మౌర్య సామ్రాజ్యం

మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ 321– 187 ) మౌర్య వంశం చే పరిపాలించబడిన ఒక ప్రాచీన బలమైన, విశాలమైన సామ్రాజ్యం.

మౌర్య సామ్రాజ్యం
మౌర్య సామ్రాజ్యం
అశోకుడు పరిపాలన అత్యధికంగా విస్తరించిన మౌర్యసామ్రాజ్యం.
Imperial Symbol:
The Lion Capital of Ashoka
Founder చంద్రగుప్త మౌర్య
Preceding State (s) Nanda Dynasty of మగధ
మహాజానపదాలు
Languages పాలి
ప్రాకృతం
సంస్కృత భాష
మతములు బౌద్ధ మతము
హిందూ మతము
జైన మతము
Capital పాటలీపుత్ర
Head of State సమ్రాట్ (చక్రవర్తి)
First Emperor చంద్రగుప్త మౌర్య
Last Emperor బృహద్రథ
Government Centralized Absolute Monarchy with Divine Right of Kings as described in the Arthashastra
Divisions 4 provinces:
Tosali
Ujjain
Suvarnagiri
Taxila
Semi-independent tribes
Administration Inner Council of Ministers (Mantriparishad) under a Mahamantri with a larger assembly of ministers (Mantrinomantriparisadamca).
Extensive network of officials from treasurers (Sannidhatas) to collectors (Samahartas) and clerks (Karmikas).
Provincial administration under regional viceroys (Kumara or Aryaputra) with their own Mantriparishads and supervisory officials (Mahamattas).
Provinces divided into districts run by lower officials and similar stratification down to individual villages run by headmen and supervised by Imperial officials (Gopas).
Area 5 million km² (Southern Asia and parts of Central Asia)
Population 50 million (one third of the world population )
Currency Silver Ingots (Panas)
Existed 322–185 BCE
Dissolution Military coup by Pusyamitra Sunga
Succeeding state Sunga Empire

మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య మహాపద్మనంద మనవడు, చంద్రగుప్త మౌర్య నంద రాజులకి, అడవి జాతికి చేందిన "ముర" అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చంద్ర గుప్తుని తల్లి పేరు "ముర" అనగా అడవిలో నెమల్లని సంరక్షించే జాతికి చెందినది. ఈ విధముగా తల్లి పేరును మౌర్యగా మార్చుకొని తన రాజ్యమును పాలించాడు.. నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు, ఎలాగైన నంద రాజ్యం నాశనము చేయాలనే ఆశయముతో చంద్రగుప్తుడిని రెచ్చకొట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపేలాగా చేశాడని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. విశకదత్తుడు రచించిన 4వ శతాబ్దము- "ముద్రరక్షస" అనే గ్రంథములో చంద్రగుప్త మౌర్య నంద వంశస్తుల కుమారుడు అని క్లుప్తముగా వివరించారు. దీనితో బలం పుంజుకున్న చంద్రగుప్తుడు క్రీ.పూ. 322 లో నంద వంశ పరిపాలనకు తెర దించి తానే ఒక మహా సామ్రాజ్యం స్థాపించాడు. అలెగ్జాండరు నాయకత్వంలోని గ్రీకుల దండయాత్ర సమయమున స్థానిక రాజ్యాల మధ్య ఉన్న మనస్పర్థలని ఉపయోగించుకుని తన సామ్రాజ్య సరిహద్దులని అమితంగా పెంచాడు. క్రీ.పూ. 316 నాటికి దాదాపు ఉత్తర భారతం అంతా ఇతని ఆధీనంలో ఉంది. అలెగ్జాండర్ సేనాని పశ్చిమ ఆసియా ప్రాంతాలని పరిపాలించిన సెల్యూకసు నికేటరుని ఓడించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

మౌర్య సామ్రాజ్యం
గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
• మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
• మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
• చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
• ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
• బ్రిటిషు రాజ్యము
• స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
• ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము • 21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

భౌగోళికంగా విస్తారమైన మౌర్య సామ్రాజ్యం మగధలో ఇనుప యుగపు చారిత్రక శక్తిగా ఉంది. ఇది క్రీ.పూ 322- 187 మధ్య భారత ఉపఖండంలో ఆధిపత్యంలో ఉంది. దక్షిణ ఆసియాలో ఎక్కువ భాగంలో విస్తరించిన మౌర్య సామ్రాజ్యం ఇండో-గంగా మైదానాన్ని జయించి కేంద్రీకృతమై ఉంది. పాటలీపుత్ర (ఆధునిక పాట్నా) రాజధాని నగరంగా చేసుకుని పాలన సాగించింది. భారతీయ ఉపఖండంలో ఉనికిలో ఉన్న అతిపెద్ద రాజకీయ సంస్థగా ఈ సామ్రాజ్యం, అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో 50 లక్షల చ.కి.మీ (s (1.9 మిలియన్ల చదరపు మైళ్ళు) విస్తరించి ఉంది.

చంద్రగుప్త మౌర్య, చాణక్య (కౌటిల్య) సహాయంతో ఒక సైన్యాన్ని అభివృద్ధి చేసాడు. క్రీ.పూ. 322 లో నంద సామ్రాజ్యాన్ని పడగొట్టి మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపించాడు. "అలెగ్జాండర్ ది గ్రేట్" దండయాత్ర తరువాత పరిపాలనలో వున్న సాట్రాపులను జయించడం ద్వారా చంద్రగుప్త తన శక్తిని మధ్య, పశ్చిమ భారతదేశం అంతటా వేగంగా విస్తరించాడు. క్రీ.పూ 317 నాటికి సామ్రాజ్యం పూర్తిగా వాయవ్య భారతదేశాన్ని ఆక్రమించాడు. మౌర్య సామ్రాజ్యం సెలూసిదు-మౌర్య యుద్ధంలో డయాడోకసు, సెలూసిదు సామ్రాజ్యం స్థాపకుడు మొదటి సెలూకసును ఓడించి సింధు నదికి పశ్చిమ భూభాగాన్ని సొంతం చేసుకుంది.

ఈ సామ్రాజ్యం హిమాలయాల సహజ సరిహద్దు వెంట, తూర్పున అస్సాం వరకు, పశ్చిమాన బలూచిస్తాను (నైరుతి పాకిస్తాను, ఆగ్నేయ ఇరాను), ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాను, హిందూ కుషు పర్వతాల వరకు విస్తరించింది. పుష్కరు, బిందుసార చక్రవర్తుల పాలనలో ఈ రాజవంశం భారతదేశం దక్షిణ ప్రాంతాలలో విస్తరించింది. అయితే ఇది అశోకుడు జయించే వరకు కళింగ (ఆధునిక ఒడిశా) ను మినహాయింపుగా పాలనసాగించింది. ఇది అశోక పాలన తరువాత సుమారు 50 సంవత్సరాలలో క్షీణించింది. క్రీస్తుపూర్వం 185 లో మగధలో షుంగా రాజవంశం స్థాపనతో మౌర్యసామ్రాజ్యం అంతరించి పోయింది.

చంద్రగుప్త మౌర్య, అతని వారసుల ఆధ్వర్యంలో అంతర్గత వాణిజ్యం, బాహ్య వాణిజ్యం, వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలు వర్ధిల్లాయి. ఆర్థిక, పరిపాలన, భద్రత కలిగిన ఏకైక శక్తిగా సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించి దక్షిణాసియా అంతటా అభివృద్ధి చెందుతూ విస్తరించింది. మౌర్య రాజవంశం ఆసియాలో పురాతనమైన సుదీర్ఘ వాణిజ్య వ్యవస్థకు అనుకూలంగా ఒకటైన పెద్ద రహదారి (గ్రాండు ట్రంకు రహదారి)ని నిర్మించింది. ఇది భారత ఉపఖండాన్ని మధ్య ఆసియాతో కలుపుతుంది. కళింగ యుద్ధం తరువాత అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో సామ్రాజ్యం దాదాపు అర్ధ శతాబ్దం కేంద్రీకృత పాలనను అనుభవించింది. చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని స్వీకరించడం వల్ల దక్షిణ ఆసియా అంతటా సామాజిక-మత సంస్కరణలు జరిగాయి. అశోకచక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించడం, బౌద్ధ మిషనరీల తోడ్పాటు, ఆ విశ్వాసాన్ని శ్రీలంక, వాయవ్య భారతదేశం, మధ్య ఆసియా విస్తరించడానికి వీలైంది. సామ్రాజ్యం జనాభా సుమారు 50-60 మిలియన్లుగా అంచనా వేయబడింది. దీని వలన మౌర్య సామ్రాజ్యం ఎక్కువ జనాభా కలిగిన పురాతన సామ్రాజ్యాలలో ఒకటిగా మారింది. పురావస్తుపరంగా దక్షిణ ఆసియాలో మౌర్య పాలన కాలం నార్తరను బ్లాక్ పాలిషు వేరు (NBPW) యుగానికి చెందినదిగా భావించబడుతుంది. అర్ధశాస్త్రం, అశోకుడి శాసనాలు మౌర్య కాలాల వ్రాతపూర్వక నివేదికలకు ప్రాథమిక వనరులుగా ఉన్నాయి. సారనాథ్ వద్ద ఉన్న " లయను క్యాపిటల్ ఆఫ్ అశోక " ఆధునిక భారతదేశం జాతీయ చిహ్నం.

పేరు వెనుక చరిత్ర

"మౌర్య" అనే పేరు అశోక శాసనాలు లేదా మెగాస్టీనెసు ఇండికా వంటి సమకాలీన గ్రీకు వృత్తాంతాలలో లేదు. అయితే ఇది ఈ క్రింది మూలాల ద్వారా ధ్రువీకరించబడింది:

  • రుద్రదామను (సా.శ. 150) జునాగఢు శిలాశాసనం చంద్రగుప్త, అశోక పేర్లకు "మౌర్య"ను ఉపసర్గ చేస్తుంది. .
  • పురాణాలు (సా.శ. 4 వ శతాబ్దం, అంతకుముందు) మౌర్యను ఒక రాజవంశ స్వరూపంగా ఉపయోగిస్తాయి.
  • బౌద్ధ గ్రంథాలు చంద్రగుప్త గౌతమ బుద్ధుడుకు చెందిన శాక్యాల "మోరియా" వంశానికి చెందినవాడని పేర్కొన్నాయి.

  • చంద్రగుప్తుడు మౌర్య రాయలు సూపరింటెండెంటు (మయూరా-పోషాకా) కుమారుడని జైన గ్రంథాలు చెబుతున్నాయి. .
  • తమిళ సంగం సాహిత్యం కూడా వాటిని 'మోరియారు' గా పేర్కొంటుంది. నందాల తరువాత రాజ్యపాలన చేసారని ప్రస్తావించింది.

బౌద్ధ సంప్రదాయం ఆధారంగా మౌర్య రాజుల పూర్వీకులు నెమళ్ళతో (పాలిలో మోరా) సుసంపన్నమైన భుభాగ ప్రాంతంలో స్థిరపడ్డారు. అందువల్ల వారు "మొరియాసు" అని పిలువబడ్డారు, వాచ్యంగా, "నెమళ్ళ ప్రదేశానికి చెందినవారు". మరొక బౌద్ధ వృత్తాంతం ఆధారంగా ఈ పూర్వీకులు మోరియా-నగరా ("మోరియా-నగరం") అనే నగరాన్ని నిర్మించారు. దీనిని "నెమళ్ల మెడ వంటి రంగు ఇటుకలతో" నిర్మించారు.

