శాతవాహనులు

శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని, కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి సా.శ..పూ.

శాతవాహనులు
శాతవాహనులు
సా.శ..150లో శాతవాహన సామ్రాజ్య విస్తృతి
అధికార భాషలు ప్రాకృతం
సంస్కృతం, భట్టిప్రోలు లిపి (ఆది - తెలుగు)
రాజధానులు కోటిలింగాల, పుణె వద్ద ఉన్న జున్నార్, గుంటూరు సమీపాన కల ధరణికోట/ అమరావతి
ప్రభుత్వం రాచరికం
శాతవాహనులకు ముందు పాలించినవారు మౌర్యులు
శాతవాహనుల తర్వాత పాలించినవారు ఇక్ష్వాకులు, కదంబులు

230 సం. నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు. శాతవానుల తొలి రాజధాని కోటిలింగాల. కాని కొందరు చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని ఆంధ్రప్రదేశ్ లోని ధాన్యకటకం (అమరావతి) అని అభివర్ణిస్తున్నారు వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.

శాతవాహనులు
గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
• మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
• మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
• చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
• ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
• బ్రిటిషు రాజ్యము
• స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
• ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము • 21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు
శాతవాహనులు
అశోకుని ఆరవస్తంభం, ఇసుకరాయిపై బ్రాహ్మీలో చెక్కిన అశోకుని 6వ స్తంభ శాసన శకలం. బ్రిటీషు మ్యూజియం
శాతవాహనులు
వాశిష్టీపుత్ర శాతకర్ణి యొక్క వెండి నాణెం (సా.శ..160).
ముందు: Bust of king. అశోకుని కాలమునాటి బ్రాహ్మీలిపిలో ప్రాకృతం: శిరి శాతకనీస రానో ... వసితిపుతస.
వెనుక: ఎడమవైపు ఉజ్జయినీ/శాతవాహన చిహ్నం. కుడివైపు ఆరు అర్ధచంద్రాకారపు ఆర్చులతో చైత్యగిరి. క్రింది భాగములో నది. తెలుగు బ్రాహ్మీ లిపిలో: అరహనకు వహిత్తి మకనకు తిరు హతకనికో.

మౌర్య వంశ సామంతులుగా రాజకీయజీవితం ప్రారంభించిన శాతవాహనులు సా.శ..పూ 232లో అశోకుని మరణం తర్వాత స్వాతంత్ర్యము ప్రకటించుకొన్నారు. శాతవాహన వంశ మూలాల గురించి అస్పష్టంగా ఉంది. పురాణాల ప్రకారం, ఈ వంశపు తొలి రాజు కణ్వ వంశాన్ని ఓడించాడు. మౌర్యుల తరవాత దక్కనులో విదేశీయుల దండయాత్రలను ఎదుర్కొని శాంతిని స్థాపించారు. మరీ ముఖ్యంగా శకులు, పశ్చిమ సాత్రపులతో వారి యుద్ధాలు దీర్ఘ కాలం పాటు సాగాయి. గౌతమీపుత్ర శాతకర్ణి, అతని కుమారుడూ వాశిష్ఠీ పుత్ర పులుమావి ల కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఉచ్ఛ స్థితికి చేరింది. సా.శ. 3 వ శతాబ్దపు తొలి నాళ్ళకు ఈ సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విచ్ఛిన్నమై పోయింది.

ఆంధ్ర అనే పదప్రస్తావన అల్ బెరూని (సా.శ..1030) వ్రాతలలో కూడా ఉంది. ఈయన దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాష "ఆంధ్రి" అని వ్రాశాడు. ఈయన గ్రంథం కితాబుల్ హింద్ ఆనాటి ఆంధ్రదేశములోని కొన్ని ఆచారవ్యవహారాలను, సంప్రదాయాలను వర్ణిస్తుంది. ఆంధ్రుల మధ్య ఆసియా నుండి తరచు దండయాత్రలు ఎదుర్కొంటూ, శక్తిమంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు, వ్యాపార దక్షత, నావికా కౌశలానికి చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆగ్నేయ ఆసియాలో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం.

శాతవాహనులు, వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి (సా.శ..పూ. 130-158) తో ప్రారంభించి తమ నాణేలపై రాజుల ముఖచిత్రాలు ముద్రించిన తొలి భారతీయ స్థానిక పాలకులుగా భావిస్తారు. ఈ సంప్రదాయం వాయవ్యాన పరిపాలించిన ఇండో-గ్రీకు రాజుల నుండి వచ్చింది. శాతవాహన నాణేలు రాజుల కాలక్రమం, భాష, ముఖ కవళికల (గుంగురు జుట్టు, పెద్ద చెవులు, బలమైన పెదవులు) గురించి అనూహ్యమైన ఆధారాలు పొందు పరుస్తున్నవి. వీరు ప్రధానంగా సీసము, రాగి నాణేలు ముద్రించారు; వీరి ముఖచిత్ర వెండి నాణేలు సాధారణంగా పశ్చిమ క్షాత్రప రాజుల నాణేలపై ముద్రించబడినవి. ఈ నాణేలపై ఏనుగులు, సింహాలు, గుర్రాలు, చైత్య స్తూపాల వంటి అనేక సాంప్రదాయక చిహ్నాలు అలంకరించబడి ఉన్నాయి. వీటిపై "ఉజ్జయిని చిహ్నం", (ఒక + గుర్తులో నాలుగు అంచుల వద్ద నాలుగు వృత్తాలు) కూడా ఉన్నాయి. ఉజ్జయినీ చిహ్నం శాతవాహనుల నాణేలపై ఉండటము వలన ప్రసిద్ధ పౌరాణిక చక్రవర్తి విక్రమాదిత్యుడు శాతవాహన చక్రవర్తి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విక్రమాదిత్యుని పేరు మీదనే విక్రమ శకం ప్రారంభమైంది.

తొలి పాలకులు

శాతవాహనులు 
శాతకర్ణి విడుదల చేసిన తొలి నాణేలు మహారాష్ట్ర - విదర్భ రకం.

క్రీ.పూ 230 ప్రాంతములో శాతవాహనులు స్వతంత్ర రాజులైన తర్వాత, వంశ స్థాపకుడైన శిముక మహారాష్ట్ర, మాల్వా, మధ్య ప్రదేశ్ లోని కొంత భాగాన్ని జయించాడు. ఈయన తర్వాత ఈయన సోదరుడు కన్హ (లేదా కృష్ణ) పాలన చేపట్టి రాజ్యాన్ని పశ్చిమాన, దక్షిణాన మరింత విస్తరింప జేశాడు. కన్హ క్రీ.పూ 207 నుండి క్రీ.పూ 189 వరకు పరిపాలించాడు.

కన్హుని వారసుడైన మొదటి శాతకర్ణి ఉత్తర భారతదేశంలో శుంగ వంశమును ఓడించి, అత్యంత వ్యయంతో అశ్వమేధంతో పాటు అనేక యజ్ఞయాగాలు జరిపించాడు. ఈయన సమయానికి శాతవాహన వంశము సుస్థిరమై, తెలంగాణాలోని కోటలింగాల (కోటిలింగాల) రాజధానిగా తన బలాన్ని దక్షిణభారతదేశమంతా వ్యాపించింది. పురాణాలు ఈ వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా ఇస్తున్నవి. అందులో చాలామంది వాళ్లు ముద్రింప జేసిన నాణేలు, శాసనాల వల్ల కూడా పరిచితులు.

ఆవిర్భావం

శాతవాహనుల పుట్టిన తేదీ, ప్రదేశం, అలాగే రాజవంశం పేరు, అర్థం చరిత్రకారులలో చర్చనీయాంశంగా ఉంది. ఈ చర్చలలో కొన్ని ప్రాంతీయవాదం నేపథ్యంలో జరిగాయి. ఇందుకు విభిన్నంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలు శాతవాహనుల అసలు మాతృభూమిగా పేర్కొనబడ్డాయి.

పేరు వెనుక చరిత్ర

ఒక సిద్ధాంతం ప్రకారం "శాతవాహన" అనే పదం సంస్కృత సప్త-వాహన ప్రాకృత రూపం ("ఏడు వాహనాలు"; హిందూ పురాణాలలో, సూర్య భగవానుడి రథాన్ని ఏడు గుర్రాలు నడిపిస్తాయి). పురాతన భారతదేశంలో సర్వసాధారణంగా, శాతవాహనులు పౌరాణిక సూర్యవంశంతో సంబంధం కలిగి ఉన్నారని ఇది సూచిస్తుంది. ఇంగువ కార్తికేయ శర్మ అభిప్రాయం ప్రకారం, రాజవంశం పేరు సాతా ("పదునుపెట్టింది", "అతి చురుకైనది" లేదా "వేగవంతమైనది"). వాహన ("వాహనం") అనే పదాల నుండి ఉద్భవించింది; వ్యక్తీకరణలో "అతి చురుకైన గుర్రపు స్వారీ చేసేవాడు" అని అర్ధం.

మరొక సిద్ధాంతం వారి పేరును పూర్వపు సత్యపుట రాజవంశంతో కలుపుతుంది. ఇంకొక సిద్ధాంతం వారి పేరును ముండా పదాలు సడం ("గుర్రం"), హర్పాను ("కొడుకు") ల నుండి వచ్చింది, ఇది "గుర్రాన్ని బలి ఇచ్చేవారి కుమారుడు" అని సూచిస్తుంది. రాజవంశంలో అనేక మంది పాలకులకు "శాతకర్ణి" అనే పేరు (బిరుదు)ను ఉంది. శాతవాహన, శాతకర్ణి, శాతకణి, శాలివాహన ఒకే పదానికి ఉన్న వివిధ రూపాలుగా కనిపిస్తాయి. "శాతకర్ణి" అనే పదం ముండా పదాలు సదా ("గుర్రం"), కోన్ ("కొడుకు") నుండి ఉద్భవించిందని దామోదరు ధర్మానందు కొసాంబి సిద్ధాంతీకరించారు.

పురాణాలు శాతవాహనులకు "ఆంధ్ర" అనే పేరును ఉపయోగిస్తాయి. "ఆంధ్ర" అనే పదం రాజవంశం జాతి లేదా భూభాగాన్ని సూచిస్తుంది. (క్రింద అసలు మాతృభూమి చూడండి). ఇది రాజవంశం సొంత రికార్డులలో కనిపించదు.

తమిళ ఇతిహాసం సిలప్పదికారంలో హిమాలయాల్లో చేసిన పోరాటంలో చేర రాజు సెంగుట్టువన్‌కు సహాయం చేసిన "నూరువరు కన్నారు" గురించిన ప్రస్తావన ఉంది. నూర్వరు కన్నారు అనే పదం ప్రత్యక్ష అనువాదం "వంద కర్ణాలు" లేదా "శాతకర్ణి", అందువలన నూరువరు కన్నారే శాతవాహన రాజవంశంగా గుర్తించబడింది.

అసలైన మాతృభూమి

Inscription of king Kanha (100-70 BCE)
Cave No.19 of Satavahana king Kanha at the Nasik Caves, 1st century BCE.
Inscription of king Kanha in cave No.19, Nasik Caves. This is the oldest known Satavahana inscription, circa 100-70 BCE. Brahmi script:
𑀲𑀸𑀤𑀯𑀸𑀳𑀦𑀓𑀼𑀮𑁂 𑀓𑀦𑁆𑀳𑁂𑀭𑀸𑀚𑀺𑀦𑀺 𑀦𑀸𑀲𑀺𑀓𑁂𑀦
𑀲𑀫𑀡𑁂𑀦 𑀫𑀳𑀸𑀫𑀸𑀢𑁂𑀡 𑀮𑁂𑀡 𑀓𑀸𑀭𑀢
Sādavāhanakule Kanhe rājini Nāsikakena Samaṇena mahāmāteṇa leṇa kārita
"Under King Kanha of the Satavahana family this cave has been caused to be made by the officer in charge of the Sramanas at Nasik".

పురాణాలలో "ఆంధ్రా", "ఆంధ్ర-జాతియా" పేర్లను ఉపయోగించడం వల్ల ఈ రాజవంశం తూర్పు దక్కను ప్రాంతంలో (చారిత్రాత్మకంగా ప్రస్తుత ఆంధ్ర ప్రాంతం) ఉద్భవించిందని ఇ.జె రాప్సన్, ఆర్.జి.భండార్కర్ వంటి కొంతమంది పండితులు విశ్వసించారు. (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ). తెలంగాణలోని కోటిలింగాల వద్ద "రానో సిరి చిముకా శాతవాహనస" అనే పురాణ చిహ్నాలు కలిగి ఉన్న నాణేలు కనుగొనబడ్డాయి. ఎపిగ్రాఫిస్టు, నామిస్మాస్టిస్టు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి మొదట్లో చిముకాను రాజవంశం వ్యవస్థాపకుడు సిముకాగా గుర్తించారు. దీని కారణంగా కోటిలింగాలు సిముకాకు నాణేలు దొరికిన ఏకైక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సిముకా వారసులైన కన్హా, మొదటి శాతకర్ణికి కారణమైన నాణేలు కోటిలింగ వద్ద కూడా కనుగొనబడ్డాయి.ఈ ఆవిష్కరణల ఆధారంగా అజయ మిత్రా శాస్త్రి, డి. ఆర్. రెడ్డి, ఎస్. రెడ్డి, శంకరు ఆర్. గోయల్ వంటి చరిత్రకారులు కోటిలింగాల ప్రాంతం శాతవాహనుల అసలు నివాసం అని సిద్ధాంతీకరించారు. కోటిలింగాల వద్ద నాణేలను కనుగొనడం "శాతవాహన రాజకీయ అధికారం అసలు కేంద్రం మనం గుర్తించాల్సిన ప్రాంతానికి స్పష్టమైన కేంద్రం " అని అజయ మిత్రా శాస్త్రి పేర్కొన్నారు." అయితే కోటిలింగాలలో లభించిన నాణెం నమూనాలు చిన్నవిగా ఉన్నాయి. ఈ నాణేలు అక్కడ ముద్రించబడినవా లేదా వేరే చోట నుండి అక్కడకు చేరుకున్నాయా అనేది కచ్చితంగా తెలియదు. అంతేకాకుండా కోటిలింగాలకు చెందిన చిముకాను రాజవంశం వ్యవస్థాపకుడు సిముకాకు చెందినవనే సిద్ధాంతంతో పి. ఎల్. గుప్తా, ఐ. కె. శర్మతో సహా పలువురు పండితులు విభేదించారు. వారు చిముకాను తరువాతి కాలానికి చెందిన పాలకుడిగా గుర్తించారు. పి.వి.పి. శాస్త్రి కూడా తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకుని ఇద్దరు రాజులు భిన్నమైన వారని పేర్కొన్నాడు. కోటిలింగాల అన్వేషణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో స్థాపకుడి నాల్గవ తరానికి చెందిన శాతవాహన యువరాజు శక్తికుమార నాణేన్ని కనుగొన్నట్లు నివేదించబడింది. పురాణాల విషయానికొస్తే, ఈ గ్రంథాలు తరువాతి తేదీలో సంకలనం చేయబడి ఉండవచ్చు. శాతవాహనులను వారి కాలం లోనే ఆంధ్రులుగా పేర్కొన్నారా లేదా అనేది కచ్చితంగా తెలియదు.

