సియెరా హోటలు, ఒక సిమెంటు ఫ్యాక్టరీని పునర్వ్యవస్థీకరించింది. ఆయన విక్టోరియా పార్కు (2017 మధ్యలో ఫ్రీటౌన్ అమ్యూజ్మెంటు పార్కు) మైదానంలో ఒక చర్చి, మసీదును జగ్సను-స్మితు నిర్మాణాలను రద్దుచేసాడు. స్టెవెన్సు రాష్ట్రాల, నగరాల మధ్య దూరం తగ్గించడానికి వంతెనను నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించాడు. రాష్ట్రాలలో రోడ్లు ఆసుపత్రులు నిర్మించబడ్డాయి. పారామౌంటు చీఫ్సు, ప్రొవిన్షియలు ప్రజలు ఫ్రీటౌన్‌లో ఒక ప్రముఖ శక్తిగా మారారు.

అనేక తిరుగుబాటు ప్రయత్నాల గ్రహించిన కారణంగా స్టీవెన్సు పాలనలో మరింత నిరంకుశత అధికరించింది. కొంతమంది మద్దతుదారులతో ఆయన సంబంధం క్షీణించింది. అతను సాధారణ ఎన్నికలలో పోటీ రాజకీయాల నుండి ఎస్.ఎల్.పి.పి పార్టీని తొలగించాడు. కొంతమంది హింస, బెదిరింపుల ద్వారా తొలగించబడ్డారు. సైనిక మద్దతును కొనసాగించేందుకు స్టీవెన్సు సియెరా లియోన్ సాయుధ దళాల అధిపతిగా ప్రముఖ జాన్ అమడు బంగురాను నిలబెట్టుకున్నాడు.

పౌర పాలనకు తిరిగి వచ్చిన తరువాత ఉప ఎన్నికలు జరిగాయి ( 1968 లో మొదలైంది).అలు- ఎ.పి.సి కేబినెటు నియమించబడింది. ప్రశాంతత పూర్తిగా పునరుద్ధరించబడలేదు. 1968 నవంబరులో స్టీవెనును ప్రావిన్సులలోని అశాంతి దేశవ్యాప్తంగా అత్యవసర స్థితిని ప్రకటించటానికి నడిపించింది. సియెరా లియోన్ సైన్యంలోని అనేక మంది సీనియరు అధికారులు స్టీవెన్సు విధానాలతో నిరాశపడ్డారు. సియెరా లియోన్ మిలటరీని నిర్వహించారు. కాని ఎవరూ స్టీవెనును ఎదుర్కోలేదు. స్టీవెన్స్ను ప్రధాన మంత్రిగా నియమించిన బ్రిగేడియరు జనరలు బాంకురా స్టీవెనును నియంత్రించే ఏకైక వ్యక్తిగా భావించారు. సైన్యం బంకురాకు అంకితం చేయబడింది. ఇది స్టీవెనుకు ప్రమాదకరమైనది. 1970 జనవరిలో బంకురాను కుట్ర అభియోగాలతో ఖైదు చేసారు. స్టీవెన్సు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు పాల్పడినట్లు ఆరోపించారు. కొన్ని నెలల పాటు కొనసాగిన ఒక విచారణ తరువాత బాంకురాకు మరణ శిక్ష విధించబడింది. 1970 మార్చి 29 మార్చి 29 న బ్రిగేడియరు బంగురా ఫ్రీటౌన్‌లో ఉరితీయబడ్డాడు.

బంకురాను ఉరితీసిన తరువాత చేసిన తరువాత ఉరితీయబడిన బ్రిగేడియెరు బంగురాకు విశ్వసనీయ సైనికుల బృందం స్టీవెన్సు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని ఫ్రీటౌన్‌లో, కొన్ని ప్రాంతాలలో తిరుగుబాటు చేసారు. అధ్యక్షుడు స్టీవెను మీద తిరుగుబాటులో పాల్గొన్నందుకు ఫ్రీటౌన్లో డజను మంది సైనికులు అరెస్టు చేసి దోషిగా నిర్ధారించారు. అరెస్టు చేసిన సైనికులలో కొంతమంది సైన్యం కార్పోరలు ఫోధీ సంకో, బంగురా బలమైన మద్దతుదారు. కార్పోరలు సాన్కోకు ఫ్రీటౌన్‌లోని పాండెం రోడు జైలులో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది

1971 ఏప్రెలులో ఒక కొత్త రిపబ్లికను రాజ్యాంగం స్వీకరించబడింది. ఇది స్టీవెన్సు ప్రెసిడెంటుగా మార్చింది. 1972 ఉప ఎన్నికలో ప్రతిపక్ష ఎస్.ఎల్.పి.పి. విధానపరమైన అడ్డంకులు, బెదిపింపులు (ఎ.పి.సి, మిలీషియా) జరిగాయని ఫిర్యాదు చేసింది. ఈ సమస్యలు చాలా తీవ్రంగా మారాయి. 1973 సార్వత్రిక ఎన్నికను ఎస్.ఎల్.పి.పి. బహిష్కరించింది; దాని ఫలితంగా ఎ.పి.సి. 85 ఎన్నికలలో 84 స్థానాలను గెలుచుకుంది.

1974 లో అధ్యక్షుడు స్టీవెనును పడగొట్టడానికి ఉద్దేశించిన ఒక తిరుగుబాటు ప్రయత్నం విఫలమై దాని నాయకులు ఉరితీయబడ్డారు. 1974 మధ్యకాలంలో స్టీవెన్సు అభ్యర్ధనతో మద్దతుగా ఉన్న గినియాన్ సైనికులు దేశంలోనే ఉన్నారు. స్టీవెన్సు అప్పటి గైనన్ అధ్యక్షుడు అహ్మదు సెకౌ టౌరేతో సన్నిహిత మిత్రుడుగా ఉండటంతో ఆయన అధికారాన్ని కొనసాగించారు. 1976 మార్చిలో స్టీవెన్సు ప్రెసిడెంటుగా రెండవ ఐదు-సంవత్సరాల పదవికి వ్యతిరేకత లేకుండా ఎన్నికయ్యారు. 1975 జూలై 19 న, మాజీ సీనియరు మంత్రి మొహమ్మదు సిరి ఫోర్నా (రచయిత అమినాత్తా ఫోర్నా తండ్రి), బ్రిగేడియరు జనరలు ఇబ్రహీం భాషు తఖి, లెఫ్టినెంటు హబీబు లాన్సనా కమరాలతో సహా 14 సీనియర్ సైన్యం, ప్రభుత్వ అధికారుల ఒక తిరుగుబాటుతో అధ్యక్షుడు స్టీవెన్సు ప్రభుత్వాన్ని వదులుకున్నాడు.

1977 లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త విద్యార్థి ప్రదర్శన సియెరా లెయోనె రాజకీయాల్ని దెబ్బతీసింది. సైన్యం, స్టీవెన్సు సొంత ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్.ఎస్.డి) బలం ఆయనని కాపాడటానికి అధికారం మీద పట్టు నిలుపుకోవటానికి సృష్టించిన భారీగా ఆయుధాలు కలిగిన సైనిక పారామిలిటరీ దళం ద్వారా వెంటనే ఈ ప్రదర్శన తొలగించబడింది. ఎస్.ఎస్.డి. అధికారులు స్టీవెనుకు చాలా విశ్వసనీయంగా ఉన్నారు. వీరు స్టీవెన్సు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ తిరుగుబాటును లేదా నిరసనలను కూల్చివేసేందుకు సియెరా లియోనులో నియమించబడ్డారు. తరువాత ఒక జనరలు ఎన్నిక పిలుపు ఇవ్వబడింది. అదే సంవత్సరం అవినీతి తిరిగి విజృంభించింది. ఎ.పి.సి. 74 సీట్లను, ఎస్.ఎల్.పి.పి. 15 గెలుచుకుంది. 1978 లో ఎ.పి.సి.- ఆధిపత్య పార్లమెంటు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1978 రాజ్యాంగం సియెరా లియోన్లో ఎ.పి.సి. మాత్రమే చట్టపరమైన రాజకీయ పార్టీగా చేసింది. ఈ చర్య దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొక ప్రధాన ప్రదర్శన జరగడానికి దారితీసింది. కానీ తిరిగి సైన్యం, స్టీవెన్సు ఎస్.ఎస్.డి దళాలు దీనిని నిలిపివేసింది.

స్టీవెన్సు సాధారణంగా నియంతృత్వ పద్ధతులకు, ప్రభుత్వ అవినీతికి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ సానుకూల సూచనతో ఆయన దేశం పౌర యుద్ధంలో కుప్పకూలిపోయాడా స్థిరంగా ఉంచాడు. ప్రస్తుతం వాడుకలో ఉన్న అనేక ప్రభుత్వ సంస్థలను అతను నిర్మించాడు.[ఆధారం చూపాలి] స్టీవెన్సు అనేక జాతి సమూహాల సభ్యులను అతని అధీనంలోని ఎ.పి.సి. ప్రభుత్వానికి చేర్చడం ద్వారా ప్రభుత్వంలో సాంప్రదాయిక ధ్రువీకరణను కూడా తగ్గించాడు.

సియాకా స్టీవెన్సు 18 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న తరువాత 1985 నవంబరులో పదవీ విరమణ చేశాడు. 1985 నవంబరూలో ఫ్రీటౌన్‌లో జరిగిన చివరి డెలిగేటు కాన్ఫరెంసులో ఎ.పి.సి. స్టీవెంసు తరువాత ఒక కొత్త అధ్యక్ష అభ్యర్థి పేరును ప్రతిపాదించింది. తరుతి అధ్యక్ష అభ్యర్థిగా సియెరా లియోన్ ఆర్మీ ఫోర్సెసు రిపబ్లిక్ అధిపతిగా ఉన్న మేజర్ జనరలు జోసెఫు సైడో మోమోహు ఎన్నిక చేయబడ్డాడు. అతనికి వారసుడిగా స్టీవెన్సు ఎంపిక చేసుకున్నాడు. సియెరా లియోన్ సాయుధ దళాల అధిపతిగా మేజర్ జనరలు మోమోను స్టీవెనుకు చాలా విశ్వసనీయత కలిగి ఉన్నందున ఆయనను ఈ పదవికి నియమించారు. స్టీవెన్సు మాదిరిగా మమోహు అల్ప సంఖ్యాక లింబా జాతి సమూహంలో సభ్యుడు.

మొహమ్మోను ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, కేవలం పోటీ చేసిన అభ్యర్థిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, ఫ్రీటౌన్‌లో 1985 నవంబరు 28 న సియెరా లియోన్ రెండవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 1986 మేలో ఎ.పి.సి. సభ్యుల మధ్య ఏక-పార్టీ పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అధ్యక్షుడు మమ్మొహు తన మాజీ సైనిక సహోద్యోగి, ముఖ్య మిత్రుడు, మేజరు జనరలు మొహమ్మదు తరావాలీని సియెరా లియోన్ మిలిటరీ అధిపతిగా నియమించబడ్డాడు. మేజరు జనరలు తరావాలీ ఒక బలమైన విశ్వాసపాత్రుడు, అధ్యక్షుడు మమ్మోహు ప్రధాన మద్దతుదారుడుగా ఉన్నాడు. అధ్యక్షుడు మమ్మోహు సియెరా లియోన్ పోలీసు అధిపతిగా జేమ్సు బంబే కమరాను ప్రతిపాదించాడు. బాంబే మెమరా అధ్యక్షుడు మమ్మోహు కీలక విశ్వాసపాత్రుడు, బలమైన మద్దతుదారుడు. సియోరా లియోన్ పోలీసు ఒక ప్రత్యేక పారామిలిటరీ బలగంగా సియారా లియోన్ పోలీసులో శక్తివంతమైన ఎస్.ఎస్.డిను సమగ్రపరచడం ద్వారా మాజీ అధ్యక్షుడు సియకా స్టీవెన్సు, మమోహు మద్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. అధ్యక్షుడు స్టీవెన్సు, ఎస్.ఎస్.డి. అధిక అధికారంమీద తన పట్టును కొనసాగించడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన వ్యక్తిగత శక్తిగా ఉంది. సియెరా లియోన్ మిలిటరీ, సియెరా లియోన్ పోలీసు ఫోర్సు నుండి స్వతంత్రంగా ఉంటుంది. బాంబే మెమారా నాయకత్వంలో సియెరా లియోన్ పోలీసు, అధ్యక్షుడు మమ్మోహు విమర్శకులకు వ్యతిరేకంగా భౌతిక హింస, అరెస్టు, బెదిరింపు ఆరోపణలు జరిగాయి.

అధ్యక్షుడు మమ్మోహు సైన్యంతో బలమైన సంబంధాలు, అవినీతిపై ఆయన దాడులు అతడికి సియెరా లెయోనెయన్ల మధ్య అవసరమైన ప్రారంభ మద్దతు లభించింది. అధ్యక్షుడు మమ్మోహు ఆధ్వర్యంలో కొత్త ఎ.పి.సి. క్యాబినెటులో కొత్త వ్యక్తులు లేకపోవడం, స్టీవెన్సు ప్రభుత్వం నుండి పాత వ్యక్తులు తిరిగి ప్రవేశించారు. మమ్మోహు స్టీవెసు పాలన శాశ్వతంగా ఉద్భవింపచేసాడన్న విమర్శలు వెల్లువెత్తాయి.

తరువాత కొన్ని సంవత్సరాల మమ్మోహు పరిపాలన అవినీతి వర్గీకరించబడింది. అనేక సీనియర్ కేబినెటు మంత్రులు తొలగించటం ద్వారా మమ్మోహు దీనిని అణిచివేశాడు. అవినీతికి వ్యతిరేకంగా తన యుద్ధాన్ని రూపొందించడానికి, అధ్యక్షుడు మమ్మోహు "రాజకీయ నేతలు, ప్రజా సేవకుల ప్రవర్తనా నియమావళిని" ప్రకటించారు. 1987 మార్చిలో రాష్ట్రపతి మమ్మోహునును పడగొట్టిన ప్రయత్నం చేసిన తరువాత 60 సీనియరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు. కార్యాలయం నుండి తీసివేయబడిన వైసు ప్రెసిడెంటు ఫ్రాన్సిసు మినాతో మరొక 5 మందితో సహా తిరుగుబాటుకు ప్రణాళిక వేసినందుకు 1989 లో ఉరిశిక్ష అమలు చేశారు.

సియెరా లియోన్ అంతర్యుద్ధం (1991–2002)

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A school in Koindu destroyed during the Civil War; in total 1,270 primary schools were destroyed in the War.

1990 అఖ్టోబరులో రాజకీయ, ఆర్థిక సంస్కరణల కొరకు దేశం లోపల, వెలుపలి నుండి ఒత్తిడి శిఖరాగ్రానికి చేరుకోవడంతో అధ్యక్షుడు మమ్మోహు 1978 ఏక-పార్టీ రాజ్యాంగాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగ సమీక్ష కమిషనును ఏర్పాటు చేశారు. కమిషను సిఫార్సులు ఆధారంగా ఒక బహుళ-పక్ష వ్యవస్థను తిరిగి స్థాపించే రాజ్యాంగం ఎ.పి.సి. పార్లమెంటు 60% ఆధిక్య ఓటుతో ఆమోదించబడింది. 1991 అక్టోబరు 1 నుండి అమలులోకి వచ్చింది. అధ్యక్షుడు మమొహు రాజకీయ సంస్కరణల విషయంలో తన వాగ్దానం నెరవేర్చడంలో తీవ్రంగా చర్యతీసుకోలేదని ఎ.పి.సి. అధికార దుర్వినియోగాల ద్వారా గుర్తించబడింది.

పొరుగున ఉన్న లైబీరియాలో జరిగే క్రూరమైన పౌర యుద్ధం సియెరా లియోన్లో జరిగిన పోరాటంలో గణనీయమైన పాత్ర పోషించింది. అప్పుడు నేషనలు పేట్రియాటికు ఫ్రంటు ఆఫ్ లిబెరియా నాయకుడు చార్లెసు టేలరు ఉత్తర సియెరా లియెనెలోని టోంకోలిలీ డిస్ట్రిక్టు నుండి వచ్చిన మాజీ సియెరా లియోనియన్ సైనిక కార్పోరల్ ఫోడే సాయబానా సన్కోహు ఆదేశంతో రెవల్యూషనరీ యునైటెడు ఫ్రంటు (ఆర్.యు.ఎఫ్.) ఏర్పాటు చేయడానికి సహకరించాడు. బ్రిటిషు శిక్షణ పొందిన మాజీ సైన్యాధిపతి శంకోహు లిబియాలో కూడా గెరిల్లా శిక్షణను పొందాడు. టేలరు లైబరియాలో తన తిరుగుబాటు ఉద్యమానికి వ్యతిరేకించిన సియెరా లియోన్లో ఉన్న " నైజీరియా ఆధిపత్య శాంతి పరిరక్షక దళాల " స్థావరాలను నాశనం చేసుకుని లక్ష్యంగా చేసుకుని ఆర్.యు.ఎఫ్. దళాలతో దాడి జరిపించాడు.