బౌద్ధ, జైన సంప్రదాయాలలో పేర్కొన్నట్లుగా నెమళ్లతో రాజవంశం సంబంధం పురావస్తు ఆధారాల ద్వారా ధ్రువీకరించబడింది. ఉదాహరణకు నందనగరులోని అశోక స్తంభం మీద నెమలి బొమ్మలు, సాంచి స్థూపం మీద అనేక శిల్పాలు కనిపిస్తాయి. ఈ సాక్ష్యం ఆధారంగా ఆధునిక విద్యాధ్యయనకారులు నెమలి రాజవంశం చిహ్నంగా ఉండవచ్చని సిద్ధాంతీకరించారు.

ధూండిరాజా (ముద్రరాక్షపై వ్యాఖ్యాత), విష్ణు పురాణం ఉల్లేఖకుడు వంటి కొంతమంది రచయితలు నందా రాజు భార్య ముర (మొదటి మౌర్య రాజు తల్లి లేదా అమ్మమ్మ) నుండి "మౌర్య" అనే పదం ఉద్భవించిందని పేర్కొన్నారు. ఏదేమైనా పురాణాలు మురా గురించికానీ నందా, మౌర్య రాజవంశాల మధ్య సంబంధం గురించికానీ ప్రస్తావించవు.

ధూండిరాజా ఉత్పన్నం చేసిన ఈ పదం ఆయన స్వంత ఆవిష్కరణ అనిపిస్తుంది: సంస్కృత నియమాల ఆధారంగా మురా (IAST: మురే) అనే స్త్రీ పేరు ఉత్పన్నం "మౌరేయా"; "మౌర్య" అనే పదం పురుష "మురా" నుండి మాత్రమే తీసుకోబడింది.

చరిత్ర

మౌర్య రాజవంశం 137 సంవత్సరాలు పరిపాలించింది. గాంధారాలోని పర్షియా ప్రాంతాలలో భారతదేశం కాశ్మీరులోని కొన్ని ప్రాంతాలలో స్థాపించబడిన హెలెనిస్టికు రాజ్యాల సాంస్కృతిక ప్రభావం ఈ ప్రదేశాల కళాత్మక శైలి, సంస్కృతిని ప్రభావితం చేసింది. అలెగ్జాండరు ది గ్రేటు మరణం తరువాత మౌర్య రాజవంశం స్థాపకుడు చంద్రగుప్తా మౌర్య సింధు లోయ, వాయవ్య భారతదేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలెగ్జాండరు సైన్యాలు గాంధారకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. చంద్రగుప్తుడు చేతిలో ఓడిపోయిన సెల్యూకసు సింధు, స్వాతు లోయలు, గాంధార, తూర్పు అరాచోసియాలను చంద్రగుప్తుడికి స్వాధీనం చేసాడు. చద్రగుప్త మనవడు అశోకుడు ఉత్తర, మధ్య భారతదేశంలో మౌర్య పాలనను విస్తరించడానికి అనేక పోరాటాలు చేశాడు. బౌద్ధమతంలోకి మారిన తరువాత అశోకుడు స్థాపించిన నిర్మాణాలు, వ్రాతపూర్వక ఆధారాలలో గ్రీకు, పెర్షియను ప్రభావాలు లేవు.

రాజవంశ స్థాపన

మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యడు చాణక్య సహాయంతో ప్రసిద్ధ అభ్యాస కేంద్రమైన తక్షశిల వద్ద స్థాపించారు. అనేక ఇతిహాసాల ఆధారంగా చాణక్యుడు పెద్ద సైనిక శక్తిగల, పొరుగువారికి భయభ్రాంతులను చేసే మగధ అనే రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ నంద రాజవంశానికి చెందిన రాజు ధననంద చేత అవమానించబడ్డాడు. చాణక్యుశు ప్రతీకారం తీర్చుకున్నాడు. నంద సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతలో అలెగ్జాండరు ది గ్రేట్ జయించిన సైన్యాలు బియాసు నదిని దాటి, మరింత తూర్పు వైపుకు వెళ్ళడానికి నిరాకరించాయి. ఇది మగధతో పోరాడే అవకాశాన్ని అడ్డుకుంది. అలెగ్జాండరు బాబిలోనుకు తిరిగి వచ్చి సింధు నదికి పశ్చిమాన తన దళాలను తిరిగి మోహరించాడు. క్రీస్తుపూర్వం 323 లో అలెగ్జాండరు బాబిలోనులో మరణించిన వెంటనే అతని సామ్రాజ్యం ఆయన సైనికారుల నేతృత్వంలో స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది.

గ్రీకు సైనికాధికారి యుడెమసు పీతాను క్రీస్తుపూర్వం 317 వరకు సింధు లోయలో పాలనసాగించాడు. చంద్రగుప్తా మౌర్య (ఆయన సలహాదారుగా ఉన్న చాణక్య సహాయంతో) గ్రీకు గవర్నర్లను తరిమికొట్టడానికి తిరుగుబాటును నిర్వహించి తరువాత సింధు లోయను స్వాధీనం చేసుకున్నాడు. మగధలో తన కొత్త అధికారం నియంత్రణ సాగించాడు.

చంద్రగుప్త మౌర్య అధికారంలోకి రావడం రహస్య వివాదాలలో కప్పబడి ఉంది. ఒక వైపు విశాఖదత్త రాసిన ముద్రారాక్షసం (రాక్షస సిగ్నెటు రింగు - రాక్షస మగధ ప్రధానమంత్రి) వంటి అనేక పురాతన భారతీయ గ్రంథాలు, అతని రాజ వంశం గురించి వివరిస్తాయి. ఆయనను నంద కుటుంబంతో కూడా అనుసంధానిస్తాయి. మౌర్యాలు అని పిలువబడే క్షత్రియ వంశాన్ని తొలి బౌద్ధ గ్రంథాలలో మహాపరినిబ్బన సూతలో సూచిస్తారు. తదుపరి చారిత్రక ఆధారాలు లేకుండా ఏదైనా తీర్మానాలు చేయడం కష్టం. చంద్రగుప్తుడు మొదట గ్రీకు గ్రంథాలలో "సాండ్రోకోటోసు"గా ఉద్భవించాడు. యువకుడిగా ఆయన అలెగ్జాండరును కలిసినట్లు చెబుతారు. ఆయన నందరాజును కలుసుకుని ఆయనకు కోపం తెప్పించి తృటిలో తప్పించుకున్నాడని కూడా అంటారు. చంద్రగుప్తా ఆధ్వర్యంలో సైన్యానికి శిక్షణ ఇవ్వడం చాణుక్యుని అసలు లక్ష్యంగా ఉంది.

మగధ విజయం

Territorial evolution of the Mauryan Empire

చణుక్యుడు మగధ సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలని చంద్రగుప్త మౌర్యుడు, ఆయన సైన్యాన్ని ప్రోత్సహించాడు. తన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి, చంద్రగుప్తా మగధ, ఇతర ప్రావిన్సుల నుండి చాలా మంది యువకులను సమీకరించాడు, ధన నంద రాజు యొక్క అవినీతి, అణచివేత పాలనపై పురుషులు కలత చెందారు, అంతేకాకుండా అతని సైన్యం సుదీర్ఘ యుద్ధాలతో పోరాడటానికి అవసరమైన వనరులు. ఈ పురుషులలో టాక్సీలా మాజీ జనరల్, చాణక్య నిష్ణాతులైన విద్యార్థులు, పర్వతక రాజు ప్రతినిధి, అతని కుమారుడు మలయకేతు, చిన్న రాష్ట్రాల పాలకులు ఉన్నారు. నందా రాజవంశానికి వ్యతిరేకంగా చంద్రగుప్త మౌర్య సాయుధ తిరుగుబాటులో మాసిడోనియన్లు (భారతీయ వనరులలో యోనా లేదా యవనాగా వర్ణించబడింది) ఇతర సమూహాలతో కలిసి పాల్గొని ఉండవచ్చు. విశాఖదత్తుది ముద్రారాక్షసం జైన రచన పారిసిష్టాపవరను చంద్రగుప్తా సంకీర్ణం ఏర్పరచుకున్న హిమాలయ రాజు పర్వతకుడు (తరచుగా పోరసుగా గుర్తించబడ్డాడు). ఈ గుర్తింపుల విషయంలో చరిత్రకారులంరిలో ఏకాభిప్రాయం లేదు. ఈ హిమాలయ (పర్వతకుడు) కూటమి చంద్రగుప్తుడికి యవనాలు (గ్రీకులు), కంబోజాలు, షకాలు (సిథియన్లు), కిరాతులు (హిమాలయన్లు), పరాసికులు (పర్షియన్లు), బాహ్లికులు (బాక్ట్రియన్లు (కుమారపురా అనే పటాలిపుత్రను తీసుకున్న)) కూడిన మిశ్రమ, శక్తివంతమైన సైన్యాన్ని ఇచ్చింది. కుసుమపురా (పాటలీపుత్ర) ముద్రరాక్ష 2:లో చాణుక్యుడి సలహా మేరకు "కుసుమపురాన్ని పర్వతకుడు, చంద్రగుప్తుడి సైన్యాలు ప్రతి దిశ నుండి ముట్టడించాయి: షకాలు, యవనులు, కిరాతులు, కాంబోజులి, పరాసికాలు, బహ్లికులు, ఇతరులు సమావేశమయ్యారు".

పటాలిపుత్రపై దాడి చేయడానికి సిద్ధమవుతున్న మౌర్యచంద్రగుప్తుడు ఒక వ్యూహంతో ముందుకు వచ్చాడు. యుద్ధం ప్రకటించగానే మౌర్య దళాలను ఎదుర్కొనేందుకు మగధ సైన్యం నగరం నుండి సుదూర యుద్ధభూమికి వచ్చారు. ఇంతలో మౌర్య సైనికాధికారి, గూఢాచారులు నందుని అవినీతిపరులకు లంచం ఇచ్చారు. ఫలితంగా ఆయన రాజ్యంలో అంతర్యుద్ధ వాతావరణాన్ని సృష్టించగలిగాడు. ఇది సింహాసనం వారసుడి మరణంతో ముగిసింది. చాణక్యుడు ప్రజల మనోభావాన్ని గెలుచుకోగలిగాడు. చివరకు నందుడు పదినుండి తొలగి చంద్రగుప్తుడికి అధికారాన్ని అప్పగించి ప్రవాసంలోకి వెళ్లాడు. చాణక్యుడు ప్రధానమంత్రి రాక్షసుడిని సంప్రదించి తన విధేయత మగధ వంశానికి మాత్రమేనని నందా రాజవంశానికి కాదని ఆయన పదవిలో కొనసాగాలని పట్టుబట్టాడు. ప్రతిఘటించడానికి ఎంచుకోవడం మగధను తీవ్రంగా ప్రభావితం చేసి, నగరాన్ని నాశనం చేసే యుద్ధాన్ని ప్రారంభిస్తుందని చాణక్య పునరుద్ఘాటించారు. రాక్షసుడు చాణక్యుడి వాదనను అంగీకరించాడు. మగధ కొత్త రాజుగా చంద్రగుప్త మౌర్యను చట్టబద్ధంగా స్థాపించాడు. రాక్షసుడు చంద్రగుప్తుడి ముఖ్య సలహాదారు అయ్యాడు. చాణక్య ఒక పెద్ద రాజనీతిజ్ఞుడిగా బాధ్యతలు స్వీకరించాడు.

