యాదవ' (గొల్ల వారు) భారతదేశంలో యాదవులు అతిపెద్ద సామాజిక వర్గం.
యాదవుల వృత్తి ప్రధానంగా వ్యవసాయం, రాజ్య పరిపాలన.యాదవుల కులము అతి ప్రాచీన కులము. వీరు """క్షత్రియులు"". శ్రీకృష్ణుడు యాదవ కులస్తుడు. వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో యాదవులు చంద్రవంశ క్షత్రియులు అని ప్రస్తావన స్పష్టంగా ఉంది. భారతదేశ చరిత్రలో యాదవులది అతి ఘనమైన చరిత్ర. మన భారతదేశ జనాభాలో దాదాపు 30 శాతం జనాభా యాదవులదే. వీరు అగ్రకులంగా ఉన్న అతిపెద్ద బలమైన సామాజిక వర్గం. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఒక యాదవ కులస్తుడే అని ఆముక్తమాల్యాద పుస్తకంలో స్పష్టంగా రాయబడినది. వీరు గోపాలకులు. వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలోను, అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తారు. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంకు చెందినవారుగా చెప్పబడింది. వీరు (ఓ.బి.సి) లలో బలంగా వున్న కులాలలో ఒకటి . ప్రతి రోజు తిరుమల వేంకటేశుని తొలి దర్శన భాగ్యం వీరికే దక్కుతుంది.కొన్ని రాష్ట్రాలలో యాదవులు (ఓ.బి.సి) చెంది అత్యధిక ఓటు బాంక్ కలవారు.బిసి-డి జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధిక ఓటు బాంక్ కలిగినవారు.
యాదవులు | |
---|---|
మతాలు | హిందూ మతం |
భాషలు | |
దేశం | |
ప్రాంతం |
సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు యదువంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులైన రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆవంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజు వంశస్థాపకుఁడు ఆయెను. అతని మూడవ కొమరుని నుండి చేదివంశము వచ్చెను. రెండవ కొమరుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును సాత్యకియు పుట్టిరి.
• రాష్ట్రకూట రాజవంశం • కాలచూరి రాజవంశం • ట్రావెన్కోర్ రాజవంశం • వేనాడ్ రాజవంశం • అయ్ రాజవంశం • చందెలా రాజవంశము • హోయసాల రాజవంశం • పాల వంశం • జైసల్మార్ రాజవంశం • చేరా రాజవంశం
పేర్లు - ఎర్ర గొల్ల, పేదింటి గొల్ల, సదనపు గొల్ల, మందుచోల్లు, గోల్పాలలులు, గొల్లలు, సద్గోప, గౌర్, అహిర్, గోపాలులు, దుమల యాదవ, మధురపురియ యాదవ్, నంద యాదవ, కంజ యాదవ, మగధ యాదవ, లక్ష్మీనారాయణ యాదవ, జడేజా, రావత్, జాదవ్,కురుమ గొల్ల (లేదా) కురుబగొల్ల
గొల్లవారు ప్రధానంగా గొర్రెలను - మేకలను మేపుకుంటారు. స్త్రీలు కూడా వ్యవసాయంలో పాలుపంచుకుంటారు, జానపద నృత్యాలు వేయడంలో నేర్పరులు. పిల్లలు పుట్టిన 21 రోజులకు నామకరణ చేస్తారు. వివాహాలు కులంలోనే జరుగుతాయి. స్వగోత్రీకుల మధ్య వివాహాలు ఉండవు. వరకట్నం సాధారణం. వైవాహిక జీవితానికి సూచనగా స్త్రీలు నుదుట సిందూరం, తాళి, కాలి చుట్లు ధరిస్తారు. మరణించినవారిని దహనం చేస్తారు, 15వ రోజున తద్దినం జరుపుకుంటారు. యాదవులు మల్లన్న (లేదా) ఖండోబా, మంగళ, రాజమ్మ, కంచర్లమ్మ, గంగమ్మ, మైసమ్మ, రేణుకమ్మ, అంకమ్మ దేవతలనుమరియూ కృష్ణుడిని ఆరాధిస్తారు. దొల పూర్ణిమ, రథయాత్ర, గణేష్ పూజ, లక్ష్మీపూజ, కనక జయంతి వంటి పండుగలు జరుపుకుంటారు. వ్యవసాయ సంబంధ పనిముట్లను పూజిస్తారు. మనిషి చనిపోయిన తర్వాత 15 వ రోజు మైల ఆచరిస్తారు. గొల్లవారు 'అన్నా, అయ్యా' పదాలను గౌరవసూచకంగా వాడతారు.