1992 ఏప్రిల్ 29 న సియెరా లెయోనె సైన్యంలోని యువ సైనికుల బృందం ఏడు సైనిక దళాల (కెప్టెను వాలెంటైను స్ట్రాస్సరు, సెర్జెంటు సోలమను ముసా, కెప్టెను కంబా మొండే, లెఫ్టినెంటు టాం న్యుమా, కెప్టెను జూలియసు మాడ బయో, కెప్టెను కమ్బో కాంబో) నేతృత్వంలో సైనిక తిరుగుబాటు ప్రారంభించారు. ఇది అధ్యక్షుడు మమ్మోహును గినియాకు అఙాతంలో ఉండేలా చేసింది.

సార్జెంటు సోలమను ముసా, స్ట్రాస్సరు చిన్ననాటి స్నేహితుడు ఎన్.పి.ఆర్.సి. సైనిక ప్రభుత్వానికి డిప్యూటీ చైర్మను, డిప్యూటీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. తన 25 వ జన్మదినం తరువాత కేవలం మూడు రోజుల తర్వాత అతను అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు స్ట్రాస్ర్ ప్రపంచంలో అతి పిన్నవయస్కుడైన అధిపతి అయ్యాడు. ఎన్.పి.ఆర్.సి. సైనిక జాతీయ అత్యున్నత కౌన్సిలు ఆఫ్ స్టేటు అన్ని విషయాలలో అత్యున్నత ఆదేశం, అంతిమ అధికారంగా స్థాపించబడింది. ప్రత్యేకంగా ఎన్.పి.ఆర్.సి. సైనికులతో అత్యధిక ర్యాంకును కలిగి ఉంది. దీనిలో స్ట్రాస్సరు అధ్యక్షుడు మోమోహ్ను అధిగమించిన అసలు సైనికులు ఉన్నారు.

ఎన్.పి.ఆర్.సి. సైనిక ప్రభుత్వం అత్యంత ఉన్నత స్థాయి సైనికులలో ఒకడైన స్ట్రాస్సరు విశ్వసనీయ మిత్రుడు లెఫ్టినెంటు సహరు శాండీ హత్య చేయబడ్డాడు. హత్యారోపణను ఎదుర్కొన్న మేజరు ఎస్.ఐ.ఎం. టురే బహిష్కరించబడిన అధ్యక్షుడు మమ్మోహు కీలక విశ్వాసపాత్రుడు. లెఫ్టినెంటు శాండీ కిల్లర్ని కనుగొనడానికి దేశవ్యాప్తంగా భారీగా సాయుధ సైనిక మారణహోమాలు జరిగాయి. అయితే ప్రధాన అనుమానితుడుగా మేజరు ఎస్.ఐ.ఎం టురే తన ప్రాణం కాపాడు కోవడానికి రహస్యంగా గినియా చేరుకున్నాడు. తొలగించబడిన అధ్యక్షుడు మమ్మోహుకు విశ్వసనీయులని భావించిన డజన్ల కొద్దీ సైనికులు ఖైదు చేయబడ్డారు. వీరిలో కల్నల్ కహోటా ఎం. డంబూయ, మేజరు యాయా టురే ఉన్నారు. లెఫ్టినెంటు శాండీకి ప్రభుత్వ మర్యాదలతో అంత్యక్రియలు జరిగాయి. ఫ్రీటౌన్‌లోని కేథడ్రాలు చర్చి వద్ద తన అంత్యక్రియల ప్రార్థన సేవలో స్ట్రాస్సరు, ఎన్.పి.ఆర్.సి. డిప్యూటీ నాయకుడు సార్జెంటు సోలమను ముసాతో సహా ఎన్.పి.ఆర్.సి. సైనిక ప్రభుత్వం అనేక ఉన్నత-స్థాయి సైనికులు హాజరయ్యారు.

ఎన్.పి.ఆర్.సి. సైనిక ప్రభుత్వం వెంటనే రాజ్యాంగాన్ని రద్దు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రసంగాలకు పరిమిత స్వేచ్ఛ, ప్రెసు స్వేచ్ఛ మీద నిషేధం విధిస్తూ సైనికులకు విచారణ లేకుండా అడ్డగించడానికి అపరిమిత అధికారాలను మంజూరు చేసింది. కోర్టులో అడ్డగించడానికి వ్యతిరేకంగా చేయబడిన సవాళ్లు తొలగించబడ్డాయి.

ఎన్.పి.ఆర్.సి. సైనిక ప్రభుత్వం " ఎకనామికు కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికను స్టేట్సు " సంబంధాలు కొనసాగించింది. లైబీరియాలో పోరాడడానికి సియెరా లియోన్ ఆధారిత ఎకనామికు కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికను స్టేట్సు దళాల మద్దతును బలపరిచింది. 1992 డిసెంబరు 28 న నిర్బంధిత కల్నలు యాహ్య కను, కల్నలు కహోటా M.S. డంబూయ, మాజీ ఇన్స్పెక్టరు జనరలు బంబే కమరా విడిపించడానికి స్ట్రాస్సరు ఎన్.పి.ఆర్.సి. ప్రభుత్వం మీద జరిగిన ఒక తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. తిరుగుబాటు ప్లాట్లు వెనుక సెర్జెంటు మొహమ్మదు లామిను బంకురా నేతృత్వంలోని అనేక మంది జూనియరు సైనిక అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ తిరుగుబాటు ప్లాట్లు సియెరా లియోన్ సైన్యంలో 15 సైనికులకు (కాల్నోలు కహోటా ఎం దుంబూయ, మేజర్ యాయా కను, సార్జెంటు మొహమేదు లామిను బంకురాతో సహా) ఫైరింగు దళం మరణశిక్ష అమలు చేసింది. పో డెంబా రోడు జైలులో నిర్బంధంలో ఉన్న మమోహు ప్రభుత్వంలోని అనేక ప్రముఖ సభ్యులు పోలీసు ఇన్స్పెక్టరు జనరలు ఆఫ్ పోలీసు బంబే కమరా కూడా ఉరితీయబడిన వారిలో ఉన్నారు.

1994 జూలై 5 న స్ట్రెస్సెరును కూల్చివేయుటానికి తిరుగుబాటుకు ప్రణాళిక వేసాడని ఆరోపణలు వచ్చిన తరువాత ఫ్రీటౌన్‌లో ప్రజలలో చాలా ప్రాచుర్యం పొందిన డిప్యూటీ ఎ.పి.ఆర్.సి. నేత సార్జెంటు సోలమను ముసా ఖైదు చేయబడ్డాడు. సెర్జెంటు ముసా ఆరోపణలను నిరాకరించాడు. స్ట్రాస్సరు ముసాను డిప్యూటీ ఎన్.పి.ఆర్.సి. ఛైర్మను స్థానాన్ని కెప్టెను జూలియసు మాడ బయో భర్తీ చేసాడు. వీరు తక్షణమే బ్రిగేడియర్కు స్ట్రాస్సరును ప్రోత్సహించారు.

ఆర్.యు.ఎఫ్.ని తిప్పికొట్టడంలో మమ్మోహు నేతృత్వంలోని ఎ.పి.సి. ప్రభుత్వంలా ఎన్.పి.ఆర్.సి. అసఫలత నిరూపించింది. దేశం ఎక్కువ భాగం ఆర్.యు.ఎఫ్. యోధుల ఆధీనం అయింది 1994 నాటికి వారు డైమండ్-రిచ్ ఈస్ట్రను ప్రావింసులో ఫ్రీటౌన్ అంచులో ఉన్నారు. ప్రతిస్పందనగా ఎన్.పి.ఆర్.సి. ప్రైవేటు సంస్థ ఎగ్జిక్యూటివు ఫలితాల నుండి అనేక వందల మంది సభ్యులను నియమించింది. ఒక నెలలోనే వారు ఆర్.యు.ఎఫ్. యోధులను సియెరా లియోన్ సరిహద్దులకు తరిమారు. సియెరా లియోన్ కొనో డైమండు-ఉత్పత్తి ప్రాంతాల నుండి ఆర్.యు.ఎఫ్.ను క్లియరు చేశారు.

స్ట్రాస్సరు ఇద్దరు సీనియరు ఎంపి.ఆరిసి. మిత్రపక్షాలు కమాండర్లు లెఫ్టినెంటు సహరు శాండీ, లెఫ్టినెంటు సోలమను ముసా అతనిని రక్షించడానికి లేకపోవడంతో ఎన్.పి.ఆర్.సి. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ స్టేటులోని స్ట్రాస్సరు నాయకత్వం బలహీనమైనదిగా పరిగణించబడింది. 1996 జనవరి 16 న అధికారంలో 4 సంవత్సరాలు గడిపిన తరువాత స్ట్రాస్సరు తన తోటి ఎన్.పి.ఆర్.సీ సైనికులు ఫ్రీటౌన్‌లోని డిఫెన్సు హెడు క్వార్టర్సులో ఒక రాజభవనం మీద జరిగిన తిరుగుబాటులో అరెస్టయ్యాడు. స్ట్రాస్సరు వెనువెంటనే సైన్య హెలికాప్టర్లో కానరీ, గినియాకు ప్రవాసంలోకి ప్రవేశించాడు.

1996 తిరుగుబాటు తరువాత తన బహిరంగ ప్రసంగంలో బ్రిగేడియరు బయో, సియెరా లియోన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన పౌర ప్రభుత్వం తిరిగి రావాలనే తన మద్దతు, అంతర్యుద్ధం ముగియడానికి అతని నిబద్ధత తిరుగుబాటుకు అతని ప్రేరణ అని పేర్కొన్నాడు. 1996 లో జరిగిన ఎన్నికల ముగింపు తరువాత సియారా లియోన్ పీపుల్సు పార్టీ (ఎస్.ఎల్.పి.పి) అహ్మదు టీజను కబబాకు అధికారం ఇచ్చింది. పౌర పాలనకు తిరిగి వస్తుందని బయో చేసిన వాగ్దానాలు నెరవేరాయి. ప్రెసిడెంటు కబాబా అధికారాన్ని తీసుకున్నాడు. అధ్యక్షుడు కబాబా ఆర్.యు.ఎఫ్ తో చర్చలు ప్రారంభించారు. శాంతి చర్చలకు ఆర్.యు.ఎఫ్. నేత ఫోడే సంకోను ఆహ్వానించారు.

1997 మే 25 న నిర్బంధిత మేజరు జనరలు జానీ పాలు కొరోమాకు విశ్వాసపాత్రుడు కార్పోరలు తంబ గోబరీ నేతృత్వంలో సియెరా లియోన్ సైన్యంలోని 15 మంది సైనికులు ఒక సైనిక దళాన్ని ప్రారంభించి అధ్యక్షుడు కబ్బబాను ఇది గినియాకు బహిష్కరణ పంపింది. తరుబాత వారు " ఆర్మి ఫోర్సెసు రివల్యూషనరీ కౌంసిలు (ఎ.ఎఫ్.ఆర్.సి) స్థాపించారు. కార్పోరలు గ్బోరీ త్వరగా ఎస్.ఎల్.బి.ఎస్. " ఎఫ్.ఎం.99.9 ప్రధానకార్యాలయానికి వెళ్ళి తిరుగుబాటు ప్రకటించాడు. దేశవ్యాప్తంగా సైనికులు గార్డులందరికీ బాధ్య నిర్వహించాలను చేయాలని హెచ్చరించాడు. సైనికులు తక్షణమే కొరోమాను జైలు నుండి విడుదల చేసి ఆయనను ఛైర్మనుగా, దేశాధ్యక్షుడిగా నియమించారు.

కొరోమా రాజ్యాంగాన్ని సస్పెండు చేసాడు. ప్రదర్శనలు నిషేధింవి, దేశంలోని అన్ని ప్రైవేటు రేడియో స్టేషన్లను మూసివేసింది. ఆర్.యు.ఎఫ్.ను కొత్త సైనిక ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయమని ఆహ్వానించింది. నూతన ఎ.ఎఫ్.ఆర్.సి- ఆర్.యు.ఎఫ్. సంకీర్ణ సైనిక ప్రభుత్వ కూటమి వైసు ఛైర్మన్గా ఆర్.యు.ఎఫ్ నాయకుడు ఫోడె సంకోహును నియమించింది. కొన్ని రోజులలో ఫ్రీటౌన్‌కు వేలమంది ఆర్.యు.ఎఫ్. యోధులి ప్రవేశించారు. డిప్యూటీ డిఫెన్సు మంత్రి శామ్యూలు హింగా నార్మను ఆధ్వర్యంలోని మెండే జాతి సమూహంలోని సంప్రదాయ సమరయోధుల సమూహం కామాజర్స్, అధ్యక్షుడు కబ్బాకు విధేయుడిగా ఉండి సియెరా లియోన్ దక్షిణ భాగాన్ని సైనికుల నుండి రక్షించాడు.

కబ్బషు ప్రభుత్వం, అంతర్యుద్ధం ముగింపు (2002–2014)

తొమ్మిది నెలలు పదవీకాలం తరువాత నైజీరియను నేతృత్వంలోని ఇ.సి.ఒ.ఎం.ఒ.జి దళాలు సైనికప్రభుత్వాన్ని పడగొట్టి 1998 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్యవిధానంలో ఎన్నికైన అధ్యక్షుడు కబ్బబాను తిరిగి అధ్యక్షుడుగా నియమించారు. 1998 అక్టోబరు 19 న సియెరా లియోన్ సైన్యంలో 24 మంది సైనికులు ఫ్రీటౌన్‌లో ఒక కోర్టు యుద్ధంలో దోషులుగా నిర్ధారించబడిన తరువాత మరణశిక్షకు గురైయ్యారు. 1997 అధ్యక్షుడు కబ్బాను, ఇతరులను పడగొట్టడానికి తిరుగుబాటు ప్రయత్నం చేసి విఫలమయ్యారు.

1999 అక్టోబరులో తిరుగుబాటుదారులను నిరాయుధలను చేయడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులను పంపేందుకు అంగీకరించింది. డిసెంబరులో 6,000 మంది సభ్యుల బృందం దేశంలో ప్రవేశించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2000 జిబ్రవరిలో ఓటు వేసి ఈ సంఖ్యను 11,000 కు పెంచింది. తరువాత ఇది 13,000 కు అధికరించింది. కానీ మేలో దాదాపుగా అన్ని నైజీరియా దళాలు దేశాన్ని వదిలి, ఐక్యరాజ్యసమితి దళాలు తూర్పు సియెరా లియోన్లో ఆర్.యు.ఎఫ్.ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సంకోహు దళాలు ఐక్యరాజ్యసమితితో గొడవపడి, శాంతి ఒప్పందం కుప్పకూలడంతో కొంతమంది 500 మంది శాంతిదళాల సభ్యులు బందీగా పట్టుబడ్డారు. ముట్టడిని అంతం చేయడానికి ఐక్యరాజ్యసమితి దళాలు ఆపరేషను ఖుక్రిని ప్రారంభించినందున బందీ సంక్షోభం ఆర్.యు.ఎఫ్, ప్రభుత్వం మధ్య పోరాటం తీవ్రరూపందాల్చింది. ఈ ఆపరేషను భారత, బ్రిటిషు స్పెషలు ఫోర్సు ప్రధాన పాత్ర పోషించింది.

దేశంలో పరిస్థితి ఆపరేషనులో బ్రిటిషు దళాలు మోహరించిన తరువాత ఒక స్థాయికి క్షీణించింది. నిజానికి కేవలం విదేశీ పౌరులను ఖాళీ చేయడానికి ఈ ఫోర్సు నియమించబడినప్పటికీ బ్రిటిషువారు వారి వాస్తవిక ఆదేశాన్ని మించిపోయి చివరకు తిరుగుబాటుదారులను ఓడించి దేశపరిస్థితి పునరుద్ధరించడానికి పూర్తి సైనిక చర్య తీసుకున్నారు. బ్రిటిషు పౌర యుద్ధం ముగిసిన తరువాత కాల్పుల విరమణ జరిగింది. బ్రిటిషు సైన్యం, నిర్వాహకులు, రాజకీయ నాయకులతో సియెరా లియోన్లో కొనసాగుతూ సైనిక దళాలకు శిక్షణ ఇవ్వడం, దేశంలో మౌలిక నిర్మాణాలను మెరుగుపర్చడం, ఆర్థిక, వస్తుపరమైన సహాయాన్ని నిర్వహించడం చేసారు. బ్రిటిషు జోక్యం సమయంలో బ్రిటను ప్రధాన మంత్రి టోనీ బ్లెయిరు సియెరా లియోన్ ప్రజలచే నాయకుడిగా భావించారు. వీరిలో చాలామంది బ్రిటిషువారిపట్ల అధిక శ్రద్ధ కలిగి ఉన్నారు.[ఆధారం చూపాలి]సియెరా లియోనియన్సు " వరల్డ్స్ మోస్ట్ రీసిలియెంటు పీపులు "గా వర్ణించబడ్డారు.