చంద్రగుప్త మౌర్య

మౌర్య సామ్రాజ్యం 
Pataliputra, capital of the Mauryas. Ruins of pillared hall at Kumrahar site.
మౌర్య సామ్రాజ్యం 
The Pataliputra capital, discovered at the Bulandi Bagh site of Pataliputra, 4th-3rd c. BCE.

క్రీస్తుపూర్వం 323 లో అలెగ్జాండరు ది గ్రేట్ మరణం తరువాత చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 305 లో సింధు లోయ, వాయవ్య భారతదేశంలో సత్రపీ (గ్రీకు భూభాగాలు) తిరిగి పొందటానికి అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు. అలెగ్జాండరు మిగిలిన దళాలు పశ్చిమ దిశగా తిరిగి వచ్చినప్పుడు మొదటి సెల్యూకసు నికేటరు ఈ భూభాగాలను రక్షించడానికి పోరాడారు. సంబంధించిన పురాతన మూలాలలో ఈ పోరాటాల గురించిన చాలా వివరాలు వివరించబడలేదు. సెల్యూకసు ఓడిపోయి తిరిగి ఆఫ్ఘనిస్తాను పర్వత ప్రాంతంలోకి వెళ్ళాడు.

క్రీస్తుపూర్వం 303 లో ఇరువురు పాలకులు వైవాహిక కూటమితో సహా శాంతి ఒప్పందాన్ని ముగించారు. దాని నిబంధనల ప్రకారం చంద్రగుప్తుడు పరోపమిసాడే (కంబోజా, గాంధార), అరాచోసియా (కంధహారు), గెడ్రోసియా (బలూచిస్తాను) సత్రపీలను పొందాడు. బదులుగా క్రీ.పూ 301 లో ఇప్ససు యుద్ధంలో పశ్చిమ హెలెనిస్టికు రాజుల మీద విజయం సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన 500 యుద్ధ ఏనుగులను మొదటి సెలూకసు అందుకున్నాను. దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. చరిత్రకారుడు మెగాస్టీన్సు డీమాకోసు, డియోనిసియసు వంటి అనేక మంది గ్రీకులు మౌర్య రాజాస్థానంలో పనిచేసారు.[ఆధారం చూపాలి] చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో మెగాస్టీన్సు ప్రముఖ గ్రీకు రాయబారిగా ఉన్నాడు. అరియను అభిప్రాయం ఆధారంగా రాయబారి మెగాస్టీనీసు (క్రీ.పూ .350-సి .290) అరాకోసియాలో నివసిస్తూ పటాలిపుత్రకు ప్రయాణించాడు. మౌర్య సమాజాన్ని స్వేచ్ఛాయుతమైనదిగా సెలూకసును ఆక్రమణను నివారించడానికి ఒక మార్గం ఎన్నుకోవడం మెగాస్టీనెసు వర్ణించాడు. సెలూకసు నిర్ణయం అంతర్లీనంగా విజయం అసంభవం గ్రహించినట్లు సూచిస్తుంది. తరువాతి సంవత్సరాల్లో సెలూకసు వారసులు ఇలాంటి సంబంధాలను కొనసాగించారని రెండుదేశాల మద్య సంచరించే యాత్రీకుల వ్రాతల ఆధారంగా తెలుస్తుంది.

పాటాలిపుత్ర రాజధానిగా చంద్రగుప్తుడు ఒక బలమైన కేంద్రీకృత రాజ్యాన్ని స్థాపించాడు. పాటలీపుత్ర మెగాస్టీన్సు వ్రాతల ఆధారంగా "64 ద్వారాలు, 570 గోపురాలు కట్టిన చెక్క గోడతో పరివృతమై ఉంటుంది". ఏలియను మెగాస్టీంసులా స్పష్టంగా పాటాలిపుత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా పర్షియా సుసా (ఎక్టబానా) కంటే శోభలో భారతీయ రాజభవనాలు ఉన్నతమైనవిగా వర్ణించారు. నగరం నిర్మాణానికి ఆ కాలంలోని పర్షియను నగరాలతో చాలా పోలికలు ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రగుప్త కుమారుడు బిందుసార మౌర్య సామ్రాజ్యం పాలనను దక్షిణ భారతదేశం వైపు విస్తరించాడు. సంగ సాహిత్యానికి చెందిన ప్రసిద్ధ తమిళ కవి మములానారు, తమిళ దేశాన్ని కలిగి ఉన్న దక్కను పీఠభూమికి దక్షిణంగా ఉన్న ప్రాంతాలను కర్ణాటక నుండి దళాలను ఉపయోగించి మౌర్య సైన్యం ఎలా ఆక్రమించిందో వివరించింది. వడుగరు (తమిళ దేశానికి ఉత్తరాన ఉన్న ఆంధ్ర-కర్నాటక ప్రాంతాలలో నివసించిన ప్రజలు) మౌర్య సైన్యం వాన్గార్డు సైన్యాలను ఏర్పాటు చేశారని ములానారు పేర్కొన్నారు.ఆయన తన సభలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారిని నియమించాడు.

ప్లుటార్చి అభిప్రాయం ఆధారంగా చంద్రగుప్త మౌర్యుడు మొత్తం భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. జస్టిను కూడా చంద్రగుప్త మౌర్య భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడని గమనించాడు. దీనిని తమిళ సంగం సాహిత్యం ధ్రువీకరిస్తుంది. ఇది వారి దక్షిణ భారత మిత్రదేశాలతో మౌర్య దండయాత్ర, వారి ప్రత్యర్థుల ఓటమి గురించి ప్రస్తావించింది.

చంద్రగుప్తుడు తన సింహాసనాన్ని త్యజించి జైన గురువు భద్రాబాహును అనుసరించాడు. సల్లెఖాన జైన ఆచారం ప్రకారం మరణానికి ఉపవాసం ఉండటానికి ముందు అతను అనేక సంవత్సరాలు శ్రావణబేలగోల వద్ద సన్యాసిగా నివసించినట్లు చెబుతారు.

బిందుసార

మౌర్య సామ్రాజ్యం 
A silver coin of 1 karshapana of the Maurya empire, period of Bindusara Maurya about 297-272 BC, workshop of Pataliputra. Obv: Symbols with a Sun Rev: Symbol Dimensions: 14 x 11 mm Weight: 3.4 g.

మౌర్య సామ్రాజ్యం స్థాపకుడు చంద్రగుప్తకు బిందుసార జన్మించాడు. వివిధ పురాణాలు, మహావంశాలతో సహా అనేక వనరులు దీనిని ధ్రువీకరించాయి.[full citation needed] బౌద్ధమత గ్రంథాలైన దీపవంశం, మహావంశ ("బిందుసారో") ఆయనను ధ్రువీకరించాయి; పారిష్ఠ-పర్వను వంటి జైన గ్రంథాలు; విష్ణు పురాణం ("విందుసర") వంటి హిందూ గ్రంథాలు కూడా ఆయనను గుర్తించాయి. 12 వ శతాబ్దపు జైన రచయిత హేమచంద్ర పారిష్ఠ-పర్వను అభిప్రాయం ఆధారంగా బిందుసార తల్లి పేరు దుర్ధర. కొన్ని గ్రీకు మూలాలు అతనిని "అమిట్రోచెట్సు", వైవిధ్యంగా కూడా ప్రస్తావించాయి.

క్రీస్తుపూర్వం 297 లో బిందుసార సింహాసనాన్ని అధిరోహించారని చరిత్రకారుడు ఉపీందరు సింగు అంచనా వేశారు. కేవలం 22 సంవత్సరాల వయస్సులో ఉన్న బిందుసారా భారతదేశం ఉత్తర, మధ్య, తూర్పు భాగాలతో పాటు ఆఫ్ఘనిస్తాను, బలూచిస్తాను భాగాలతో కూడిన పెద్ద సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. బిందుసార ఈ సామ్రాజ్యాన్ని భారతదేశం దక్షిణ భాగం కర్ణాటక వరకు విస్తరించాడు. అతను మౌర్య సామ్రాజ్యం క్రింద పదహారు రాజ్యాలను తీసుకువచ్చాడు. తద్వారా దాదాపు అన్ని భారతీయ ద్వీపకల్పాలను జయించాడు (అతను 'రెండు సముద్రాల మధ్య భూమిని - బెంగాలు బే, అరేబియా సముద్రం మధ్య ద్వీపకల్ప ప్రాంతం' ను జయించినట్లు చెబుతారు). రాజు ఇలంసెటుసెన్నీ, పాండ్యాలు, చేరాలు పాలించిన చోళులవంటి స్నేహపూర్వక తమిళ రాజ్యాలను బిందుసార జయించలేదు. ఈ దక్షిణాది రాజ్యాలు కాకుండా, కళింగ (ఆధునిక ఒడిశా) భారతదేశంలో బిందుసార సామ్రాజ్యంలో భాగం కాని ఏకైక రాజ్యలుగా ఉన్నాయి. తరువాత అతని కుమారుడు అశోకుడు, తన తండ్రి పాలనలో ఉజ్జయిని రాజప్రతినిధ్గా పనిచేశాడు. ఇది పట్టణం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

బిందుసార జీవితాన్ని అలాగే అతని తండ్రి చంద్రగుప్తా లేదా అతని కుమారుడు అశోకుడి జీవితం కూడా నమోదు చేయబడలేదు. ఆయన పాలనలో చాణుక్యుడు ప్రధానమంత్రిగా కొనసాగాడు. భారతదేశాన్ని సందర్శించిన మధ్యయుగ టిబెటు పండితుడు తారనాథ అభిప్రాయం ఆధారంగా చాణక్యుడు "పదహారు రాజ్యాల ప్రభువులను, రాజులను నాశనం చేయడానికి, తూర్పు, పశ్చిమ మహాసముద్రాల మధ్య భూభాగానికి సంపూర్ణ యజమాని కావడానికి" బిందుసారకు సహాయం చేశాడు. అతని పాలనలో, తక్షశిలా పౌరులు రెండుసార్లు తిరుగుబాటు చేశారు. మొదటి తిరుగుబాటులో అతని పెద్ద కుమారుడు సుసిమా పాల్గొన్నాడు. రెండవ తిరుగుబాటుకు కారణం తెలియదు. కానీ బిందుసార తన జీవితకాలంలో దానిని అణచివేయలేకపోయాడు. బిందుసార మరణం తరువాత దీనిని అశోకుడు రూపుమాపాడు.

బిందుసార హెలెనికు ప్రపంచంతో స్నేహపూర్వక దౌత్య సంబంధాలను కొనసాగించాడు. బిందుసర న్యాయస్థానంలో డీమాచసు సెలూసిదు చక్రవర్తి మొదటి ఆంటియోకసు రాయబారిగా పనిచేసాడు.గ్రీకు రచయిత ఇయాంబులసును స్వాగతించాడని డయోడోరసు పేర్కొన్న పాలిబోత్రా రాజు (పటాలిపుత్ర, మౌర్య రాజధాని)ను సాధారణంగా బిందుసారగా గుర్తిస్తారు. ఈజిప్టు రాజు ఫిలడెల్ఫసు డియోనిసియసు అనే రాయబారిని భారతదేశానికి పంపించాడని ప్లినీ పేర్కొన్నాడు. సైలేంద్ర నాథు సేను అభిప్రాయం ఆధారంగా ఇది బిందుసార పాలనలో జరిగినట్లు తెలుస్తుంది.