శాతవాహనులు 
క్రీ.పూ 70-60 నాటి నానేఘాటు శాసనం. మొదటి శాతకర్ణి పాలనలో

సా.పూ. 700 సమయంలో ఆంధ్ర తెగలు యమునా నదీ తీరానికి సమీపంలో నివసించినట్లు ఆధారాలున్నాయి. ఆపస్తంబ ధర్మసూత్రాల రచయిత అయిన "ఆపస్తంబ", వారికి గురువు. వారు దక్షిణానికి వెళ్లడం మొదలుపెట్టి, తొలుత వింధ్య పర్వతాలకు దక్షిణంగా స్థిరపడ్డారు. వారు రాజ్యాలను స్థాపించారు, అనేక నగరాలను నిర్మించారు. ఈ నగరాలు ప్రస్తుత దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ప్రతిష్టానపురం (ఇప్పటి పైఠాన్) వారి రాజధాని. వారే శాతవాహన రాజులు. చంద్రగుప్త మౌర్యుని పాలనలో మెగస్తనీస్ తన పుస్తకం ఇండికాలో దీనిని వివరించాడు.

శాతవాహనులు పశ్చిమ దక్కను (ప్రస్తుత మహారాష్ట్ర) లో ఉద్భవించారని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రారంభ శాతవాహన కాలం (క్రీ.పూ. 1 వ శతాబ్దం) నుండి ఉన్న నాలుగు శాసనాలను కనుగొన్నారు. నాసిక్ జిల్లాలోని పాండవ్లేని గుహలలోని గుహ నెం .19 వద్ద కన్హా (క్రీ.పూ. 100-70) పాలనలో జారీ చేసిన పురాతన శాతవాహన శాసనాన్ని కనుగొన్నారు. నానేఘాట్ వద్ద దొరికిన ఒక శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య అయిన నయనికా (లేదా నాగనికా) జారీ చేసింది; నానేఘాటు వద్ద కనుగొన్న మరొక శాసనాన్ని పాలియోగ్రాఫిక్ ప్రాతిపదికన అదే కాలానికి చెందినదిగా గుర్తించారు. మహారాష్ట్రకు ఉత్తరాన ఉన్న మధ్యప్రదేశ్ లోని సాంచి వద్ద రెండవ శాతకర్ణి కాలానికి చెందిన శాసనాన్ని కనుగొన్నారు. ఇతర శాతవాహన శాసనాల్లో ఎక్కువ భాగాన్ని పశ్చిమ దక్కనులో కనుగొన్నారు. మరోవైపు, తూర్పు దక్కనులో లభించిన ఎపిగ్రాఫిక్ ఆధారాలలో సా.శ. 4 వ శతాబ్దానికి ముందు శాతవాహనుల గురించిన ప్రస్తావన లేదు.

నెవాసా వద్ద, కన్హాకు చెందినవని భావిస్తున్న ఒక ముద్ర, కొన్ని నాణేలు లభించాయి. శాతకర్ణి Iకి చెందినవని భావిస్తున్న నాణేలు మహారాష్ట్రలోని నాసిక్, నెవాసా, పౌని (తూర్పు దక్కన్, ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని ప్రదేశాలతో పాటు) కూడా లభించాయి. ఈ సాక్ష్యం ఆధారంగా, కొంతమంది చరిత్రకారులు శాతవాహనులు తమ రాజధాని ప్రతిష్ఠానపురం చుట్టుపక్కల ప్రాంతంలో మొదట అధికారంలోకి వచ్చారని, ఆపై తమ భూభాగాన్ని తూర్పు దక్కన్‌కు విస్తరించారని వాదించారు. తొలి శాసనాలు చాలా తక్కువ సంఖ్యలో లభించడాన్ని బట్టి, వారు పశ్చిమ దక్కనుకు చెంది ఉంటారని భావించడం "తాత్కాలికం" మాత్రమేనని కార్లా సినోపోలీ హెచ్చరించింది.

కన్హాకు చెందిన పాండవ్లేని శాశనంలో మహా-మాత్ర అనే పదాన్ని ప్రస్తావించింది. ఇది ప్రారంభ శాతవాహనులు మౌర్య పరిపాలనా నమూనాను అనుసరించారని సూచిస్తుంది. తూర్పు దక్కను (ఆంధ్ర ప్రాంతం) ప్రాంతానికి స్థానికులు అయినందున శాతవాహనులు ఆంధ్రులు అని సి. మార్గబంధు సిద్ధాంతీకరించాడు -వారు మౌర్య సామంతులుగా పనిచేసిన తరువాత పశ్చిమ దక్కనులో తమ సామ్రాజ్యాన్ని మొదట స్థాపించినప్పటికీ. హిమాన్షు ప్రభా రే (1986) ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ, ఆంధ్ర అనేది మొదట ఒక జాతిని సూచించే పదమని, శాతవాహనుల తరువాత చాలాకాలం తరువాత గానీ అది భౌగోళిక ప్రాంతాన్ని సూచించేదిగా మారలేదనీ పేర్కొంది. విద్యా దేహెజియా ప్రకారం. పురాణాల రచయితలు (శాతవాహన కాలం తరువాత వ్రాయబడి ఉండవచ్చు) తూర్పు దక్కనులో శాతవాహనులు ఉండడాన్ని బట్టి వారు ఆ ప్రాంతానికే చెందినవారని తప్పుగా భావించి వారిని "ఆంధ్రుల"ని అని తప్పుగా పేర్కొని ఉంటారని వాదించింది.

పురాణాలు శాతవాహన రాజులను ఆంధ్రభృత్యః అని పిలిచాయి. ఆంధ్ర అనేది ఒక గిరిజన పేరు . ప్రస్తుత తెలుగు భూముల (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల లోని) ప్రాదేశిక పేరు. ఈ ప్రాదేశిక సూచన శాతవాహనుల కాలం ముగిసిన తర్వాత మాత్రమే వాడుకలోకి వచ్చింది, అంటే ఆంధ్ర అనే పదం కేవలం ఆంధ్ర తెగను మాత్రమే సూచిస్తుంది (ఋగ్వేదం ప్రకారం వీరు యమునా నది ఒడ్డున ఉత్తర భారతదేశంలో ఉద్భవించారు). అంతేగానీ, ఇది ప్రస్తుత ఆంధ్ర ప్రాంతాన్ని లేదా తెలుగు ప్రజలను సూచించదు. ఆంధ్రభృత్యులు (ఆంధ్ర సేవకులు) అనే పదం రెండు విషయాలను సూచించవచ్చు -ఒకటి ఆంధ్రులు మౌర్యులు లేదా శుంగులకు సామంతులై ఉండవచ్చు. మరొకటి, కొంతమంది పండితుల ప్రకారం, ఇది ఆంధ్రా పాలకులకు చెందిన కొందరు సేవకులను సూచిస్తుంది.

కొంతమంది పరిశోధకులు ఈ రాజవంశం ప్రస్తుత కర్ణాటకలో ఉద్భవించిందని ప్రారంభంలో కొంతమంది ఆంధ్ర పాలకులకు విధేయత చూపారని సూచిస్తున్నారు. ప్రస్తుత బళ్లారి జిల్లాలోని ప్రాదేశిక విభాగం శాతవాహని-శాతహని (శాతవాహనిహర లేదా శాతహని-రత్తా) శాతవాహన కుటుంబానికి మాతృభూమి అని వి.ఎస్. సుక్తాంకర్ సిద్ధాంతీకరించాడు. తొలి శాతవాహనులకు చెందిన శాసనం ఒక్కటి కూడా బళ్లారి జిల్లాలో లభించలేదని, బళ్లారి జిల్లాలో ఉన్న ఏకైక శాతవాహన శాసనం శాతవాహన చరిత్ర తరువాతి దశకు చెందిన పులుమావిదని సూచిస్తూ డాక్టరు గోపాలాచారి, సుక్తాంకర్ సిద్ధాంతాన్ని సవాలు చేశాడు. కర్ణాటకలోని కనగనహళ్లి గ్రామంలో సా.పూ. మొదటి శతాబ్దం, సా.శ. మొదటి శతాబ్దం మధ్య కాలానికి చెందిన ఒక స్థూపంపై చిముకా (సిముకా), శాతకణి (శాతకర్ణి), ఇతర శాతవాహన పాలకుల చిత్రాలను వర్ణించే సున్నపురాయి ప్యానెళ్ళు ఉన్నాయి.

చరిత్ర

శాతవాహనుల గురించిన సమాచారాన్ని పురాణాలు, కొన్ని బౌద్ధ - జైన గ్రంథాలు, రాజవంశం శాసనాలు, నాణేలు, వాణిజ్యంపై దృష్టి సారించే విదేశీ (గ్రీకు - రోమను) వ్రాతల నుండి సేకరించారు. ఈ మూలాలు అందించిన సమాచారం రాజవంశం సంపూర్ణ చరిత్రను సంపూర్ణ నిశ్చయత్మకంగా పునర్నిర్మించడానికి సరిపోదు. ఫలితంగా శాతవాహన కాలక్రమం గురించి బహుళ సిద్ధాంతాలు ఉన్నాయి.

స్థాపన

శాతవాహనులు 
Early coin of Satakarni I (70-60 BCE). Obverse legend:
(𑀲𑀺𑀭𑀺) 𑀲𑀸శాతవాహనులు శాతవాహనులు 𑀡𑀺(𑀲), (Siri) Sātakaṇi(sa).

నానేఘాటులోని శాతవాహన శాసనంలోని రాయల్సు జాబితాలో సిముకాను మొదటి రాజుగా పేర్కొన్నారు. రాజవంశం మొదటి రాజు 23 సంవత్సరాలు పరిపాలించాడని, అతని పేరును సిషుకా, సింధుకా, చిస్మాకా, షిప్రకా మొదలైనవిగా పేర్కొనాలని వివిధ పురాణాలు చెబుతున్నాయి. వ్రాతప్రతులను తిరిగి తిరిగి కాఫీ చేసిన ఫలితంగా ఇవి సిముకా వికృత రూపబేధం ఏర్పడిందని అని విశ్వసిస్తున్నారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా సిముకా పేరును కూడా నిశ్చయంగా చెప్పలేము. కింది సిద్ధాంతాల ఆధారంగా శాతవాహన పాలన ప్రారంభం క్రీ.పూ. 271 నుండి క్రీ.పూ 30 వరకు నాటిదని భావిస్తున్నారు. పురాణాల ఆధారంగా మొదటి ఆంధ్ర రాజు కన్వా పాలనను పడగొట్టాడు. కొన్ని గ్రంథాలలో ఆయనకు బలిపుచ్చా అని పేరు పెట్టారు.. డి. సి. సిర్కారు ఈ సంఘటనను సి.క్రీ.పూ 30 నాటిదని పేర్కొన్నాడు. ఈ సిద్ధాంతానికి ఇతర పరిశోధకులు మద్దతిచ్చారు.

మత్స్య పురాణం ఆంధ్ర రాజవంశం సుమారు 450 సంవత్సరాలు పరిపాలించినట్లు పేర్కొంది. 3 వ శతాబ్దం ప్రారంభంలో శాతవాహన పాలన ముగిసినందున, వారి పాలన ప్రారంభాన్ని క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. ఇండికా ఆఫ్ మెగాస్టీన్సు (క్రీస్తుపూర్వం 350 - 290) "అండారే" అనే శక్తివంతమైన తెగ గురించి ప్రస్తావించింది. దీని రాజు 1,00,000 పదాతిదళం, 2,000 అశ్వికదళం, 1,000 ఏనుగుల సైన్యాన్ని కొనసాగించాడు. అండారేను ఆంధ్రరాజుగా గుర్తించినట్లయితే ఇది క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నుండి ప్రారంభమయ్యే శాతవాహన పాలనకు అదనపు సాక్ష్యంగా పరిగణించబడుతుంది. బ్రహ్మాండ పురాణం "నాలుగు కాన్వారాజులు 45 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తుంది అని పేర్కొంది. అప్పుడు (అది) తిరిగి ఆంధ్రలకు వెళ్తుంది" అని పేర్కొంది. ఈ ప్రకటన ఆధారంగా ఈ సిద్ధాంత ప్రతిపాదకులు మౌర్య పాలన తరువాత శాతవాహన పాలన ప్రారంభమైందని తరువాత మద్యకాలంలో కన్వాల పాలన సాగిందని ఆ తరువాత శాతవాహన పాలన పునరుజ్జీవనం అని వాదించారు. ఈ సిద్ధాంతంలో ఒక సంస్కరణ ఆధారంగా మౌర్యుల తరువాత సిముకా వచ్చాడు. సిద్ధాంతం వైవిధ్యం ఏమిటంటే కాన్వాసులను పడగొట్టడం ద్వారా శాతవాహన పాలనను పునరుద్ధరించిన వ్యక్తి సిముకా; పురాణాల సంకలనం అతన్ని రాజవంశం స్థాపకుడిగా అయోమయ పెట్టాయి.

శాతవాహన పాలకుడు క్రీ.పూ. మొదటి శతాబ్దంలో ప్రారంభమై సా.శ.. రెండవ శతాబ్దం వరకు కొనసాగారని చాలా మంది ఆధునిక పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ సిద్ధాంతం పురాణ రికార్డులతో పాటు పురావస్తు, ఆధారాలపై ఆధారపడి ఉంది. మునుపటి కాలానికి వారి పాలనను సూచించే సిద్ధాంతం ఇప్పుడు ఎక్కువగా ఖండించబడింది. ఎందుకంటే వివిధ పురాణాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. ఎపిగ్రాఫికు లేదా నామమాత్రపు ఆధారాలకు ఇవి పూర్తిగా మద్దతు ఇవ్వవు.