1991, 2001 మధ్య, సియెరా లియోన్ అంతర్యుద్ధంలో 50,000 మంది పౌరులు మరణించారు. లక్షలాది మంది ప్రజలు తమ నివాసాల నుండి బలవంతంగా వెలుపలకు చేయబడ్డారు. అనేక మంది గినియా, లైబీరియాలో శరణార్థులుగా మారారు. 2001 లో ఐక్యరాజ్యసమితి దళాలు తిరుగుబాటుదారుల ప్రాంతాలకు తరలించబడ్డాయి, తిరుగుబాటు సైనికులను నిరాయుధులను చేయడం ప్రారంభించాయి. 2002 జనవరి నాటికి యుద్ధం ప్రకటించబడింది. 2002 మేలో కబ్బా మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004 నాటికి నిరాయుధీకరణ ప్రక్రియ పూర్తయింది. అంతేకాకుండా 2004 లో ఐక్యరాజ్యసమితి యుద్ధ నేరాల కోర్టు యుద్ధం రెండు వైపుల నుండి సీనియరు నాయకుల విచారణకు ప్రయత్నాలను ప్రారంభించింది. 2005 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతా దళాలు సియెరా లియోన్ నుండి వైదొలిగాయి.

2007 ఆగస్టులో సియెరా లియోన్ అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించింది. అధ్యక్షుడి అభ్యర్థి ఓటు మొదటి రౌండులో రాజ్యాంగంలోని 50% ప్లసు వోటింగ్ మెజారిటీని గెలుచుకున్నారు. 2007 సెప్టెంబరులో తిరిగి ఎన్నిక జరిగింది. ప్రధాన ప్రతిపక్ష ఎ.పి.సి. అభ్యర్థి అయిన ఎర్నెస్టు బాయి కొరోమా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొరోమా 2012 నవంబరులో రెండవ (, ఆఖరి) పదవికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

అంటువ్యాధులతో యుద్ధం (2014–2016)

సియెరా లియోన్లో 2014 లో ఎబొలా వైరసు అంటువ్యాధి మొదలై దేశంలో విస్తృతమైన ప్రభావాన్ని చూపింది. సియెరా లియోన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని యోచన చేసింది. 2014 చివరినాటికి సియెరా లియోన్లో దాదాపు 3000 మరణాలు, వ్యాధి 10 వేల కేసులు నమోదయ్యాయి. ఈ అంటువ్యాధి ఓస్యూ టు ఓస్ టాక్ 2014 సెప్టెంబరులో దేశవ్యాప్తంగా మూడు-రోజుల దిగ్బంధానికి దారితీసింది. వెస్టు ఆఫ్రికాలో విస్తృత ఎబోలా వైరసు అంటువ్యాధిలో భాగంగా ఇది సియెరా లియోన్లో సంభవించింది. ఆగస్టు ఆరంభంలో ఎబోలా ఎపిడెమికు కారణంగా సియెరా లియోన్ లీగు ఫుట్బాల్ (సాకర్) మ్యాచ్లను రద్దు చేసింది. 2016 మార్చి 16 న ప్రపంచ ఆరోగ్య సంస్థ సియెరా లియోన్ ఎబోలా నుండి విముక్తి పొందిందని ప్రకటించింది.

2017 ఆగస్టు 14 మడ్ స్లైడ్సు

2014 ఆగస్టు 14 న సియెరా లియోన్లో ఉదయం 6.30 సమయంలో దేశరాజధాని ఫ్రీటౌన్‌లో పలుమార్లు కొండచరియలు విరిగిపడ్డాయి.

భౌగోళికం, వాతావరణం

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A map of Sierra Leone
సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Sierra Leone map of Köppen climate classification

సియెరా లియోన్ వెస్టు ఆఫ్రికా నైరుతి తీరంలో ఉంది. ఇది 7 ° నుండి 10 ° డిగ్రీల ఉత్తర అక్షాంశం (చిన్న ప్రాంతం 7 ° దక్షిణానికి), 10 ° నుండి 14 ° డిగ్రీల పశ్చిమరేఖాంశం మధ్య ఉంటుంది. ఈ దేశం ఉత్తర, తూర్పుసరిహద్దులలో గినియా, ఆగ్నేయ దిశగా లైబీరియా, పశ్చిమ, నైరుతీ సరిహద్దులలో అట్లాంటికు మహాసముద్రం ఉన్నాయి.

సియెరా లియోన్ మొత్తం వైశాల్యం 71,600 చ.కి.మీ (27,699 చదరపు మైళ్ళు), ఇందులో 120 కిమీ మీ 2 (46 చదరపు మైళ్ల) జలభాగం కలిగి ఉంది.

దేశంలో నాలుగు విభిన్న భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. తూర్పు సియెరా లియోన్లో పీఠభూమి ఎత్తైన పర్వతాలకు చేరుకుంటుంది. ఇక్కడ బిన్టుమాని పర్వతంలో దేశంలో అత్యధిక ఎత్తైన 1,948 మీ (6,391 అడుగులు) శిఖరం ఉంది. ఈ ప్రాంతం దక్షిణాన మోయా నది పారుదల ముఖద్వారం ఎగువ భాగం ఉంది.

సియెరా లియోన్ భూభాగంలో 43% అడవులు, పొదలు, వ్యవసాయ భూభాగం ఆక్రమిస్తున్నాయి. ఉత్తర విభాగం " వరల్డు వైల్డులైఫు ఫండు " గినియా అటవీ-సవన్నా మొజాయిక్ పర్యావరణ ప్రాంతంలో భాగంగా వర్గీకరించబడింది. దక్షిణంగా వర్షారణ్యాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి.

పశ్చిమప్రాంతంలో సియెరా లియోన్ 400 కిలోమీటర్లు (249 మైళ్ళు) పొడవైన అట్లాంటికు తీరప్రాంతం ఉంది. ఇది రెండు అద్భుతమైన సముద్ర వనరులు, ఆకర్షణీయమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. తీరానికి తక్కువగా ఉన్న గినియా మడ అడవుల చిత్తడి నేలలు ఉన్నాయి. జాతీయ రాజధాని ఫ్రీటౌన్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద సహజ నౌకాశ్రయమైన సియెరా లియోన్ హార్బరు పక్కన ఉన్న తీర ద్వీపకల్పంలో ఉంది.

వాతావరణం ఉష్ణమండలంగా ఉంటుంది. వ్యవసాయ చక్రాన్ని నిర్ణయించడానికి రెండు సీజన్లు: మే నుండి నవంబరు వరకు వర్షాకాలం, డిసెంబరు నుండి మే వరకు పొడి వాతావరణం ఉంటుంది. హార్మట్టను చల్లని, పొడి గాలులు సహారా ఎడారి రాత్రి సమయంలో ఉష్ణోగ్రత 16 ° సెం (60.8 ° ఫా) కంటే తక్కువగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 26 ° సెం (78.8 ° ఫా), సంవత్సరానికి 26 నుండి 36 ° సెం (78.8 నుండి 96.8 ° ఫా) వరకు ఉంటుంది.

పర్యావరణం

సియెరా లియోన్లో భూగర్భ క్షీణతకు బాధ్యత వహించాలని " హ్యూమను యాక్టివిటీసు " పేర్కొన్నాయి. భూసారాన్ని క్షీణింపజేస్తున్న వ్యవసాయ భూమి వినియోగం, పేలవమైన నేల, నీటి నిర్వాహం, అటవీ నిర్మూలన, వృక్షాలను తొలగించడం, వంటచేయడానికి కట్టెల ఉపయోగం, పెంపుడు జంతుల కారణంగా అత్యధికంగా మేత ఉపయోగించడం, పట్టణీకరణ వంటివి పర్యావణానికి సమస్యలుగా ఉన్నాయి.

వాణిజ్య కలప కోసం, వ్యవసాయాభూముల కొరకు అటవీ నిర్మూలన, ప్రధాన ఆందోళనగా దేశం సహజ ఆర్థిక సంపదకు అపారమైన నష్టాన్ని సూచిస్తుంది. మైనింగు, భూమి మార్పిడి కోసం (పశువులు మేత వంటి) స్లాషు & బర్ను విధానం ఉపయోగించడం, 1980 నుండి సియెరా లియోన్లో నాటకీయంగా తగ్గిన అటవీ భూమి. సియెరా లియెనె సహజవనరుల క్షీణత కొరకు ఆందోళన చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. తక్కువ అటవీప్రాంతం, ఎక్కువ అటవీనిర్మూలన ఉన్న దేశాలలో సియెరా లియోన్ ఉంది.

ఉత్తరాన టామా-టోంకోలి ఫారెస్టు రిజర్వులో భారీ లాగింగు కొనసాగుతున్న ఆందోళనలు ఉన్నాయి. లాగర్లు నిమిని, కొనో జిల్లలలో తమ తూర్పు ప్రావింసుకు కార్యకలాపాలను విస్తరించారు. జుయి, వెస్ట్రను రూరలు డిస్ట్రిక్టు, వెస్ట్రను ఏరియా లోమా పర్వతాల జాతీయ ఉద్యానవనం, కొనియాడౌగు, ఉత్తర ప్రావిన్సు, కెన్మా జిల్లా, తూర్పు ప్రావీంసులో కంబూయి ఫారెస్టు రిజర్వులో కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు ప్రారంభించాయి.

ఆఫ్రికా వైల్డు డాగు, లైకాను పిక్టసు నివాసాల క్షీణత అధికరించింది. ఈ కేయిడు సియెరా లియోనులో నిర్మూలించబడిందని భావిస్తున్నారు. . 2002 వరకు సియెరా లియోన్ ఒక అటవీ నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది. ఎందుకంటే పౌర యుద్ధం కారణంగా వేలాది మంది మరణాలు సంభవించాయి. అటవీ నిర్మూలన కారణంగా అంతర్గత వ్యయాలు 7.3% పెరిగాయి. 2003 నాటికి సియెరా లియోన్ 55 రక్షిత ప్రాంతాలు దేశభూభాగంలో 4.5% ఆక్రమించి ఉన్నాయి. దేశంలో 2,090 ప్రముఖ వృక్షజాతులు 147 క్షీరదాలు, 626 పక్షులు, 67 సరీసృపాలు, 35 ఉభయచరాలు, 99 చేప జాతులు ఉన్నాయి.

సియెరా లియోన్ జలాలలో అక్రమంగా చేపలుపట్టే ఓడల సంఖ్య ఇటీవల సంవత్సరాల్లో పెరిగిందని ఎన్విరాన్మెంటలు జస్టిసు ఫౌండేషను పేర్కొంది. అక్రమ చేపలవేట కారణంగా చేప నిల్వలలు గణనీయంగా క్షీణించాయి. మనుగడ కోసం ఒక ముఖ్యమైన వనరుల స్థానిక ఫిషింగ్ సంఘాలను కోల్పోతుంది. ఒక దశాబ్దం పాటు అంతర్యుద్ధం నుండి కోలుకుంటున్న దేశంలో చాలా సమాజాలలోని ప్రజలు చేపలవేటను జీవనాధారంగా ఎంచుకున్నందున పరిస్థితి తీవ్రంగా ఉంది. 2005 జూన్ 5 లో రాయలు సొసైటీ ఫర్ ది ప్రొటెక్షను ఆఫ్ బర్డ్సు (ఆర్.ఎస్.పి.బి) బర్డు లైఫు ఇంటర్నేషనలు, దక్షిణ ఈస్ట్రను సియెరా లియోన్లోని గోలా ఫారెస్టులో ఒక పరిరక్షణ- అభివృద్ధి ప్రణాళికకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. సియెరా లియోనిలో ఒక ముఖ్యమైన సజీవ వర్షారణ్యం ఉంది.

ఆర్ధికం

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A proportional representation of Sierra Leone's exports

1990 ల నాటికి ఆర్థిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఆర్థికరంగం తీవ్రంగా అధోకరణం చెందింది. తరువాతి దశాబ్దంలో దేశ పౌర యుద్ధంలోఅధికారిక ఆర్థికవ్యవస్థ చాలా నాశనమైంది. 2002 జనవరిలో ఘర్షణలు ముగిసిన తరువాత, వెలుపల నుండి లభించిన భారీ సహాయం సియెరా లియోన్ పునరుద్ధరించడానికి సహాయపడింది.

అధికారుల అవినీతిని (ఇది అనేక పౌర యుద్ధానికి ప్రధాన కారణమని భావించింది) పరిమితం చేసే ప్రభుత్వ ప్రయత్నాల విజయం మీద పునరుద్ధరణ ఆధారపడి ఉంటుంది. విజయానికి కీలక సూచిక దాని డైమండు సెక్టారు ప్రభుత్వ నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది.

నిరుద్యోగం అధికంగా ఉంది. ముఖ్యంగా యువత, మాజీ యుద్ధవీరులలో. అధికారులు సివిలు సర్వీసులో సంస్కరణలను అమలు చేయడానికి జాప్యం చేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ కార్యక్రమం వేగం కూడా తగ్గుతుంది. దాతలు దాని పురోగతిని కోరారు.

కరెన్సీ " లెయోనె". సెంట్రలు బ్యాంకు ఆఫ్ బ్యాంకు ఆఫ్ సియెరా లియోను. సియెరా లియోన్ ఫ్లోటింగు ఎక్స్ఛేంజి రేటు వ్యవస్థను నిర్వహిస్తుంది. విదేశీ కరెన్సీలను వాణిజ్య బ్యాంకులు, గుర్తింపు పొందిన విదేశీ మారకం బ్యూరోలు, చాలా హోటళ్లలో మార్చవచ్చు. సియెరా లియోనులో క్రెడిటు కార్డు వాడకం పరిమితమైంది. అయితే కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లలో వాడవచ్చు. కొన్ని అంతర్జాతీయంగా లింక్డు ఆటోమేటెడు టెల్లరు మెషీన్లు ఉన్నాయి. ఇవి ఫ్రెటౌనులో వీసా కార్డులను ప్రోక్రెడిటు బ్యాంకు నిర్వహిస్తాయి.

సియెరా లియోన్ అనేది ఒక దుర్భర పరిస్థితులకు గురవుతుంది (సహజ సంపద తక్కుగా ఉండడం మాత్రమే కాక) కానీ దాని సహజ సంపద (వనరు శాపగ్రస్థంగా ఉంది) పేలవమైన నిర్వహణతో మరింత క్షీణిస్తుంది. ఉంటుంది.

వ్యవసాయం

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
సియెరా లియోన్లో తన బియ్యం పంటతో రైతు. సియెరా లియోన్ జనాభాలో మూడింట రెండు వంతుల జీవనాధారంలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది.

సియెరా లియోన్ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి వ్యవసాయం జీవనాధారంగా ఉంటుంది. 2007 లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో వ్యవసాయం 58% ఉంది.

జనాభాలో 80% మందికి వ్యవసాయం అతిపెద్ద ఉపాధిగా ఉంది. సియెరా లియోన్లో బియ్యం అత్యంత ముఖ్యమైన ఆహారపదార్ధంగా ఉంది. 85% మంది రైతులు వర్షపు సీజనులో బియ్యం సాగు చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి 76 కిలోల వార్షిక వినియోగం జరుగుతుంది.

గనులు

సుసంపన్నమైన ఖనిజసంపద కలిగిన సియెరా లియోన్ దాని ఆర్థిక పునాది కోసం మైనింగు (ముఖ్యంగా వజ్రాలపై) ఆధారపడింది. ఇది అగ్ర పది వజ్రాలు ఉత్పత్తి దేశాలలో ఒకటిగా ఉంది. ఖనిజ ఎగుమతులు ప్రధాన కరెన్సీ సంపాదించేవిగా ఉన్నాయి. సియెరా లియోన్ రత్నాలు- నాణ్యమైన వజ్రాల ప్రధాన నిర్మాత. వజ్రాలు సుసంపన్నంగా ఉన్నప్పటికీ చారిత్రాత్మకంగా వాటి దోపిడీ నిరోధించడానికి, ఎగుమతిని నిర్వహించడానికి ఇబ్బందులు ఎదుర్కొంది.

సియెరా లియోన్ కెంపులకు ప్రసిద్ధి చెందింది. పౌర యుద్ధం సమయంలో వజ్రాల సమ్మేళనాలను విక్రయించడం, దాని దురాక్రమణలను పెంచే ఆయుధాలు కొనుగోలు చేయడం జరిగింది. 1970 లలో, 1980 ల ప్రారంభంలో గనుల రంగం క్షీణించడం, ప్రభుత్వ అధికారుల మధ్య అవినీతి అధికరించడం కారణంగా ఆర్థిక వృద్ధి రేటు మందగించింది.

