కమ్యూనిజం భావజాలంతో భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ.
దీని ఆంగ్ల పేరు (Communist Party of India (CPI)) లోని ప్రథమాక్షరాలతో సిపిఐగా లేక భా.క.పాగా పేరుపొందింది.ఈ పార్టీ డిసెంబరు 26 1925 స్థాపించబడింది. 1964లో దీనిలోని అతివాద వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)గా విడిపోయింది.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | |
---|---|
Secretary-General | సురవరం సుధాకర రెడ్డి |
స్థాపన తేదీ | డిసెంబరు 26, 1925 |
ప్రధాన కార్యాలయం | ఢిల్లీ |
పార్టీ పత్రిక | New Age (English), Mukti Sangharsh (Hindi), Kalantar (Bengali), Janayugam daily (Malayalam), Visalandra Daily (Telugu) Andhrapradesh, JANASAKTHI Daily (Tamil) Tamilnadu |
విద్యార్థి విభాగం | All India Students Federation |
యువత విభాగం | All India Youth Federation |
మహిళా విభాగం | National Federation of Indian Women |
కార్మిక విభాగం | All India Trade Union Congress and Bharatiya Khet Mazdoor Union |
రైతు విభాగం | All India Kisan Sabha (Ajoy Bhavan) |
రాజకీయ విధానం | కమ్యూనిజం |
International affiliation | International Conference of Communist and Workers' Parties. |
Colours | Red |
కూటమి | Left Front |
లోక్సభ స్థానాలు | 2 / 543 |
రాజ్యసభ స్థానాలు | 1 / 245 |
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) పార్టీ 1925 చివరలో కాన్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోలో స్థాపించబడింది, భారతదేశం లోపల, బయట చాలా మంది ప్రజలు ఉపఖండంలో కమ్యూనిస్ట్ ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నించారు. 1920 లో తాష్కెంట్లో (ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లో) మనబేంద్ర నాథ్ రాయ్, అబాని ముఖర్జీ,రాయ్ భార్య ఎవెలిన్ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన వారు. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తమ లక్ష్యాలలో మిలిటెంట్ సామ్రాజ్యవాద దేశభక్తిని అంతర్జాతీయవాదంతో కలిపి మోహన్దాస్ కె. గాంధీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) నేతృత్వంలోని అహింసాత్మక శాసనోల్లంఘన (సత్యాగ్రహ) ప్రచారాలకు ఒక ఉద్యమాన్ని ప్రారంభించాయి . అయితే, ఆ సమయంలో, బ్రిటీష్ పరిపాలన కమ్యూనిస్ట్ కార్యకలాపాలపై సాధారణ నిషేధాన్ని విధించింది, పార్టీకి వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంది, పార్టీ నాయకులను 1929 లో జైళ్ళలో వేయడంతో సహా సిపిఐ సంస్థాగతంగా బలహీనంగా ఉండి, పార్టీ అయ్యే వరకు రహస్యంగా పనిచేయడానికి ఆంక్షలు విధించారు . తర్వాత 1942 లో రద్దు చేయబడింది. 1947 లో భారతదేశం వచ్చిన తరువాత కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ( సిపిఐ) బలపడింది . కమ్యూనిస్ట్ పార్టీ ( సి.పి .ఐ ) మహిళలకు సామాజిక సమానత్వం, పెద్దలందరికీ ఓటు హక్కు, ప్రైవేటు యాజమాన్యంలోని సంస్థల జాతీయం, భూ సంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం ( అంటరానివారితో సహా), సమ్మెల ద్వారా నిరసన తెలపడం, వంటివి పార్టీ యొక్క ప్రజాదరణను పెంచాయి. 1951 లో పార్టీ "జాతీయ ప్రజాస్వామ్యం" అని ప్రజలకు పిలుపునిచ్చింది. పార్టీ 1950 నుంచి దేశములో జరిగిన ఎన్నికలలో ( లోక్ సభ, రాజ్య సభ ) 1951, 1957, 1962 కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఇది చాలా తక్కువ సీట్లను పొంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా దేశములో అవతరించింది. 1957 లో సిపిఐ కేరళలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ను ఓడించింది, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్మొ ముఖ్యమంత్రిగా భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేరళలలో నంబూద్రిపాద్ ప్రభుత్వం అనేక సంస్కరణలను ( భూ సంస్కరణ, విద్యా విధానములో ) ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణ లతో వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరిగినవి
భారతదేశములో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిన వ్యక్తులు : ఎం. ఎన్. రాయ్, ఎవెలిన్ రాయ్-ట్రెంట్, అబాని ముఖర్జీ, రోసా ఫిటింగోవ్, మహ్మద్ అలీ, మొహమ్మద్ షఫీక్, . సి .పి.ఐ పార్టీ యొక్క కార్యక్రమాన్ని భారతదేశ పరిస్థితులకు తగినట్లుగా రూపొందించాలని నిర్ణయించింనారు ఎస్ . వి . ఘటే మొదటి జనరల్ సెక్రటరీ, కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ( 1925-1933) వరకు
భా.క.పా. భారత ఎన్నికల కమీషను చే జాతీయ పార్టీగా గుర్తింపబడింది. As of 2019[update] భా.క.పా. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డి. రాజా. కె. నారాయణ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.