ఆరంభకాల విస్తరణ

Sanchi donations (50 BCE- 0 CE)
The southern gateway of the Great Stupa at Sanchi was, according to an inscription (see arrow), donated under the rule of "King Satakarni", probably Satakarni II.
The inscription appears on the relief of a stupa at the center of the top architrave, at the rear. It is written in three lines in early Brahmi script over the dome of the stupa in this relief. Dated circa 50 BCE- 0 CE.
Text of the inscription:
𑀭𑀸𑀜𑁄 𑀲𑀺𑀭𑀺 𑀲𑀸𑀢𑀓𑀡𑀺𑀲 / 𑀆𑀯𑁂𑀲𑀡𑀺𑀲 𑀯𑀸𑀲𑀺𑀣𑀻𑀧𑀼𑀢𑀲 / 𑀆𑀦𑀁𑀤𑀲 𑀤𑀸𑀦𑀁
Rāño Siri Sātakaṇisa / āvesaṇisa vāsitḥīputasa / Ānaṁdasa dānaṁ
"Gift of Ananda, the son of Vasithi, the foreman of the artisans of rajan Siri Satakarni"

సిముకా తరువాత అతని సోదరుడు కన్హా (కృష్ణ అని కూడా పిలుస్తారు) పశ్చిమాన నాసికు వరకు రాజ్యాన్నివిస్తరించాడు. ఆయన వారసుడు మొదటి శాతకర్ణి పశ్చిమ మాల్వా, అనుపా (నర్మదా లోయ) విదర్భలను జయించాడు. తరువాత ఆయన ఉత్తర భారతదేశం మీద గ్రీకు దండయాత్రల వల్ల కలిగే గందరగోళాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అశ్వమేధ రాజసూయలతో సహా వేదకాల యాగాలు చేశాడు. బౌద్ధులకు బదులుగా ఆయన బ్రాహ్మణులను పోషించి వారికి గణనీయమైన సంపదను విరాళంగా ఇచ్చాడు. కళింగ రాజు ఖరవేల హతిగుంప శాసనం "శాతకణి" లేదా "శతకమిని" అనే రాజును గురించి ప్రస్తావించింది. వీరిలో కొందరు మొదటి శాతకర్ణిగా గుర్తించారు. ఈ శాసనం ఒక సైన్యాన్ని పంపించడంతో ఖరవేల నగరానికి సంభవించిన ముప్పు గురించి వివరిస్తుంది. ఈ శాసనం పాక్షికంగా మాత్రమే స్పష్టంగా ఉన్నందున వివిధ పరిశోధకులు శాసనంలో వివరించిన సంఘటనలను విభిన్నంగా వివరిస్తారు. ఆర్. డి. బెనర్జీ, సైలేంద్ర నాథు సేన్ అభిప్రాయం ఆధారంగా ఖరవేల శాతకర్ణికి వ్యతిరేకంగా సైన్యాన్ని పంపించాడు. భగవాలు లాల్ అభిప్రాయం ఆధారంగా శాతకర్ణి తన రాజ్యం మీద ఖరవేల దాడి చేయకుండా ఉండాలని కోరుకున్నాడు. అందువల్లన అతను గుర్రాలు, ఏనుగులు, రథాలు, మనుషులను ఖరవేలాకు నివాళిగా పంపించాడు. సుధాకరు చటోపాధ్యాయ అభిప్రాయం ఆధారంగా శాతకర్ణికి వ్యతిరేకంగా ముందుకు సాగడంలో విఫలమైన తరువాత ఖరవేల సైన్యం తన మార్గాన్ని మళ్ళించింది. అలైను డానియోలౌ అభిప్రాయం ఆధారంగా ఖరవేల శాతకర్ణితో స్నేహంగా ఉన్నాడు. ఎటువంటి ఘర్షణలు లేకుండా ఆయన రాజ్యాన్ని దాటాడు.

శాతకర్ణి వారసుడు రెండవ శాతకర్ణి 56 సంవత్సరాలు పాలించాడు. ఈ సమయంలో ఆయన షుంగాల నుండి తూర్పు మాల్వాను స్వాధీనం చేసుకున్నాడు. ఇది సాంచి బౌద్ధ ప్రాంతంలో ప్రవేశించడానికి వీలు కల్పించింది. దీనిలో మౌర్య సామ్రాజ్యం నిర్మించిన స్థూపాలు, షుంగా స్థూపాల చుట్టూ అలంకరించబడిన ద్వారాలను నిర్మించిన ఘనత ఆయనకు దక్కింది. రెండవ శాతకర్ణి సాంచిలోని శాసనం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. అతని తరువాత లంబోదర వచ్చాడు. లంబోదర కుమారుడు, వారసుడు అపిలకా నాణేలు తూర్పు మధ్యప్రదేశులో కనుగొనబడ్డాయి.

సాంచి కళ

శాతవాహనులు సాంచి బౌద్ధ స్థూపం అలంకారంలో పాల్గొన్నారు. ఇది రెండవ శాతకర్ణి రాజు కింద భారీగా మరమ్మతులు చేయబడింది. ద్వారలలో ఒకటైన బ్యాలస్ట్రేడు క్రీ.పూ 70 తరువాత నిర్మించబడింది. ఇవి శాతవాహనులచే నియమించబడినట్లు భావిస్తున్నారు. రెండవ శాతరకర్ణి రాయలు ఆర్కిటెక్టు ఆనంద సృష్టించినది అని దక్షిణ గేట్వే మీద ఒక శాసనం నమోదు చేసింది. శాతవాహన చక్రవర్తి శాతకర్ణి హస్థకళాఖండం " దక్షిణ ద్వారం " అగ్రశ్రేణి చట్రం ఒక బహుమతిగా ఒక శాసనం నమోదు చేస్తుంది:

రాజా సిరి శాతకర్ణి కళాఖండం ఫోర్మాను అయిన వసితి కుమారుడు ఆనంద బహుమతి

Sanchi under the Satavahanas
1st century BCE/CE.
శాతవాహనులు 

నహాపనా నాయకత్వంలో మొదటి పశ్చిమ సాత్రపాల దండయాత్ర

ఒక కుంతల శాతకర్ణి గురించి గుప్త సూచనలు మినహా అపిలకా వారసుల గురించి పెద్దగా తెలియదు. రాజవంశం తరువాతి ప్రసిద్ధ పాలకుడు హేలా మహారాష్ట్ర ప్రాకృతంలో గహా సత్తసాయిని స్వరపరిచాడు. హాలా మాదిరిగా ఆయన నలుగురు వారసులు కూడా చాలా తక్కువ కాలం (మొత్తం 12 సంవత్సరాలు) పరిపాలించారు. ఇది శాతవాహనులకు సమస్యాత్మక సమయాన్ని సూచిస్తుంది.

ఎపిగ్రాఫికు నమిస్మాటికు ఆధారాలు శాతవాహనులు ఇంతకుముందు ఉత్తర దక్కను పీఠభూమి, ఉత్తర కొంకణ తీర మైదానాలను నియంత్రించారని, ఈ రెండు ప్రాంతాలను కలిపే పర్వత మార్గాలను నియంత్రించారని సూచిస్తుంది. 15-40 CE సమయంలో వారి ఉత్తరప్రాంత పొరుగువారు - పశ్చిమ క్షత్రపాలు - ఈ ప్రాంతాలలో వారి ప్రభావాన్ని విస్తరించారు.పాశ్చాత్య క్షత్ర పాలకుడు నహాపన తన రాజప్రతినిధి అల్లుడు రిషభదత్త శాసనాలు ధ్రువీకరించినట్లుగా, మాజీ శాతవాహన భూభాగాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది.

మొదటి పునరుద్ధరణ

శాతవాహనులు 
A coin of Nahapana restruck by the Satavahana king Gautamiputra Satakarni. Nahapana's profile and coin legend are still clearly visible.
శాతవాహనులు 
The defeated "Saka-Yavana-Palhava" (Brahmi script: 𑀲𑀓 𑀬𑀯𑀦 𑀧𑀮𑁆𑀳𑀯) mentioned in the Nasik cave 3 inscription of Queen Gotami Balasiri (end of line 5 of the inscription).
శాతవాహనులు 
Satavahana architecture at Cave No.3 of the Pandavleni Caves in Nashik. This cave was probably started during the reign of Gautamiputra Satakarni, and was finished and dedicated to the Buddhist Samgha during the reign of his son Vasishthiputra Pulumavi, circa 150 CE.

శాతవాహన శక్తిని గౌతమిపుత్ర శాతకర్ణి పునరుద్ధరించాడు. ఆయన శాతవాహన పాలకులలో గొప్పవాడిగా పరిగణించబడ్డాడుచార్లెసు హిగ్హాం తన పాలనను సుమారు 103 –  127 CE. ఎస్. నాగరాజు పాలన 106-130 CE నాటిది. ఆయన ఓడించిన రాజు పశ్చినయ క్షత్ర పాలకుడు నహాపన అని తెలుస్తుంది. గౌతమిపుత్ర పేర్లు, బిరుదులతో నహపన నాణేలు ముద్రించబడ్డాయి.గౌతమిపుత్ర తల్లి గౌతమి బాలాశ్రీ మరణించిన 20 వ సంవత్సరం నాటి నాసికు ప్రశాస్తి శాసనం ఆయన సాధించిన విజయాలను నమోదు చేస్తుంది. శాసనం అత్యంత ఉదారవాద వివరణ ఆధారంగా ఆయన రాజ్యం ఉత్తరాన ఉన్న రాజస్థాను నుండి దక్షిణాన కృష్ణ నది వరకు, పశ్చిమాన సౌరాష్ట్ర నుండి తూర్పున కళింగ వరకు విస్తరించి ఉంది. ఆయన రాజ-రాజ (కింగ్స్ ఆఫ్ కింగ్స్) మహారాజా (గ్రేట్ కింగ్) అనే బిరుదులను స్వీకరించాడు, వింధ్య ప్రభువుగా అభివర్ణించాడు.

అతని పాలన చివరి సంవత్సరాలలో ఆయన పరిపాలన ఆయన తల్లి చేత నిర్వహించబడింది. ఇది అనారోగ్యం లేదా సైనిక పోరాటాల కారణంగా కావచ్చు. ఆయన తల్లి గౌతమి బాలాశ్రీ రూపొందించిన నాసికు శాసనం ఆధారంగా అతనే …

…… క్షత్రియుల అహంకారాన్ని చూర్ణం చేసిన వారు; ఎవరు సకాలు (పశ్చిమ సత్రాపీలు), యవనులు (ఇండో-గ్రీకులు), పహ్లావాలు (ఇండో-పార్థియన్లు), ... ఖఖరత కుటుంబాన్ని (నహాపన క్షారత కుటుంబం) పాతుకుపోయిన వారు; శాతవాహన జాతి కీర్తిని పునరుద్ధరించారు.

నాసికు లోని పాండవ్లేని గుహల గుహ నెం .3 వద్ద రాజమాత గౌతమి బాలాశ్రీ వివరణ.

గౌతమిపుత్ర తరువాత అతని కుమారుడు వసిష్టిపుత్ర శ్రీ పులమావి (లేదా పులుమయి) వచ్చారు. సైలేంద్ర నాథు సేన్ అభిప్రాయం ఆధారంగా పులుమావి సా.శ.. 96–119 నుండి పరిపాలించారు. చార్లెసు హిఘం అభిప్రాయం ఆధారంగా సా.శ.. 110 లో సింహాసనాన్ని అధిష్టించాడు. పెద్ద సంఖ్యలో శాతవాహన శాసనాలలోని పులుమావి చిహ్నాలతో నాణేలు రాజ్యమంతటా పంపిణీ చేయబడ్డాయి. ఆయన గౌతమిపుత్ర భూభాగాన్ని కొనసాగించాడని, రాజ్యాన్ని సుసంపన్నంగా పరిపాలించాడని ఇది సూచిస్తుంది. అతను బళ్లారి ప్రాంతాన్ని శాతకర్ణి రాజ్యంలో చేర్చాడని నమ్ముతారు. కోరమాండలు తీరంలో డబులు మాస్టు ఉన్న నౌకలను కలిగి ఉన్న అతని నాణేలు సముద్ర వాణిజ్యం, నావికా శక్తిలో పాల్గొనడాన్ని సూచిస్తున్నాయి. అమరావతిలో పాత స్థూపం అతని పాలనలో పునరుద్ధరించబడింది.

మొదటి రుద్రదామను నాయకత్వంలో రెండవ సాత్రపాల దండయాత్ర

శాతవాహనులు 
Coin of Vashishtiputra Satakarni.

పులుమావి వారసుడు అతని సోదరుడు వశిష్తిపుత్ర శాతకర్ణి. ఎస్. ఎన్. సేన్ అభిప్రాయం ఆధారంగా ఆయన సా.శ.. 120–149 మద్య కాలంలో పాలించాడు; చార్లెసు హిగ్హాం అభిప్రాయం ఆధారంగా ఆయన రాజ్యపాలన 138–145 CE వరకు విస్తరించింది. మొదటి రుద్రదామను కుమార్తెను వివాహం చేసుకుని ఆయన పశ్చిమ సాత్రపీలతో వివాహ సంబంధాన్ని కుదుర్చుకున్నాడు.

మొదటి రుద్రాదమను జునాగఢు శాసనం ఆయన దక్షిణాపథ (దక్కను) ప్రభువు శాతకర్ణిని రెండుసార్లు ఓడించాడని పేర్కొంది. దగ్గరి సంబంధాల కారణంగా ఆయన ఓడిపోయిన పాలకుడి ప్రాణాలతో విడిచిపెట్టాడని కూడా ఇది పేర్కొంది:

"మంచి నివేదికను పొందిన రుద్రదామను (...), ఆయన రెండుసార్లు న్యాయమైన పోరాటంలో దక్షిణాపాథ ప్రభువు అయిన శాతకర్ణిని పూర్తిగా ఓడించినప్పటికీ వారి దగ్గర సంబంధం కారణంగా అతనిని నాశనం చేయలేదు."

జునాగఢు శాసనం.

డి. ఆర్. భండార్కరు దినేషుచంద్ర సిర్కారు ప్రకారం, రుద్రదామను చేతిలో గౌతమిపుత్ర శాతకర్ణి ఓడిపోయినప్పటికీ, ఓడిపోయిన పాలకుడు ఆయన కుమారుడు వశిష్టపుత్ర పులుమావి అని E. J. రాప్సను విశ్వసించాడు. ఓడిపోయిన పాలకుడు వశిష్టిపుత్ర వారసుడు శివస్కంద లేదా శివశ్రీ పులుమాయి (లేదా పులుమావి) అని శైలేంద్ర నాథు సేన్, చార్లెసు హిఘం విశ్వసించారు.జునాగఢు శాసనం.