Percentage of GDP by sector (2007)
Rank Sector Percentage
of GDP
1 Agriculture 58.5
2 Other services 10.4
3 Trade and tourism 9.5
4 Wholesale and retail trade 9.0
5 Mining and quarrying 4.5
6 Government Services 4.0
7 Manufacturing and handicrafts 2.0
8 Construction 1.7
9 Electricity and water 0.4

సియారా లియోన్ వజ్రాల వార్షిక ఉత్పత్తి $ 250 మిలియన్ల అమెరికా డాలర్ల నుండి $ 300 మిలియన్ల అమెరికా డాలర్ల మధ్య ఉంటుంది. వీటిలో కొన్ని అక్రమ రవాణా ఔతుంటాయి. ఇది బహుశా నగదు బదిలీకి లేదా అక్రమ కార్యకలాపాల నిధుల కోసం ఉపయోగించబడుతుంది. పౌర యుద్ధం తరువాత అధికారిక ఎగుమతులు నాటకీయంగా అభివృద్ధి చెందాయి. వాటి నిర్వహణను మెరుగుపరచడానికి ప్రయత్నాలు కొంత విజయం సాధించాయి. 2000 అక్టోబరులో దేశం నుండి వజ్రాల ఎగుమతి కోసం ఒక ఐక్యరాజ్యసమితి - ఆమోదిత సర్టిఫికేషను పొందింది. ఇది చట్టపరమైన ఎగుమతుల్లో నాటకీయ పెరుగుదలకు దారి తీసింది. 2001 లో ప్రభుత్వం ఒక మైనింగు కమ్యూనిటీ డెవలప్మెంటు ఫండు (డి.ఎ.సి.డి.ఎఫ్) ను సృష్టించింది. ఇది డైమండు మైనింగు కమ్యూనిటీలకు వజ్రాల ఎగుమతి పన్నులో కొంత భాగాన్ని అందిస్తుంది. చట్టపరమైన డైమండు వర్తకంలో స్థానిక కమ్యూనిటీల వాటాను పెంచడానికి ఈ ఫండు రూపొందించబడింది.

సియెరా లియోన్ టైటానియం ఖనిజం నిల్వలు ప్రపంచంలోని అతి పెద్ద డిపాజిట్లలో ఒకటిగా ఉన్నాయి. ఇది పెయింట్ పిగ్మెంటు, వెల్డింగు రాడు పూతలుగా ఉపయోగించే ఒక ఖనిజం.

రవాణా

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
The road from Kenema to Kailahun District

సియెరా లియోన్లో అనేక రకాలైన రవాణా వ్యవస్థలు ఉన్నాయి. ఇది రహదారి, వాయు, జల రవాణా ఉన్నాయి. రహదారుల నెట్వర్కు, అనేక విమానాశ్రయాలు ఉన్నాయి. సియెరా లియోన్లో 11,300 కిలోమీటర్ల (7,000 మైళ్ళు) పొడవైన హైవేలు ఉన్నాయి. వీటిలో 904 కిమీ (562 మైళ్ళు) (8%) కాలిబాట నిర్మితమై ఉంటాయి. (చోట్ల 8%) సియెరా లియోన్ రహదారులు కనెరీ, గినియా, మోన్రోవియా, లైబీరియా అనుసంధానితమై ఉన్నాయి.

ఆఫ్రికన్ ఖండంలో అతిపెద్ద సహజ నౌకాశ్రయాన్ని సియెరా లియోన్ కలిగి ఉంది. ఇది తూర్పు ఫ్రీటౌన్లోని క్లైను టౌను ప్రాంతంలోని " రెండవ ఎలిజబెత్తు రాణి క్వే " ద్వారా సెంట్రలు ఫ్రీటౌన్‌లో ప్రభుత్వ వార్ఫు ద్వారా అంతర్జాతీయ షిప్పింగును అనుమతిస్తుంది. సియెరా లియోన్లో 800 కిమీ (497 మీ) జలమార్గాలు ఉన్నాయి. వీటిలో 600 కిమీ (373 మైళ్ళు) సంవత్సరం పొడవునా ప్రయాణించడానికి వీలుగా ఉంటాయి. ప్రధాన పోర్టు నగరాలు బోంటీ, ఫ్రీటౌన్‌, షేర్బ్రో ద్వీపం, పెప్పెలు.

సియెరా లియోన్లో పది ప్రాంతీయ విమానాశ్రయాలు, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. ఉత్తర సియెరా లియోన్ లోని తీర పట్టణమైన లుంగీలో " లుంగీ అంతర్జాతీయ విమానాశ్రయం " సియెరా లియోన్ నుండి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రధాన విమానాశ్రయంగా ఉంది. ప్రయాణీకులు ఫ్రీవటౌనులో అబెర్డీను హెలిపోర్టులు నదిని దాటడానికి ఫెర్రీ లేదా ఒక హెలికాప్టరు ద్వారా దాటతారు. విమానాశ్రయం నుండి ఇతర ప్రధాన నగరాలకు హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయము 3,047 మీటర్లు (9,997 అడుగులు) కంటే ఎక్కువ రన్వేలను నిర్మించింది. ఇతర విమానాశ్రయాలలో రన్వేలు ఉన్నాయి. ఏడు విమానాలు 914 నుండి 1,523 మీటర్ల (2,999 నుండి 4,997 అడుగులు) వరకు రన్వేలు ఉన్నాయి; మిగిలిన రెండు తక్కువ రన్వేలు ఉన్నాయి.

సియెరా లియోన్ ఎయిర్లైన్సు ధ్రువీకరణ విషయంలో నిషేధిత దేశాల జాబితాలో కనిపిస్తుంది. దీని అర్థం సియెరా లియోనులో నమోదు చేయబడిన ఎయిర్లైన్సు ఐరోపాసమాఖ్యలో ఏ రకమైన సేవలను నిర్వహించలేదు. ఇందులో " ప్రామాణిక సేఫ్టీ స్టాండర్సు " లేక పోవడమే ఇందుకు కారణం.

2014 మే నాటికి దేశంలోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం లండను, పారిసు, బ్రస్సెల్సు, పశ్చిమ ఆఫ్రికాలోని ప్రధాన నగరాలకు నేరుగా విమానాలను నిర్వహించనుంది.

2014 సెంప్టెమరులో ఎబోలా కారణంగా ప్రయాణపరిమితి విధించిన జిల్లాలలో కైలహును, కెన్మా, బొంబాలి, టాంకోలి, పోర్టు లాకో వంటి అనేక జిల్లాలు ఉన్నాయి.

విద్యుత్తు

పర్యవేక్షణ

2016 నాటికి సియారా లియోన్లో విద్యుత్తు వినియోగం మొత్తం జనాభాలో సుమారు 12% ఉంది. ఈ 12%లో జనాభాలో సుమారు 10% పట్టణ రాజధాని ఫ్రీటౌన్‌లో ఉన్నారు. ఇది గ్రామీణ ప్రాంత జనాభాలో 2% విద్యుత్తును వినియోగిస్తుంది. జనాభాలో అధిక భాగం వారి రోజువారీ మనుగడ కోసం బయోమాసు ఇంధనాలపై ఆధారపడివుంది. కట్టెలు, బొగ్గు అత్యంత అధికంగా ఉపయోగించబడ్డాయి. ఈ వనరుల బర్నింగు మహిళలు, పిల్లలపై ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను చూపుతూ ఉన్నట్లు నివేదించబడింది. 2012 లో ఎక్యూటు రెస్పిరేటరీ ఇన్ఫెక్షను (ఎఆర్ఐ), ఇంటిలో బయోమాసు ఇంధనాలు దహనం చేయడం ఒక అధ్యయనం జరిగింది. ఫలితాలు ఏమిటంటే కట్టెలు పొయ్యిని ఉపయోగించిన ప్రదేశాలలో 64% మంది పిల్లలు ఎ.ఆర్.ఐ.తో బాధపడుతూ ఉన్నారు. 44% బొగ్గుల పొయ్యిని ఉపయోగించారు. బొగ్గు, వంటచెరకు వినియోగం పర్యావరణ సంబంధిత సమస్యలను ఎదుర్కుంది. ఎందుకంటే రెండూ సహజ వనరులకు విరుద్ధంగా ఉంటాయి. ఫలితంగా సహాయనిధి దాతలు, ప్రభుత్వ సంస్థలు, ఇంధన & నీటి వనరుల మంత్రిత్వశాఖ, అటవీ విభాగాలకు కట్టెలు, బొగ్గు వ్యాపారీకరణ అనేద వివాదాస్పదమైంది. ఐరోపా సస్టైయినబులు డెవలప్మెంటు గోల్సు, ముఖ్యంగా లక్ష్య సంఖ్య ఏడు (సరసమైన, పరిశుభ్రమైన శక్తి) కారణంగా సియెరా లియోన్లో ప్రధాన శక్తి వనరులుగా ఉండటానికి సౌర, జలశక్తి రెండింటి అభివృద్ధికి బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సియెరా లియోన్ ఉష్ణమండల వాతావరణం, భారీ వార్షిక వర్షపాతం, నదులు పుష్కలంగా వాస్తవికంగా మరింత సౌర, జలశక్తి ప్రత్యామ్నాయాలను అభివృద్ధిచేయడానికి ఇవి శక్తినిస్తాయని విశ్వసిస్తున్నారు.

సోలారు విద్యుత్తు

యుకె డిపార్ట్మెంటు ఫర్ ఇంటర్నేషనలు డెవలప్మెంటు (డిఎఫ్.ఐ.డి) తో కలిసి, సియెరా లియోన్ తన పౌరులకు 2025 నాటికి సౌర శక్తిని అందించడానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ విస్తృతమైన గోలు కూడా చిన్న లక్ష్యాలుగా విభజించబడింది. ఈ లక్ష్యాలలో మొదటిది 2016 లో కనీసం 50,000 గృహాలకు సౌర శక్తిని అందించడం, రెండోది 2017 నాటికి 250,000 గృహాలు, చివరికి 2020 నాటికి 10,00,000 మందికి శక్తిని అందించడం. 2030 నాటికి 14 వివిధ ఆఫ్రికన్ దేశాలకు విద్యుత్తును అందించే శక్తినిచ్చే ఎనర్జీ ఆఫ్రికా అందుబాటు ప్రచారం క్రిందకు వస్తుంది. ఈ కాంపాక్టు ఒప్పందానికి ముందు సౌరశక్తి కోసం సియెరా లియోన్ ప్రైవేటు రంగం బలహీనంగా ఉంది. ఇది లక్ష్య జనాభాలో 5% కంటే తక్కువ శక్తిని అందించింది. దిగుమతి సుంకాలు, పన్నులు, నాణ్యత నియంత్రణ లేకపోవడం దీనికి కారణం. ఎనర్జీ ఆఫ్రికా లక్ష్యం నెరవేరిందని నిర్ధారించడానికి, సియెరా లియోన్ సర్టిఫికేటు సౌర ఉత్పత్తులపై దాని దిగుమతి సుంకాలు, విలువ ఆధారిత పన్ను (వాట్) ను తొలగించడానికి అంగీకరించింది. ఈ మార్పు దాని పౌరులకు సరసమైన, నాణ్యమైన సౌర ఉత్పత్తులను అందించేటానికి విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. విధులు, పన్నులు లేకపోవడంతో సౌర ఉత్పత్తులపై 30% నుండి 40% వ్యయం తగ్గింపు ఉంటుందని అంచనా వేయబడింది.

జలవిద్యుత్తు

2012 నాటికి సియెరా లియోన్ 3 ప్రధాన జలవిద్యుత్తు ప్లాంట్లను కలిగి ఉంది. మొట్టమొదటిగా 1982 లో డీవో ప్లాంటును తొలగించారు, రెండవది తూర్పు ప్రావింసులో, బుమ్బునా. సేవా నది, పాంపాన నది, సేలీ నది, మో నది, లిటిలు స్కార్రియస్లలో అనేక కొత్త జలవిద్యుత్తు ప్లాంట్లు తెరవగలవని అంచనావేయబడింది. ఈ ప్రాజెక్టులన్నింటిలో బింబన డ్యాం ఇప్పటికీ సియెరా లియోన్ జలవిద్యుత్తు ప్రాజెక్టులలో అతిపెద్ద స్థానంలో ఉన్నాయి. ఇది సెలీ నది, ఫ్రీటౌన్ సమీపంలో ఉంది. ఇది 50 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. 2017 నాటికి దాని సామర్థ్యాన్ని 400 మెగావాట్ల పెంచడానికి ప్రణాళికలు ఉన్నాయి. దీనికి సుమారు 750 మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. బంబున ఆనకట్ట విదేశీ ఇంధనంపై ఖర్చు మొత్తంని తగ్గించగలదు. దేశం నెలకు కనీసం $ 2 మిలియన్లను ఆదా చేయగలదని అంచనా వేయబడింది. గతంలో ఈ ప్రాజెక్టు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంటు బ్యాంకు, ఇటాలియన్ కంపెనీ సాలిని ఇంప్రెలీలో కలయికతో $ 200 మిలియన్ల నిధులను పొందింది.

గణాంకాలు

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Sierra Leone's total population, from 1961 to 2003

2013 లో సియెరా లియోన్ 61,90,280 అధికారికంగా అంచనా వేయబడిన జనాభా ఉన్నారు. వార్షికవృద్ధి రేటు 2.216% ఉంది. గ్రామీప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలశాతం 62%. జనాభాలో యువత అధింగా ఉన్నారని అంచనా. 15 సంవత్సరాల కంటే తక్కువ వసున్నవారి సంఖ్య 41.7% ఉంది. నగరాలకు వలస వచ్చిన ఫలితంగా పట్టణప్రాంత ప్రజల శాతం వార్షికంగా 2.9% ఉంది.

సియెరా లియోన్ జనాభా సాంద్రత ప్రాంతాలవారీగా మారుతూ ఉంటుంది. పశ్చిమప్రాతం అర్బను డిస్ట్రిక్టు ఫ్రీటౌన్ " రాజధాని నగరం, అతిపెద్ద నగరంతో) జనసాధ్రత చదరపు కిమీకి 1,224 మంది ఉంది. భౌగోళికంగా అతిపెద్ద జిల్లా అయిన కొయనడుగులో జనసాంధ్రత చ.కి.మీ 21.4 ఉంది.

సియెరా లియోన్ అధికార భాష ఇంగ్లీషు. పాఠశాలలు, ప్రభుత్వ పరిపాలన, మాధ్యమాలలో ఆగ్లభాష ప్రాధానభాషగా ఉంది. ఆంగ్లం, అనేక దేశీయ ఆఫ్రికా భాషల మిశ్రమంగా రూపొందిన క్రియో భాష సియెరా లియోన్ ప్రజల ప్రధాన భాషగా ఉంది. సియెరా లియోన్ అన్ని ప్రాంతాలలో విస్తారంగా వాడుకలో ఉన్న భాషగా ఉంది. దేశం జనాభాలో 90% మందికి క్రియో భాష వాడుకలో ఉంది. ఇది అన్ని విభిన్న జాతుల సమూహాల భాషను కలిపి, ప్రత్యేకించి వర్తకం, పరస్పర సంభాషణలకు ఇది ఉపయోగించబడుతుంది.

శరణార్ధుల, వలసదారుల సంయుక్త కమిటీ ప్రచురించిన వరల్డు రెఫ్యూజీ సర్వే 2008 ఆధారంగా సియెరా లియోన్లో 2007 చివరి నాటికి 8,700 శరణార్థులు ఉన్నారు. 2007 నాటికి వీరిలో దాదాపు 20,000 లైబీరియా శరణార్థులు స్వచ్ఛందంగా లైబీరియాకు తిరిగి వెళ్ళారు. సయెర్రా లియోన్లో మిగిలి ఉన్న శరణార్థులు దాదాపుగా లైబీరియన్లుగా ఉన్నారు.

2004 జనాభా గణాంకాలు 5 అతిపెద్ద నగరాలకు పైన ఉదహరించబడ్డాయి. వీటిలో ఫ్రీటౌన్ వెస్ట్రను అర్బను ఏరియా (గ్రేటరు ఫ్రీటౌన్‌) ఉంది. ఇతర మూలం నుండి అంచనాలు ఉన్నాయి. వివిధ వనరులు వివిధ అంచనాలను ఇస్తాయి. పైన పేర్కొన్న జాబితాలో మగ్బర్కాను చేర్చాలని కొందరు వాదిస్తున్నారు. అయితే మూలాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. ఒక మూలం జనాభా 14,915 మరొకటి 85,313 గా చూపుతుంది. 2004 జనాభా లెక్కలలో టార్గొంబు పొడిగించబడిన పట్టణం "పండేబూ-టోక్పోమ్" 10,716 మంది ప్రజలు ఉన్నారు. "గ్బెండెంబు" జనాభాలో ఎక్కువ జనాభా 12,139 ఉంది. 2004 గణాంకాలలో వాటర్లూ జనాభా 34,079 ఉంది.

మతం

Religion in Sierra Leone (2010)
Religion percent
Islam
  
78%
Christianity
  
21%
Other faiths
  
1%
సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Mosque and church in Sierra Leone

సియెరా లియోన్ అధికారికంగా లౌకిక రాజ్యం. అయినప్పటికీ ఇస్లాం, క్రైస్తవ మతం దేశంలో రెండు ప్రధాన మతాలు. సియెరా లియోన్ రాజ్యాంగం ప్రజలకు మతం స్వాతంత్ర్యం అందిస్తుంది. సియెరా లియోన్ ప్రభుత్వం సాధారణంగా దీనిని రక్షిస్తుంది. సియెరా లియోన్ ప్రభుత్వం రాజ్యాంగపరంగా దేశ అధికారిక మతాన్ని స్థాపించకుండా నిషేధించింది. అయినప్పటికీ దేశంలో ప్రధాన రాజకీయ కార్యక్రమాల ప్రారంభంలో ముస్లింలు, క్రైస్తవులు ప్రార్థనలు సాధారణంగా నిర్వహించబడుతున్నాయి. వీటిలో అధ్యక్షుడు పదవీప్రమాణం చేసేసమయం, పార్లమెంటు నూతన సెషను అధికారిక ప్రారంభించేసమయం ఉన్నాయి.