అతని తండ్రి చంద్రగుప్తుడిలా కాకుండా (తరువాతి దశలో జైనమతంలోకి మారినవారు), బిందుసార అజివిక వర్గాన్ని విశ్వసించారు. బిందుసార గురువు పింగలవత్స (జనసనా) అజీవ శాఖకు చెందిన బ్రాహ్మణుడు. బిందుసార భార్య, రాణి సుభద్రంగి (రాణి అగ్గమహేసి) చంపా (ప్రస్తుత భాగల్పూర్ జిల్లా) నుండి అజీవ శాఖకు చెందిన బ్రాహ్మణుడు. బ్రాహ్మణ మఠాలకు (బ్రాహ్మణ-భట్టో) అనేక దానాలు ఇచ్చిన ఘనత బిందుసారాలో ఉంది.

క్రీస్తుపూర్వం 270 లలో బిందుసర మరణించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఉపీందరు సింగు ప్రకారం, బిందుసారా క్రీస్తుపూర్వం 273 లో మరణించాడు. అలైను డానియౌలో అతను క్రీ.పూ 274 లో మరణించాడని నమ్ముతాడు. క్రీస్తుపూర్వం 273-272లో అతను మరణించాడని సైలేంద్ర నాథు సేను అభిప్రాయపడ్డాడు. అతని మరణం తరువాత నాలుగు సంవత్సరాల వారసత్వ పోరాటం జరిగింది. తరువాత అతని కుమారుడు అశోకుడు క్రీస్తుపూర్వం 269-268లో చక్రవర్తి అయ్యాడు.మహావంశం ఆధారంగా బిందుసార 28 సంవత్సరాలు పాలించాడు. చంద్రగుప్తుడి వారసుడిని "భద్రాసర" అని పిలిచే వాయు పురాణం, అతను 25 సంవత్సరాలు పరిపాలించాడని పేర్కొంది.

అశోక

మౌర్య సామ్రాజ్యం 
Aśంka pillar capital at Sarnath. ca. 250 BCE.
మౌర్య సామ్రాజ్యం 
Ashoka pillar at Vaishali.
మౌర్య సామ్రాజ్యం 
Fragment of the 6th Pillar Edict of Ashoka (238 BCE), in Brahmi, sandstone, British Museum.

యువ యువరాజుగా, అశోక (క్రీ.పూ. 272 ​​- 232) ఉజ్జయిని, తక్షశిలలో తిరుగుబాట్లను అణిచివేసిన తెలివైన శక్తిగా ఉన్నాడు. చక్రవర్తిగా ఆయన ప్రతిష్ఠాత్మకంగానూ ఆవేశపూరితంగానూ ఉన్నాడు. దక్షిణ, పశ్చిమ భారతదేశంలో సామ్రాజ్యం ఆధిపత్యాన్ని తిరిగి నొక్కి చెప్పాడు. కానీ ఆయన కళింగ (క్రీ.పూ. 262–261) ను జయించడం అతని జీవితంలో కీలకమైన సంఘటనగా నిరూపించబడింది. అశోక కళింగను ఒక పెద్ద ప్రాంతం మీద అధికారాన్ని స్థిరపరచడానికి అక్కడ ఒక కోటను నిర్మించాడు. రాజ సైనికులు, పౌర విభాగాల కళింగ దళాల మీద అశోకుడి సైన్యం విజయం సాధించినప్పటికీ తీవ్ర ఆవేశంతో జరిగిన యుద్ధంలో సైనికులు, పౌరులు కలిసి 1,00,000 మంది మరణించారు. ఇందులో 10,000 మందికి పైగా అశోకుడికి చెందిన సైనికులు ఉన్నారు. లక్షలాది మంది ప్రజల మరణం, యుద్ధవిధ్వంసం అశోకుడు ప్రతికూలంగా ప్రభావితమయ్యాడు. వినాశనాన్ని వ్యక్తిగతంగా చూసిన అశోకుడు పశ్చాత్తాపం చెందడం ప్రారంభించాడు. కళింగ అనుసంధానం పూర్తయినప్పటికీ అశోకుడు బౌద్ధమతం బోధలను స్వీకరించాడు. ఫలితంగా ఆయన యుద్ధం, హింసను త్యజించాడు. ఆయన ఆసియా చుట్టూ పర్యటించడానికి, బౌద్ధమతాన్ని ఇతర దేశాలకు వ్యాప్తి చేయడానికి మతబోధకుల బృందాలను పంపించాడు.[ఆధారం చూపాలి]

అశోకుడు అహింసా సూత్రాలతో వేట, హింసాత్మక క్రీడా కార్యకలాపాలను నిషేధించడానికి ఒప్పంద, బలవంతపు శ్రమకు ముగింపు అమలు చేశాడు (యుద్ధంలో దెబ్బతిన్న కళింగలో వేలాది మంది ప్రజలు శ్రమ, దాస్యంలోకి నెట్టబడ్డారు). ఆయన ఒక పెద్ద, శక్తివంతమైన సైన్యాన్ని కొనసాగిస్తూ శాంతిని స్థాపించాడు. అధికారాన్ని కొనసాగిస్తూ అశోకుడు ఆసియా, ఐరోపాలలో రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలను విస్తరించాడు. ఆయన బౌద్ధ కార్యకలాపాలకు మార్గదర్శకం చేశాడు. ఆయన దేశవ్యాప్తంగా భారీ మౌలిక నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాడు. 40 ఏళ్ళకు పైగా శాంతి సామరస్యం, శ్రేయస్సు అశోకడిని భారతీయ చరిత్రలో అత్యంత విజయవంతమైన, ప్రసిద్ధ రాజులలో ఒకటిగా చేసింది. ఆయన ఆధునిక భారతదేశంలో ప్రేరణకలిగించిన ఆదర్శవంతమైన చక్రవర్తిగా మిగిలిపోయాడు.[ఆధారం చూపాలి]

రాతితో అమర్చబడిన అశోకుడి శాసనాలు ఉపఖండం అంతటా కనిపిస్తాయి. పశ్చిమాన ఆఫ్ఘనిస్తాను, దక్షిణాన ఆంధ్ర (నెల్లూరు జిల్లా) వరకు అశోక శాసనాలు ఆయన విధానాలు, విజయాలను తెలియజేస్తాయి. ప్రధానంగా ప్రాకృతంలో వ్రాయబడినప్పటికీ వాటిలో రెండు గ్రీకు భాషలో, ఒకటి గ్రీకు - అరామికు భాషలలో వ్రాయబడ్డాయి. అశోకుడి శాసనాలు గ్రీకులు, కంబోజులు, గాంధారులు ఆయన సామ్రాజ్యం సరిహద్దు ప్రాంతం ప్రజలుగా ఉన్నట్లు సూచిస్తాయి. పశ్చిమంలోని గ్రీకు పాలకులకు మధ్యధరా వరకు అశోకుడు దూతలను పంపినట్లు వారు ధ్రువీకరిస్తున్నారు. ఆ సమయంలో హెలెనికు ప్రపంచంలోని ప్రతి పాలకులైన అమ్టియోకో (ఆంటియోకసు), తులమయ (టోలెమి), అమ్టికిని (ఆంటిగోనోసు), మాకా (మాగాసు), అలికసుదారో (అలెగ్జాండరు) అశోకుడు మతమార్పిడి గ్రహీతలుగా ఈ శాసనాలు కచ్చితంగా పేరు పెట్టాయి. శాసనాలు తమ భూభాగాన్ని "600 యోజనాల దూరంలో" (ఒక యోజనాలు 7 మైళ్ళు) కచ్చితంగా గుర్తించాయి. ఇది భారతదేశం, గ్రీసు మధ్య (సుమారు 4,000 మైళ్ళు) దూరానికి అనుగుణంగా ఉంటుంది.

పతనం

అశోకుడి బలహీనమైన రాజుల వారసత్వం 50 సంవత్సరాలు కొనసాగింది. ఆయన తరువాత అశోకుని మనవడు దశరథ మౌర్యుడు సింహాసం అధిష్టించాడు. ఆయన తరువాత అశోకు కుమారులు ఎవరూ సింహాసనాన్ని అధిష్టించలేదు. తన మొదటి కుమారుడు మహేంద్ర ప్రపంచవ్యాప్తంగా బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి పూనుకున్నాడు. కునల మౌర్యుడు గుడ్డివాడు కాబట్టి సింహాసనాన్ని అధిరోహించలేకపోయాడు. కౌర్వాకి కుమారుడు తివాలా అశోకుడి కంటే ముందే మరణించాడు. మరో కుమారుడు జలౌకా అతని వెనుక పెద్ద కథ లేదు.

ఈ సామ్రాజ్యం దశరథుని పాలనలో అనేక భూభాగాలను కోల్పోయింది. తరువాత వాటిని కునల కుమారుడు సంప్రాతి స్వాధీనం చేసుకున్నాడు. సంప్రాతి తరువాత మౌర్యాలు నెమ్మదిగా అనేక భూభాగాలను కోల్పోయారు. క్రీస్తుపూర్వం 180 లో బృహద్రత మౌర్యడిని ఆయన సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్ర షుంగా వధించాడు. ఆయనకు వారసుడు లేరు. అందువలన గొప్ప మౌర్య సామ్రాజ్యం చివరకు ముగింపుకు వచ్చి షుంగా సామ్రాజ్యం పుట్టుకొచ్చింది.

శుంగ తిరుగుబాటు (క్రీ.పూ 185)

బృహద్రాత హత్య, షుంగా సామ్రాజ్యం అభివృద్ధి బౌద్ధుల మీద మతపరమైన హింస అధికరించడానికి దారితీసిందని. హిందూ మతం పునరుద్ధరించబడిందని అశోకవదన వంటి బౌద్ధ రికార్డులు వ్రాస్తున్నాయి. సర్ జాన్ మార్షల్ ప్రకారం హింసకు ప్రధాన రచయిత పుష్యమిత్ర అయి ఉండవచ్చని భావించబడుతుంది. అయినప్పటికీ తరువాత షుంగా రాజులు బౌద్ధమతానికి ఎక్కువ మద్దతునిచ్చినట్లు తెలుస్తోంది. ఇతర చరిత్రకారులు ఎటియన్నే లామోట్టే రోమిలా థాపరు, బౌద్ధులను హింసించారనే ఆరోపణలకు అనుకూలంగా పురావస్తు ఆధారాలు లేవని దారుణాల విస్తృతి పరిమాణం అతిశయోక్తి అని వాదించారు.

ఇండో - గ్రీకు రాజ్య స్థాపన (క్రీ.పూ 180)

మౌర్యాల పతనం ఖైబరు పాసు అరక్షించితం చేసింది. ఫలితంగా విదేశీ దండయాత్ర తరంగాలను కొనసాగాయి. గ్రీకో-బాక్ట్రియను రాజు డెమెట్రియసు విజృంభించి క్రీ.పూ 180 లో దక్షిణ ఆఫ్ఘనిస్తాను, వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను జయించి ఇండో-గ్రీకు రాజ్యాన్ని స్థాపించాడు. ఇండో-గ్రీకులు ట్రాన్సు-సింధు ప్రాంతం మీద ఆధీనతను నిర్వహించి శతాబ్దానికి మధ్య భారతదేశంలోకి ప్రవేశించారు. వారి ఆధ్వర్యంలో బౌద్ధమతం అభివృద్ధి చెందింది. వారి రాజులలో ఒకరైన మేనందరు బౌద్ధమతంలో ప్రసిద్ధ వ్యక్తి అయ్యాడు. ఆయన ఆధునిక నగరమైన సియాలుకోట సాగాలా కొత్త రాజధానిని స్థాపించవలసి ఉంది. అయినప్పటికీ వారి డొమైనుల పరిధి, వాటి పాలన కాలం చాలా చర్చకు లోబడి ఉన్నాయి. క్రీస్తు జననం వరకు వారు ఉపఖండంలో ఆధీనత కలిగి ఉన్నారని ఆధారాలు సూచిస్తున్నాయి. షుంగాలు, శాతవాహనులు, కళింగులు వంటి స్వదేశీ శక్తులకు వ్యతిరేకంగా వారు సాధించిన విజయాలు స్పష్టంగా తెలియకపోయినా, ఇండో-సిథియన్లుగా పేరు మార్చబడిన సిథియను తెగలు క్రీస్తుపూర్వం 70 నుండి ఇండో-గ్రీకుల ముగింపుకు కారణం అయ్యాయి. ట్రాంసి-సింధు ప్రజలు మధుర ప్రాంతం, గుజరాతు ప్రాంతాలలో భూములను నిలుపుకున్నాయి.[ఆధారం చూపాలి]

మౌర్య సామ్రాజ్యం 
A representation of the Lion Capital of Ashoka, which was erected around 250 BCE. It is the emblem of India.
మౌర్య సామ్రాజ్యం 
Statuettes of the Maurya period, 4th-3rd century BCE. Musée Guimet.