తన విజయాల ఫలితంగా, రుద్రాదమను పూహే, నాసికు తీవ్రమైన దక్షిణ భూభాగాలను మినహాయించి గతంలో నహాపన చేతిలో పట్టుబడిన అన్ని పూర్వ భూభాగాలను తిరిగి పొందాడు. శాతవాహన ఆధిపత్యాలు అమరావతి చుట్టూ దక్కను తూర్పు మధ్య భారతదేశంలో వాటి అసలు స్థావరానికి పరిమితం చేయబడ్డాయి.

రెండవ పునరుద్ధరణ

శాతవాహనులు 
Coin of Yajna Sri Satakarni, British Museum.

ప్రధాన శాతవాహన రాజవంశానికి చెందిన చివరి వ్యక్తి శ్రీ యజ్ఞ శాతకర్ణి క్లుప్తంగా శాతవాహన పాలనను పునరుద్ధరించారు. ఎస్. ఎన్. సేన్ అభిప్రాయం ఆధారంగా ఆయన సా.శ.. 170-199 మద్యకాలంలో పాలించాడు. చార్లెసు హిగ్హాం పాలన సా.శ.. 181 నాటిది. ఆయన నాణేలు నౌకల చిత్రాలను కలిగి ఉంటాయి. ఇవి నావికాదళ, సముద్ర వాణిజ్య విజయాన్ని సూచిస్తాయి. అతని నాణేల విస్తృత పంపిణీ, నాసికు, కన్హేరి, గుంటూరులోని శాసనాలు అతని పాలన దక్కను తూర్పు, పశ్చిమ భాగాలలో విస్తరించి ఉన్నాయని సూచిస్తున్నాయి. ఆయన పాశ్చాత్య క్షత్రపాలు కోల్పోయిన భూభాగాన్ని చాలావరకు తిరిగి పొంది వారిని అనుకరిస్తూ వెండి నాణేలను జారీ చేశాడు. ఆయన పాలన చివరి సంవత్సరాలలో అభిరాలు రాజ్యం ఉత్తర భాగాలను, నాసికు ప్రాంతం చుట్టూ స్వాధీనం చేసుకున్నాడు.

పతనం

యజ్ఞ శాతకర్ణి తరువాత బహుశా కేంద్రీయ శక్తి క్షీణించిన కారణంగా రాజవంశం దాని భూస్వామ్యవాదుల అభివృద్ధి ఫలితంగా త్వరగా పతనం అయింది. మరోవైపు పశ్చిమ సాత్రపాలు గుప్త సామ్రాజ్యం ప్రభావంతో అంతరించిపోయే వరకు తరువాత రెండు శతాబ్దాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంన్నాయి. యజ్ఞశ్రీ తరువాత మాధారిపుత్ర స్వామి ఈశ్వరసేన ఆధికారానికి వచ్చాడు. తదుపరి రాజు విజయ 6 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కుమారుడు వశిష్టీపుత్ర శ్రీ చాధశాతకర్ణి 10 సంవత్సరాలు పరిపాలించాడు. ప్రధాన శ్రేణి చివరి రాజు పులుమావి 4 సి. 225 CE. ఆయన పాలనలో నాగార్జునకొండ, అమరావతిలో అనేక బౌద్ధ స్మారక కట్టడాలు నిర్మించబడ్డాయి. మధ్యప్రదేశ్ కూడా అతని రాజ్యంలో భాగంగా ఉంది.

4 వ పులుమావి మరణం తరువాత శాతవాహన సామ్రాజ్యం ఐదు చిన్న రాజ్యాలుగా విభజించబడింది:

  1. ఉత్తర భాగం శాతవాహనుల అనుషంగిక శాఖచే పాలించబడుతుంది (ఇది 4 వ శతాబ్దం ప్రారంభంలో ముగిసింది

)

  1. నాసికు చుట్టూ పశ్చిమ భాగం అభిరాకు పాలనలో ఉంది.
  2. తూర్పు భాగం (కృష్ణ-గుంటూరు ప్రాంతం), ఆంధ్ర ఇక్ష్వాకుల చేత పాలించబడింది.
  3. నైరుతి భాగాలు (ఉత్తర కరనాటక), బనావాసి చుటసు చేత పాలించబడింది.
  4. ఆగ్నేయ భాగాన్ని పల్లవులు పాలించారు.

భూభాగ విస్తరణ

శాతవాహనులు 
Ashoka with his Queens, at Sannati (Kanaganahalli Stupa), 1st-3rd century CE. The inscription "Rāya Asoko" (𑀭𑀸𑀬 𑀅𑀲𑁄𑀓𑁄, "King Ashoka") in Brahmi script is carved on the relief.

ఉత్తర డెక్కను ప్రాంతం శాతవాహన భూభాగంలో ఉంది. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. కొన్ని సమయాలలో వారి పాలన ప్రస్తుత గుజరాతు, కర్ణాటక, మధ్యప్రదేశ్ వరకు కూడా విస్తరించింది. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ జారీ చేసిన నాసికు ప్రశాస్తి శాసనం తన కుమారుడు ఉత్తరాన గుజరాతు నుండి దక్షిణాన ఉత్తర కర్ణాటక వరకు విస్తరించి ఉన్న విస్తృతమైన భూభాగాన్ని పరిపాలించాడని పేర్కొంది. ఈ భూభాగాల మీద గౌతమిపుత్రకు సమర్థవంతమైన నియంత్రణ ఉందా అనేది స్పష్టంగా లేదు. ఏదేమైనా ఈ భూభాగాలపై అతని నియంత్రణ ఎక్కువ కాలం కొనసాగలేదని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.అంతేకాకుండా ఈ రాజ్యం నిరంతరాయంగా లేదు: ఈ ప్రాంతంలలోని చాలా ప్రాంతాలు వేటగాళ్ళు, ఇతర గిరిజన వర్గాల నియంత్రణలో ఉన్నాయి.

శాతవాహన రాజధాని కాలంతో మారుతూనే ఉంది. నాసికు శాసనం గౌతమిపుత్రను బెనకటక ప్రభువుగా అభివర్ణిస్తుంది. ఇది అతని రాజధాని పేరు అని సూచిస్తుంది. టోలెమి (2 వ శతాబ్దం) ప్రతిష్ఠన (ఆధునిక పైథాను)ను పులుమావి రాజధానిగా పేర్కొన్నాడు. ఇతర సమయాలలో శాతవాహన రాజధానులలో అమరావతి (ధరణికోట), జూన్నారు ఉన్నాయి. ఎం. కె. ధవాలికరు అసలు శాతవాహన రాజధాని జూన్నారు వద్ద ఉందని సిద్ధాంతీకరించారు. కాని వాయవ్య దిశ నుండి సాకా-కుషాన చొరబాట్ల కారణంగా ప్రతిష్ఠానకు మార్చవలసి వచ్చింది.

అనేక శాతవాహన-యుగ శాసనాలు మత ఆశ్రమాలకు నిధులను నమోదు చేశాయి. ఈ శాసనాలలో దాతల నివాసాలుగా ఎక్కువగా ప్రస్తావించబడిన స్థావరాలలో సోపారా, కల్యాణి, భారుచా (గుర్తించబడని), చౌలు సముద్ర ఓడరేవులు ఉన్నాయి. ఎక్కువగా పేర్కొన్న లోతట్టు స్థావరాలలో ధెనుకాకట (గుర్తించబడనివి), జూన్నారు, నాసికు, పైథాను, కరాదు ఉన్నాయి.

పశ్చిమ దక్కను లోని ఇతర ముఖ్యమైన శాతవాహన ప్రదేశాలలో గోవర్ధన, నెవాసా, టెరు, వడ్గావు-మాధవ్పూరు ఉన్నారు. తూర్పు దక్కనులో అమరావతి, ధులికట్ట, కోటలింగల, పెద్దాబంకూరు ఉన్నాయి.

నిర్వహణావిధానం

శాతవాహనులు శాస్త్రాలు ఆధారిత విధానాలతో పరిపాలన మార్గదర్శకాలను అనుసరించారు. వారి ప్రభుత్వం మౌర్యపాలన కంటే తక్కువ స్థిరత్వం కలిగి ఉంది. వారి పాలనలో అనేక స్థాయిలలో భూస్వామ్యవాదాలను కలిగి ఉంది:

  • రాజులు, వంశపారంపర్య పాలకులు.
  • రాజులు, చిన్న యువరాజులు తమ పేర్లలో నాణేలు ముద్రించారు.
  • మహారాతీలు, వంశపారంపర్య ప్రభువులు స్వంత పేర్లతో గ్రామాలను మంజూరు చేసారు. రాజకుటుంబ సభ్యులతో పెళ్ళి సంబంధాలు ఏర్పరుచుకున్నారు.
  • మహాసేనపతి (రెండవ పులుమావి పాలనలో పౌరనిర్వహణాధికారి; 4 పులుమావి పాలనలో కింద జనపద ప్రతినిధులు నియమించబడ్డారు)
  • మహాతలవర ("గొప్ప కాపలాదారు")
  • రాజకుమారులు (కుమారాలు) భూభాగాల ప్రతినిధులుగా నియమించబడ్డారు.

శాతవాహన రాజకీయాల అతిపెద్ద భౌగోళిక ఉపవిభాగం " అహారా ". అహారాలను పాలించటానికి నియమించబడిన గవర్నర్ల పేర్లను అనేక శాసనాలు సూచిస్తాయి (ఉదా. గోవర్ధనహర, మామలహర, సతవనిహర, కపురహర). శాతవాహనులు అధికారిక పరిపాలనా, ఆదాయ సేకరణ నిర్మాణ విధానాన్ని నిర్మించడానికి ప్రయత్నించారని ఇది సూచిస్తుంది.

గౌతమిపుత్ర శాతకర్ణి శాసనాలు ఒక పెట్టుబడిదారి విధాన ఉనికిని సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ నిర్మాణం ఎంత స్థిరంగా, ప్రభావవంతంగా ఉందో తెలియదు. ఉదాహరణకు నాసికు గుహ (11) లోని రెండు శాసనాలలో సన్యాసి వర్గాలకు వ్యవసాయ భూమిని విరాళంగా ఇచ్చారని సూచిస్తున్నాయి. సన్యాసులు పన్ను మినహాయింపుతో రాజ అధికారుల జోక్యం లేకుండా తమ సంపదలను అనుభవిస్తారని అవి పేర్కొన్నాయి. మొదటి శాసనం ఆధారంగా ఈ మంజూరును గౌతమిపుత్ర మంత్రి శివగుప్తుడు రాజు ఆదేశాల మేరకు ఆమోదించాడని, "గొప్ప ప్రభువులచే" భద్రపరచబడిందని పేర్కొంది. రెండవ శాసనం గౌతమిపుత్ర తల్లి ఇచ్చిన మంజూరును నమోదు చేస్తుంది. శ్యామకను గోవర్ధన అహారా మంత్రిగా పేర్కొంది. ఈ చార్టరును లోటా అనే మహిళ ఆమోదించినట్లుగా పేర్కొంది. పురావస్తు శాస్త్రవేత్త జేముస్ బర్గెసు వివరణ ఆధారంగా గౌతమిపుత్ర తల్లి ప్రధాన సేవకురాలుగా భావిస్తున్నారు.

శాతవాహన-యుగ శాసనాలు నాగరా (నగరం), నిగామా (మార్కెటు పట్టణం), గామా (గ్రామం) అనే మూడు రకాల స్థావరాలను పేర్కొన్నాయి.

ఆర్థికం

శాతవాహనులు 
Indian ship on lead coin of Vasisthiputra Sri Pulamavi, testimony to the naval, seafaring and trading capabilities of the Satavahanas during the 1st–2nd century CE.

వ్యవసాయం తీవ్రతరం చేయడంతో ఇతర వస్తువుల ఉత్పత్తి అధికరించిన కారణంగా శాతవాహనులు భారత ఉపఖండంలో, వెలుపల వాణిజ్యం వంటి ఆర్థిక విస్తరణలో పాల్గొన్నారు (ప్రయోజనం పొందారు).

శాతవాహనుల కాలంలో సారవంతమైన నదీతీరాల వెంట (ముఖ్యంగా ప్రధాన నదీతీరాల వెంట) బృహత్తరమైన స్థావరాలు స్థాపించబడ్డాయి. అడవుల నిర్మూలన, ఆనకట్టల నిర్మాణం వ్యవసాయ భూముల విస్తీర్ణం అధికరించింది.

శాతవాహన కాలంలో ఖనిజ వనరుల ప్రాంతాలు అత్యుపయోగం అధికరించి ఉండవచ్చు. ఈ ప్రాంతాలలో కొత్త స్థావరాలు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి ప్రాంతాలలో వాణిజ్యం, చేతిపనులను (సిరామికు సామాను వంటివి) సులభతరం చేశాయి. శాతవాహన కాలంలో పెరిగిన చేతిపనుల ఉత్పత్తి కోటలింగల వంటి ప్రదేశాలలో పురావస్తు పరిశోధనల నుండి లభించిన వస్తువులు సాక్ష్యంగా ఉన్నాయి. అలాగే హస్థకళాకారుల గురించి ఎపిగ్రాఫికు సూచనల ఆధారంగా స్పష్టంగా తెలుస్తుంది.

శాతవాహనులు భారత సముద్ర తీరాన్ని నియంత్రించారు, ఫలితంగా, వారు రోమను సామ్రాజ్యంతో పెరుగుతున్న భారతీయ వాణిజ్యాన్ని ఆధిపత్యం చేశారు. ఎరిథ్రేయను సముద్ర పెరిప్లసు రెండు ముఖ్యమైన శాతవాహన వాణిజ్య కేంద్రాల గురించి ప్రస్తావించింది: ప్రతిష్ఠనా, ఠగర. ఇతర ముఖ్యమైన పట్టణ కేంద్రాలలో కొండపూరు, బనవాసి, మాధవపూరు ఉన్నాయి. శాతవాహన రాజధాని ప్రతిష్ఠానాను సముద్రంతో అనుసంధానించే ఒక ముఖ్యమైన ప్రదేశంగా నానాఘాటు ఉంది.

మతం

శాతవాహనులు 
The Pompeii Lakshmi ivory statuette was found in the ruin of Pompeii (destroyed in an eruption of Mount Vesuvius in 79 CE). It is thought to have come from Bhokardan in the Satavahana realm in the first half of the 1st century CE. It testifies to Indo-Roman trade relations in the beginning of our era.

శాతవాహనులు హిందువులుగా బ్రాహ్మణ హోదాను పొందారు, అయినప్పటికీ వారు బౌద్ధ మఠాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. శాతవాహన కాలంలో సామాన్య ప్రజలు సాధారణంగా ఒక నిర్దిష్ట మత సమూహానికి ప్రత్యేకంగా మద్దతు ఇవ్వలేదు.