2010 ప్యూ పరిశోధనా కేంద్రం గణాంకాల ఆధారంగా సియెరా లియోన్ జనాభాలో 78% ముస్లింలు (అధికంగా సున్నీ), 20.9 క్రైస్తవులు (అధికంగా ప్రొటెస్టంట్లు), 1% సాంప్రదాయ ఆఫ్రికా మతం లేదా ఇతర విశ్వాసాకు చెందినవారు ఉన్నారు. లియోన్ యొక్క ఇంటర్-రెలిజియస్ కౌన్సిలు అంచనాల ఆధారంగా సియెరా లియోన్లో 77% ముస్లిములు, 21% క్రైస్తవులు, 2% సాంప్రదాయ ఆఫ్రికా మతం అనుచరులు ఉన్నారని భావించారు. సియెరా లియోన్ ముస్లిములలో దేశంలో రెండు అతిపెద్ద జాతి సమూహాలు (మెండే, టెమ్నే) ఉన్నాయి.

సియెరా లియోన్ ప్రపంచంలోని అత్యంత మతసహనం కలిగిన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[ఆధారం చూపాలి] ముస్లింలు, క్రైస్తవులు సహజీవనంతో పరస్పరం సహకరించుకుంటారు. మత హింస దేశంలో చాలా అరుదు. సియెరా లియోన్ పౌర యుద్ధం సమయంలో కూడా ప్రజలు తమ మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదు.

దేశం సియెరా లియోన్ ఇంటరు రిలిజియసు కౌన్సిలుకు నివాసంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా శాంతి, సహనం పెంపొందించడానికి క్రైస్తవ, ముస్లిం మతం మత నాయకులచే రూపొందించబడింది. ఈదు అలు-ఫితరు, ఈదు అలు అధా, మౌలిదు-ఉన్-నబి (ఇస్లాం మతం పుట్టినరోజు) ఇస్లామికు సెలవులు సియెరా లియోన్లో జాతీయ సెలవుదినాలుగా గుర్తించబడ్డాయి. క్రైస్తవ శలవులలో క్రిస్మసు, బాక్సింగు డే, గుడు ఫ్రైడే, ఈస్టరు కూడా సియెరా లియోన్లో జాతీయ సెలవుదినాలు. రాజకీయాలలో ఓటర్లు అభ్యర్థి మతతానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అర్హత అనుసరించి ఓటు వేస్తుంటారు.

సియెరా లియోన్ ముస్లింలు అధిక భాగం ఇస్లాం సున్నీ సంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు. సియెరా లియోన్లో మసీదులు, ఇస్లామికు పాఠశాలలు ఎక్కువగా సున్నీ ఇస్లాం విధానంలో ఉన్నాయి. సియెరా లియోన్ ముస్లింలలో 10% అహ్మదీయ ఇస్లాం అనుచరులు ఉన్నారు. సియెరా లియోన్ అహ్మదియ ముస్లింలు ఉన్నందున సియెరా లియోన్లో 500 అహ్మదీయ మసీదులు ఉన్నాయి..షియా ఇస్లాంకు సియెరా లియోన్లో బలమైన మద్దతు లేదు. దేశంలో చాలా కొద్ది మంది షియా ముస్లింలు ఉన్నారు. సున్నీ, అహ్మదియ వర్గాల సియెరా లియోన్ ముస్లింలు అధికంగా ఒకే మసీదులో ప్రార్థిస్తారు. మాలికి పాఠశాల సియెరా లియోన్ అంతటా ఇస్లామికు సున్నీ ఇస్లాం విధానంలోనే ఉంటాయి. సియారా లియోన్లో అనేక అహ్మదియ ముస్లింలు కూడా మాలికి న్యాయ మీమాంసాన్ని అనుసరిస్తున్నారు.

సియెరా లియోన్ ఇస్లామికు సుప్రీం కౌన్సిలు సియెరా లియోన్లో అత్యున్నతస్థాయి ఇస్లామిక్ మత సంస్థ, దేశం ఇమాములు, ఇస్లామికు పండితులు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఇస్లామిక్ మతగురువులు ఆధిపత్యంతో రూపొందించబడింది. సియెరా లియోన్ సుప్రీం ఇస్లామికు కౌన్సిలు అధ్యక్షుడుగా " షేకు ముహమ్మద్ తహా జలోహు " ఉన్నాడు. సియెరా లియోన్లో " ది యునైటెడ్ కౌంసిలి ఆఫ్ ఇమాంసు " అనే ఇస్లామికు మత సంస్థ శక్తివంతమైన ములింసంస్థాగా ఉంది. అది సియెరాలో ఇమాం మసీదుల నిర్మాణం, నిర్వహణలకు బాధ్యత వహిస్తుంది.[2]. సియెరా లియోన్ రెండు అతిపెద్ద మసీదులు ఫ్రీటౌన్ సెంట్రలు మసీదు, ఘడాఫీ సెంట్రలు మసీదు (మాజీ లిబియా నాయకుడు ముమామరు గడ్డాఫీ నిర్మించినవి) రెండూ కూడా రాజధాని ఫ్రీటౌన్‌లో ఉన్నాయి.

ప్రస్తుతం అత్యంత ప్రముఖ సియెరా లియోనన్ ముస్లిం మతాచార్యులు, బోధకులలో షేకు అబూ బకర్రా కోట్కో కమరా, షేకు ముహమ్మదు తహా జల్లో, షేకు ఉమర్రా కను, షేకు అహ్మదు తేజను సిల్లా, షేకు సయీరు రహ్మాను, షేకు ముహమ్మదు హబీబ్ షరీఫు ఉన్నారు. షియా ముస్లిం అయిన షేకు అహ్మదు తేజను సిల్లా మినహాయించి. సియెరా లియోన్ ముస్లిం పండితులు అందరూ సున్నీ ముస్లింలే. షేకు సయీరు రహ్మాను అహ్మదియ ముస్లింగా ఉన్నాడు. సియెరా లియోన్ క్రైస్తవులలో అధిక భాగం ప్రొటెస్టంట్లు ఉన్నారు. వీరిలో అతిపెద్ద సమూహాలు వెస్లియన్లు _ మెథడిస్టులు ఉన్నారు. ఇతర ప్రొటెస్టెంటు క్రైస్తవులలో గణనీయమైన సంఖ్యలో ప్రెస్బిటేరియన్లు ఉన్నారు. బాప్టిస్టులు సెవెంతు డే అడ్వెంటిస్టులు ఉన్నారు. ఆగ్లికన్లు, లూథరన్లు ఉన్నారు. పెంటెకోస్టులు ఉన్నారు. క్రిస్టియన్ మత సంస్థ " చర్చిల కౌన్సిలు "ను సియెరా లియోన్లో ప్రొటెస్టంటు చర్చిలు రూపొందించాయి. ఇటీవల పెంటెకోస్టలు చర్చిల అధివృద్ధి (ప్రత్యేకించి ఫ్రీటౌన్‌) చేస్తూ ఉంది.

2017 సెప్టెంబరులో నైజీరియా పెంటకోస్టలు క్రిస్టియను పాస్టరు పేరు విక్టరు అజాసఫేను సియెరా లియోన్ పోలీసు ఖైదుచేయబడ్డాడు. రాజధాని ఫ్రీటౌన్లో ఇస్లాంకు వ్యతిరేకంగా (ప్రత్యేకంగా సియెరా లియోనే ముస్లింలకు వ్యతిరేకంగా) మతపరమైన అసహనం, తీవ్రవాద ద్వేషపూరిత ప్రసంగం ప్రసంగించిన తరువాత ఖైదుచేసి జైలులో ఉంచబడ్డాడు. అంతర్జాతీయంగా ప్రఖ్యాత జింబాబ్వేముస్లిం మతాధికారి ముఫ్టి మెంకు సియెరా లియోన్ను సందర్శించిన తరువాత అజిసాఫే స్పష్టంగా కోపంగా, అసూయతో ఉన్నాడు. 2017 సెప్టెంబరు 21 - 23 వ తేదీన సియెరా లియోన్ పర్యటనలో తన ఇస్లామికు ఉపన్యాసం వినడానికి ఫ్రీటౌన్‌లోని జాతీయ స్టేడియంలో, లక్షమందికి పైగా ప్రజలు హాజరయ్యారు. సియెరా లియోన్లోని అనేక క్రైస్తవ సంస్థలు, చర్చిల కౌన్సిలుతో సహా ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా అజాసఫు చేసిన ప్రసంగాన్ని ఖండించారు. సియెరా లియోన్ ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. అతని చర్చి లైసెన్సు కూడా తాత్కాలికంగా సస్పెండు చేయబడింది. ఈ సంఘటన సియెరా లియోన్లో మతపరమైన ఉద్రిక్తతకు కారణం అయింది. దేశీయం మత సహనానికి ప్రసిద్ధి చెందింది. ఈ సంఘటనపట్ల దేశీయంగా, విదేశాలలో చాలా ఆగ్రహించారు. అనేక మంది అజీసాఫే నైజీరియా తన స్వదేశం నైజీరియాకు తిరిగి పంపించబడతారని భావించారు. సియెరా లియోన్ పోలీసు కస్టడీలో పాస్టరు సియెరా లియోనే ముస్లింలకు, సియెరా లియోన్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాడు. జైలులో అనేక రోజుల తరువాత అజిసాఫే విడుదలచేబడి ఆయన చర్చి లైసెన్సు ఆయనకు తిరిగి ఇవ్వబడింది. అనేక నెలలు కఠినమైన ప్రభుత్వ పరిశీలన తరువాత తిరిగి తెరిచారు.

సిర్రా లియోన్ క్రైస్తవ జనాభా గణనీయమైన అల్పసంఖ్యాకులను నాన్-క్రైస్తవులు పేర్కొంటారు. సియెరా లియోన్లో 8% మంది ప్రొటెస్టెంటు కాని క్రైస్తవులు ఉన్నారు. సియెరా లియోన్లో క్రైస్తవులు 26% ఉన్నారు. సియెరా లియోన్లో యెహోవాసాక్షులు, మొర్మోంసు వారు సియెరా లియోన్లో క్రైస్తవులలో అల్పసంఖాక ప్రజలుగా ఉన్నారు. రాజధాని ఫ్రీటౌన్‌లో ఆర్థడాక్సు క్రైస్తవుల చిన్న వర్గం నివసిస్తుంది.

సంప్రదాయ సమూహాలు

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
The distribution of major ethnic groups within Sierra Leone
Ethnic groups
of Sierra Leone
Temne
Mende
Limba
Loko
Fula
Mandingo
Creole
Sherbro
Kuranko
Kono
Susu
Kissi
Yalunka
Vai
Kru

సియెరా లియోన్ 16 జాతి సమూహాలకు నిలయంగా ఉంది. ప్రతి ఒక్కటి దానికి స్వంత భాష ఉంది. టెమ్నే 36%, మెండే 33% అతిపెద్ద అత్యంత ప్రభావవంతమైన జాతులుగా ఉన్నాయి. ఉత్తర సియెరా లియోన్, సియెరా లియోన్ రాజధాని పరిసర ప్రాంతాలలో టెమ్నే ఎక్కువగా ఉంది. మెండే దక్షిణ-తూర్పు సియెరా లియోన్ (కొనా జిల్లా మినహా) లో అధికంగా ఉన్నారు.

ఎక్కువ శాతం మంది ముస్లింలు (85%) ఉన్నారు. అల్పసంఖ్యాక క్రైస్తవ సమాజం (10%) వద్ద ఉంది. మెండే ముస్లింలు (70%) వద్ద ముస్లిం మెజారిటీగా ఉన్నారు. అయినప్పటికీ ఒక పెద్ద అల్పసంఖ్యాక క్రైస్తవ సమాజం (30%) ఉంది. సియెరా లియోన్ జాతీయ రాజకీయాలు టెమ్నే ప్రజలు ఆధిపత్యం వహిస్తున్న వాయవ్య ప్రాంతం, మండేప్రజలు ఆధిపత్యం వహిస్తున్న ఆగ్నేయప్రాంతాల మద్య కేంద్రీకృతమై ఉంటాయి. మెండేలో అధిక భాగం సియెరా లియోన్ పీపుల్సు పార్టీ (ఎసెల్పిపి) కు మద్దతు ఇస్తుంది. అయితే ఎక్కువ మంది టెమ్నే ఆల్ పీపుల్సు కాంగ్రెసు (ఎ.పి.సి) కు మద్దతు ఇస్తారు.

మండే ప్రజల పూర్వీకులుగా విశ్వసిస్తున్న మానె ప్రజలచే ప్రారంభకాలంలో లైబీరియను లోతట్టుప్రాంతాలను ఆక్రమించబడ్డాయి. 18 వ శతాబ్దంలో ఈ ప్రజలు నెమ్మదిగా, శాంతియుతంగా సియెరా లియోన్ ప్రాంతాలలో ప్రవేశించారు. టెమ్నే ప్రజలు ప్రస్తుత గినియాలో ఉన్న ఫూటా జల్లోను నుండి వచ్చారని భావిస్తున్నారు.

జనాభాలో 6.4% ఉన్న లింబా మూడవ అతిపెద్ద జాతి సమూహం ఉంది. లింబా సియెరా లియోన్ స్థానిక ప్రజలు. వారు మూలం, సంప్రదాయం వివరణ లేదు. ఐరోపియన్లు ప్రవేశించడానికి ముందు నుండి సియెరా లియోనిలో నివసించినట్లు నమ్ముతారు. లింబా ప్రజలు ప్రధానంగా నార్తరను సియెరా లియోనులో (ముఖ్యంగా బాంబోలి, కంబియా, కోయండిగు జిల్లాలలో) కనిపిస్తారు. లింబా ప్రజలలో 60% క్రైస్తవులు, 40% ముస్లింలు ఉన్నారు. పొరుగున ఉన్న టెమ్నే ప్రజలతో వీరికి రాజకీయ మిత్రత్వం ఉంటుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి లింబా ప్రజలు మెండే ప్రజలతో కలిసి సియెరా లియోన్ రాజకీయాలలో చాలా ప్రభావవంతంగా ఉన్నారు. లిబ్యా ప్రజలు అధికంగా ఆల్ పీపుల్సు కాంగ్రెసు (ఎ.పి.సి)పార్టీకి మద్దతు ఇస్తారు. సియారా లియోన్ మొదటి, రెండవ అధ్యక్షులు సికా స్టైవెన్సు, జోసెఫు సైడు మోమో ఇద్దరూ జాతి లింబా జాతికి చెందినవారే. సియెరా లియోన్ ప్రస్తుత రక్షణ మంత్రి ఆల్ఫ్రెడు పోయోలో కాంటే కూడా ఒక లింబా సంప్రదాయానికి చెందినవాడే.

అతిపెద్ద అల్పసమిహ్యాక జాతి సమూహాలలో ఒకరు ఫులా (3.4%). వీరు 7 వ - 18 వ శతాబ్ధాల గినియా ఫౌటా జెల్లాను ప్రాంతం నుండి వలసవచ్చిన ఫూలా వారసులు. ప్రధానంగా సియెరా లియోన్ పశ్చిమ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఫులా దాదాపు 99% కంటే అధికంగా ముస్లింలు ఉన్నారు. ఫూలా ప్రధానంగా వ్యాపారులు ఉన్నారు. చాలా మంది మధ్యతరగతి గృహాలలో నివసిస్తున్నారు. వారి వర్తకం కారణంగా, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఫులాప్రజలు కనిపిస్తారు.

ఇతర సంప్రదాయ జాతులలో మండింగో ప్రజలు (మండిన్కా అని కూడా పిలువబడుతుంది) ఒకరు. ఇతర జాతి సమూహాలు. వీరు 19 వ శతాబ్దం నుంచి 20 వ శతాబ్ద మధ్యకాలంలో గినియా నుండి సియెరా లియోన్కు వలస వచ్చిన వ్యాపారుల వారసులు. మండికా ప్రజలు ప్రధానంగా తూర్పుప్రాంతం, ఉత్తరప్రంతంలో కనిపిస్తారు. వారు ప్రధానంగా పెద్ద పట్టణాలలో ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరప్రాంతంలోని కరీనా, (బాంబోలి జిల్లా), ఫలాబా, కబాలా (కొనియాద్గు జిల్లా), తూర్పు ప్రాంతంలో యెంగెమా (కోనో జిల్లా) ఉన్నారు. ఫులా మాదిరిగా మండిన్కా ప్రజలలో కూడా దాదాపు 99% కంటే అధికంగా ముస్లింలు ఉన్నారు. సియెరా లియోన్ మూడవ అధ్యక్షుడు అహ్మదు టెజను కబబా, సియెరా లియోన్ మొదటి ఉపాధ్యక్షుడు సోరీ ఇబ్రహీం కొరామా ఇద్దరూ మండికంర్లే.

