మైఖేలాంజెలో (మార్చి 6, 1475 – ఫిబ్రవరి 18, 1564) ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - పేటా, డేవిడ్ అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు ఫ్రెస్కో చిత్రాలు - రోమ్ నగరంలో సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు, తుది తీర్పు . తరువాత అదే నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికాకు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.
మైఖేలాంజిలో డి లొడోవికో బునరోటి సిమోని (Michelangelo di Lodovico Buonarroti Simoni) | |
డానియెల్ డ వోల్టెరా గీసిన మైఖేలాంజిలో Chalk portrait | |
జన్మ నామం | Michelangelo di Lodovico Buonarroti Simoni |
జననం | అరెజ్జో, కాప్రెసి, టుస్కాని | 1475 మార్చి 6
మరణం | 1564 ఫిబ్రవరి 18 రోమ్ | (వయసు 88)
జాతీయత | ఇటాలియన్ |
రంగం | శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణం, కవిత్వం |
శిక్షణ | డొమెనికో ఘిరాల్డియో వద్ద అనుచరునిగా |
ఉద్యమం | ఉన్నత పునరుజ్జీవనం |
This article uses material from the Wikipedia తెలుగు article మైఖేలాంజెలో, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.