రాగతి పండరి (జూలై 22, 1965 - 19 ఫిబ్రవరి, 2015) తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో (వాగ్దేవి, కె.సి లలిత అడపాదడపా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినప్పటికీ), రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్టు.
అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నది. ఈ మంచి పేరుకు వెనుక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేక పోయినా, అంతకు మించిన మానసిక చలాకీతనంతో, చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకుంటున్నది. ఆమె మాటలలోనె చెప్పాలంటే, "జీవితంలో వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజు డోసులాంటివి". ఏవిధమైన భయంలేకుండా, తాను కార్టూన్లు గీయాలన్న కోరిక, స్ఫూర్తి, కార్టూనిస్ట్ జయదేవ్ కలగ చేశారని చెపుతుంది. అలాగే, జయదేవ్ కూడా రాగతి పండరి తన నిజమైన శిష్యురాలని చెప్పుకుంటాడు.
కుమారి రాగతి పండరిబాయి | |
---|---|
జననం | రాగతి పండరిబాయి జులై 22, 1965 విశాఖపట్టణం, విశాఖపట్టణం జిల్లా |
మరణం | 2015 ఫిబ్రవరి 19 విశాఖపట్టణం, విశాఖపట్టణం జిల్లా | (వయసు 49)
మరణ కారణం | ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి |
నివాస ప్రాంతం | విశాఖపట్టణం |
ఇతర పేర్లు | రాగతి పండరి |
వృత్తి | వ్యంగ్య చిత్రకారిణి |
తండ్రి | రాగతి గోవిందరావు |
తల్లి | రాగతి శాంతకుమారి |
సంతకం |
రాగతి పండరి 1965 సంవత్సరం జూలై 22 న విశాఖపట్టణంలో జన్మించింది. ఈమె తండ్రి రాగతి గోవిందరావు. తల్లి రాగతి శాంతకుమారి. ఈమె చదువు ఇంటివద్దనే కొనసాగింది. అతి చిన్నవయసులోనే పోలియో వల్ల వచ్చిన శారీరక లోపం ఉన్నా పట్టుదల, ధైర్యం కలిగి జీవితాన్ని ఆత్మ విశ్వాసంతో,కఠోర పరిశ్రమతో ఎదుర్కొని, కార్టూన్ రంగంలో అగ్రగణ్యుల సరసన చేరింది.
తిరిగొచ్చే కార్టూన్లు ఈమెను నిరాశపరచలేదు, పట్టుదలను పెంపొందించి మరింత కృషి సలపటానికి ఆలవాలమయ్యాయి. ఈమె తన వ్యంగ్యచిత్ర ప్రస్థానాన్ని 1973లో తన 8వ ఏటనే మొదలు పెట్టింది. బాల్యం వీడని రోజులలలోనే ఈమె వ్యంగ్య చిత్రాలు ప్రచురణ ప్రారంభమయ్యింది. 1980-1990 దశకాలు ఈమెవే అని చెప్పవచ్చు. కొన్ని వేల వ్యంగ్య చిత్రాలను శరపరంపరగా చిత్రించి పాఠకుల మీదకు వదిలింది. అన్ని ప్రముఖ వార, మాస పత్రికలలో ఈమె కార్టూన్లు ప్రచురించబడ్డాయి, పండుగలు వచ్చాయంటే, పత్రికల సంపాదకులు ఈమె కార్టూన్ల కోసరం ఎంతగానో కోరుకుని, అడిగి మరీ తెప్పించుకుని తమతమ పత్రికలలో ప్రచురిస్తారు.
సాధారణంగా కార్టూనిస్టులు ఇండియన్ ఇంకులో క్రొక్వైల్ కలాన్ని ముంచి కార్టూన్లు వేస్తారు. కానీ రాగతి పండరి ఆలోచన వచ్చిందే తడవుగా కాగితంపై పెన్సిల్తో గీతలు కూడా గీసుకోకుండా నేరుగా స్కెచ్ పెన్నుతోనే కార్టూన్ వేసేస్తారు. ఆ క్రమంలో ఐదు పది నిమిషాల స్వల్పవ్యవధిలోనే కార్టూన్ గీసే విభిన్నమైన శైలి ఆమెది. జయదేవ్ గురువుగా భావించి ఆయన శైలిలో కొద్దిరోజుల పాటు కార్టూన్లు వేసినా, వేగంగా తనదంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని ఆమె గీత చూడగానే గుర్తుపట్టేలా శైలిని ఏర్పరుచుకున్నారు.
- బాపు, కార్టూనిస్టు, చిత్రకారుడు, సినీదర్శకుడు.
-జయదేవ్, కార్టూనిస్టు.
-రామకృష్ణ, కార్టూనిస్టు
-జయదేవ్, కార్టూనిస్టు.
2015 ఫిబ్రవరి 19 న విశాఖపట్టణంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో కన్నుమూశారు. ఆమె కోరిక ప్రకారం కుటుంబసభ్యులు ఆమె అవయవాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దానం చేశారు.
2. నా గురించి నేను... రాగతి పండరి ఆత్మకథ-ప్రచురణ చిత్రకళా పరిషత్ 2008వ సంవత్సరంలో
This article uses material from the Wikipedia తెలుగు article రాగతి పండరి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.