తూర్పు సియెరా లియోన్లో ప్రధానంగా కోనో జిల్లాలో నివసించే కొనో ప్రజలు తరువాతి స్థానంలో ఉన్నారు. కొనో ప్రజల పూర్వీకులు గినియా నుండి వలస వచ్చారు. ప్రస్తుతం వారిని కార్మికులు (ప్రధానంగా డైమండు మైనర్లుగా)గా ఉన్నారు. కొనాను జాతీయులలో అధికభాగం క్రైస్తవులు, ప్రభావవంతమైన అల్పసంఖ్యాక ముస్లింలు ఉన్నారు. సియారా లియోన్ మాజీ ఉపాధ్యక్షుడు అల్హాజీ శామ్యూలు సాం-సుమానా కోనో జాతికి చెందిన వాడే.

చిన్నదైనప్పటికీ ప్రాముఖ్యత కలిగిన క్రియో ప్రజలు (1787-1885 మద్యకాలంలో ఫ్రీటౌన్‌లో స్థిరపడ్డ ఆఫ్రికా అమెరికన్లు, వెస్ట్ ఇండియన్లు, విముక్తి ఆఫ్రికా బానిసల వారసులు) 3% ఉన్నారు. వారు ప్రధానంగా రాజధాని నగరం ఫ్రీటౌన్‌, దాని పరిసరాలలోని పశ్చిమప్రాంతాన్ని ప్రాంతం ఆక్రమించుకున్నారు. క్రియో సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి, అనేకమంది వారి పూర్వీకుల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది - వారు అభివృద్ధి కాలంలో బ్రిటిషు అధికారులతో, వలసవాద పాలనా యంత్రాంగంతో చాలా దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నారు.

క్రియో సాంప్రదాయకంగా సియెరా లియోన్ న్యాయవ్యవస్థ, ఫ్రీటౌన్‌లోని (ఎన్నుకోబడిన) నగర మండలిలో అధికారాన్ని కలిగి ఉంది. వలసరాజ్యాల కాలంలో పాశ్చాత్య సంప్రదాయాల ప్రకారం విద్యావంతులైన మొదటి జాతి సమూహాలలో ఒకటైన వారిని సంప్రదాయంగా సాంఘిక సేవా స్థానాలకు నియమించబడడం ప్రారంభించారు. వారు పౌర సేవలో ప్రభావవంతులై ఉంటారు. క్రియోప్రజలలో క్రైస్తవులు 90% ఉంటారు. అయినప్పటికీ ఒక చిన్న కానీ ముఖ్యమైన ముస్లిం అల్పసంఖ్యాకులు (స్థానికంగా వీరిని ఒకు ప్రజలు అంటారు) 10% ఉంటారు.

ఇతర మైనారిటీ జాతి సమూహాలు కుంకోనో, మిండిగోలతో సంబంధం కలిగి ఉంటాయి. వీరిలో ముస్లింలు అధికంగా ఉంటారు. కురాంకో సుమారు 1600 లో గినియా నుండి సియెరా లియోన్లో ప్రవేశించి ఉత్తరప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రత్యేకించి వీరు కోనిదుగు జిల్లాలో స్థిరపడ్డారు. కురాంకో ప్రజలలో ప్రధానంగా రైతులు అధికంగా ఉంటారు. వారి నాయకులు సంప్రదాయబద్ధంగా మిలిటరీలోని అనేక సీనియరు పదవులలో ఉన్నారు. బ్యాంకు ఆఫ్ సియెరా లియోన్ ప్రస్తుత గవర్నరు "కైఫాల మారా " కుర్కోనో ఒక జాతికి చెందినవాడే.

ఉత్తరప్రాంతంలో సియెరా లియోన్ స్థానిక ప్రజలు, ఐరోపియన్లు ప్రవేశించించిన సమయం నుండి నివసిస్తున్నారని విశ్వసిస్తున్నారు. పొరుగున ఉన్న టెమ్నే ప్రజలలా లాకో ప్రజలలో ముస్లిం ఆధిక్యత అధికంగా ఉంది. సుసు, వారి సంబంధిత యలూంకా ప్రజలు వర్తకులుగా ఉన్నారు. రెండు సమూహాలు ప్రాథమికంగా గాంబియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న కంబియా, కొనియాద్గు జిల్లాలో సుదూర ఉత్తరప్రాంతంలో కనిపిస్తారు. సుసు, యలుంకా జాతులు రెండూ గినియా నుండి వలస వచ్చిన ప్రజల సంతతివారు. ఈ రెండు జాతులలో ముస్లింలు 99% కంటే అధికంగా ఉన్నారు.

కిస్సి ప్రజలు సియెరా లియోన్లో దక్షిణ-తూర్పు ప్రాంతంలలోని మరింత లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారు ప్రధానంగా కైలహును జిల్లాలోని కొయిండు దాని పరిసర ప్రాంతాలలో ఉన్నారు. కిస్సిప్రజలలో అధిక భాగం క్రైస్తవులు ఉన్నారు. వాయి, క్రూ ప్రజలు ప్రధానంగా లైబీరియా సరిహద్దు సమీపంలోని కైలహును, పుజహును జిల్లాలో కనిపిస్తారు. క్రూ ప్రజలు ప్రధానంగా రాజధాని ఫ్రీటౌన్లోని పొరుగు ప్రాంతం అయిన క్రౌబేలో ఉన్నారు. వాయి ప్రజలలో దాదాపు 90% ముస్లిం మెజారిటీ ఉండగా, క్రూ ప్రజలలో దాదాపు 99.9% కంటే అధికంగా క్రైస్తవులు ఉన్నారు.

దక్షిణాన బోంటీ జిల్లా తీరంలో షెర్బ్రో ప్రజలు ఉన్నారు. వీరిని సియెరా లియోన్కు చెందిన స్థానికులుగా భావిస్తున్నారు. వీరు షేర్బ్రో ద్వీపాలను కనిపెట్టినప్పటి నుండి దానిని ఆక్రమించారు. షేర్బ్రో ప్రధానంగా మత్స్యకారులుగా, రైతులుగా ఉన్నారు. వారు ప్రధానంగా బొంతే జిల్లాలో కనిపిస్తారు. షేర్బ్రో ప్రజలందరూ దాదాపుగా క్రైస్తవులుగా ఉన్నారు. వారి నాయకులు బ్రిటిషు కాలనీవాసులతో, వ్యాపారులతో వివాహం సంబంధాలు ఏర్పరచుకున్నారు.

సియెరా లియోనియనెలో కొద్ది సంఖ్యలో 19 వ శతాబ్దంలో దేశానికి వచ్చిన వ్యాపారుల వారసులు (పాక్షిక లేదా పూర్తి లెబనీయులు) ఉన్నారు. వారు స్థానికంగా సియెరా లియోన్-లెబనీయులు అని పిలువబడతారు. సియెరా లియోన్-లెబనీయులు ప్రధానంగా వ్యాపారులుగా ఉన్నారు. వారు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో మధ్యతరగతి గృహాల్లో నివసిస్తున్నారు. వీరు ప్రధానంగా ఫ్రీటౌన్‌, బో, కెన్మా, కైట్యు టౌను, మాకేని ప్రాంతాలలో నివసిస్తున్నారు.

Gender equality

కుటుంబం

సియెరా లియోనిలో 50% మంది మహిళలు ఉన్నారు. వీరిలో కేవలం 28% మాత్రమే ఇంటిపెద్దలుగా ఉన్నారు. మిగిలిన దేశాలలో ఉన్నట్లు అధిక వేతనంతో ఉద్యోగావకాశాలు లభించడానికి, ఇంటి అవసరాలను తీర్చడానికి విద్యాసాధన కీలక అంశంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు మౌలిక విద్యావకాశాల కొరత కారణంగా ప్రారంభవిద్యలో పురుషులు మహిళలకంటే 4%, పోస్టు గ్రాడ్యుయేటు స్థాయిలో 1.2% మాత్రమే అధికంగా ఉన్నారు.

సియెరా లియోన్లో సాధారణంగా పురుషులు ఇంటిపెద్దలుగా ఉంటారు. వారి వైవాహిక స్థితి మారినా వారి స్థితి మారదు. అయినప్పటికీ వారి కుటుంబ హోదాను అనుసరించి మహిళ ఇంటి పెద్దగా మారుతుంది. తన జీవితాంతం ఆమె ఒంటరిగా మిగిలిపోతే ఒక మహిళ ఇంటిపెద్దగా ఉంటుంది. కానీ ఒక మహిళ వివాహం చేసుకుంటే ఆమె ఇంట్లోనే ఆమె అధిపతిగా ఉండదు. వితంతువులు లేదా విడాకులు తీసుకున్నట్లయితే స్త్రీలు ఇంటిపెద్దలుగా ఉంటారు.

కార్మిక క్షేత్రంలో గృహ కుటుంబం ఆర్థికావసరాలను అందించే వారు ఇంటి పెద్దగా ఉండేఅవకాశం ఉంది. అయినప్పటికీ ఆడవారు లింగ వివక్షను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మహిళలు తక్కువ ఆదాయాలు, ఆర్థిక పోరాటాను ఎదుర్కొంటారు. సంఖ్యలో, స్త్రీ ఉద్యోగుల చెల్లింపులు తక్కువ (6.3) పురుషుల ఉద్యోగుల చెల్లింపు అధికంగా (15.2) ఉంటుంది.

యుద్ధం

బలవంతంగా పిల్లలను యుద్ధంలో భాగస్వామ్యం చేయడం సియెరా లియోన్లో తీవ్ర మానసిక భావోద్వేగ హానిని ఎదుర్కొన్నారు. యుద్ధ ప్రభావాలు ఎదుర్కొన్న నష్టం, పిల్లల లింగంపై ఆధారపడి ఉంటుంది. రెండు లింగాలు అధిక స్థాయిలో హింసను అనుభవించాయి. అధిక సంఖ్యలో అత్యాచారాలు అనుభవించిన స్త్రీలలో నిరాశ, ఆందోళననా చిహ్నాలు అధికంగా కనిపించాయి. మరోవైపు పురుషులు అధిక స్థాయి ఆందోళన, శత్రుత్వం అనుభవించారు. సంరక్షణ ఇచ్చే వ్యక్తిని కోల్పోయిన తరువాత కూడా మానవులు నిరాశకు గురవుతారు.

అంటువ్యాధులు (ఎబోలా)

సియెరా లియోన్ జనాభాలో 50% మహిళలు ఉండటంతో వారు దేశం ఆర్థికవ్యవస్థ, సమాజాభివృద్ధికి చాలా వరకు దోహదం చేస్తారు. వ్యాధి సోకిన వ్యక్తులతో సామీప్యత కారణంగా సంరక్షణ బాధ్యతలు స్థానాల్లోని సియెరా లియోనన్ మహిళలు ముఖ్యంగా వ్యాధికి గురవుతారు. వ్యాధి సోకిన వ్యక్తి చనిపోయినప్పుడు, అంత్యక్రియలకు సిద్ధం మహిళలు వహిస్తున్నారు. ఇది సోకిన శరీరాన్ని ముట్టుకున్న కారణంగా మహిళలు వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. రోగులకు చికిత్స చేయడానికి సరైన పరికరాలు లేదా సరైన ఉపకరణాలు లేని కారణంగా ఆరోగ్య సంస్థలు అధిక నాణ్యమైన సేవలను అందించలేనప్పుడు ఎబోలాతో బాధపడుతున్న మహిళలలో బలహీనత అధికరించింది.

లిగ ఆధారిత హింస

సియెరా లియోన్ వంటి కొన్ని సమాజాలలో మహిళలకు సామాజిక, ఆర్థిక మద్దతు లేకపోవటం వలన వారిని మరింత బలహీనపరుస్తుంది. వారిని లింగ హింసకు గురి చేస్తుంది. మహిళలను అణిచివేయడం ద్వారా, పురుషులు అధిక శక్తిని కలిగి నిర్ణయాధికారులయ్యారు. లింగ ఆధారిత హింసను అమలు చేసే పద్ధతి మారవచ్చు; ఇది లైంగిక, భౌతిక, శబ్ద, ఆర్థిక, లేదా భావోద్వేగంగా ఉంటుంది. వయస్సు, సామాజిక-ఆర్ధిక స్థితి, లేదా విద్య వంటి అంశాలు హింసచేయడాన్ని అడ్డగించవు. వారి కుటుంబ పేరు గౌరవారవం, కీర్తి కూడా చాలామంది మహిళలకు హింసను అడ్డగించలేవు. హింసకు గురవుతున్న ఒక బాధితురాలు దురాక్రమణదారుడి మీద ఫిర్యాదు చేయడానికి కుటుంబ సమస్యలు ఎదురవ్వడం కారణంగా ఫిర్యాదుచేయడానికి వెనుకంజ వేయడం వలన స్వీయ-విశ్వాసాన్ని కోల్పోవటం ప్రారంభమవుతుంది. అందువలన భౌతిక హింసకు గురవుతున్న స్త్రీ తన గాయాలను నయం చేయటానికి ప్రత్యేక నిపుణుడి వద్ద హాజరు కావడం వీలుపడదు. కొన్ని సందర్భాలలో మహిళలు ధైర్యం చేసి నేరస్థుల వద్ద లంచాలు తీసుకునే అధికారుల కారణంగా మహిళలకు న్యాయంజరగడం లేదు.

మహిళల ఆర్ధికావలంబన

స్త్రీ-పనిచేసే చిన్న తరహా వ్యాపారం సియెరా లియోన్ ఆర్థికవ్యవస్థకు దోహదం చేస్తుంది. అది పలు మార్గాల్లో మహిళలను స్వతంత్రంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. అయినప్పటికీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సహాయాన్ని పొందటానికి మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. దేశ జనాభాలో 50% మహిళలున్న సియెరా లియోన్లో ఆర్థిక పక్షవాతం నివారించడం చాలా కష్టం.

ప్రాథమిక విద్యకు ప్రాప్యత లేకపోవడం వలన వ్యాపార లైసెంసులను పొందడానికి, కాంట్రాక్టును నమోదు చేసుకోవడానికి మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి ప్రత్యేకకేంద్రం ఉండకపోవడమే మహిళలకు అతిపెద్ద అవరోధంగా ఉంది. సియెరా లియోన్లలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం వ్యాపారము చేయడానికి సహాయపడటం కష్టంగా ఉంది.

విద్య

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A secondary school class in Pendembu, Kailahun District

సియెరా లియోన్లో 6 సంవత్సరాల ప్రాథమిక విద్య, ప్రాథమిక స్థాయిలో (క్లాసు P1-P6), జూనియరు 3 సంవత్సరాల మాధ్యమిక విద్య నిర్బంధవిద్య అమలులో ఉంది. చట్టబద్ధంగా అవసరమవుతుంది. కానీ పాఠశాలలు, ఉపాధ్యాయుల కొరత కారణంగా నిర్బంధవిద్య అమలు అసాధ్యంగా ఉంది. దేశంలోని వయోజన జనాభాలో మూడింట రెండు వంతుల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు.

సియెరా లియోన్ అంతర్యుద్ధం 1,270 ప్రాథమిక పాఠశాలల నాశనానికి దారితీసింది. 2001 లో పాఠశాల వయస్సు పిల్లలలో 67% మందికి విద్య అందుబాటులో లేదు. అప్పటినుండి ఈ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది, 2001 - 2005 మధ్యకాలంలో ప్రాథమిక పాఠశాల నమోదు రెట్టింపు అయ్యింది. యుధ్ధం ముగిసిన తరువాత చాలా పాఠశాలల పునర్నిర్మాణం జరిగింది. ప్రాథమిక పాఠశాలలలోని విద్యార్థులు సాధారణంగా 6 నుండి 12 ఏళ్ళ వయస్సు వరకు విద్యాభ్యాసం చేస్తారు. మాధ్యమిక పాఠశాలలలో 13 నుంచి 18 వరకు విద్యాభ్యాసం చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలలో ప్రాథమిక విద్య ఉచితమేకాక తప్పనిసరి హాజరు ఉంటుంది.

దేశంలో మూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి: 1827 లో స్థాపించబడిన ఫౌరా బే కాలేజి (పశ్చిమ ఆఫ్రికాలోని పురాతన విశ్వవిద్యాలయం), మాకేని విశ్వవిద్యాలయం (2005 సెప్టెంబరులో ది ఫాతిమా ఇన్స్టిట్యూటుగా స్థాపించబడింది. కళాశాల 2009 ఆగస్టులో విశ్వవిద్యాలయ హోదాను మంజూరు చేసి మాకెని విశ్వవిద్యాలయంగ పేరు మార్చబడింది), నజలా విశ్వవిద్యాలయం. ప్రధానంగా బో జిల్లాలో ఉన్న. నజలా విశ్వవిద్యాలయం 1910 లో జజలా వ్యవసాయ ప్రయోగాత్మక స్టేషనుగా స్థాపించబడి 2005 లో విశ్వవిద్యాలయంగా మారింది. ఉపాధ్యాయుల శిక్షణ కళాశాలలు, మతపరమైన సెమినార్లు దేశం యొక్క అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి.

