ప్రియురాలు పిలిచింది 2000 లో విడుదల అయిన తెలుగు సినిమా.
వి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి, అజిత్, టబు, ఐశ్వర్యరాయ్, అబ్బాస్ నటించారు. ఈ సినిమా 2000 సంవత్సరం విడుదల అయిన తమిళ "కండుకొండైన్ కండుకొండైన్" చిత్రానికి అనువాదం.
ప్రియురాలు పిలిచింది | |
---|---|
దర్శకత్వం | రాజీవ్ మీనన్ |
స్క్రీన్ ప్లే | రాజీవ్ మీనన్ |
దీనిపై ఆధారితం | జేన్ ఆస్టెన్ "సెన్స్ అండ్ సెన్సిబిలిటీ" |
నిర్మాత | ఎ.ఎం రత్నం |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రవి కె. చంద్రన్ |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | ఎ.ఆర్ రెహమాన్ |
నిర్మాణ సంస్థ | వి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2000 మే 5 |
సినిమా నిడివి | 158 నిమిషాల |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒక ఊళ్ళో పెద్ద ఎస్టేట్ యజమానురాలు అయిన పద్మకి ఇద్దరు కూతుళ్లు - సౌమ్య, మీనాక్షి. పెళ్ళి చూపుల్లో సౌమ్యని చూసి వెళ్ళిన అబ్బాయి చనిపోతాడు. అప్పట్నుంచి సౌమ్య నష్టజాతకురాలు అన్న ముద్ర పడుతుంది. ఇక ఏ సంబంధాలూ రాక ఆమెకి వాళ్ళ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటూ, కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంటుంది. మీనాక్షికి కవితలు అంటే పిచ్చి. అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసే అజిత్ ఓ సినిమా షూటింగ్ కోసం లొకేషన్ను వెతుక్కుంటూ సౌమ్య వాళ్ళ ఎస్టేటుకు వస్తాడు. మొదటి చూపులోనే అజిత్ ప్రేమలో పడుతాడు. సౌమ్య కూడా తనని ప్రేమించేట్టుగా ఒప్పించి, అతను మొదటి సినిమా తీసిన తర్వాత పెళ్ళిచేసుకుంటానని చెప్పి వెళ్తాడు. యుద్ధంలో ఒక కాలును కోల్పోయిన మేజర్ (మమ్ముట్టి) మీనాక్షిని ప్రేమిస్తుంటాడు. మీనాక్షి పాటలంటే మమ్ముట్టికి చాలా ఇష్టం. మీనాక్షి అబ్బాస్ ని ప్రేమిస్తుంది. పద్మ వాళ్ళ నాన్న చనిపోతూ ఎస్టేట్ అతని కొడుకు పేరు మీద రాస్తాడు. దానితో పద్మ వాళ్ళు హైదరాబాదుకి వెళ్ళవలసివస్తుంది. సౌమ్య ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా చేరుతుంది. మేజర్ సాయంతో ఓ మ్యూజిక్ కాలేజిలో లెక్చరర్ గా మీనాక్షి చేరుతుంది. అజిత్ అష్టకష్టాలు పడి టాప్ స్టార్ నందినీ వర్మతో సినిమా తీస్తాడు. నందినీ తో అజిత్ వ్యవహారాన్ని నడుపుతున్నాడన్న గాసిప్ లు పత్రికల్లో చూసి సౌమ్య అజిత్ కు దూరంగా ఉండడం మొదలుపెడుతుంది. ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్న అబ్బాస్ నష్టాలపాలై బోర్డు తిప్పేస్తాడు. డిపాజిటర్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న అబ్బాస్ ను, మీనాక్షిని మమ్ముట్టి మళ్ళీ ఒకటి చేస్తాడు. అయితే అప్పులిచ్చేందుకు ముందుకు వచ్చిన ఓ ఎమ్మెల్యే కూతురును అబ్బాస్ పెళ్ళిచేసుకుంటాడు. దీంతో షాక్ తిన్న మీనాక్షి వర్షంలో తడుచుకుంటూ నడిచి వెళ్తూ మ్యాన్ హోల్ లో పడి ఆస్పత్రిపాలవుతుంది. తను గాయని అయ్యేందుకు తోడ్పడమే కాకుండా, ఆస్పత్రిలో తనకు సేవలు చేసిన మమ్ముటినే పెళ్ళి చేసుకుంటుంది. అపార్థాలన్నీ తొలగిపోయాక అజిత్, సౌమ్యలు పెళ్ళి చేసుకుంటారు.
సంఖ్య | శీర్షిక | సాహిత్యం | గాయకుడు(లు) | పొడవు |
---|---|---|---|---|
1. | గంధపు గాలిని | వైరముత్తు | శంకర్ మహదేవన్ | 6:00 |
2. | దోబూచులాటేరా | వైరముత్తు | కె.ఎస్ చిత్ర | 4:49 |
3. | పలికే గోరింకా | వైరముత్తు | సాధనా సర్గం | 4:43 |
4. | తొంగి చూసే | సుబ్రమణ్య భారతి | మహాలక్ష్మి అయ్యర్, హరిహరన్ | 2:21 |
5. | ఏమాయే నా కవిత | వైరముత్తు | కె.ఎస్ చిత్ర | 5:15 |
6. | సమయమే మాగ్నెట్ | వైరముత్తు | దేవన్ ఏకాంబరం, క్లింటన్ చర్చి, డొమినిక్ చర్చి | 5:09 |
This article uses material from the Wikipedia తెలుగు article ప్రియురాలు పిలిచింది, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.