సామాజిక న్యాయ మహాశిల్పం (ఆంగ్లం: Statute of Social Justice) అనేది విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డా.
బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం">డా. బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాం. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2024 జనవరి 19న ప్రారంభించి జాతికి అంకితం చేసాడు.
ప్రదేశం | స్వరాజ్య మైదానం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
---|---|
రూపకర్త | ఎంఎస్ అసోసియేట్ సంస్థ |
రకం | శిల్పం |
నిర్మాన పదార్థం | కాంస్యం |
ఎత్తు | 125 అడుగులు |
బరువు | 120 మెట్రిక్ టన్నులు |
నిర్మాణం ప్రారంభం | డిసెంబరు 2021 |
పూర్తయిన సంవత్సరం | జనవరి 2024 |
ప్రారంభ తేదీ | 2024 జనవరి 19 |
అంకితం చేయబడినది | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ |
రూ.404 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాల విస్తీర్ణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు. ఇందులో నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం కాంస్య విగ్రహం ఎత్తు 125 అడుగులు. కాగా, తయారీకి 120 మెట్రిక్ టన్నుల కాంస్యంతో పాటు 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ వినియోగించారు. ఈ విగ్రహ పీఠం కింది భాగం 81 అడుగులు ఉంది. ఇందులో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు నిర్మించారు. ఇందులో ఒక సినిమా హాలుతో పాటు అంబేడ్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటోగ్యాలరీ, శిల్పాలు, పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో దీనిని రూపొందించారు.
స్మృతివనం ప్రహరీ చుట్టూ 2,200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయిని, అక్కడక్కడ పాలరాతిని వినియోగించారు. ఇందులో చిన్నారులకు ఆటస్థలం, ఉద్యానవనం, వాటర్ ఫౌంటెయిన్లు, ఫుడ్కోర్టు వంటి సదుపాయాలు ఉన్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article డా. బి.ఆర్. అంబేద్కర్ మహాశిల్పం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.