ఇజ్రాయెలు దాని అంతర్జాతీయ అభివృద్ధి సహకారం కార్యక్రమంలో భాగంగా సియెరా లియోన్ విద్యార్థులకు స్కాలర్షిప్పులను మంజూరు చేసింది.

Health

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A situation map of the Ebola outbreak as of 8 August 2014

సియెరా లియోన్లో ప్రజల సరాసరి ఆయుఃపరిమితి 57.39 సంవత్సరాలు.

జనాభాలో ఎయిడ్సు ప్రాబల్యం 1.6%. ప్రపంచ సగటు కంటే 1% కంటే ఎక్కువ. సబ్ సహారా ఆఫ్రికాలో ఉన్న 6.1% కంటే ఇది తక్కువగా ఉంది.

చాలామంది గ్రామస్తులకు వైద్యులు, ఆసుపత్రులు దూరంగా ఉన్నకారణంగా ఆరోగ్యసంరక్షణ తక్షణమే అందుబాటులో ఉండదు. కొన్ని గ్రామాలలో ఉచితంగా ఆరోగ్య సంరక్షణను అందించినప్పటికీ వైద్య సిబ్బంది వేతనం తక్కువగా చెల్లించబడుతుంది కనుక గ్రామీణులు వారికున్న ఉచిత వైద్య సంరక్షణ హక్కు గురించి తెలియపోవడాన్ని అవకాశంగా మార్చుకుని కొన్నిసార్లు వారి సేవలకు ప్రజల నుండి వసూలు చేస్తారు. . దేశంలో ఈ రకమైన మొదటి డయాలసిసు యంత్రాన్ని ఇజ్రాయెలు దానం చేసింది.

ఓవర్సీసు డెవలప్మెంటు ఇన్స్టిట్యూటు నివేదిక ప్రకారం ఆరోగ్యం కొరకు చేస్తున్న మొత్తం ఖర్చులో 85.7% వ్యక్తిగత ఆరోగ్యం కొరకు వ్యయం చేయబడుతుంది.

అంటువ్యాధులు

సియెరా లియోన్ పసికర్లు, కలరా, లస్సా జ్వరం, మెనింజైటిసు వంటి అంటురోగాల వ్యాప్తికి గురవుతుంది. సియెరా లియోన్లో పసుపు జ్వరం, మలేరియా వంటి అంటువ్యాధులు సాధారణంగా ఉంటాయి.

2014 ఎబోలా వ్యాప్తి

సామాజిక ఆర్థిక అసమానతలు సాధారణంగా ఉండే ఆఫ్రికాలో ఎబోలా ప్రబలమైనది. మద్య ఆఫ్రికా దేశాలు కాంగో, సుడాన్, ఉగాండా, గబాన్ వంటి ప్రజాస్వామ్య రిపబ్లిక్కులలో ఇ.వి.డి. అత్యంత ప్రబలంగా ఉంది.

2014 లో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరసు వ్యాప్తి చెందింది. 2014 అక్టోబరు 19 నాటికి సియారా లియోనులో 3,706 కేసుల నమోదు, 1,259 మంది మరణాలు సంభవించాయి. వీరిలో యబోలాను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ అనారోగ్యానికి గురైన ప్రముఖ వైద్యుడు షేకు ఉమరు ఖాను కూడా ఉన్నాడు. 2014 ఆగస్టు ఆరంభంలోనే గినియా ఎబోలా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రయత్నిస్తూ సియెరా లియోన్ సరిహద్దులను మూసివేసింది. ఎబోలా గినియాలో పుట్టుకొచ్చింది. సియెరా లియోన్ కంటే అధికంగా ఎబోలా కేసులు గినియాలో నమోదయ్యాయి. మానవమరణాలతో ఈ వ్యాధి వ్యాప్తి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపివేసింది. 2014 సెప్టెంబరు నాటికి సరిహద్దులు మూసివేయడం, వైమానిక విమానాలు రద్దు చేయడం, విదేశీ కార్మికుల తరలింపు, సరిహద్దు వాణిజ్యం కూలిపోవటంతో, ఐ.ఎం.ఎఫ్. పరిశీలనలో సియెరా లియోన్, ఇతర ప్రభావిత దేశాల జాతీయ లోటును భర్తీచేయడానికి ఆర్థిక మద్దతును విస్తరించింది.

మానసిక ఆరోగ్యం

సియెరా లియోన్లో మానసిక ఆరోగ్య రక్షణ దాదాపుగా ఉనికిలో లేదు. అనేక మంది బాధితులకు సాంప్రదాయిక వ్యాధి నివారణల నిపుణుల సహాయంతో తమను నయం చేసేందుకు ప్రయత్నిస్తారు. అంతర్యుద్ధం (1991-2002) సమయంలో అనేకమంది సైనికులు దురాక్రమణలలో పాల్గొన్నారు. చాలా మంది పిల్లలు బలవంతంగా పోరాటంలో పాల్గొన్నారు. ఇది మానసికంగా అనారోగ్యబాధితుల సంఖ్య 4,00,000 మంది (2009 నాటికి) చేరుకోవడానికి కారణంగా మారింది. వేలాదిమంది మాజీ బాల సైనికులు తమ జ్ఞాపకాలలో మొద్దుబారేందుకు మత్తుపదార్థలకు బానిసలయ్యరు.

మాతాశిశు ఆరోగ్యరక్షణ

2010 గణాంకాల ఆధారంగా సియారా లియోన్ ప్రపంచంలోని 5 వ అత్యున్నత ప్రసూతి మరణాల రేటును కలిగి ఉంది. ఒక 2013 యూనిసెఫు నివేదిక ప్రకారం సియెరా లియోన్లో మహిళల 88% మహిళలు సత్నా ఆచారానికి గురౌతున్నారు. 2014 నాటికి సియెరా లియోన్ శిశుమరణాలు ప్రపంచంలోని 11 వ స్థానంలో ఉన్నట్లు అంచనా వేయబడింది.

మంచినీటి సరఫరా

సియెరా లియోన్లో నీటి సరఫరా సురక్షితమైన త్రాగునీటి సరఫరా పరిమితంగా ఉంటుంది. ప్రభుత్వం, అనేక ప్రభుత్వేతర సంస్థలు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ 2002 లో సియెరా లియోన్ అంతర్యుద్ధం ముగిసిన తరువాత అందుబాటు మెరుగుపడలేదు. 50% వద్ద నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా సరఫరా క్షీణించింది. 2009 లో చైనా నిధిసహకారంతో ఒరూగ్లో కొత్త ఆనకట్ట నిర్మాణం చేసి నీటి కొరతను తగ్గించాలని భావించారు.

2006 లో నిర్వహించిన ఒక జాతీయ సర్వే ప్రకారం పట్టణ జనాభాలో 84%, గ్రామీణ జనాభాలో 32% మెరుగైన నీటి వనరుకు అందుబాటు కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత బావుల సహకారంతో మంచినీరు అందుబాటులో ఉంది. ఉపరితల నీటివసతులు (50%), అసురక్షిత బావులు (9%), అసురక్షిత సెలయేర్లు (9%) మీద ఆధారపడిన గ్రామీణ జనాభాలో 68% మంది మెరుగైన నీటి వనరులు అందుబాటులో లేవు. పట్టణ జనాభాలో కేవలం 20%, గ్రామీణ జనాభాలోని 1% మంది మాత్రమే తమ ఇంటిలో పైప్ట్ తాగునీటిని పొందారు. 2000 సర్వేలో పట్టణ ప్రాంతాలలో అందుబాటు అధికరించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది తగ్గింది. నిర్వహణా లోపం కారణంగా సౌకర్యాలలో ఆటంకం ఏర్పడింది.

2004 లో లోకలు గవర్నమెంటు ఆక్టులో ఏర్పడిన నూతన వికేంద్రీకరణ విధానానికి రాజధాని వెలుపల ఉన్న ప్రాంతాల్లో నీటి సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వం నుండి స్థానిక కౌన్సిల్సుకు బదిలీ చేయబడింది. ఫ్రీటౌన్లో గుమా వాలీ వాటరు కంపెనీ నీటి సరఫరాకి బాధ్యత వహిస్తుంది.

సంస్కృతి

బహుభార్యాత్వం

2008 గణాంకాల ఆధారంగా సియెరా లియోనీలో 37% మహిళలు బహుభార్యా సంబంధాలతో బంధితులై ఉన్నారు.

ఆహారసంస్కృతి

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Rice farming in Rolako

బియ్యం సియెరా లియోన్ ప్రధాన ఆహారం. రోజువారీ ప్రతి భోజనంలో అన్నం వినియోగిస్తారు. ఈ అన్నం అనేక విధాలుగా తయారు చేస్తారు. బంగాళాదుంప ఆకులు, కాసావా ఆకులు, క్రెయిను క్రెయిను, ఓక్రా సూపు, కాల్చినన చేప, వేరుశెనగ స్ట్యూ వంటి ఆహారాలు సియెరా లియోన్ ప్రజల అభిమాన ఆహారాలుగా ఉన్నాయి.

సియెరా లియోన్లో ఉన్న పట్టణాలు, పట్టణాల వీధులలో తాజా మామిడి, నారింజ, అనాస వంటి పండ్లు, కాల్చిన అరటికాయలు, అల్లం బీరు, కాల్చిన బంగాళాదుంప, కాల్చిన కర్ర పెండెలం (మిరియాలు సాసులతో) వంటి కూరగాయలు, పాప్కార్ను లేదా వేరుశెనగ, రొట్టె, కాల్చిన లేదా చిన్న ముక్కలుగా వేయించిన మొక్కజొన్న, మాంసం లేదా రొయ్యల స్కెర్ల చిన్న సంచులు లభిస్తాయి.

పోయో ఒక ప్రముఖ సియెరా లియోనియా పానీయం. ఇది తియ్యగా, తేలికగా ఉండే పులియబెట్టిన కల్లు వంటిది. దేశంలోని పట్టణాలు, గ్రామాలలో బార్లు కనిపిస్తుంటాయి. పోయో బార్లు రాజకీయాలు, ఫుట్బాలు, బాస్కెట్బాలు, వినోదం, ఇతర అంశాల గురించిన అనధికారిక చర్చా కేంద్రాలుగా ఉంటాయి.

మాధ్యమం

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A radio listener in Kailahun

19 వ శతాబ్దం ప్రారంభంలో సియెరా లియోన్లో మాధ్యమం ప్రింటింగు ప్రెసు (ఆఫ్రికాలో మొట్టమొదటి) ప్రవేశపెట్టడంతో ప్రారంభమైంది. అనేక వార్తాపత్రికలను సృష్టించడంతో ఒక బలమైన స్వేచ్ఛాయుతమైన పాత్రికేయ సంప్రదాయం అభివృద్ధి చేయబడింది. 1860 వ దశకంలో సియెరా లియోన్ ఆఫ్రికాకు ఒక విలేఖరి కేంద్రంగా మారింది. ఈ దేశం నుండి నిపుణులు ఖండం అంతటా ప్రయాణించేవారు. 1930 లలో రేడియో ప్రవేశపెట్టబడడంతో ఇది దేశంలో ప్రధాన సమాచార ప్రసార మాధ్యమంగా మారి 19 వ శతాబ్దం చివరలో పత్రికారగం పరిశ్రమ క్షీణించింది.

1934 లో వలసరాజ్య ప్రభుత్వం సియెరా లియోన్ బ్రాడుక్యాస్టింగు సర్వీసు (ఎస్.ఎల్.బి.ఎస్)ను సృష్టించింది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో మొట్టమొదటి ఆంగ్ల భాషా రేడియో బ్రాడుకాస్టరు సేవగా మారింది. 1978 లో దేశంలోని అన్ని జిల్లాలకు కవరేజును విస్తరించింది. ఈ సేవ 1963 లో టెలివిజను ప్రసారాన్ని ప్రారంభించింది. 2010 ఏప్రెలులో సియెరా లియోన్ బ్రాడుక్యాస్టింగు సర్వీసు, సియెరా లియోన్ యునైటెడు నేషంసు పీసుకీపింగుతో విలీనమై " బ్రాడుకాస్టింగు కార్పొరేషను " ఏర్పాటు చేయబడింది. ఇది ప్రస్తుతం సియెరా లియోన్లో ప్రభుత్వ యాజమాన్య జాతీయ బ్రాడ్కాస్టరుగా ఉంది.

సియెరా లియోన్ రాజ్యాంగం వాక్స్వాతంత్ర్యం, ప్రెసు స్వేచ్ఛను అందిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం మాధ్యమం మీద బలమైన నియంత్రణను నిర్వహిస్తుంది. కొన్నిసార్లు ఈ హక్కులను ఆచరణను నియంత్రిస్తుంది. సమాజం, రాజకీయ ప్రముఖులు కొన్ని విషయాలను నిషేధించాయి. జర్నలిస్టులకు వ్యతిరేకంగా రాజకీయ ప్రముఖులు ఖైదు, హింసను ఉపయోగించారు.

1980 లో చట్టం ఆధారంగా వార్తాపత్రికలు అన్నీ సమాచార మంత్రిత్వ శాఖలో నమోదు చేసి గణనీయ నమోదు రుసుము చెల్లించాలి. మాధ్యమాలలో ప్రచురించబడిన వాటిని నియంత్రించడానికి 1965 లోని సెడిలియసు లిబెలు చట్టంతో " ది క్రిమినల్ లిబెల్ లా" ఉపయోగిస్తారు. 2006 లో అధ్యక్షుడు అహ్మదు టెజను కబ్బా పాత్రికేయులు స్వేచ్ఛగా పనిచేయడానికి అనుకూలంగా పత్రికా యంత్రాంగాన్ని రూపొందించడానికి ప్రెసు, మీడియాలను నియంత్రించే చట్టాలను సంస్కరించడానికి అనుకూలత తెలియజేసాడు. As of 2013 " రిపోర్టర్సు వితౌటు బోర్డర్సు " ప్రెసు ఫ్రీడం ఇండెక్సులోని 179 దేశాలలో సియెరా లియోన్ 61 వ స్థానంలో ఉంది (2012 లో 63 వ స్థానం).

దేశంలో అక్షరాస్యత తక్కువ స్థాయిలో ఉండటం (ప్రత్యేకించి ఫ్రీటౌన్‌) ఇతర ప్రధాన నగరాల వెలుపల, సియెరా లియోన్లో ప్రింటు మాద్యమానికి విసారమైన ఆదరణలేదు. 2007 లో దేశంలో 15 రోజువారీ వార్తాపత్రికలు, మరికొన్ని వార్తాపత్రికలు ప్రచురించబడ్డాయి. వార్తాపత్రికల పాఠకులలో యువకులు రోజువారీ వార్తాపత్రికలను వారాంతాలలో చదువుతుండగా వయోజనులు ప్రతిరోజూ చదువుతున్నారు. ప్రైవేటుగా నడుపబడుతున్న వార్తాపత్రికలు అధికంగా తరచుగా ప్రభుత్వంపై విమర్శలు ప్రచురితమౌతూ ఉన్నాయి. ప్రామాణిక శిక్షణ లేకపోవటం వలన ప్రింటు జర్నలిజాన్ని ప్రజలు రేడియో ప్రసారాలకంటే తక్కువగా విశ్వసిస్తుంటారు.

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
ఇసాట మహోయి టాకింగు స్టూడియో ఫ్రీటౌన్‌లో రేడియో కార్యక్రమాలు సంకలనం చూపించారు; ఆమె కూడా సియెరా లియోన్ రేడియో సోపు ఒపేరా అంటుండా అయేండాలో నటిగా ఉంది

సియెరా లియోన్లో రేడియో అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యంత విశ్వసనీయ మాధ్యమంగా ఉంది. దేశంలో దినసరి రేడియో శ్రోతలు 85% ఉన్నారు. 72% మంది ప్రజలకు రేడియో ఉంది. ఈ స్థాయిలు దేశంలోని ప్రాంతాల మధ్య మారుతూ ఉంటాయి. వెస్ట్రను ఏరియాలో అత్యధిక స్థాయిలు, కైలహును ప్రాంతంలో తక్కువగా ఉంటాయి. స్థానిక వాణిజ్య స్టేషన్లు పరిమిత ప్రసార శ్రేణిని కలిగి ఉంటాయి. జాతీయ కవరేజుతో కొన్ని స్టేషన్లు ఉన్నాయి. - కాపిటలు రేడియో సియెరా లియోన్ వాణిజ్య కేంద్రాలలో అతిపెద్దది.