సి.పి.ఐ.కి చెందిన అనుబంధ సంస్థలు:
ఎన్నిక సంవత్సరం | పోటీచేసిన స్థానాలు | గెలిచిన స్థానాలు |
---|---|---|
1999 | 54 | 4 |
2004 | 34 | 10 |
2009 | 56 | 4 |
2014 | 67 | 1 |
2019 | 49 | 2 |
No | Photo | Name | Tenure |
---|---|---|---|
1st | దస్త్రం:SV GHATE.jpg | సచ్చిదానంద్ విష్ణు ఘటే | 1925-1933 |
2nd | గంగాధర్ అధికారి | 1933-1935 | |
3rd | పురాణ్ చంద్ జోషి | 1935-1948 | |
4th | బి.టి.రణదివే | 1948-1950 | |
5th | చండ్ర రాజేశ్వరరావు | 1950-1951, 1964-1990 | |
6th | దస్త్రం:Ajoy Gosh.jpg | అజోయ్ ఘోష్ | 1951-1962 |
Chairman | శ్రీపాద అమృత్ డాంగే | 1962-1981 | |
7th | ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ | 1962-1964 | |
8th | ఇంద్రజిత్ గుప్తా | 1990-1996 | |
9th | ఎ.బి.బర్ధన్ | 1996-2012 | |
10th | సురవరం సుధాకరరెడ్డి | 2012-2019 | |
11th | డి.రాజా | 2019–Present |
2006 వరకు రాష్ట్రాల శాసనసభలలో భాకపా స్థితి క్రింద ఇవ్వబడింది.
రాష్ట్రం | అభ్యర్థుల సంఖ్య | గెలుపొందినవారి సంఖ్య | శాసనసభలో మొత్తం సీట్లు | ఎన్నికల సంవత్సరం |
ఆంధ్రప్రదేశ్ | 12 | 6 | 294 | 2004 |
అస్సాం | 19 | 1 | 126 | 2001 |
బీహారు | 153 | 5 | 324 | 2000 |
ఛత్తీస్గఢ్ | 18 | 0 | 90 | 2003 |
ఢిల్లీ | 2 | 0 | 70 | 2003 |
గోవా | 3 | 0 | 40 | 2002 |
గుజరాత్ | 1 | 0 | 181 | 2002 |
హర్యానా | 10 | 0 | 90 | 2000 |
హిమాచల్ ప్రదేశ్ | 7 | 0 | 68 | 2003 |
జమ్ము కాశ్మీర్ | 5 | 0 | 87 | 2002 |
కర్ణాటక | 5 | 0 | 224 | 2004 |
కేరళ | 22 | 17 | 140 | 2006 |
మధ్యప్రదేశ్ | 17 | 0 | 230 | 2003 |
మహారాష్ట్ర | 19 | 0 | 288 | 1999 |
మణిపూర్ | 16 | 4 | 60 | 2006 |
మేఘాలయ | 3 | 0 | 60 | 2003 |
మిజోరం | 4 | 0 | 40 | 2003 |
ఒడిషా | 6 | 1 | 147 | 2004 |
పాండిచ్చేరి | 2 | 0 | 30 | 2001 |
పంజాబ్ | 11 | 0 | 117 | 2006 |
రాజస్థాన్ | 15 | 0 | 200 | 2003 |
తమిళనాడు | 8 | 6 | 234 | 2006 |
త్రిపుర | 2 | 1 | 60 | 2003 |
ఉత్తర ప్రదేశ్ | 5 | 0 | 402 | 2002 |
ఉత్తరాంచల్ | 14 | 0 | 70 | 2002 |
పశ్చిమ బెంగాల్ | 13 | 8 | 294 | 2006 |
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన 2009ఎన్నికలలో నాలుగు సీట్లు గెలుచుకుంది.
This article uses material from the Wikipedia తెలుగు article కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.