బౌద్ధ సన్యాసి గుహ గోడల మీద నమోదు చేయబడిన నయనికా నానఘాటు శాసనం,ఆమె భర్త మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, అగ్న్యాధేయ యాగం వంటి అనేక వేదకాల యాగాలను చేశారని పేర్కొంది. ఈ యాగాలకు బ్రాహ్మణ పూజారులకు, హాజరైన వారికి చెల్లించిన గణనీయమైన రుసుమును శాసనం నమోదు చేస్తుంది. ఉదాహరణకు, భాగల-దశరాత్ర యాగం కొరకు 10,001 ఆవులను మంజూరు చేశారు; మరొక యాగం కొరకు 24,400 నాణేలు మంజూరు చేయబడ్డాయి. దీని పేరు స్పష్టంగా లేదు.

గౌతమి బాలాశ్రీ నాసికు శాసనంలో, ఆమె కుమారుడు గౌతమిపుత్ర సతకర్ణిని "ఏకాబన్మాన" అని పేర్కొనబడింది, దీనిని కొందరు " అసమాన బ్రాహ్మణ" అని వ్యాఖ్యానించారు. తద్వారా ఇది బ్రాహ్మణ మూలాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ ఆర్. జి. భండార్కరు ఈ పదాన్ని "బ్రాహ్మణుల ఏకైక రక్షకుడు" అని వ్యాఖ్యానించాడు.

శాతవాహన కాలంలో దక్కను ప్రాంతంలో అనేక బౌద్ధ సన్యాసుల ప్రదేశాలు వెలువడ్డాయి. ఏదేమైనా ఈ మఠాలు, శాతవాహన ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలు స్పష్టంగా లేవు. కన్హా పాలనలో జారీ చేసిన పాండవ్లేని గుహల శాసనం ఈ గుహను శ్రమణుల (వేదయేతర సన్యాసులు) మహా-మత్రా (ఆఫీసర్-ఇన్-ఛార్జ్) ఆధ్వర్యంలో తవ్వినట్లు పేర్కొంది. దీని ఆధారంగా కన్హా బౌద్ధమతం వైపు మొగ్గు చూపారని. బౌద్ధ సన్యాసుల సంక్షేమానికి అంకితమైన పరిపాలనా విభాగాన్ని కలిగి ఉన్నారని సుధాకరు చటోపాధ్యాయ తేల్చిచెప్పారు.

ఏదేమైనా కార్లా ఎం. సినోపోలి, బౌద్ధ మఠాలకు శాతవాహన రాజులు విరాళాలు ఇచ్చినట్లు కొన్ని రికార్డులు ఉన్నప్పటికీ, చాలావరకు విరాళాలు ఇతర ప్రముఖులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాతలలో సర్వసాధారణం వ్యాపారులు చేసినట్లు భావిస్తున్నారు. చాలా మఠాలు ముఖ్యమైన వాణిజ్య మార్గాల్లో ఉన్నాయి.వ్యాపారులు బహుశా మఠాలకు విరాళం ఇచ్చారు. ఎందుకంటే ఈ సైట్లు విశ్రాంతి గృహాలుగా పనిచేస్తూ వాణిజ్యంలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేశాయి. బౌద్ధేతరులకు (ముఖ్యంగా బ్రాహ్మణులకు) చేసిన విరాళాలతో సహా, స్వచ్ఛంద విరాళాలను ప్రదర్శించడానికి ఈ మఠాలు ఒక ముఖ్యమైన వేదికగా కనిపిస్తాయి.

భాష

శాతవాహన శాసనాలు, నాణెం ఇతిహాసాలు " మధ్య ఇండో-ఆర్యను " భాషలో ఉన్నాయి. ఈ భాషను కొంతమంది ఆధునిక పండితులు "ప్రాకృతం" అని పిలుస్తారు. కాని "ప్రాకృత" అనే పదాన్ని విస్తృతంగా నిర్వచించినట్లయితే మాత్రమే ఈ పదజాలం సరైనదిగా పరిగణించబడుతుంది. మధ్య ఇండో-ఆర్యన్ భాష "పూర్తిగా సంస్కృతం కాదు". శాతవాహన రాజు హాలా గురించిన కథనాలున్న గహా సత్తసాయి సంకలనంలో ఉపయోగించిన సాహిత్య ప్రాకృతం కంటే శాసనాల భాష వాస్తవానికి సంస్కృతానికి దగ్గరగా ఉంది. శాతవాహనులు చాలా అరుదుగా రాజకీయ శిలాశాసనాలలో సంస్కృతాన్ని ఉపయోగించారు. నాసికు ప్రషస్తికి దగ్గరగా ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి సంబంధిత ఒక శిలాశాసనం మరణించిన రాజును (బహుశా గౌతమీపుత్ర) వివరించడానికి వసంత-తిలకమిత్రలోని సంస్కృత శ్లోకాలను ఉపయోగిస్తుంది. సన్నాటి వద్ద ఉన్న ఒక సంస్కృత శాసనం గౌతమిపుత్ర శాతకర్ణిని సూచిస్తుంది. వారికి సంబంధించిన ఒకానొక నాణెంలో సంస్కృత పురాణం కూడా ఉంది.శాతవాహనులు ఒక వైపు మధ్య ఇండో-ఆర్యన్ భాషను మరోవైపు ఆది తెలుగు భాషను కలిగి ఉన్న ద్విభాషా నాణేలను కూడా విడుదల చేశారు.

శిలాశాసనాలు

శాతవాహనులు 
Inscription of Gautamiputra Satakarni, Nasik Caves No.3, Inscription No.4. Circa 150 CE.

శాతవాహన కాలం నుండి అనేక బ్రాహ్మి లిపి శాసనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకు వ్యక్తిగతంగా బౌద్ధ సంస్థలకు ఇచ్చిన విరాళాల సంబంధిత వివరాలు మినహా రాజవంశం గురించి ఎక్కువ సమాచారం ఇవ్వవు. శాతవాహన రాజులు జారీ చేసిన ప్రధానంగా మతపరమైన విరాళాలకు సంబంధించిన శాసనాలు కొన్నింటిలో పాలకుల గురించి, సామ్రాజ్య నిర్మాణం గురించి కొంత సమాచారం ఉంటుంది.నాసికు 19 వ గుహలో లభించిన శిలాశాసనం (అన్నింటికంటే పురాతనం) ఈ గుహ కంహా కాలంలో ఉన్న మహామాత్రా సమను (నాసికు) నివాసితమని సూచిస్తుంది.

నానేఘాటు వద్ద, శాతకర్ణి భార్య అయిన నయనికా జారీ చేసిన శాసనం కనుగొనబడింది. ఇది మొదటి నాయనికా వంశాన్ని నమోదు చేస్తుంది. రాజ కుటుంబం చేసిన వేదకాల యాగాలను ప్రస్తావించింది. నానేఘాటులోని మరో శాసనం శాతవాహన రాజుల పేర్లను కలిగి ఉంది. వాటి బేస్-రిలీఫ్ పోర్ట్రెయిట్లపై లేబులుగా కనిపిస్తుంది. చిత్తరువులు ఇప్పుడు పూర్తిగా క్షీణించాయి. కాని శాసనం పాలియోగ్రాఫికు ప్రాతిపదికన నాయనికా శాసనానికి సమకాలీనమని నమ్ముతారు.

తరువాతి పురాతన శాతవాహన-యుగం శాసనం సాంచి వద్ద మొదటి స్థూపం శిల్పకళా గేట్వే మూలకం మీద కనిపిస్తుంది. సిరి శాతకర్ణి శిల్పకారుల ఫోర్మాను కుమారుడు ఆనంద ఈ మూలకాన్ని దానం చేసినట్లు పేర్కొంది. ఈ శాసనం బహుశా రెండవ శాతకర్ణి పాలన కాలానికి చెందినదై ఉంటుందని భావించబడుతుంది.

నాణేలు

Satavahana bilingual coinage in Prakrit and Dravidian (c.150 CE)
Bilingual coinage of Sri Vasishthiputra Pulumavi in Prakrit and Dravidian, and transcription of the obverse Prakrit legend.

Obverse: Portrait of the king. Legend in Prakrit in the Brahmi script (starting at 12 o'clock):
𑀭𑀜𑁄 𑀯𑀸𑀲𑀺𑀣𑀺𑀧𑀼𑀢𑀲 𑀲𑀺𑀭𑀺 𑀧𑀼𑀎𑀼𑀫𑀸𑀯𑀺𑀲
Raño Vāsiṭhiputasa Siri-Puḷumāvisa
"Of King Lord Pulumavi, son of Vasishthi"

Reverse: Ujjain and arched-hill symbols. Legend in Dravidian (close to Telugu and Tamil), and the Dravidian script, essentially similar to the Brahmi script (starting at 12 o'clock):
𑀅𑀭𑀳𑀡𑀓𑀼 𑀯𑀸𑀳𑀺𑀣𑀺 𑀫𑀸𑀓𑀡𑀓𑀼 𑀢𑀺𑀭𑀼 𑀧𑀼𑀮𑀼𑀫𑀸𑀯𑀺𑀓𑀼
Arahaṇaku Vāhitti Mākaṇaku Tiru Pulumāviku
or: Aracanaku Vācitti Makaṇaku Tiru Pulumāviku
"Of King Tiru Pulumavi, son of Vasishthi"

గౌతమిపుత్ర శాతకర్ణి రాజుతో ప్రారంభించి వారి పాలకుల చిత్రాలతో తమ సొంత నాణేలను జారీ చేసిన తొలి భారతీయ పాలకులు శాతవాహనులు. ఆయన ఓడించిన పశ్చిమ క్షత్రపాల నుండి ఈ పద్ధతి తీసుకోబడింది. పశ్చిమ సాత్రపాలు వాయవ్య దిశలో ఇండో-గ్రీకు రాజుల నాణేల లక్షణాలను అనుసరిస్తున్నారు.

దక్కను ప్రాంతంలో శాతవాహన కాలానికి చెందిన సీసం, రాగి, పోటిను లోహాలతో జారీచేసిన వేలాది నాణేలు కనుగొనబడ్డాయి; కొన్ని బంగారు, వెండి నాణేలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నాణేలు ఏకరీతి రూపకల్పన లేదా పరిమాణాన్ని కలిగి ఉండవు. శాతవాహన భూభాగంలో బహుళ సభా స్థానాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇది నాణేల్లో ప్రాంతీయ వ్యత్యాసాలకు దారితీస్తుంది.

శాతవాహనుల నాణాలు అన్ని ప్రాంతాలలో, అన్ని కాలాలలో మినహాయింపు లేకుండా ప్రాకృత మాండలికాన్ని ఉపయోగించాయి. అదనంగా కొన్ని ఒకవైపు ద్రావిడ, మరొకవైపు ప్రాకృత భాషలతో ముద్రించబడిన నాణాలు కూడా ఉన్నాయి. (తమిళ తెలుగు భాషల మాదిరిగానే), ద్రావిడ లిపిలో ఉన్నాయి. (కొన్ని వైవిధ్యాలకు బ్రాహ్మి లిపి మాదిరిగానే).

అనేక నాణేలు బహుళ పాలకుల (ఉదా. శాతవాహన, శాతకర్ణి, పులుమావి) సాధారణమైన శీర్షికలు లేదా మాట్రానింలను కలిగి ఉంటాయి. కాబట్టి నాణేల ద్వారా ధ్రువీకరించబడిన పాలకుల సంఖ్యను కచ్చితంగా నిర్ణయించలేము. 16 - 20 మంది పాలకుల పేర్లు వివిధ నాణేల మీద కనిపిస్తాయి. ఈ పాలకులలో కొందరు శాతవాహన చక్రవర్తుల కంటే స్థానిక ఉన్నతవర్గాలుగా కనిపిస్తారు.

శాతవాహన నాణేలు వాటి కాలక్రమం, భాష, ముఖ లక్షణాలకు (గిరజాల జుట్టు, పొడవాటి చెవులు, బలమైన పెదవులు) ప్రత్యేకమైన సూచనలు ఇస్తాయి. వారు ప్రధానంగా సీసం, రాగి నాణేలను జారీ చేశారు; వారి పోర్ట్రెయిటు తరహా వెండి నాణేలు సాధారణంగా పశ్చిమ క్షత్ర రాజుల నాణేల మీద ముద్రించబడ్డాయి. శాతవాహన నాణేలు ఏనుగులు, సింహాలు, గుర్రాలు, చైత్యాలు (స్థూపాలు) వంటి వివిధ సాంప్రదాయ చిహ్నాలను కూడా ప్రదర్శిస్తాయి. అలాగే "ఉజ్జయిని చిహ్నం", చివర నాలుగు వృత్తాలు కలిగిన శిలువ.