ఆర్ధికం

మౌర్య సామ్రాజ్యం 
మౌర్య విగ్రహం, 2వ శతాబ్దం BCE.

దక్షిణ ఆసియాలో మొట్టమొదటిసారిగా రాజకీయ ఐక్యత, సైనిక భద్రత ఒక సాధారణ ఆర్థిక వ్యవస్థకు అవకాశం కలిగించాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం వాణిజ్యాన్ని మెరుగుపరిచాయి. వందలాది రాజ్యాలు, అనేక చిన్న సైన్యాలు, శక్తివంతమైన ప్రాంతీయ అధిపతులు, అంతర్గత యుద్ధాలు పాల్గొన్న మునుపటి పరిస్థితి క్రమశిక్షణ కలిగిన కేంద్ర అధికారానికి దారితీసింది. ప్రాంతీయ రాజుల నుండి రైతులు పన్ను, పంట సేకరణ భారం నుండి విముక్తి పొందారు. అర్థశాస్త్రంలో సూత్రాల ప్రకారం జాతీయంగా నిర్వహించబడే సరసమైన పన్నుల విధానం అమలుపరచబడింది. చంద్రగుప్త మౌర్యుడు భారతదేశం అంతటా ఒకే కరెన్సీని స్థాపించాడు. ప్రాంతీయ గవర్నర్లు, నిర్వాహకుల నెట్‌వర్క్, ఒక పౌర సేవ వ్యాపారులు, రైతులు, వ్యాపారులకు న్యాయం, భద్రతను అందించింది. మౌర్య సైన్యం చిన్న ప్రాంతాలలో తమ ఆధిపత్యాన్ని ప్రయత్నించిన బందిపోట్లు, ప్రాంతీయ ప్రైవేటు సైన్యాలు, శక్తివంతమైన అధిపతుల ముఠాను తుడిచిపెట్టింది. ఆదాయ సేకరణలో రెజిమెంటలు అయినప్పటికీ, ఉత్పాదకతను పెంపొందించడానికి మౌర్యుడు పలు ప్రజోపయోగ జలమార్గాలను కూడా అభివృద్ధి చేసింది. అయితే కొత్తగా కనుగొన్న రాజకీయ ఐక్యత, అంతర్గత శాంతి కారణంగా భారతదేశంలో అంతర్గత వాణిజ్యం బాగా విస్తరించింది.[ఆధారం చూపాలి]

ఇండో-గ్రీకు స్నేహ ఒప్పందం ప్రకారం అశోకుడి పాలనలో, అంతర్జాతీయ వాణిజ్యం విస్తరించింది. ప్రస్తుత పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను సరిహద్దులో ఉన్న ఖైబరు పాస్ బాహ్య ప్రపంచంతో వ్యాపారసంబంధాలు అభివృద్ధి చేయడానికి వాణిజ్యపరంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఓడరేవుగా మారింది. పశ్చిమ ఆసియాలోని గ్రీకు రాజ్యాలు, హెలెనికు రాజ్యాలు భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా మారాయి. వాణిజ్యం మలయా ద్వీపకల్పం ద్వారా ఆగ్నేయాసియా వరకు విస్తరించింది. భారతదేశం ఎగుమతులలో వస్తువులు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అన్యదేశ ఆహారాలు ఉన్నాయి. మౌర్యుడు సామ్రాజ్యంతో వాణిజ్యాన్ని విస్తరించి బాహ్య ప్రపంచం నుండి కొత్త శాస్త్రీయ జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించాడు. వేలాది రోడ్లు, జలమార్గాలు, కాలువలు, ఆస్పత్రులు, విశ్రాంతి గృహాలు, ఇతర ప్రజా మౌలిక నిర్మాణానికి కూడా అశోకుడు మార్గదర్శకం చేశాడు. పన్నులు, పంట సేకరణకు సంబంధించిన కఠినమైన పరిపాలనా పద్ధతులను సడలించడం సామ్రాజ్యం అంతటా ఉత్పాదకత, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి సహాయపడింది.[ఆధారం చూపాలి]

అనేక విధాలుగా మౌర్య సామ్రాజ్యంలో ఆర్థిక పరిస్థితి అనేక రోమను సామ్రాజ్యానికి సమానంగా ఉంటుంది. ఇద్దరికీ విస్తృతమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికీ కార్పొరేషన్ల మాదిరి సంస్థలు ఉన్నాయి. రోంలో సంస్థాగత సంస్థలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ప్రభుత్వ-ఆధారిత ప్రాజెక్టులకు ఉపయోగించబడుతున్నాయి. మౌర్యుడు భారతదేశంలో అనేక ప్రైవేటు వాణిజ్య సంస్థలు స్థాపించాడు. ఇవి పూర్తిగా ప్రైవేటు వాణిజ్యం కోసం పనిచేసాయి. మౌర్య సామ్రాజ్యంలో ఇవి అభివృద్ధి చెందాయి.

Maurya Empire coinage

మతం

జైనమతం

మౌర్య సామ్రాజ్యం 
Bhadrabahu Cave, Shravanabelagola where Chandragupta is said to have died

చంద్రగుప్తా మౌర్యుడు పదవీ విరమణ చేసిన తరువాత జైన మతాన్ని స్వీకరించాడు. ఆయన తన సింహాసనాన్ని, భౌతిక ఆస్తులను త్యజించినతరువాత సంచారం చేస్తున్న జైన సన్యాసుల సమూహంలో చేరాడు. చంద్రగుప్తుడు జైన సన్యాసి ఆచార్య భద్రాబాహు శిష్యుడు. తన చివరి రోజులలో కర్ణాటకలోని శ్రావణ బెల్గోల వద్ద, శాంతారా కఠినమైన కానీ స్వీయ-శుద్ధి చేసే జైన కర్మను (మరణం వరకు వేగంగా) గమనించినట్లు చెబుతారు. అశోకుడి మనవడు సంప్రతి కూడా జైన మతాన్ని పోషించాడు. సుహస్తిను వంటి జైన సన్యాసుల బోధనల ద్వారా సంప్రతి ప్రభావితమయ్యాడు. ఆయన భారతదేశం అంతటా 1,25,000 దరసరాలను నిర్మించాడని చెబుతారు. వాటిలో కొన్ని ఇప్పటికీ అహ్మదాబాదు, విరాంగాం, ఉజ్జయిని, పాలితానా పట్టణాలలో కనిపిస్తాయి. [ఆధారం చూపాలి]అశోకుడు, సంప్రాతి జైనమతం ప్రచారం చేయడానికి గ్రీకు, పర్షియా, మిడిలు ఈస్టులకు ప్రచారకులను పంపాడు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో పరిశోధనలు జరగలేదు.

ఆ విధంగా మౌర్య పాలనలో జైన మతం కీలక శక్తిగా మారింది. దక్షిణ భారతదేశంలో జైన మతం వ్యాప్తికి చంద్రగుప్తుడు, సంప్రతి ఘనత పొందారు. వారి పాలనలో లక్షలాది దేవాలయాలు, స్థూపాలు నిర్మించబడినట్లు చెబుతారు.

బుద్ధమతం

మౌర్య సామ్రాజ్యం 
The stupa, which contained the relics of Buddha, at the center of the Sanchi complex was originally built by the Maurya Empire, but the balustrade around it is Sunga, and the decorative gateways are from the later Satavahana period.
మౌర్య సామ్రాజ్యం 
The Dharmarajika stupa in Taxila, modern Pakistan, is also thought to have been established by Emperor Asoka.

సామ్రాజ్యం కేంద్రమైన మగధ బౌద్ధమతానికి కూడా జన్మస్థలంగా ఉంది. అశోకుడు మొదట్లో హిందూ మతాన్ని అభ్యసించాడు కాని తరువాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు; కళింగ యుద్ధం తరువాత, ఆయన విస్తరణ వాదం, తీవ్రమైన వేగంతో ఇంటెన్సివు పోలీసింగు, పన్ను వసూలు కొరకు, తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా క్రూరమైన చర్యలు, కఠినమైన ఆర్థిక నిషేధాలను త్యజించాడు. అశోకుడు తన కుమారుడు మహీంద, కుమార్తె సంఘమిత్ర నేతృత్వంలోని ఒక మతప్రచారక బృందాన్ని శ్రీలంకకు పంపాడు. శ్రీలంక రాజు టిస్సా బౌద్ధ ఆదర్శాలకు ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. అతను వాటిని స్వయంగా స్వీకరించి బౌద్ధమతాన్ని దేశజాతీయ మతంగా మార్చాడు. అశోకుడు పశ్చిమ ఆసియా, గ్రీసు ఆగ్నేయాసియాకు అనేక బౌద్ధ మతప్రచారక బృందాలను పంపాడు. మఠాలు, పాఠశాలల నిర్మాణంతో పాటు సామ్రాజ్యం అంతటా బౌద్ధ సాహిత్యాన్ని ప్రచురించాడు. ఆయన సాంచి, మహాబోధి ఆలయం వంటి భారతదేశం అంతటా 84,000 స్థూపాలను నిర్మించాడని నమ్ముతారు. సైబీరియాతో సహా ఆఫ్ఘనిస్తాను, థాయిలాండు, ఉత్తర ఆసియాలో బౌద్ధమతానికి ప్రజాదరణను భివృద్ధి చేసాడు. బౌద్ధ మతం సంస్కరణ, విస్తరణకు కృషి చేసిన కౌన్సిలు, భారతదేశం మూడవ బౌద్ధ మండలి, దక్షిణ ఆసియా బౌద్ధ ఆదేశాలను తన రాజధాని సమీపంలో ఏర్పాటు చేయడానికి అశోకుడు సహాయం చేశాడు. భారతీయ వ్యాపారులు బౌద్ధమతాన్ని స్వీకరించి మౌర్య సామ్రాజ్యం అంతటా మతాన్ని వ్యాప్తి చేయడంలో పెద్ద పాత్ర పోషించారు.

నిర్మాణ అవశేషాలు

మౌర్య సామ్రాజ్యం 
Mauryan architecture in the Barabar Caves. Lomas Rishi Cave. 3rd century BCE.