సియెరా లియోన్లో ఐక్యరాజ్యసమితి మిషను (యూనియోసిలు) దేశంలోని అత్యంత ప్రసిద్ధ రేడియో స్టేషన్లలో ఒకటి. ఇది పలు భాషలలో ప్రసార కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. 2008 లో ఐక్యరాజ్యసమితి మిషను పునర్వ్యవస్థీకరించబడింది. కొత్త సియెరా లియోన్ బ్రాడుకాస్టింగు కార్పొరేషను (ఎస్.ఎల్.బి.సి)ను ఏర్పాటు చేయడానికి ఐక్యరాజ్యసమితి మిషను రేడియో సియెరా లియోన్ బ్రాడుకాస్టింగు కార్పొరేషనుతో విలీనం చేయాలని నిర్ణయించుకుంది. 2011 లో ఈ విలీనానికి అవసరమైన చట్టం అమలుచేసిన తరువాత జరిగింది. రేడియో సియెరా లియోన్ బ్రాడుకాస్టింగు కార్పొరేషను ఎఫ్.ఎం రేడియో ప్రసారాలను అందిస్తుంది. రెండు టెలివిజను సేవలను అందిస్తుంది. వీటిలో ఒకటి అంతర్జాతీయ వినియోగానికి ఉపగ్రహంతో అనుసంధానం చేయబడింది. బి.బి.సి. వరల్డు సర్వీసు (ఫ్రీటౌన్‌, బో, కెన్మా, మాకేనిలో), రేడియో ఫ్రాన్సు ఇంటర్నేషనలు (ఫ్రీ టౌను మాత్రమే), వాయిసు ఆఫ్ అమెరికా (ఫ్రీటౌన్ మాత్రమే) ప్రసారం చేయబడతాయి.

రాజధాని ఫ్రీటౌన్‌, ఇతర ప్రధాన నగరాల వెలుపల చాలామందికి టెలివిజను కార్యక్రమాలు అందుబాటులో లేవు. అయితే బో, కెన్మా, మాకేని ప్రాంతాలలో సియెరా లియోన్ బ్రాడు కాస్టింగు కార్పొరేషను స్వంత ప్రసారసేవలు అందిస్తుంది. సియెరా లియోన్లో మూడు ఉచిత ఎర్తు టెలివిజను స్టేషన్లు ఉన్నాయి, ప్రభుత్వ సియెరా లియోన్ బ్రాడుకాస్టింగు కార్పొరేషను, ఇతర రెండు సంస్థలు ఉన్నాయి. స్టాండర్డు టైమ్సు వార్తాపత్రిక ఎ.వై.వి.- ఆఫ్రికా యంగు వాయిసు యజమాని నిర్వహిస్తున్న ప్రైవేటు స్టేషన్లు ఫ్రీటౌన్‌లో స్టారు టి.వి కార్యక్రమాలు అందిస్తుంది. TV స్టేషన్లు అప్పుడప్పుడూ మతపరమైన నిధులతో పనిచేస్తాయి. లాభదాయకంగా లేని రెండు ఇతర వాణిజ్య టి.వి. ఆపరేటర్లు (ఎ.బి.సి, ఎ.ఐ.టి) మూసివేయబడ్డాయి. 2007 లో దక్షిణాఫ్రికాలోని మల్టిచాయిసు ఆఫ్రికా సబ్-సహారా డిజిటలు ఉపగ్రహ టెలివిజను సర్వీసుతో పాన్-ఆఫ్రికన్ టెలివిజన్ సేవలో భాగంగా జి.టి.వి. ద్వారా పే-పర్-వ్యూ సేవ కూడా ప్రవేశపెట్టబడింది. జి.టి.వి. తరువాత వ్యాపారంలోకి వెళ్ళింది. దేశంలో సబుస్క్రిప్షన్ ఉపగ్రహ టెలివిజను ఏకైక ప్రొవైడరుగా డి.ఎస్.టి.వి.ని వదిలివేసింది. డిజిటలు టెరెస్ట్రియలు చందా టి.వి రుసుముతో సేవలను నిర్వహించేందుకు పలు సంస్థలు అవసరమైన సామర్ధ్యం సిద్ధం చేసుకుంటున్నాయి. మల్టీచాయిసు గో TV తో లైసెన్సు పొందడానికి ముందుగానే మౌలిక సదుపాయాలను నిర్మించి అంతిమంగా లైసెన్సు పొందడానికి విఫలమయ్యాయి. ప్రస్తుతం ఐ.టి.వి, సాట్కాను పనిచేస్తున్నాయి.

సియెరా లియోన్లో ఇంటర్నెట్ సదుపాయం తక్కువగానే ఉంది. కానీ దేశవ్యాప్తంగా 3జి- 4జి సెల్యులారు ఫోను సేవలను ప్రవేశపెట్టినప్పటి నుండి పెరుగుదల ఉంది. దేశంలో అనేక ప్రధాన ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు (ఐ.ఎస్.పి లు) దేశంలో పనిచేస్తున్నాయి. ఫ్రీటౌన్‌లో ఇంటర్నెట్ సదుపాయం అందించే ఇంటర్నెట్ కేఫ్లు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇంటర్నెట్‌కు ప్రాప్యతతో ఎదుర్కొంటున్న సమస్యలు ఫ్రీటౌన్ వెలుపల దేశంలో అప్పుడప్పుడూ విద్యుత్తు సరఫరా, కనెక్షన్లు వేగం అందుకున్నాయి.

కళలు

The arts in Sierra Leone are a mixture of tradition and hybrid African and western styles.

క్రీడలు

సియెరా లియోన్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Sierra Leone National Stadium

సియెరా లియోన్లో ఫుట్ బాలు చాలా ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. సియెరా లియోన్ వీధులలో పిల్లలు, యువకులు, వయోజనులు తరచూ ఫుట్బాలును ప్రదర్శిస్తుంటారు. దేశవ్యాప్తంగా యువకుల, వయోజనుల ఫుట్బాలు టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. సియెరా లియోన్లో పలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు స్వంత ఫుట్ బాలు జట్లను ఏర్పాటు చెసుకుంటూ ఉంటాయి.

లియోన్ స్టార్సు అని పిలువబడే సియెరా లియోన్ జాతీయ ఫుట్బాలు జట్టు అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటుంది. ఇది ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డు కప్పుకు ఎన్నడూ అర్హత సాధించలేనప్పటికీ కానీ 1994 - 1996 లో ఆఫ్రికా కప్పు ఆఫ్ నేషనులో పాల్గొంది. జాతీయ ఫుట్బాలు జట్టు " లియోన్ స్టార్సు " మ్యాచులో పాల్గొన్నసమయాలలో దేశవ్యాప్తంగా సియెరా లెయోనియన్లు జాతీయ జట్టుకు మద్దతుగా సంయుక్తంగా కలిసిపోతారు. ప్రత్యక్ష మ్యాచిని ప్రజలు తమ స్థానిక రేడియోస్టేషన్లకు (విశ్లేషణ వినడానికి), టెలివిజను స్టేషన్లకు (వీక్షించడానికి) తరలి వస్తారు. దేశం జాతీయ టెలివిజను నెట్వర్కు సియెరా లియోన్ బ్రాడ్కాస్టింగు కార్పోరేషను (ఎస్.ఎల్.బి.సి) దేశవ్యాప్తంగా పలు స్థానిక రేడియో స్టేషన్లలో జాతీయ ఫుట్బాలు జట్టు ప్రత్యక్ష మ్యాచును ప్రసారం చేస్తుంది.

లియోన్ స్టార్సు ఒక ముఖ్యమైన మ్యాచు గెలిచినప్పుడు, కౌంటీలోని పలువురు యువకులు ఉత్సాహంగా వేడుక జరుపుకునేందుకు వీధిలలోకి వెళతారు. సియెరా లియోన్ నేషనలు ప్రీమియరు లీగులో శిక్షణ పొందినప్పటికీ పలువురు జాతీయ జట్టు ఫుట్ బాలు ఆటగాళ్ళు ఐరోపా జట్లు కోసం కూడా ఆడతారు. జాతీయ జట్టు ఫుట్ బాలు క్రీడాకారులు చాలామంది సియెరా లియోన్లో ప్రాబల్యత సంతరించుకున్నారు. సియెరా లియోన్ ఇంటర్నేషనలు ఫుట్ బాలు ఆటగాళ్ళలో మొహమ్మదు కల్లోను, మొహమేదు బంగురా, రోడ్నీ స్ట్రాస్సరు, కెయీ కమరా, ఇబ్రహీం తెతే బాంగూరా, ముస్తాపా దుంబూయ, క్రిస్టియను కౌల్కరు, అల్హాసను బంగ్మురా, షెరీఫు సుమా, మొహమ్మదు కమరా, ఉమరు బంగ్యురా, జూలియసు గిబ్రిల్లా వూబే.

సియెరా లియోన్ ఫుట్బాలు అసోసియేషను సియెరా లియోన్ నేషనలు ప్రీమియరు లీగు (సియెరా లియోన్లో అత్యున్నత వృత్తిపరమైన ఫుట్బాలు లీగు)ను నియంత్రించబడుతుంది. సియెరా లియోన్ ప్రీమియర్ లీగు దేశం అంతటా 14 క్లబ్బులను నిర్వహిస్తుంది. ఈస్టు అండు లయన్సు మైటీ బ్లాక్పూలు రెండు అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఫుట్బాల్ క్లబ్లు. " ఈస్టు ఎండ్ లయన్సు, మైటీ బ్లాక్పూలు ఫుట్ బాలు క్లబ్బులు రెండూ శక్తివంతమైన ఫుట్ బాలు క్లబ్బులుగా విజయవంతగా ఉన్నాయి. వారు ఒకరినొకరు ఆడుతున్నప్పుడు ఫ్రీటౌన్లో జాతీయ స్టేడియం టిక్కెట్లు మొత్తం క్రయించబడుతుంటాయి. రెండు క్లబ్బుల మద్దతుదారులు ఆటకు ముందు, తరువాత ఒకరితో ఒకరు ఘర్షణ పడుతుంటారు. ఇద్దరు గొప్ప ప్రత్యర్థుల మధ్య పోటీలో ఘర్షణను నివారించడానికి జాతీయ స్టేడియంలో లోపల, వెలుపల భారీ పోలీసు బలగం మొహరించబడుతుంటారు. అనేక సియెరా లియోనేయా యువకులు స్థానిక ఫుట్బాలు లీగుకు మద్దతు ఇస్తుంటారు.

చాలామంది సియెరా లియోన్ యువకులు, పిల్లలు, పెద్దలు ఐరోపాలో నిర్వహించబడుతున్న ఇంగ్లీషు ప్రీమియరు లీగు, ఇటాలియన్ సీరీ ఏ, స్పానిషు లా లిగా, జర్మన్ బుండెస్లిగా, ఫ్రెంచి లిగ్యు 1 లను అభిమానిస్తుంటారు.. సియెరా లియోన్ క్రికెట్టు జట్టు అంతర్జాతీయ క్రికెట్టు పోటీలలో సియెరా లియోన్ క్రికెట్టు జట్టు ప్రాతినిథ్యం వహిస్తుంది. పశ్చిమ ఆఫ్రికాలో ఇది ఉత్తమమైనదిగా గుర్తించబడుతుంది. ఇది 2002 లో ఇంటర్నేషనల్ క్రికెటు కౌన్సిలు సభ్యత్వం సాధించింది. 2004 లో ఆఫ్రికన్ చాంపియన్షిపులో అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశం పొందింది. అది ఎనిమిది జట్లలో చివరి స్థానంలో నిలిచింది. 2006 లో జరిగిన ఈ టోర్నమెంటులో ప్రపంచ క్రికెటు లీగు ఆఫ్రికా ప్రాంతంలోని మూడు విభాగాలు మొజాంబిక్కు రన్నరు-అప్గా నిలిచింది. డివిజను టూకు ప్రమోషనును స్వల్పతేడాతో కోల్పోయింది.

2009 లో సియెరా లియోన్ అండరు -19 జట్టు ఆఫ్రికా అండరు -19 ఛాంపియన్షిప్పులో (జాంబియాలో) రెండో స్థానంలో నిలిచింది. తద్వారా అండరు -19 ప్రపంచ కప్పు క్వాలిఫైయింగు టోర్నమెంటులో 9 ఇతర జట్లతో అర్హత సాధించింది. అయితే టొరాంటోలో జరిగిన టోర్నమెంటులో ఆడేందుకు ఈ జట్టు కెనడా వీసాలను పొందలేకపోయింది.

సియెరా లియోన్లో బాస్కెట్బాలుకు ప్రజాదరణ అధికంగా లేదు. సియెరా లియోన్ జాతీయ బాస్కెటు బాలు జట్టు అంతర్జాతీయ పురుషుల బాస్కెట్బాలు పోటీలలో సియెరా లియోనుకు ప్రాతినిథ్యం వహిస్తుంది. సియెరా లియోన్ జాతీయ బాస్కెటు బాలు జట్టును సియెరా లియోన్ బాస్కెట్బాలు ఫెడరేషను నియంత్రిస్తుంది.

జాతీయ బాస్కెటు బాలు అసోసియేషను (ఎన్.బి.ఎ) యువతలో కొంతభాగంలో ప్రసిద్ధి చెందింది. ఎన్.బి.ఎ. సూపరు స్టార్సు లెబ్రాను జేమ్సు, కొబు బ్రయంటు, కెవిను డ్యురాంటు వంటి సియెరా లియోన్ క్రీడాకారులు యువకుల అభిమానం చూరగొన్నారు. మాజీ ఎన్.బి.ఎ. స్టార్సు ముఖ్యంగా మైఖేలు జోర్డాను, షకీలు ఓ నీలు, అల్లెను ఐవెర్సను, మాజికు జాన్సను సియెరా లియెనెలో ప్రసిద్ధి చెందారు. దేశంలో అత్యంత ప్రసిద్ధ బాస్కెట్బాలు ఆటగాడు మైఖేలు జోర్డాను సాధారణ జనాభాలో బాగా ప్రాచుర్యం పొందాడు. ప్రస్తుత ఎన్.బి.ఎ. యువక్రీడాకారుడు విక్టరు ఓలాడిపో సియెరా లియోనే సంతతికి చెందినవాడు. అతని తండ్రి సియెరా లియోనుకు చెందినవాడు.

దేశంలో టెన్నిసులో బాగా ప్రాచుర్యం పొందనప్పటికీ అమెరికా క్రీడాకారులు ఫ్రాన్సిసు టియాఫొ సియెరా లియోన్ సంతతికి చెందినవాడు. ఆయన తల్లితండ్రులు అమెరికాకు వలసవెళ్ళారు.

అంతర్జాతీయ ఫ్లోర్బాలు ఫెడరేషన్లో చేరడానికి అర్హత సాధించిన మొట్టమొదటి ఆఫ్రికా దేశం సియెరా లియోన్.

మూలాలు

Tags:

సియెరా లియోన్ పేరు వెనుక చరిత్రసియెరా లియోన్ చరిత్రసియెరా లియోన్ భౌగోళికం, వాతావరణంసియెరా లియోన్ ఆర్ధికంసియెరా లియోన్ గణాంకాలుసియెరా లియోన్ Gender equalityసియెరా లియోన్ విద్యసియెరా లియోన్ Healthసియెరా లియోన్ సంస్కృతిసియెరా లియోన్ మూలాలుసియెరా లియోన్

🔥 Trending searches on Wiki తెలుగు:

నీటి కాలుష్యంఅల్లూరి సీతారామరాజుహస్తప్రయోగంరామసహాయం సురేందర్ రెడ్డిమెదడుఅడాల్ఫ్ హిట్లర్సన్నాఫ్ సత్యమూర్తిపటికగజేంద్ర మోక్షంవినోద్ కాంబ్లీరుక్మిణి (సినిమా)నవరత్నాలుబోడె రామచంద్ర యాదవ్ఆవేశం (1994 సినిమా)ఆరుద్ర నక్షత్రమువందే భారత్ ఎక్స్‌ప్రెస్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంPHస్టాక్ మార్కెట్ఒగ్గు కథకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ఎస్. జానకిమొదటి ప్రపంచ యుద్ధంపుష్యమి నక్షత్రముశ్రీకాకుళం జిల్లానెమలిఓం భీమ్ బుష్టెట్రాడెకేన్తెలుగు సంవత్సరాలుసత్య సాయి బాబాపవన్ కళ్యాణ్వాసుకి (నటి)సంస్కృతంబోయపాటి శ్రీనువంకాయఉమ్మెత్తవేంకటేశ్వరుడునవరసాలుభారత జాతీయ కాంగ్రెస్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపన్ను (ఆర్థిక వ్యవస్థ)రాజనీతి శాస్త్రముతిరుపతిశ్యామశాస్త్రితెలుగు అక్షరాలువాల్మీకిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఉండి శాసనసభ నియోజకవర్గంభారత జాతీయ చిహ్నంభారత సైనిక దళంతెలుగు సాహిత్యంమామిడియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్చే గువేరాఆతుకూరి మొల్లమహేంద్రగిరిజనసేన పార్టీఉదయకిరణ్ (నటుడు)బ్రాహ్మణ గోత్రాల జాబితాపర్యావరణంనవగ్రహాలుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్యతితిథిరామప్ప దేవాలయంఉగాదిలోక్‌సభసంఖ్యపరకాల ప్రభాకర్ఇంద్రుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలునువ్వు నేనురావణుడుసాయిపల్లవిఆవర్తన పట్టికభారత జాతీయ మానవ హక్కుల కమిషన్సుభాష్ చంద్రబోస్🡆 More