శాతవాహనుల నాణెములు శతసహస్రములు లభించినవి. అందు లేఖనములు కల నాణెములు అనేకము ఉన్నాయి. లేఖనములు అనగా నాణెములను వేయించిన రాజుల పేరుకల వాక్యములు. అవి షష్ఠీవిభక్త్యంతములుగ ఉండును. లేఖనములు కలనాణెములు ఆ పేరిట రాజుయొక్క నాణెమని అర్ధము. వీటిలో శిముక శాతవాహనుని నాణెములు లేఖనములయందు: సాతవాహనస, సతవాహణస, సిరిచిముకసాతవాహన అను పేరుకల నాణెములు ఉన్నాయి. అందు నావాసా వద్ద లభించిన 1810, 4685, 6544, 6863 సంఖ్యగల నాణెములు, మరొకొన్ని హైదరాబాదు, ఔరంగాబాదు,ఓరుగల్లు, కరీంనగర్, కోటిలింగాల వద్ద లభించినాయి. కృష్ణశాతకరి నాణెములు: ఈనాణెముల లేఖనములయందు రాజ్ఞః శ్రీకృష్ణశాతకర్ణి: పేరు ఉంది. ఇవి మహారాష్ట్రలో కల నవాసా, చంద మండలములయందు లభించినవి. శ్రీశాతకర్ణి నాణెములు: సిరిసాతకణిస, సిరిపాతకణస అను లేఖనములు గల అనేకనాణెములు ఉన్నాయి.అవి రాజ్ఞః శ్రీశాతకర్ణ: రాజుయొక్క నాణెములు.ఇవి పశ్చిమ భారత దేశమున లభించిన 5,6,7,171,172,173,174,175,176,177 సంఖ్యల నాణెములు. ఇవి కొండపూర్, నాసిక్, ఉజ్జయిని,త్రిపురి, కథియవాడ్, బాలాపూర్, అమరావతి, చేబ్రోలు, మాచెర్ల, నాగార్జునకొండ మొదలయిన స్థలములలో లభించినవి. నాగనికా శ్రీశాతకర్ణుల వెండినాణెములు: జూన్నార దగ్గర లభించిన వెండినాణెముల మీద ముందువైపు రాజ్ఞః సిరిసాత నాగనికాయ అను లేఖనము ఉంది. ఇది అశ్వమేధయాగ సందర్భములోని నాణెము.ఇవి హైదరాబాదు, ఖమ్మం, నాగార్జునకొండ, బీదర్ మొదలగు ప్రాంతములలో లభించినవి. స్కందశాతకర్ణి నాణెములు: రాజ్ఞ:సిరిఖదసాతకణిస అను లేఖనము కల నాణెములు అలతికలవు.స్కందశాతకర్ణి పులమావి తర్వాతివాడు శివస్కందశాతకర్ని.ఇవి కృష్ణా గోదావరి తీరములయందు లభించినవి. హాలిని నాణెములు: రాజ్ఞ:సిరిసతస, సిరిసదస, సిరిసాతస అను లేఖనములు ఈరాజు పేరుమీద అలతికలవు.1,2 సంఖ్య గల నాణెములు ఉన్నాయి.ఇవి కౌండన్యపురమునందు, మాళవదేశమునందు, ఉజ్జయిని, త్రిపురి, హైదరాబాదు, కృష్ణా గోదావరి తీరములయందు లభించినవి. మాఠరీపుత్ర శివస్వాతిశకసేనుని నాణెములు: మాఠరీపుతస, సకసదస, సకసెనన, శకసేనస్య పేరుగల లేఖనములు నాణెములు లభించినవి. 313, 311, 309, 310, 312 సంఖ్య గల నాణెములు లభించినవి. ఇవి తర్హాళానిధి, అమరావతి, బ్రహ్మపురి, కృష్ణా గోదావరి తీరములయందు లభించినవి.

ఇతర ఉదాహరణలు

సాంస్కృతిక సాధనలు

శాతవాహనులు 
The Great Chaitya in the Karla Caves, Maharashtra, India, c. 120 CE. The Satavahana rulers made grants for its construction.

శాతవాహనులు సంస్కృతానికి బదులుగా ప్రాకృత భాషను పోషించారు. శాతవాహన రాజు హేలా " గహ సత్తాసాయి (దీనిని: గతే సప్తషాత)" (సంస్కృతం: గాధాసప్తశతి), అని పిలిచే మహారాష్ట్ర కవితల సంకలనాన్ని సంకలనం చేయడానికి ప్రసిద్ధి చెందారు. అయితే భాషా ఆధారాల నుండి ఇప్పుడు ఉన్న రచన తరువాతి శతాబ్దం లేదా రెండు సంవత్సరాల్లో తిరిగి సవరించబడిందని తెలుస్తోంది. జీవనోపాధికి వ్యవసాయం ప్రధాన మార్గమని ఈ పుస్తకం ద్వారా స్పష్టమైంది. ఇందులో అనేక రకాల అతీంద్రియవిశ్వాసాలు కూడా ఉన్నాయి. అదనంగా హాలా మంత్రి గుణధ్య బృహత్కథ రచయిత.

శిల్పాలు

మధుకరు కేశవు ధవాలికరు ఇలా వ్రాశాడు, "శాతవాహన శిల్పాలు దాని స్వంత విలక్షణమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు స్వతంత్ర పాఠశాలగా గుర్తించబడలేదు. ప్రారంభంలోనే, శిల్పకళ ప్రారంభాన్ని సూచించే భాజా విహారా గుహలో క్రీ.పూ 200 కాలానికి చెందిన శాతవాహన రాజ్యంలో కళలకు గుర్తుగా ఉంది. ఇది శిల్పాలతో అలంకరించబడి ఉంది. స్తంభాలు కూడా తామరపీఠంతో సింహిక లాంటి పౌరాణిక జంతువుల మకుటంతో నిర్మించబడి ఉంటాయి." చంకమాలో" ఉత్తర పశ్చిమ స్తంభం మీద సంభవించే ప్యానెలు ద్వారం బుద్ధుడి జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనను చిత్రీకరిస్తుంది. ఇరువైపులా రెండు నిచ్చెనలలా కనిపించే శిల్పాలతో బుద్ధుడు నడిచిన విహార ప్రదేశం ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత ఇక్కడ బోధి చెట్టు దగ్గర నాలుగు వారాలు గడిపాడు. వీటిలో మూడవ వారం ఆయన విహార ప్రదేశం (చంకమ) వెంట నడుస్తూ గడిపాడు."

పైన పేర్కొన్న కొన్ని ప్రధాన శాతవాహన శిల్పాలతో పాటు మరికొన్ని శిల్పాలు ఉన్నాయి.-అవి ద్వారపాల, గజలక్ష్మి, శాలభంజికలు, రాజుల ఊరేగింపు, అలంకార స్తంభం మొదలైనవి ఉన్నాయి.

కంచు

శాతవాహనులు 
Royal earrings, Andhra Pradesh, 1st Century BCE.

శాతవాహనులకు కారణమైన అనేక లోహ బొమ్మలు కనుగొనబడ్డాయి. బ్రహ్మపురిలో ప్రత్యేకమైన కంచు వస్తువుల నిల్వ కూడా కనుగొనబడింది. అక్కడ లభించిన స్తువుల గురించి వ్రాయబడిన అనేక వ్యాసాలు భారతీయులే కాక రోమను, ఇటాలియను ప్రభావం కూడా ప్రతిబింబించాయి. వస్తువులు దొరికిన ఇంటి నుండి పోసిడాను చిన్న విగ్రహం, ద్రాక్షాసారాయి పాత్రలు, చిత్రపటాలు, ఆండ్రోమెడ ఫలకం కూడా లభించాయి. అష్మోలియను మ్యూజియంలోని చక్కటి ఏనుగు, బ్రిటిషు మ్యూజియంలోని యక్షి చిత్రం, పోషెరిలో ఛత్రపతి శివాజీ మహారాజు వాస్తు సంగ్రహాలయంలో భద్రపరచబడిన కార్నుకోపియా (అలంకరించిన కొమ్ముబూర). కూడా శాతవాహన కాలానికి చెందినవని భావిస్తున్నారు.

నిర్మాణం

అమరావతి స్థూపం శిల్పాలు శాతవాహన కాలాల నిర్మాణ అభివృద్ధిని సూచిస్తాయి. వారు అమరావతిలో (95 అడుగుల ఎత్తు) బౌద్ధ స్థూపాలను నిర్మించారు. వారు గోలి, జగ్గియాపేట, గంతసాల, అమరావతి భట్టిప్రోలు, శ్రీ పార్వతం వద్ద పెద్ద సంఖ్యలో స్థూపాలను నిర్మించారు. శాతవాహనచే పోషించబడిన 9వ - 10వ గుహలు అజంతా చిత్రాలను కలిగి ఉన్నాయి. వారు గుహల అంతటా చిత్రలేఖనాలతో అలకరించడం ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. అశోకుడి స్థూపాలు విస్తరించబడ్డాయి. అంతకుముందు ఇటుకలు, కలప పనులు రాతి పనులతో భర్తీ చేశారు. ఈ స్మారక కట్టడాలలో అమరావతి, నాగార్జునకొండ స్థూపాలు అత్యంత ప్రసిద్ధమైనవి.

చిత్రలేఖనాలు

భారతదేశంలో చరిత్రపూర్వ రాతి కళను మినహాయించి శాతవాహనుల కాలంనాటికి చెందిన మిగిలి ఉన్న నమూనాలు అజంతా గుహల వద్ద మాత్రమే కనుగొనబడతాయి. అజంతా కళాత్మక కార్యకలాపాలలో రెండు దశలు ఉన్నాయి: శాతవాహన పాలనలో మొదటిది క్రీస్తుపూర్వం 2 నుండి 1 వ శతాబ్దాలకు చెందిన హినాయనా గుహలు తవ్వినప్పుడు; 5 వ శతాబ్దం రెండవ భాగంలో ఒకటకుల ఆధ్వర్యంలో రూపొందించబడినవి. ప్రకృతి వైపరీత్యాలు, కొన్ని విధ్వంసాల కారణంగా అజంతా గుహలు భారీగా నష్టపోయాయి. శాతవాహనులకు సంబంధించిన కొన్ని శకలాలు రెండూ స్థూపంలో ఉన్న చైత్య-గ్రిహాలలోని 9 - 10 గుహలలో మాత్రమే మిగిలి ఉన్నాయి.

అజంతా వద్ద శాతవాహన కాలం నాటి అతి ముఖ్యమైన చిత్రలేఖనం 10వ గుహలోని ఛదంత జాతక, కానీ అది కూడా చిన్నది మాత్రమే. ఇది పౌరాణిక కథకు సంబంధించిన ఆరు దంతాలతోఉన్న బోధిసత్వుని ఏనుగు చిత్రలేఖనం. మగ, ఆడ ఇద్దరి మానవ బొమ్మలు అసలైన శాతవాహనులు, సాంచి ద్వారంలోని వారి ఫిజియోగ్నమీ, దుస్తులు, ఆభరణాలకు సంబంధించి వారి సహచరులతో దాదాపు సమానంగా ఉంటాయి. ఒకే తేడా ఏమిటంటే సాంచి శిల్పాలు వారి బరువులో కొంత భాగాన్ని తగ్గించాయి.

అమరవతి కళలు

శాతవాహన పాలకులు బౌద్ధ కళ, వాస్తుశిల్పానికి చేసిన కృషికి ప్రఖ్యాతిగాంచారు. వారు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వద్ద స్థూపంతో సహా కృష్ణా నది లోయలో గొప్ప స్థూపాలను నిర్మించారు. స్థూపాలను పాలరాయి స్లాబులలో అలంకరించి బుద్ధుని జీవితంలోని దృశ్యాలు చెక్కారు. వీటిని స్లిం, సొగసైన శైలిలో చిత్రీకరించారు. అమరావతి శైలి శిల్పం ఆగ్నేయాసియా శిల్పకళను కూడా ప్రభావితం చేసింది.

పాలకుల జాబితా

శాతవాహన రాజుల కాలక్రమం గురించి బహుళ పురాణాలలో ప్రస్తావించబడింది. ఏదేమైనా రాజవంశంలోని రాజుల సంఖ్య, రాజుల పేర్లు, వారి పాలన కాలం గురించిన వివరణలలో వివిధ పురాణాలలో అసమానతలు ఉన్నాయి. అదనంగా పురాణాలలో జాబితా చేయబడిన కొంతమంది రాజులు పురావస్తు ఆధారాల ద్వారా ధ్రువీకరించబడలేదు. అదేవిధంగా నాణేలు, శాసనాల ఆధారంగా తెలిసిన కొంతమంది రాజులు ఉన్నారు. వీరి పేర్లు పురాణ జాబితాలో లేవు.

శాతవాహన రాజుల పునర్నిర్మాణాలను చరిత్రకారులు రెండు వర్గాలుగా విభజిస్తారు. మొదటిది వర్గం ఆధారంగా 30 శాతవాహన రాజులు సుమారు 450 సంవత్సరాల కాలంలో 30 మంది శాతవాహన రాజులు పరిపాలించారు. మౌర్య సామ్రాజ్యం పతనం అయిన వెంటనే సిముకా పాలనతో శాతవాహన శకం ప్రారంభమైంది. ఈ అభిప్రాయాలను పురాణాలు అధికంగా ధ్రువీకరిస్తున్నాయి. అయినప్పటికీ ఇది ఇప్పుడు అధికంగా ఖండించబడింది. పునర్నిర్మాణాల రెండవ (విస్తృతంగా ఆమోదించబడిన) వర్గం ప్రకారం శాతవాహన పాలన క్రీ.పూ. మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ వర్గంలోని కాలక్రమం రాజులను తక్కువ సంఖ్యలో కలిగి ఉంది. పురాణ రికార్డులను పురావస్తు, వ్రాతపూర్వక ఆధారాలతో మిళితం చేస్తుంది.

శాతవాహన రాజ్యం స్థాపించబడిన తేదీకి సంబంధించి అనిశ్చితి కారణంగా శాతవాహన రాజుల పాలనల గురించి సంపూర్ణ తేదీలు ఇవ్వడం కష్టం. అందువలన చాలా మంది ఆధునిక విద్యావేత్తలు చారిత్రాత్మకంగా ధ్రువీకరించబడిన శాతవాహన రాజుల పాలనలకు సంపూర్ణ తేదీలను కేటాయించరు. కాలనిర్ణయం చేసేవారు ఒకరితో ఒకరు చాలా భిన్నంగా ఉంటారు.

హిమాన్షు ప్రభా రే పురావస్తు ఆధారాల ఆధారంగా ఈ క్రింది కాలక్రమాన్ని అందిస్తుంది:

  • సిముకా (క్రీ.పూ 100 కి ముందు)
  • కన్హా (క్రీ.పూ. 100–70)
  • మొదటి శాతకర్ణి (క్రీ.పూ 70-60)
  • రెండవ శాతకర్ణి (క్రీ.పూ. 50-25)
    • హేలా వాస్సలు శాతవాహన రాజులతో క్షత్రపాలు
  • నహాపన (సా.శ.. 54-100)
  • గౌతమిపుత్ర శాతకర్ణి (సా.శ.. 86–110)
  • పులుమావి (క్రీ.పూ 110–138)
  • వశిష్టీపుత్ర శాతకర్ణి (సా.శ.. 138–145)
  • శివ శ్రీ పులుమావి (సా.శ.. 145–152)
  • శివ స్కంద శాతకర్ణి (సా.శ.. 145–152)
  • యజ్ఞ శ్రీ శాతకర్ణి (152–181 CE)
  • విజయ శాతకర్ణి
    • ఆగ్నేయ దక్కను ప్రాంతీయ పాలకులు:
    • చంద్ర శ్రీ
    • రెండవ పులుమావి.
    • అభిరా ఇస్వసేన
    • మాధారిపుత్ర సకసేన
    • హరితిపుత్ర శాతకర్ణి

పురాణాలలోని జాబితా

వివిధ పురాణాలు శాతవాహన పాలకుల విభిన్న జాబితాల వివరణ ఇస్తాయి. మత్స్య పురాణం 30 ఆంధ్ర రాజులు 460 సంవత్సరాలు పరిపాలించారని పేర్కొంది. అయినప్పటికీ దాని వ్రాతప్రతులలో 19 రాజులు మాత్రమే ఉన్నారు. వారి పాలన 448.5 సంవత్సరాల వరకు రాజులను పేర్కొంది. వాయు పురాణం 30 మంది ఆంధ్ర రాజులు ఉన్నారని పేర్కొంది. కాని దాని వివిధ లిఖిత ప్రతులు వరుసగా 17, 18, 19 రాజులను మాత్రమే పేర్కొని పాలన వరుసగా 272.5, 300, 411 సంవత్సరాలు ఉన్నట్లు పేర్కొన్నది. ఈ రాజులలో చాలామంది చారిత్రక ఆధారాల ద్వారా ధ్రువీకరించబడలేదు. మరోవైపు నామమాత్రపు సాక్ష్యాలతో ధ్రువీకరించబడిన కొంతమంది శాతవాహన రాజులు (రుద్ర శాతకర్ణి వంటివారు) పురాణాలలో అస్సలు ప్రస్తావించబడలేదు.