ఈ కాలపు గొప్ప స్మారక చిహ్నం, కుమ్రారు ప్రదేశంలో ఉన్న పాత రాజభవనం చంద్రగుప్త మౌర్యుని పాలనలో నిర్మించబడింది. సమీపంలోని కుమ్రారు స్థలంలో జరిపిన త్రవ్వకాల్లో రాజభవనం అవశేషాలు వెలికి తీయబడ్డాయి. ఈ రాజభవనం భవనాల సముదాయంగా భావించబడుతుంది. వీటిలో ముఖ్యమైనది విస్తారమైన కొయ్య స్తంభాల మద్దతుతో నిర్మించిన విస్తారమైన సభామంటపం ఉంది. స్తంభాలను సాధారణ వరుసలలో అమర్చారు. తద్వారా హాలును అనేక చిన్న చదరపు మండపాలుగా విభజించారు. స్తంభాల సంఖ్య 80, ఒక్కొక్కటి 7 మీటర్లు. మెగాస్టీనెసు వంటి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ ప్యాలెసు ప్రధానంగా కలపతో నిర్మించబడింది. ఈ రాజభవనం సుసా, ఎక్బాటానా రాజభవనాలను శోభ, గొప్పతనాన్ని మించిందని భావించారు. దాని పూతపూసిన స్తంభాలు బంగారు తీగలు, వెండి పక్షులతో అలంకరించబడ్డాయి. ఈ భవనాలు చేపల చెరువులతో నిండిన విస్తారమైన ఉద్యానవనంలో ఉన్నాయి. అనేక రకాల అలంకారమైన చెట్లు, పొదలతో అమర్చబడి ఉన్నాయి.[better source needed] కౌటిల్య అర్థశాస్త్రం ఈ కాలం నుండి ప్యాలెసు నిర్మాణ పద్ధతిని కూడా ఇస్తుంది. రాతి స్తంభాల శకలాలు, వాటి గుండ్రని ఆకృతి, మృదువైన మెరుగుతో సహా, అంతకుముందు చెక్కతో స్తంభాల స్థానంలో రాతి స్తంభాలను నిర్మాణానికి అశోకుడు బాధ్యత వహించినట్లు సూచిస్తుంది.[ఆధారం చూపాలి]

మౌర్య సామ్రాజ్యం 
An early stupa, 6 meters in diameter, with fallen umbrella on side. Chakpat, near Chakdara. Probably Maurya, 3rd century BCE.

అశోకుడి కాలంలో రాతిపని చాలా వైవిధ్యమైన క్రమంలో ఉంది. ఎత్తైన స్తంభాలు, స్థూపాల రెయిలింగ్లు, సింహాసనం, ఇతర వ్యక్తుల భారీ శిల్పాలు కలిగి ఉంది. ఈ సమయంలో రాతి వాడకం చాలా పరిపూర్ణతకు చేరుకుంది. రాతి కళ చిన్న శకలాలు కూడా చక్కటి ఎనామిలు వంటి అధికంగా మెరిసే పాలిషును ఇచ్చారు. ఈ కాలం బౌద్ధ పాఠశాల నిర్మాణానికి నాంది పలికింది. అశోకుడు అనేక స్థూపాల నిర్మాణానికి బాధ్యత వహించాడు. అవి పెద్ద గోపురాలు, బుద్ధుని చిహ్నాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి సాంచి, భార్హటు, అమరావతి, బోధగయ, నాగార్జునకొండ వద్ద ఉన్నాయి. మౌర్య వాస్తుశిల్పానికి అత్యంత విస్తృతమైన ఉదాహరణలు అశోక స్తంభాలు, అశోకుని కాలంలో చెక్కిన శాసనాలు ఉన్నాయి. తరచూ అద్భుతంగా అలంకరించబడి భారత ఉపఖండం అంతటా 40 కి పైగా వ్యాపించాయి.[better source needed]

నందంఘడు, సాంచి స్థూపం అశోక స్తంభాలు రాజచిహ్నం అయిన నెమళ్ళతో అలంకరించబడుతున్నట్లు వర్ణించబడింది.

Maurya structures and decorations at Sanchi
(3rd century BCE)
మౌర్య సామ్రాజ్యం 
Approximate reconstitution of the Great Stupa at Sanchi under the Mauryas.

పర్యావరణ చరిత్ర

మౌర్య సామ్రాజ్యం 
The two Yakshas, possibly 3rd century BCE, found in Pataliputra.

మౌర్య రాజవంశం నాటికి భారతదేశంలో జంతువుల రక్షణ తీవ్రమైన వ్యాపారంగా మారింది; భారతదేశంలో ఏకీకృత రాజకీయ సంస్థను అందించిన మొట్టమొదటి సామ్రాజ్యం కావడంతో, అడవులు, వాటి నివాసిత జంతుజాలం ​​పట్ల మౌర్యుల వైఖరి ఆసక్తిని కలిగిస్తుంది.

మౌర్యాలు మొదట అడవులను వనరులుగా చూశారు. వారికి అతి ముఖ్యమైన అటవీ ఉత్పత్తి ఏనుగు. ఆ కాలంలో సైనిక శక్తి గుర్రాలు, మనుషులపైనే కాకుండా యుద్ధ-ఏనుగులపై కూడా ఆధారపడింది; అలెగ్జాండరు మాజీ సైనికాధికారులలో ఒకరైన సెలూకసు ఓటమికి ఏంగులు ప్రధాన పాత్ర పోషించాయి. మౌర్యాలు ఏనుగుల సరఫరాను చౌకగా భద్రపరచడానికి ప్రయత్నించారు. అడవి ఏనుగులను పెంచడం కంటే వాటిని పట్టుకోవడం, మచ్చిక చేసుకోవడం, శిక్షణ ఇవ్వడానికి తక్కువ సమయం తీసుకున్నారు. కౌటిల్య అర్థశాస్త్రంలో పురాతన గణాంకాల గరిష్ఠాలు మాత్రమే కాకుండా, ఏనుగులు, అడవుల రక్షకుడు వంటి అధికారుల బాధ్యతలను నిస్సందేహంగా నిర్దేశిస్తుంది.

అడవి సరిహద్దులో ఆయన అటవీవాసుల రక్షణలో ఉన్న ఏనుగుల కోసం ఒక అడవిని ఏర్పాటు చేయాలి. " చీఫ్ ఎలిఫెంట్ ఫారెస్టరు " కార్యాలయం కాపలాదారుల సహాయంతో ఏ భూభాగంలోనైనా ఏనుగులను రక్షించాలి. ఏనుగును చంపినవారికి మరణశిక్ష విధించబడుతుంది-అర్ధశాస్త్రం

మౌర్యాలు కలప సరఫరాను రక్షించడానికి ప్రత్యేక అడవులను, అలాగే చర్మం కొరకు సింహాలు, పులులను కూడా సంరక్షించారు. ఇతర ప్రదేశాలలో దొంగలు, పులులు, ఇతర మాంసాహారులను తొలగించి పశువులను మేపడానికి అడవులను సురక్షితంగా ఉంచడానికి కూడా జంతువుల రక్షకుడు పనిచేశాడు.[ఆధారం చూపాలి]

మౌర్యులు కొన్ని అటవీ ప్రాంతాలను వ్యూహాత్మక లేదా ఆర్థిక పరంగా విలువైనదిగా భావించారు. వాటిపై నియంత్రణ చర్యలను ఏర్పాటు చేశారు. వారు అన్ని అటవీ తెగలను విశ్వసించ లేదు. లంచం, రాజకీయ అణచివేతతో వారిని నియంత్రించారు. సరిహద్దులను కాపాడటానికి, జంతువులను వలలో వేయడానికి, ఆహారం సేకరించడానికి వారు వారిలో కొంతమందిని అరణ్యకులుగా నియమించారు. కొన్నిసార్లు ఉద్రిక్తత, సంఘర్షణతో కూడిన సంబంధం మౌర్యులకు వారి విస్తారమైన సామ్రాజ్యాన్ని కాపాడటానికి వీలు కల్పించింది.

పరిపాలన చివరి భాగంలో అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత ఆయన తన పాలనా శైలిలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చాడు. ఇందులో జంతుజాలానికి రక్షణ కల్పించి రాజ వేటను కూడా వదులుకున్నాడు. వన్యప్రాణుల పరిరక్షణ చర్యలను సమర్థించిన చరిత్రలో మొదటి పాలకుడు [రాజు]గా రాతి శాసనాలు కూడా ఉన్నాయి. జంతువుల వధను వదులుకోవడంలో చాలామంది రాజు మార్గాన్ని అనుసరించారని శాసనాలు ప్రకటించాయి; వారిలో ఒకరు గర్వంగా ఇలా చెబుతున్నారు:

మా రాజు చాలా తక్కువ జంతువులను చంపాడు. ఐదవ స్తంభంపై శాసనం)

అయినప్పటికీ అశోకుడి శాసనాలు వాస్తవ సంఘటనల కంటే పాలకుల కోరికను ప్రతిబింబిస్తాయి; రాజ వేట సంరక్షణలో జింకలను వేటాడినందుకు 100 'పనాస ' (నాణేలు) జరిమానా ప్రస్తావించడం చట్టాన్ని అతిక్రమించే వారు ఉన్నట్లు చూపిస్తుంది. చట్టపరమైన ఆంక్షలు సాధారణ ప్రజలు వేటాడటం, నరికివేయడం, చేపలు పట్టడం - అడవుల్లో మంటలు వేయడంలో పద్ధతులతో విభేదించాయి.

హెలెనిస్టికు ప్రపంచంతో సంబంధాలు

మౌర్య సామ్రాజ్యం 
Mauryan ringstone, with standing goddess. Northwest Pakistan. 3rd Century BCE

సంరాజ్య స్థాపన

మౌర్య సామ్రాజ్యం ప్రారంభం నుండే హెలెనిస్టికు ప్రపంచంతో సంబంధాలు ప్రారంభమై ఉండవచ్చు. చంద్రగుప్తా మౌర్యుడు అలెగ్జాండరు ది గ్రేట్‌తో కలిశారని (బహుశా వాయవ్యంలో తక్షశిలా ప్రాంతంలో):

"సాండ్రోకోటసు స్ట్రిప్లింగుగా ఉన్నప్పుడు అలెగ్జాండరును చూశాడు. అలెగ్జాండరు తనను దేశానికి అధిపతిగా చేయడాన్ని తృటిలో తప్పిందని తరువాతి కాలంలో సాండ్రోకోటసు చెప్పాడని మాకు చెప్పబడింది. ఎందుకంటే దాని రాజు తన తక్కువ పుట్టుకను అసహ్యించుకుని తృణీకరించబడ్డాడు ". ప్లూటార్కు 62-4

వాయవ్యప్రాంతం తిరిగి జయించుట (c. క్రీ.పూ.317–316)

అలెగ్జాండరు (జస్టిను) తరువాత చంద్రగుప్తుడు చివరికి వాయవ్య భారతదేశాన్ని ఆక్రమించాడు. అక్కడ గ్రీకులు గతంలో పాలించిన భూభాగాలలో ఆయన సాత్రపీలతో (పాశ్చాత్య మూలాల్లో "ప్రిఫెక్ట్సు"గా వర్ణించబడ్డాడు) పోరాడాడు. వీరిలో పశ్చిమంలో పాలకుడు యుడెమసు ఉండవచ్చు (క్రీ.పూ 317 లో పంజాబు వదిలి వెళ్ళే వరకు) క్రీస్తుపూర్వం 316 లో సింధు తీరప్రాంతాలలో గ్రీకు కాలనీల పాలకుడు అజెనోరు కుమారుడు పీతాను బాబిలోను బయలుదేరే వరకు పాలన సాగించి ఉండవచ్చు.[ఆధారం చూపాలి]

"అలెగ్జాండరు మరణం తరువాత బానిసత్వ భారాన్ని కదిలించినట్లుగా ఆయన రాజప్రతినిధులను భారతీయప్రజానీకం హత్య చేసింది. ఈ విముక్తికి రచయిత సాండ్రాకోటోసు కానీ ఆయన విజయం తరువాత బానిసత్వం ప్రజలకు నుండి విముక్తిని కలిగించాడు. సింహాసనాన్ని తీసుకున్న తరువాత ఆయన ప్రజలు విదేశీ ఆధిపత్యం నుండి విముక్తి పొందిన వ్యక్తులు అయ్యారు. "జస్టిన్ XV.4.12-13

"తరువాత అతను అలెగ్జాండరు ప్రతినిధులకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక పెద్ద అడవి ఏనుగు అతని వద్దకు వెళ్లి అతనిని మచ్చిక చేసుకున్నట్లుగా తన వెనుకకు తీసుకువెళ్ళింది. అతను గొప్ప పోరాట యోధుడు, యుద్ధ నాయకుడయ్యాడు. ఆ విధంగా రాజ్యాధికారాన్ని సంపాదించిన తరువాత సాండ్రాకోటోసు భారతదేశంలో ఉన్నాడు. ఆ సమయంలో సెలూకోసు భవిష్యత్తు కీర్తిని సిద్ధం చేస్తున్నాడు. " జస్టిన్ XV.4.19 possidebat."

