భారతదేశంలో పశుపోషణ,వ్యవసాయం కలిగిన తెగలు ఎన్నియో ఉన్నవి.
అందులోని యాదవ అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. పశువులను సంరక్షించే గొప్ప ఘనత గల వారు. భారతదేశం లోనే అతిపెద్ద సామాజికవర్గం.పశుపోషణ,వ్యవసాయం కలిగిన తెగలు ఎన్నియో ఉన్నవి. అందులోని యాదవ అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి.వీరు క్షత్రియులు.భారతదేశచరిత్ర లో వీరు అమోఘమైన చరిత్ర కలవారు.వేరు రాజ్యాలను పరిపాలిస్తూనే మరొక వైపు రాజ్యం లోని పశువులను సంరక్షించే గొప్ప ఘనత గల వారు.యాదవులకు భూమి భయపడుతుంది.భారతదేశంలోనే అతిపెద్ద సామాజికవర్గం. యాదవులు ( యాదవులు (మహారాజ్ యాడు భూమి- వారసులు) పురాతన భారతదేశ ప్రజలు పురాణ రాజు యదు వారసులు. యాదవ్ రాజవంశం ప్రధానంగా ఆభీరాస్ (ప్రస్తుత అహిర్ ), ఆంధక్, వృృష్ణి, సత్వత్ అనే సమాజాలను కలిగి ఉంది, వీరు శ్రీకృష్ణుని ఆరాధకులు. పురాతన భారతీయ సాహిత్యంలో ఈ ప్రజలు యదువంశ ప్రధాన అవయవాలుగా వర్ణించబడ్డారు. యాదవ్ మహారాజ్ యాడు వంశస్థుడు, యాదవ్ అనే పేరుతో పిలుస్తారు. యాదవ తెగ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. పశువులు మరియు పాల విక్రయం కారణం గా ఈ కులాన్ని bc-d జాబితాలో చేర్చింది బీసీ (bc-d)గా చేర్చారు. కావ్యం ప్రకారం వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజు సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు. లూసియా మిచెలుట్టి యాదవు వీరు శ్రీకృష్ణుని ఆరాధకులు. పురాతన భారతీయ సాహిత్యంలో ఈ ప్రజలు యదువంశ ప్రధాన అవయవాలుగా వర్ణించబడ్డారు.
యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు.
యాదవ కులం మూలంలో పాతుకుపోయిన రాజవంశం నిర్దిష్ట సూత్రం ప్రకారం, భారతీయ గోపాలక్ కులాలన్నీ శ్రీకృష్ణ (గోపాలక్, క్షత్రియ) జన్మించిన అదే యదువంశం నుండి వచ్చాయి. వారందరూ శ్రీ కృష్ణుడికి చెందినవారని వారిలో బలమైన నమ్మకం ఉంది ఉన్న, ప్రస్తుత యాదవ్ కులాలు అదే పురాతన పెద్ద యాదవ సమూహం నుండి రద్దు
యాదవ్ అనే పదం అనేక పేర్లతో పిలువబడుతుంది, మొదట హిందీ ప్రాంతంలో, పంజాబ్, గుజరాత్లలో - అహిర్ , మహారాష్ట్ర, గోవాలో - గావ్లి , ఆంధ్ర, కర్ణాటక - గొల్ల , తమిళనాడులో - కోనర్ , కేరళ. - మనేర్ సాధారణ సంప్రదాయక శ్రామిక కౌబాయ్, ఎద్దు-మంద, పాలు అమ్మకాలలో ఉంది.
యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందారని చెప్పవచ్చు. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు యదు అను రాజు వంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులు అగు రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆవంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజు వంశస్థాపకుఁడు ఆయెను. అతని మూడవ కొమరుని నుండి చేదివంశము వచ్చెను. రెండవ కొమరుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును సాత్యకియు పుట్టిరి.
వీరి ఆరాధ్య దైవం మహాభారత కావ్యంలోని శ్రీకృష్ణుడు.
భారతదేశంలోని పశుపోషణ వృత్తిగల తెగలు చాలా ఉన్నా, ఆ తెగలను వివిధ రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో దేశ ప్రసిద్ధినొందారు. కొన్ని తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజము. ఆ క్రమంలో వృత్తిపరంగా యాదవులను పోలిన ఇతర పశుపోషణ వృత్తిగల తెగలు యాదవులను తమ పూర్వీకులుగా భావించాయి. యాదవులను పూర్వీకులుగా విశ్వసించే జాతుల పేర్లు, గోపాలులు, ఏయాగొల్లలు, కురుమగొల్ల , సద్గోప, గౌర్, అహిర్, గౌడా, దుమల గౌడా, మధురపురియ గౌడా, నంద గౌడా, కంజ గౌడా, మగధ గౌడా, లక్ష్మీనారాయణ గౌడా, జడేజా, రావత్, జాదవ్,కురుబ/ కురుబ గొల్ల
This article uses material from the Wikipedia తెలుగు article యాదవ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.