వివిధ విద్యావేత్తలు ఈ క్రమరాహిత్యాలను వివిధ మార్గాలలో వివరించారు. ఆర్. జి. భండార్కరు, డి. సి. సిర్కారు, హెచ్. సి.రేచౌధురి వాయుపురాణంలో ప్రధాన రాజవంశాల క్రమానుగత జాబితా గురించిన వివరణ మాత్రమే ఇవ్వబడింది. మత్స్యపురాణం రాజులతో వారి కుమారుల గురించిన విచరణ కూడా ఇవ్వబడింది.

వివిధ పురాణాలలో పేర్కొన్న విధంగా ఆంధ్ర రాజుల పేర్లు (IAST లో) క్రింద ఇవ్వబడ్డాయి. ఈ పేర్లు ఒకే పురాణాల వివిధ వ్రాతప్రతులలో మారుతూ ఉంటాయి. కొన్ని వ్రాతప్రతులలో కొన్ని పేర్లు లేవు. ప్రతి పురాణానికి క్రింద ఇవ్వబడిన జాబితాలో చాలా సమగ్రమైన సంస్కరణ ఉంది. పురాణాలలో, కృష్ణ (IAST: Kṛṣṇa) ను కన్వా రాజు సుషర్మానును పడగొట్టిన మొదటి రాజు సోదరుడిగా వర్ణించారు. మిగతా రాజులందరినీ వారి పూర్వీకుల కుమారులుగా అభివర్ణించారు. ఆంధ్ర-భృత్యాల మొదటి రాజును స్కంద పురాణం కుమారి ఖండంలో శూద్రక లేదా సురకా అని కూడా పిలుస్తారు (క్రింద పట్టికలో లేదు).

Puranic genealogy of Andhra dynasty
# పాలకుడు నాణ్యాలు శిలాశాసనాలు భాగవతపురాణం బ్రహ్మాండపురాణం మత్స్యపురణం వాయుపురాణం విష్ణు పాలనాకాలం ప్రత్యామ్నాయ పేర్లు, రాజ్యాలు
1 సిముక 23 సిసుక (మత్స్య), సింధుక (వాయు), సిప్రక (విష్ణు), చిస్మక (బ్రహ్మాండ)
2 క్రస్న (కంహా) 18
3 మొదటి శాతకర్ణి 10 శాతకర్ణ (భాగవత), మల్లకర్ణి-10 -18 సం. (మత్స్య), శ్రీ శాతకర్ణి (విష్ణు)
4 పూర్ణోత్సంగ 18 పూర్ణమాస (భాగవత)
5 స్కందస్తంబి 18 శ్రీవాస్వని ('మత్స్య)
6 రెండవ శాతకర్ణి 56
7 లంబోదర 18
8 అపిలక 12 అపిలక (మత్స్య), ఇవిలక (విష్ణు ), హివిలక (భాగవత)
9 మేఘస్వాతి 18 సౌదశ ('బ్రహ్మాండ)
10 స్వాతి (శాతకర్ణి) 12
11 స్కందస్వాతి 7 స్కందస్వాతి - 28 సం ('బ్రహ్మాండ)
12 మృగేంద్ర-స్వాతికర్న 3 మహేంద్ర శాతకర్ణి ('బ్రహ్మాండ)
13 కుంతల-స్వాతికర్న 8
14 Svātikarṇa 1
15 మొదటి పులోమవి 24 పులోమవి - 36 సం ('మత్స్య), ఆత్మన (భాగవత ), పతిమవి (వాయు ), పతుమతు (విష్ణు), అభి - బ్రహ్మాండ
16 గౌరక్రస్న 25 గోరక్సస్వశ్రీ (మత్స్య), నేమి క్రస్న (వాయు), అరిష్టకర్మను (విష్ణు )
17 హలా 5 హలేయ (భాగవత ); 1 సం (వ్రాతప్రతులలో)
18 మండలక 5 తాలక (భాగవత ), సప్తక (వాయు ), పట్టాలక ('విష్ణు), భావక (బ్రహ్మాండ)
19 పురీంద్రసేన 5 పురీసభీరు (భాగవత), పురికసేన - 21 సం (వాయు), ప్రవిల్లసేన (విష్ణు ), ప్రవిల్లసేన - 12 సం (బ్రహ్మాండ)
20 సుందర శాతకర్ణి 1 సుందర స్వాతికర్న ('మత్స్య ), సునందన (భాగవత)
21 చకోర శాతకర్ణి (చకోర) 0.5
22 శివస్వాతి 28 స్వాతిసేన - 1 సం ('బ్రహ్మాండ), శివస్వామి (వాయు)
23 గౌతమీపుత్ర 21 యంత్రమతి - 34 సం (బ్రహ్మాండ ), గోతమీపుత్ర (భాగవత , విష్ణు ); 24 సం (శిలాశాసనాల ఆధారంగా)
24 రెండవ పులోమవి (వాషిష్టీపుత్ర) 28 పురీమను (భాగవత ), పులోమతు (మత్స్య ), పులిమతు (విష్ణు ). ఇవి చూడండి: వషిష్టీపుత్ర శాతకర్ణి
25 శివశ్రీ 7 మాదసిరా (భాగవత)
26 శివస్కంద శాతకర్ణి 7
27 యఙశ్రీ 29 యఙాశ్రీ శాతకర్ణి - 19 సం (బ్రహ్మాండ ), యఙశ్రీ - 9, 20 లేక 29 సం ('మత్స్య )
28 విజయ 6
29 చంద్రశ్రీ 3 చంద్రవిజయ (భాగవత), దండశ్రీ (బ్రహ్మాండ,వాయు),వాద-శ్రీ లేక చంద్ర-శ్రీ-శాతకర్ణి - 10 సం (మత్స్య )
30 మూడవ పులోమవి 7 సులోమధి (భాగవత), పులోమవితు (మత్స్య ), పులోమర్చిసు (విష్ణు )

పురాణ-ఆధారిత జాబితా

ఎస్.నాగరాజు ఇచ్చిన 30 మంది రాజులు, వారి పాలనా కాలం వివరణ:

  1. సిముకా (మ .క్రీ.పూ 228 - క్రీ.పూ 205)
  2. కృష్ణ (మ .క్రీ.పూ 205 - క్రీ.పూ 187)
  3. 1 వ సాథకార్ని (మ. క్రీ.పూ .187 - క్రీ.పూ.177)
  4. పూర్ణోత్సంగా (r. క్రీ.పూ 177 - క్రీ.పూ 159)
  5. స్కంధస్థంభి (మ .159 - క్రీ.పూ 141)
  6. 2 వ శాతకర్ణి (r. క్రీ.పూ.141 - క్రీ.పూ.85)
  7. లంబోదర (మ.క్రీ.పూ. 85 - క్రీ.పూ.67)
  8. అపిలక (మ .క్రీ.పూ.67 - క్రీ.పూ.55)
  9. మేఘస్వాతి (మ. క్రీ.పూ.55 - క్రీ.పూ.37)
  10. స్వాతి (మ. క్రీ.పూ 37 - క్రీ.పూ 19)
  11. స్కందస్వాతి (మ. క్రీ.పూ.19 - క్రీ.పూ.12)
  12. మృగేంద్ర శాతకర్ణి (మ. సా.శ..12 - సా.శ..9)
  13. కునతల శాతకర్ణి (మ. క్రీ.పూ. 9 - క్రీ.పూ. 1)
  14. 3 వ శాతకర్ణి (r. క్రీ.పూ.1 -సా.శ.. 1)
  15. మొదటి పులుమావి (r. సా.శ.. 1 - సా.శ..36)
  16. గౌర కృష్ణ (మ సా.శ..36 - సా.శ.. 61)
  17. హాలా (r.సా.శ.. 61 - సా.శ..66)
  18. మండలక అకా పుట్టలక లేదా 2 వ పులుమావి(r. సా.శ..69-71)
  19. పురింద్రసేన (r.సా.శ.. 71 - సా.శ.. 76)
  20. సుందర శాతకర్ణి (మ. సా.శ.. 76 - సా.శ.. 77)
  21. చకోర శాతకర్ణి (r. సా.శ.. 77 -సా.శ.. 78)
  22. శివస్వాతి (మ.సా.శ.. 78 - సా.శ..106)
  23. గౌతమిపుత్ర శాతకర్ణి (r.సా.శ.. 106 -సా.శ.. 130)
  24. వసిష్టీపుత్ర అకా పులుమావి III (r. సా.శ.. 130 - సా.శ..158)
  25. శివశ్రీ శాతకర్ణి (మ. సా.శ..158 - సా.శ..165)
  26. శివస్కంద శాతకర్ణి (r.సా.శ.. 165-సా.శ..172)
  27. శ్రీ యజ్ఞ శాతకర్ణి (మ. సా.శ.. 172 - సా.శ..201)
  28. విజయ శాతకర్ణి (r. సా.శ..201 - సా.శ..207)
  29. చంద్ర శ్రీ శాతకర్ణి (మ.సా.శ..207 - సా.శ..214)
  30. 3 వ పులుమావి (r.సా.శ..217 -సా.శ.. 224)

శకులు, యవనులు, పహ్లవులతో ఘర్షణలు

క్రీస్తుశకం తొలి శతాబ్దములో మధ్య ఆసియా నుండి శకులు భారతదేశంపై దండెత్తి పశ్చిమ క్షాత్రప వంశాన్ని స్థాపించారు. హాలుని వెనువెంట రాజ్యానికొచ్చిన నలుగురు వారసులు ఎక్కువ కాలం పరిపాలించలేదు. నలుగురు కలిసి మొత్తం పన్నెండు సంవత్సరాలు పాలించారు. ఈ కాలములో శాతవాహనులు మాళవతో సహా తమ రాజ్యములోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ క్షాత్రపులకు కోల్పోయారు.

శాతవాహనులు 
గ్రీకు శాసనముతో భారతీయ యక్షుడు, అమరావతి, సా.శ..3వ శతాబ్దం

ఆ తర్వాత కాలములో గౌతమీపుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) (పా. 78-106 CE) పశ్చిమ క్షాత్రప పాలకుడు, నహపాణను ఓడించి, శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకొని వంశ ప్రతిష్ఠను పునరుద్ధరించాడు. ఈయన గొప్ప హిందూమతాభిమాని. శాలివాహనుడు తన శాసనములలో "శకులు (పశ్చిమ క్షాత్రప), యవనులు (ఇండో-గ్రీకులు), పల్లవులు (ఇండో-పార్థియన్లు) యొక్క నాశకుడు" అన్న బిరుదు స్వీకరించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి 78లో శక చక్రవర్తి విక్రమాదిత్యను ఓడించి శాలివాహన యుగం లేదా శక యుగానికి నాందిపలికాడు. శాలివాహన యుగాన్ని నేటికీ మరాఠీ ప్రజలు, దక్షిణ భారతీయులు పాటిస్తున్నారు. మహారాష్ట్రలో నేటికీ ప్రజల హృదయాలలో, మరొక గొప్ప మరాఠా యోధుడు శివాజీ చక్రవర్తితో పాటు గౌతమీపుత్ర శాతకర్ణికి ప్రత్యేక స్థానం ఉంది.

గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఆయన కుమారుడు వాసిష్టీపుత్ర పులోమావి (పా. 106-130) సింహాననాన్ని అధిష్టించాడు. ఈయన ముఖచిత్ర సహిత నాణేలు ముద్రింపజేసిన తొలి శాతవాహన చక్రవర్తి. ఈయన సోదరుడు వాసిష్టీపుత్ర శాత , పశ్చిమ క్షత్రాప వంశానికి చెందిన మొదటి రుద్రవర్మ యొక్క కుమార్తెను పెళ్ళిచేసుకున్నాడు. అయితే స్వయంగా తన మామ చేతిలో యుద్ధరంగాన ఓడిపోయి శాతవాహనుల ప్రతిష్ఠకు, బలానికి తీరని నష్టం కలుగజేశాడు.

అప్పటి నుండి శ్రీయజ్ఞ శాతకర్ణి (170-199 CE) రాజ్యానికి వచ్చేవరకు శాతవాహనుల పరిస్థితి పెద్దగా మారలేదు. శ్రీయజ్ఞ శాతకర్ణి శకులపై తీవ్ర పోరాటము సాగించి శాతవాహనులు కోల్పోయిన భూభాగాన్ని కొంతవరకు తిరిగి పొందాడు.

సాంస్కృతిక అభివృద్ధి

శాతవాహనులు 
బుద్ధుని పై మరుని దాడి - విగ్రహ రూపము, సా.శ..2వ శతాబ్దం

శాతవాహన చక్రవర్తులలో హాలుడు (పా. 20-24), మహారాష్ట్రీ ప్రాకృత కావ్య సంగ్రహం గాహా సత్తసయి (సంస్కృతం: గాథా సప్తశతి) కి గాను ప్రసిద్ధి చెందాడు. అయితే భాషాపరిశీలన ఆధారాల వలన, ఇప్పుడు లభ్యమవుతున్న ప్రతి ఆ తరువాత ఒకటీ రెండు శతాబ్దాలలో తిరగరాయబడినది అని ఋజువైనది.

శాతవాహన సామ్రాజ్యం మరాఠీ భాషకు మూల భాష అయిన మహారాష్ట్రీ ప్రాకృత భాష యొక్క అభివృద్ధికి దోహదం చేసింది. శాతవాహన చక్రవర్తులలో కెల్లా గొప్పవాడైన శాలివాహనుడు (గౌతమీపుత్ర శాతకర్ణి) ప్రతిష్ఠానపురం (ఇప్పటి పైఠాన్) యొక్క సాంస్కృతిక అభివృద్ధికి కృషిచేశాడని భావిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పైఠానీ చీర శాతవాహన కాలములోనే అభివృద్ధి చెందినది.