సెల్యూకసుతో సంఘర్షణ - సంధి(క్రీ.పూ.305)

మౌర్య సామ్రాజ్యం 
A map showing the north western border of Maurya Empire, including its various neighboring states.

అలెగ్జాండరు పూర్వ సామ్రాజ్యం ఆసియా భాగానికి చెందిన మాసిడోనియా సాట్రాపీ అయిన మొదటి సెలూకసు నికేటరు, తన స్వంత అధికారం కలిగిన బాక్ట్రియా, సింధు (అప్పియను, హిస్టరీ ఆఫ్ రోం, ది సిరియా వార్సు 55) తూర్పు భూభాగాల వరకు స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.పూ 305 లో వరకు చక్రవర్తి చంద్రగుప్తుడు, సెల్యూకసు మద్య సంఘర్షణ జరిగింది:

""పొరుగు దేశాల కోసం ఎల్లప్పుడూ వేచి ఉండి, ఆయుధాలతో బలంగా కౌన్సిలును ఒప్పించేవాడు. ఆయన [సెలూకసు] మెసొపొటేమియా, అర్మేనియా, 'సెలూసిదు' కప్పడోసియా, పెర్సిసు, పార్థియా, బాక్టీరియా, అరేబియా, టాపోరియా, సోగ్డియా, అరాకోసియా, హిర్కానియా, ఇతర అలెగ్జాండరు చేత అణచివేయబడిన పొరుగున ఉన్న ప్రజలు, సింధు నది వరకు పొందాడు. అలెగ్జాండరు తరువాత అతని సామ్రాజ్యం సరిహద్దులు ఆసియాలో చాలా విస్తృతంగా అభివృద్ధి చెందాయి. ఫ్రిజియా నుండి సింధు వరకు మొత్తం ప్రాంతం సెలూకసుకు లోబడి ఉంది ". అప్పీను హిస్టరీ ఆఫ్ రోమ్, ది సిరియన్ వార్స్ 55

సంఘర్షణకు సంబంధించిన వివరణలు ఏవీ లేనప్పటికీ భూభాగాన్ని జయించడంలో విఫలమైనందున, సెలూకసు భారత చక్రవర్తిపై పేలవంగా వ్యవహరించాడని స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి అప్పటికే అతనికి చాలా వరకు లొంగిపోవలసి వచ్చింది. సెలూకసు, చంద్రగుప్తుడు చివరికి ఒక పరిష్కారానికి చేరుకున్నారు. క్రీస్తుపూర్వం 305 లో మూసివేయబడిన ఒక ఒప్పందం ద్వారా స్ట్రాబో ప్రకారం సెలూకసు చంద్రగుప్తుడికి తూర్పు ఆఫ్ఘనిస్తాను, బలూచిస్తాన్లతో సహా అనేక భూభాగాలను అప్పగించారు.[ఆధారం చూపాలి]

సైనిక సంబంధాలు

303 లో చంద్రగుప్తుడు సెల్యూకసుతో చేసుకున్న శాంతి ఒప్పందం వైవాహిక కూటమితో ముగించాడు. బదులుగా చంద్రగుప్తుడు విస్తారమైన భూభాగాలను అందుకున్నాడు. ప్రతిగా సెలూకసుకు 500 యుద్ధ ఏనుగులను ఇచ్చాడు. ఇవి క్రీ.పూ 301 లో సైనికశక్తిగా ఇప్ససు యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. ఈ ఒప్పందంతో పాటు సెలూకసు మెగాస్టీనెసును ఒక రాయబారిగా చంద్రగుప్తుడి రాజసభలో నియమించాడు. తరువాత డీమాకోసును తన కుమారుడు బిందుసారకు పటాలిపుత్ర (బీహారులోని ఆధునిక పాట్నా) లోని మౌర్యుల రాజసభలో పనిచేయడానికి పంపించాడు. తరువాత టోలెమికు ఈజిప్టు పాలకుడు, అశోకునికి సమకాలీనుడైన రెండవ టోలెమి ఫిలడెల్ఫసు " ప్లినీ ది ఎల్డరు డయోనిసియసు " అనే రాయబారిని మౌర్య రాజసభకు పంపినట్లు నమోదు చేయబడింది.[better source needed]

సింధుకు పశ్చిమంలో ఉన్న భూభాగంలోని హిందూ కుషు, ఆధునిక ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బలూచిస్తాను వంటి విస్తారమైన భూభాగాలను చంద్రగుప్తునికి అందించబడ్డాయిని ప్రధాన స్రవంతి స్కాలర్షిప్పు పేర్కొంది. పురావస్తుపరంగా అశోక శాసనాలు వంటి మౌర్య పాలన దృఢమైనమైన ఆధారాలు దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని కందహారు వరకు కనిపిస్తుంటాయి.

"" ఆయన (సెలూకసు) సింధును దాటి భారతీయుల రాజు సాండ్రోకోటసు [మౌర్యుడు] తో యుద్ధం చేశాడు. వారు ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహ సంబంధాన్ని కుదుర్చుకునే వరకు వారు ఆ ప్రవాహం ఒడ్డున నివసించారు. " " 55
"" అతనితో (సాండ్రాకోటోసు) ఒక ఒప్పందం కుదుర్చుకుని, ఓరియంటు పరిస్థితిని క్రమబద్ధీకరించిన తరువాత, సెలూకసు యాంటిగోనసుపై యుద్ధానికి దిగాడు. " "XV.4.15

-జూనియసు జస్టినసు, హిస్టోరియం ఫిలిప్పికరం, లిబ్రీ XLIV, XV.4.15

"ఎపిగామియా" ఒప్పందం గ్రీకులు, భారతీయుల మధ్య చట్టబద్ధమైన వివాహం రాజ్యస్థాయిలో గుర్తించబడిందని సూచిస్తుంది. అయినప్పటికీ ఇది రాజవంశ పాలకులలో మాత్రమేనా లేదా సామాన్య ప్రజలలో జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.[ఆధారం చూపాలి]

పరస్పర కానుకల పరిమార్పు

చంద్రగుప్తుడు తన కోరికలతో కూడిన శాంతిసందేశాన్ని సెలూకసుకు పంపిన తరువాత వారి ఒప్పందాన్ని అనుసరించి చంద్రగుప్తుడు, సెలూకసు పరస్పర బహుమతులను మార్పిడి చేసుకున్నారని శాస్త్రీయ వర్గాలు నమోదు చేశాయి. :

", థియోఫ్రాస్టసు అటువంటి విషయాలలో [ప్రజలను మరింత రంజింపజేయడానికి] అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని చెప్తాడు. ఫిలార్కసు ఆయను ధృవీకరించాడు. భారతీయుల రాజు సాండ్రాకోటసు సెలూకసుకు పంపిన కొన్ని బహుమతుల గురించి ప్రస్తావించాడు; అద్భుతమైన ప్రేమను ఉత్పత్తి చేయడంలో మనోజ్ఞతను ప్రదర్శించడం, కొంతమంది దీనికి విరుద్ధంగా, ప్రేమను బహిష్కరించడం. " నౌక్రాటిసు ఎథీనియసు, "ది డీప్నోసోఫిస్ట్సు" మొదటి బుక్కు, అధ్యాయం 32

అతని కుమారుడు బిందుసరుడు 'అమిత్రాఘట' (స్లేయరు ఆఫ్ ఎనిమీసు) కూడా మొదటి ఆంటియోకసుతో బహుమతులు మార్పిడి చేసినట్లు క్లాసికలు మూలాలలో నమోదు చేయబడింది:

"కానీ ఎండిన అత్తి పండ్లను పురుషులందరూ చాలా అధికంగా కోరుకున్నారు (నిజంగా, అరిస్టోఫేన్సు చెప్పినట్లుగా," ఎండిన అత్తి పండ్ల కంటే మంచిగా ఏమీ లేదు "), భారతీయుల రాజు అమిట్రోచాట్సు కూడా ఆంటియోకస్కు వ్రాస్తూ, (అది ఈ కథను చెప్పే హెగెసాండరు) ఆయనకు కొంచెం తీపి వైన్, కొన్ని ఎండిన అత్తి పండ్లను, ఒక సోఫిస్టు కొని పంపించమని ఆయనను వేడుకున్నాడు;, ఆంటియోకసు "పొడి అత్తి పండ్లను, తీపి వైన్ మేము మీకు పంపుతాము; గ్రీసులో ఒక సోఫిస్టును విక్రయించడం చట్టబద్ధం కాదు. "ఎథీనియసు," ఆయనకు సమాధానం రాశాడు. డీప్నోసోఫిస్టే "XIV.67

భారతదేశంలో గ్రీకు ప్రజలు

అశోక పాలనలో భారత ఉపఖండం వాయువ్యంలో ఉంది. సింధు లోయ ప్రాంతంలో అలెగ్జాండరు సాధించిన విజయాల అవశేషాలు. అశోక రాతి శాసనాలలో కొన్ని గ్రీకు భాషలో చెక్కబడి ఉన్నాయి. అశోకుడు తన ఆధిపత్యంలో ఉన్న గ్రీకులను బౌద్ధమతంలోకి మార్చారని పేర్కొన్నాడు:

    "ఇక్కడ గ్రీకులు, కంబోజులు, నభాకులు, నభపమ్కిట్లు, భోజులు, పిటినికులు, ఆంధ్రలు, పాలిదాసు రాజులు ప్రజలు ధర్మంలో ప్రియమైన-దేవతల సూచనలను అనుసరిస్తున్నారు." (రాతి శాసనం సంఖ్య 13)

    మౌర్య సామ్రాజ్యం 
    పాకిస్తాన్లోని కెపికెలోని షాబాజుబర్హిలో అశోకుడి శాసనం

"ఇప్పుడు, గతంలో (నైతికత మహామత్రాలు అని పిలువబడే అధికారులు) ఇంతకుముందు లేరు. పదమూడు సంవత్సరాలు అభిషేకం చేసిన నా చేత (నేను ఉన్నప్పుడు) నైతికత మహామాత్రాలను నియమించారు. నైతికతను స్థాపించడంలో, నైతికతను ప్రోత్సహించడంలో గ్రీకులు, కాంబోజాలు, గాంధారలలో, ఇతర పాశ్చాత్య సరిహద్దులు (నాది) ఉన్నవారిలో (కూడా) నైతికతకు అంకితమైన వారి సంక్షేమం, ఆనందం కోసం. " (రాతి శాసనం సంఖ్య 5)

