వేయి స్తంభాల గుడి: హనుమకొండ లోని దేవాలయం

వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం.ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది.

వెయ్యి స్తంభాల గుడి
వేయి స్తంభాల గుడి: హనుమకొండ లోని దేవాలయం
వెయ్యి స్తంభాల గుడి
పేరు
ఇతర పేర్లు:వెయ్యి స్తంభాల గుడి
స్థానిక పేరు:వెయ్యి స్తంభాల గుడి
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:హనుమకొండ/వరంగల్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు, విష్ణువు, సూర్యుడు
నిర్మాణ శైలి:కాకతీయ, చాళుక్య
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
సా.శ. 1163
నిర్మాత:రుద్రదేవుడు
వేయి స్తంభాల గుడి: హనుమకొండ లోని దేవాలయం
వెయ్యి స్తంభాల ఆలయం, హనుమకొండ, వరంగల్
వేయి స్తంభాల గుడి: హనుమకొండ లోని దేవాలయం
2022లో మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయం

ఆలయ విశేషాలు

ఇది హన్మకొండ జిల్లా, హనుమకొండ మండలం, హనుమకొండలో పట్టణంలో ఉంది.ఇది వరంగల్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.

ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.

ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం, ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.

ఆలయ ప్రాంగణంలో మరేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయవ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా, రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. 2014లో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కల్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది [ఆధారం చూపాలి].

మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్షిస్తారు. మహాన్యాస పుర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం.

ఇంతటి ప్రశస్థి కల ఈ ఆలయానికి దూరప్రాంతాల వారు ఖాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషను చేరుకున్న పిదప బస్సు లేక ఆటోల గుండా 5 కి.మీ. దూరంలో నున్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు.

మూలాలు

Tags:

కాకతీయులు

🔥 Trending searches on Wiki తెలుగు:

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)బగళాముఖీ దేవికాలేయంభారతదేశ రాజకీయ పార్టీల జాబితా2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలురామ్ మనోహర్ లోహియాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసాయిపల్లవిరామావతారంపల్నాడు జిల్లారెండవ ప్రపంచ యుద్ధంమీనరాశివై. ఎస్. విజయమ్మశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిసంతోష్ యాదవ్తీహార్ జైలుఅరుణాచలంభీమసేనుడుతమన్నా భాటియాఅలంకారంవేమన శతకముఆంధ్రప్రదేశ్ శాసనసభగుణింతంభగవద్గీతసాయి ధరమ్ తేజ్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాజవాహర్ లాల్ నెహ్రూరాజస్తాన్ రాయల్స్కూన రవికుమార్అచ్చులుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్నువ్వు లేక నేను లేనుయూట్యూబ్రవీంద్రనాథ్ ఠాగూర్హైదరాబాదుదిల్ రాజురజినీకాంత్మిథునరాశికర్మ సిద్ధాంతందర్శి శాసనసభ నియోజకవర్గంనవలా సాహిత్యముప్రియురాలు పిలిచిందినానార్థాలుజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తినీతి ఆయోగ్ప్రజాస్వామ్యంహలో బ్రదర్ఎయిడ్స్విశ్వామిత్రుడుభారతదేశ జిల్లాల జాబితాపూర్వ ఫల్గుణి నక్షత్రముబాజిరెడ్డి గోవర్దన్రాజ్యసభఫరియా అబ్దుల్లాసునాముఖికోల్‌కతా నైట్‌రైడర్స్భారతీయ రైల్వేలుఅంగారకుడుకల్లుఅమెరికా రాజ్యాంగంతెనాలి రామకృష్ణుడుగుంటకలగరభారతదేశంలో సెక్యులరిజంమహాభారతంనారా లోకేశ్ఛత్రపతి శివాజీఅధిక ఉమ్మనీరుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురామసహాయం సురేందర్ రెడ్డిరామోజీరావుకీర్తి రెడ్డిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాసింగిరెడ్డి నారాయణరెడ్డిగుంటూరు కారంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గందశరథుడువిశ్వబ్రాహ్మణ🡆 More