శాతవాహనులు ఆనాటి కళలను, కట్టడాలను ప్రోత్సహించారు. వారు కట్టించిన కట్టాడాలు, స్థూపాలు నేటికీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో చూడవచ్చు. అమరావతి లోని బౌద్ధ స్థూపం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ స్థూపాలలో ఉపయోగించిన చలువరాతి కట్టడాలు, గౌతమ బుద్ధుని శిల్పాలు వారి కళాతృష్ణకు, ఆనాటి పరిస్థితులకు అద్దం పడతాయి. శాతవాహనులు ఆగ్నేయ ఆసియాను ఒక తాటి క్రిందకు తేవడంలో సఫలం అయ్యారు. మహాయాన బౌద్ధం ఆంధ్ర నుంచి ఆగ్నేయ ఆసియాకు వ్యాప్తి చెందడానికి వీరి నౌకాయానం, వీరు చేసిన వర్తక వాణిజ్యాలు ఎంతో దోహదం చేశాయి. ఆంధ్ర శిల్పకళ వీరి ద్వారా ఆగ్నేయ ఆసియాలో కూడా వ్యాప్తి చెందింది.

ఈకాలం కవులు

  1. గుణాడ్యుడు (తెలంగాణ తొలి లిఖిత కవి)
  2. హాలుడు (శాతవాహన 17వ రాజు (కవివత్సలుడు) - గాథాసప్తశతి)

క్షీణదశ

శాతవాహనులు 
గౌతమీపుత్ర యజ్ఞ శాతకర్ణి యొక్క నాణెం (పా. 167-196).

శాతవాహనులు తమ శత్రువులను విజయవంతముగా అడ్డుకున్నా, తరచూ జరిగిన సాయుధ ఘర్షణలు, సామంతుల విజృంభణతో చివరకు వంశం క్షీణించింది. రమారమి 220 సం.లో శాతవాహనుల శకం అంతరించింది.

ఆయా రాజవంశాలు శాతవాహనుల ఆధీనములో ఉన్న ప్రాంతాలను తమలో తాము పంచుకున్నాయి.

  • రాజ్యం యొక్క వాయవ్య భాగాన్ని యాదవులు ఆక్రమించి ప్రతిష్ఠానపురం రాజధానిగా శాతవాహనుల తరువాత పాలన సాగించారు.
  • దక్షిణ మహారాష్ట్రలో రాష్ట్రకూటులు
  • ఉత్తర కర్ణాటకలో వనవాసికి చెందిన కాదంబులు.
  • కృష్ణా-గుంటూరు ప్రాంతంలో ఇక్ష్వాకులు (లేదా శ్రీపర్వతీయులు).

శాతవాహన పరిపాలనానంతర సమయములో చిన్న చిన్న రాజ్యాలు వెలిశాయి. వారిలో పేరొందిన రాజులు పల్లవులు. వీరు కాంచీపురం రాజధానిగా పరిపాలన గావించారు. వీరి మొదటి రాజు సింహవర్మ (సా.శ.. 275-300).

శాతవాహన రాజుల పౌరాణిక జాబితా

మత్స్య పురాణం పై ఆధారితమైన ఈ 30 రాజుల జాబితా సమగ్రమైనది.

  • శిముక లేక శిశుక (పా. క్రీ.పూ.230-207). మరియ (271-248 క్రీ.పూ), పరిపాలన 23 సం.
  • కృష్ణ (పా. 207-189 బిసిఈ), పరిపాలన 18 సం.
  • శ్రీ మల్లకర్ణి (లేక శ్రీ శాతకర్ణి), పరిపాలన 10 సం.
  • పూర్నోత్సంగుడు, పరిపాలన 18 సం.
  • స్కంధస్తంభి, పరిపాలన 18 సం.
  • శాతకర్ణి (క్రీ.పూ.195), పరిపాలన 56 సం.
  • లంబోదర, పరిపాలన 18 సం. (పా. క్రీ.పూ.87-67)

బహుశా కణ్వ వంశ సామంతులుగా (క్రీ.పూ. 75-35) :

  • అపీలక, పరిపాలన 12 సం.
  • మేఘస్వాతి (లేక సౌదస), పరిపాలన 18 సం.
  • స్వాతి (లేక స్వమి), పరిపాలన 18 సం.
  • స్కందస్వాతి, పరిపాలన 7 సం.
  • మహేంద్ర శాతకర్ణి (లేక మృగేంద్ర స్వాతికర్ణ, రెండవ శాతకర్ణి), పరిపాలన 8 సం.
  • కుంతల శాతకర్ణి (లేక కుంతల స్వాతికర్ణ), పరిపాలన 8 సం.
  • స్వాతికర్ణ, పరిపాలన 1 సం.
  • పులోమావి (లేక పాటుమావి), పరిపాలన 36 సం.
  • రిక్తవర్ణ (లేక అరిస్టకర్మ), పరిపాలన 25 సం.
  • హాల (20-24 సిఈ), పరిపాలన 5 సం. గాథా సప్తశతి అనే కావ్యాన్ని రచించాడు.
  • మండలక (లేక భావక, పుట్టలక), పరిపాలన 5 సం.
  • పురీంద్రసేన, పరిపాలన 5 సం.
  • సుందర శాతకర్ణి, పరిపాలన 1 సం.
  • కరోక శాతకర్ణి (లేక కరోక స్వాతికర్ణ), పరిపాలన 6 సం.
  • శివస్వాతి, పరిపాలన 28 సం.
  • గౌతమీపుత్ర శాతకర్ణి, లేక గౌతమీపుత్ర, శాలివాహనుడిగా ప్రసిద్ధి చెందాడు (పా. 25-78 సిఈ), పరిపాలన 21 సం.
  • వశిష్టపుత్ర శ్రీపులమావి, లేక పులోమ, పులిమన్ (పా. 78-114 సిఈ), పరిపాలన 28 సం.
  • శివశ్రీ శాతకర్ణి (పా. 130-160), లేక శివశ్రీ పరిపాలన 7 సం.
  • శివస్కంద శాతకర్ణి, (157-159), పరిపాలన 7 సం.
  • యజ్ఞశ్రీ శాతకర్ణి, (పా. 167-196 సిఈ), పరిపాలన 29 సం.
  • విజయశ్రీ శాతకర్ణి, పరిపాలన 6 సం.
  • చంద్రశ్రీ శాతకర్ణి, పరిపాలన 10 సం.
  • మూడవ పులమాయి, 7 సం.

ఆంధ్రరాజులలో కడపటి చక్రవర్తియైన ఈ మూడవపులమాయి మరణానంతరము దేశమల్లకల్లోలము అయినని డిగెన్సు ఓలెనాచెన్ (Degines Olonachen) అను నాతడువ్రాసెను. ఈపులమాయి అధికారులలో ఒకడు గంగానదీ ప్రాంతభూములను ఆక్రమించుకొని, చీనాచక్రవర్తిఅగు టెయింటుసాంగు (Tiatsong) వద్దనుండి హ్యూంట్జి (Hiuntse) అనువాడుకొందరు రాయబారులతో వచ్చుచున్నాడని విని వారలను పట్టుకొనుటకై సేనలను పంపెనని, బహుకష్టముతో హ్యూంట్జి పారిపోయి టిబెట్టు దేశానికి పారిపోయెనని, ఆదేశపు రాజైన త్సోంగ్లస్తాన్ (Yetsonglostan) అను నాతడు వానికి కొంతసైన్యమిచ్చెనని, ఆతడాసైన్యముతో మరలవచ్చి పులమాయి శత్రువుని ఓడించి వానిని బెదరించి ఓడగొట్టెనని డిగెన్సు వ్రాసియున్నాడు.ఇందువలన పులమాయికి చైనాదేశస్థులకు మైత్రికలదని తెలియుచున్నది.

శకరాజుల నిరంతరవైర ఆంధ్రసామ్రాజ్య పతనమునకు కారణము అని చెప్పవచ్చును.శకరాజులు ఆంధ్రరాజ్యమును సా.శ..256లో కాలచూర్య ఆంధ్రులను ఓడించిరి.కాకతీయులవద్ద సేనానాయకులుగా ఉండిన రెడ్డి వెలమనాయకులు కాకతీయాంధ్రసామ్రాజ్యనిర్మూలనముతో స్వతంత్రించి ప్రత్యేక రాజ్యములు స్థాపించి శాతవాహనుల రాజులదగ్గర ఉన్నతోద్యోగములు పొందిన పల్లవులు ఆంధ్రసామ్రాజ్య విచ్ఛిత్తితో స్వతంత్రించి పల్లవసామ్రాజ్యమును స్థాపించిరి.

శాతవాహనుల నాణాలమీద శ్రీవత్స చిహ్నం

మొదట శాతవాహనుల నాణాలమీద కనిపించే చిహ్నాలలో శ్రీవత్స చిహ్నం (లక్ష్మీ దేవి) ప్రత్యేకమైనది.దీనికి విశేషమయిన ప్రాముఖ్యం ఉంది. శ్రీవత్సం అష్టమంగళాలలో ఒకటన్నది సువిదితం. విష్ణువు యొక్క విగ్రహం శ్రీవత్సాంకితవక్షం కలదిగా వరాహమిహిరుడు వివరించాడు.ప్రాచీన నాణేలమీద, శిల్పాలలో ఈ చిహ్నానికి శివ, విష్ణువులు ఇద్దరితో సంబందం ఉంది. భాగవతం యొక్క ప్రారంభ దశలో దీనికి వీరపూజ (వీరవాదం) తో దగ్గర సంబంధం కలిగి ఉండేది. ఇదే మొదటి శాతవాహనుల నాణాల మీద కనిపించే చిహ్నం. మహాపురుష లక్షణం కనుక బౌద్ధ శిల్పంలో కూడా శ్రీవత్స చిహ్నం కనిపిస్తుంది. యక్షిణి శిల్పాల కంఠాభరణాలలో మధ్య పూసగా దీనిని చూడవచ్చును.శ్రీ వత్స చిహ్నం ఒకపాతబుద్ద పాదం మీద కనిపిస్తుంది.ఈ బుద్దపాదం వేసరవల్లి దగ్గర దొరికింది. క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందినది. సాతవాహనుల నాణాలలో మొదటివాటిలో ఈ చిహ్నం తన సాధారణ స్వరూపంలో కనిపించటమేకాక సంపూర్ణ మానవ స్వరూపంలో కూడా కనిపిస్తుంది.ఈ వంశానికి చెందిన రాజులందరిలో బలవంతుడైన రెండవశాతకర్ణి ఒక వయిపు లక్ష్మికల నాణాలు వెలువరించాడు. ఈ విధంగా అతడు తన ప్రజలకి తన కులదైవం మీద ఎంతభక్తిఉందో నిరూపించుకున్నాడు.ఈ రకం నాణాలు సైరాన్, కౌండిన్యపుర్, విదిశ ప్రాంతాలలో దొరికాయి.

బయటి లింకులు

పాదపీఠికలు

ఇవి కూడా చూడండి

మూలాలు

  • K.A. Nilakanta Sastri, A History of South India (Madras, 1976).

Tags:

శాతవాహనులు తొలి పాలకులుశాతవాహనులు ఆవిర్భావంశాతవాహనులు చరిత్రశాతవాహనులు భూభాగ విస్తరణశాతవాహనులు నిర్వహణావిధానంశాతవాహనులు ఆర్థికంశాతవాహనులు మతంశాతవాహనులు భాషశాతవాహనులు శిలాశాసనాలుశాతవాహనులు నాణేలుశాతవాహనులు సాంస్కృతిక సాధనలుశాతవాహనులు పాలకుల జాబితాశాతవాహనులు శకులు, యవనులు, పహ్లవులతో ఘర్షణలుశాతవాహనులు సాంస్కృతిక అభివృద్ధిశాతవాహనులు క్షీణదశశాతవాహనులు శాతవాహన రాజుల పౌరాణిక జాబితా[102]శాతవాహనులు శాతవాహనుల నాణాలమీద శ్రీవత్స చిహ్నంశాతవాహనులు బయటి లింకులుశాతవాహనులు పాదపీఠికలుశాతవాహనులు ఇవి కూడా చూడండిశాతవాహనులు మూలాలుశాతవాహనులుకోటిలింగాలధరణికోటభారతదేశంరాజధాని

🔥 Trending searches on Wiki తెలుగు:

సినిమాఅగ్నికులక్షత్రియులురేవతి నక్షత్రంకృష్ణా నదిద్రౌపది ముర్ముయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితారామాయణంసజ్జా తేజహెప్టేన్చాకలివికీపీడియాతిక్కనఆంధ్రప్రదేశ్మంతెన సత్యనారాయణ రాజురామతీర్థం (నెల్లిమర్ల)ప్లీహమునారా లోకేశ్PHబీబి నాంచారమ్మపూర్వాభాద్ర నక్షత్రముజాషువాఅల్లరి ప్రేమికుడుభారతదేశ ప్రధానమంత్రిదృశ్యం 2వ్యాసుడుమానవ శరీరముసత్యయుగంతీన్మార్ సావిత్రి (జ్యోతి)మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిజనసేన పార్టీకృత్తిక నక్షత్రముకర్ణాటకఆదిత్య హృదయంమూలా నక్షత్రంవై.ఎస్.వివేకానందరెడ్డిసీ.ఎం.రమేష్బారసాలథామస్ జెఫర్సన్నవధాన్యాలుగోపగాని రవీందర్రుహానీ శర్మపసుపు గణపతి పూజనువ్వొస్తానంటే నేనొద్దంటానావై.యస్.భారతిజొన్నశాంతికుమారిశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)నవనీత్ కౌర్తెలుగు వికీపీడియాసీతారామ కళ్యాణం (1986 సినిమా)శివ పురాణంపిత్తాశయముమలబద్దకంసంధ్యావందనంచిత్త నక్షత్రముటి. రాజాసింగ్ లోథ్ఇంటి పేర్లువిజయవాడజ్యేష్ట నక్షత్రంవల్లభనేని బాలశౌరిశివసాగర్ (కవి)సలేశ్వరంగుణింతంతాటిభారత రాజ్యాంగ పీఠికనందమూరి బాలకృష్ణభారత జాతీయపతాకంహార్దిక్ పాండ్యావేసవి కాలందాశరథి కృష్ణమాచార్యఇత్తడిషిర్డీ సాయిబాబాయోనిసాక్షి (దినపత్రిక)రవితేజభారత రాజ్యాంగ ఆధికరణలురుద్రమ దేవిచిరుధాన్యం🡆 More