మౌర్య సామ్రాజ్యం 
అశోకుడు కందహారు శాసనం, కందహారు నుండి రాజు అశోకుడు రాసిన ద్విభాషా శాసనం (గ్రీకు అరామికు). కాబూలు మ్యూజియం. (అనువాదం కోసం చిత్రం క్లిక్ చేయండి)

శాసనం 13 శకలాలు గ్రీకు భాషలో ఉన్నట్లు కనుగొనబడ్డాయి. గ్రీకు, అరామికు రెండింటిలోనూ వ్రాయబడిన పూర్తి శాసనం కందహారులో కనుగొనబడింది. ఇది అధునాతన తాత్విక పదాలను ఉపయోగించి అద్భుతమైన క్లాసికలు గ్రీకులో వ్రాయబడిందని చెబుతారు. ఈ శాసనం లో, అశోక తన ఇతర శాసనాలు సర్వత్రా "ధర్మం" కోసం గ్రీకు అనువాదంగా యూసేబియా ("భక్తి") అనే పదాన్ని ప్రాకృతంలో మూస:Npsn

    "పదేళ్ళు (పాలన) పూర్తయిన తరువాత రాజు పియోడాస్సేసు (అశోకుడు) భక్తి (εὐσέβεια, యూసేబీయా) ను పురుషులకు తెలియజేశాడు; ఈ క్షణం నుండి అతను ప్రజలను మరింత ధర్మవంతులుగా చేసాడు. ఇది ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది. రాజు జీవులను (చంపడం) మానేసాడు. ఇతరులు (రాజు) వేటగాళ్ళు, మత్స్యకారులు వేటాడటం మానేశారు. వారి తండ్రి - తల్లి, పెద్దలకు విధేయులుగా, గతానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా ప్రతి సందర్భంలోనూ వ్యవహరించడం ద్వారా వారు మరింత సంతోషంగా జీవిస్తారు ". (ట్రాన్స్. జి.పి. కారటెల్లి చేత [1]): [1])[నమ్మదగని మూలం?]

పశ్చిమ ప్రాంతాలకు బౌద్ధ మతప్రచార బృందాలు (c.క్రీ.పూ 250)

అలాగే అశోక శాసనాలలో అశోక ఆ కాలంలోని హెలెనిస్టికు రాజులను తన బౌద్ధ మతమార్పిడి గ్రహీతలుగా పేర్కొన్నాడు అయినప్పటికీ ఈ సంఘటన గురించి పాశ్చాత్య చారిత్రక వ్రాతపూర్వక ఆధారాలు లేవు:

"ఇక్కడ, సరిహద్దులలో, ఆరు వందల యోజనాలు (5,400–9,600 కిమీ) దూరంలో ధర్మం విజయం ఉంది. ఇక్కడ అలెగ్జాండరు పాలనలోని ఆంటియోకోసు, టోలెమి, ఆంటిగోనోసు, మాగాసు అనే నలుగురు రాజులు, అదేవిధంగా దక్షిణాన చోళులు, పాండ్యులు, తమరపర్ణి (శ్రీలంక) వరకు ఉన్నారు. " (అశోకుడి శాసనాలు, 13 వ రాతి శాసనం, ఎస్. ధమ్మికా).మూస:Npsn

మనుషులు, జంతువులకు, వారి భూభాగాలలో ఆయుర్వేద ఔషధం అభివృద్ధిని కూడా అశోకుడు ప్రోత్సహించాడు:

    "ప్రియమైన-దేవతలలో రాజు పియాదాసి [అశోకుడు] రాజ్యం, సరిహద్దుల తురావాత ఉన్న ప్రజలలో, చోళులు, పాండ్యాలు, సత్యపుత్రులు, కేరళపుత్రులు, తమరపర్ణి వరకు, గ్రీకు రాజు ఆంటియోకోసు పాలించిన చోట, ఆంటియోకోసు పొరుగువారైన రాజులలో, ప్రతిచోటా ప్రియమైన-దేవతల ప్రాంతంలో రాజా పియాదాసి, రెండు రకాల వైద్య చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు: మానవులకు వైద్య చికిత్స, జంతువులకు వైద్య చికిత్స. ఎక్కడైతే మానవులకు లేదా జంతువులకు అనువైన వైద్య మూలికలు అందుబాటులో లేవో అక్కడ నేను వాటిని దిగుమతి చేసుకున్నాను. వైద్య మూలాలు లేదా పండ్లు అందుబాటులో లేని చోట నేను వాటిని దిగుమతి చేసుకున్నాను. రోడ్ల వెంట నేను బావులు తవ్వి, మనుషుల, జంతువుల ప్రయోజనం కోసం చెట్లను నాటాను ". 2 వ రాతిశాసనం.మూస:Npsn

బౌద్ధమతం ప్రచారంలో భారతదేశంలోని గ్రీకులు కూడా చురుకైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ధర్మరక్షిత వంటి అశోకు దూతలు, పాలి మూలాలలో ప్రముఖ గ్రీకు ("యోనా") బౌద్ధ సన్యాసులు, బౌద్ధ మతమార్పిడి కార్యక్రమాలలో చురుకుగా ఉన్నారు. (మహావంశ, XII [113]:

మూస:Npsn).

సుభగసేన, మూడవ ఆంటియోచోసు (క్రీ.పూ 206)

సుభగసేనుడు క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దానికి చెందిన ఒక భారతీయ మౌర్య పాలకుడని పురాతన గ్రీకు మూలాలలో వివరించబడింది. ప్రాకృతంలో సుభాగసేన లేదా సుభాశసేన అని పేరు పెట్టారు. ఆయన పేరు మౌర్య రాకుమారుల జాబితాలో [ఒకప్పుడు], యాదువ రాజవంశం జాబితాలో, ప్రద్యుమ్నుని వారసుడిగా పేర్కొనబడింది. ఆయన అశోకు మనవడు లేదా అశోకుడి కుమారుడు కునాలా అయి ఉండవచ్చు. ఆయన హిందూ కుషుకు దక్షిణంగా, బహుశా గాంధారాలో పరిపాలించాడు. ఆంటియోకోసు, సెలూసిదు రాజు, బాక్ట్రియాలో యూతిడెమసుతో సంధి చేసిన తరువాత క్రీస్తుపూర్వం 206 లో భారతదేశానికి వెళ్లి అక్కడ ఉన్న భారత రాజుతో స్నేహాన్ని పునరుద్ధరించాడని చెబుతారు:

"ఆయన (ఆంటియోకసు) కాకససు దాటి భారతదేశంలోకి దిగాడు; భారతీయ రాజు సోఫాగసేనసుతో తన స్నేహాన్ని పునరుద్ధరించాడు; మొత్తం నూట యాభైకంటే అధికంగా ఎక్కువ ఏనుగులను అందుకున్నాడు; మరోసారి తన దళాలను సమకూర్చుకుని, వ్యక్తిగతంగా మళ్ళీ ఆయన సైన్యంతో బయలుదేరాడు. అతని సైన్యం: ఈ రాజు అతనికి అప్పగించడానికి అంగీకరించిన నిధిని ఇంటికి తీసుకెళ్లడానికి సిజికస్కు చెందిన ఆండ్రోస్తేనిసును అక్కడ విడిచిపెట్టాడు". Polybius 11.39మూస:Npsn

Timeline

  • 322 BCE: Chandragupta Maurya founded the Mauryan Empire by overthrowing the Nanda Dynasty.
  • 317–316 BCE: Chandragupta Maurya conquers the Northwest of the Indian subcontinent.
  • 305–303 BCE: Chandragupta Maurya gains territory from the Seleucid Empire.
  • 298–269 BCE: Reign of Bindusara, Chandragupta's son. He conquers parts of Deccan, southern India.
  • 269–232 BCE: The Mauryan Empire reaches its height under Ashoka, Chandragupta's grandson.
  • 261 BCE: Ashoka conquers the kingdom of Kalinga.
  • 250 BCE: Ashoka builds Buddhist stupas and erects pillars bearing inscriptions.
  • 184 BCE: The empire collapses when Brihadnatha, the last emperor, is killed by Pushyamitra Shunga, a Mauryan general and the founder of the Shunga Empire.

ఇవికూడా చూడండి

మూలాలు

Tags:

మౌర్య సామ్రాజ్యం పేరు వెనుక చరిత్రమౌర్య సామ్రాజ్యం చరిత్రమౌర్య సామ్రాజ్యం ఆర్ధికంమౌర్య సామ్రాజ్యం మతంమౌర్య సామ్రాజ్యం నిర్మాణ అవశేషాలుమౌర్య సామ్రాజ్యం పర్యావరణ చరిత్రమౌర్య సామ్రాజ్యం హెలెనిస్టికు ప్రపంచంతో సంబంధాలుమౌర్య సామ్రాజ్యం Timelineమౌర్య సామ్రాజ్యం ఇవికూడా చూడండిమౌర్య సామ్రాజ్యం మూలాలుమౌర్య సామ్రాజ్యంఅలెగ్జాండర్చంద్రగుప్త మౌర్యుడుమౌర్య వంశం

🔥 Trending searches on Wiki తెలుగు:

రతన్ టాటాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారతదేశ చరిత్రశిబి చక్రవర్తిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థహైపర్ ఆదిరౌద్రం రణం రుధిరంపార్వతికుండలేశ్వరస్వామి దేవాలయంతెలుగుపచ్చకామెర్లురైతునాగార్జునసాగర్నాగ్ అశ్విన్హస్తప్రయోగంఅష్ట దిక్కులుకాజల్ అగర్వాల్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఅంగచూషణవాతావరణంనిర్మలా సీతారామన్ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారత ఆర్ధిక వ్యవస్థసన్నాఫ్ సత్యమూర్తిఅరుణాచలంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్భూమన కరుణాకర్ రెడ్డిరుద్రమ దేవినక్షత్రం (జ్యోతిషం)ఆర్యవైశ్య కుల జాబితాభారత రాజ్యాంగ సవరణల జాబితాఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితారామాయణంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితామహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంకృతి శెట్టికమల్ హాసన్విరాట్ కోహ్లిరాహువు జ్యోతిషంచేతబడిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ఉత్తరాభాద్ర నక్షత్రముఉత్తరాషాఢ నక్షత్రమువంగవీటి రంగాప్రకాష్ రాజ్ఆది శంకరాచార్యులుమహేంద్రగిరితెలంగాణ రాష్ట్ర సమితిఎన్నికలుభారతరత్నతోటపల్లి మధుభారత సైనిక దళంకూచిపూడి నృత్యంఅమెజాన్ ప్రైమ్ వీడియోవారాహిచంద్రుడుగోదావరిదాశరథి కృష్ణమాచార్యరెడ్యా నాయక్ప్రకృతి - వికృతిచతుర్యుగాలుకాలేయంఊరు పేరు భైరవకోనఋగ్వేదంభారతదేశ జిల్లాల జాబితాతెలుగు సాహిత్యంఎయిడ్స్గురజాడ అప్పారావువందేమాతరంభారతదేశంకన్యారాశిసింగిరెడ్డి నారాయణరెడ్డితాన్యా రవిచంద్రన్తాజ్ మహల్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంతెలుగు సంవత్సరాలు🡆 More