వెనుకబడిన తరగతులలో దాదాపు 22 కులాలకు యాచకవృత్తి కావడం గమనార్హం. కాగా బీసీ కులాలలో మరికొన్ని కులాలు ప్రత్యేకించి కొన్ని కులాలను మాత్రమే యాచిస్తాయి. ఇటువంటివాటిలో యాదవులను యాచించే కులస్తులు మందెచ్చులవాళ్లు. మందెచ్చులవారిని బొమ్మలాటవాళ్ళు, పొదపొత్తులవాళ్ళు, పొదరులు, పొగడపొత్తర్లు అని కూడా పిలుస్తారు. గొల్ల, కురుమల (కురుమగొల్ల) దగ్గర మాత్రమే యాచి స్తారు. యాచనలోనూ కులతత్వం వీరి తరతరాల ఆచారం. గ్రామా లకు వెళ్లినా యాదవ వాడలలోనే నివ సిస్తారు. మందెచ్చుల వాండ్లు తెలంగాణ ప్రాంతంలోని ప్రధానంగా నల్గొండ, వరం గల్, మెదక్ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తారు.మందెచ్చుల వారిలో పురుషుడు యాదవ పెద్దలను పొగుడుతూ రాగయుక్తంగా పాటలు పాడతాడు.అతని వెనక అతని భార్య తాళం వేస్తూ వంత పాడుతుంది.పాటలో గల వేగం కట్టిపడేస్తుంది.యాదవ కులానికి చెందిన వారు చనిపోతే అక్కడ మందెచ్చు లవాండ్లు హాజరవుతారు. శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో పాడెకు ముందు భాగంలో నడుస్తూ కొమ్ము బూర ఊదుతూ, డోలువాయిస్తూ నడుస్తారు. ఆ తర్వాత మందెచ్చులవాళ్లు ఆ ఇంటి యాదవ పెద్దల కథలు ప్రత్యేక తీరులో చెపుతారు . కథానాయకుడు ఒక చేత కట్టె పట్టుకుని, మరో చేత్తో చిడతలు వాయిస్తూ, కాళగజ్జెల చప్పుడు చేస్తూ, సహచరునితో ముందు నిలుచుంటాడు. అతని వెనక ఇద్ద రు వంతలు పాడేవారు, ముందు వరస వారితో వెనుక వరసవారు పోటీపడుతూ కథ నడుపు తారు.గంగ రాజు కథ, పెద్దిరాజు కథ, కాటమ రాజుకథ ఇలా యాదవ పెద్దల కథలు చెప్పి అక్కడివారిని ఆనందపరుస్తారు. కథ పూర్తయ్యాక ఆ వాడలో ఉన్న ప్రజలు కొంత ధనం ఇస్తారు. ఇంతకు ముందు గొఱ్ఱెలను మేకలను సంభావనగా ఇచ్చేవారు.
విజయదశమి వేడుకల్లో జరిగే పారువేట ఉత్సవం మద్దికేర గ్రామంలో ప్రధాన ఆకర్షణ. స్థానిక యాదవ రాజుల వంశీయులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. మద్దికేరళో పెద్దనగిరి, చిన్ననగిరి అనే యాదవ రాజుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబీకులు శ్రీ భోగేశ్వర స్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. పనులు సవ్యంగా జరగాలంటే భోగేశ్వరుని దయ ఉండాలని, ఇందు కోసం ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో భోగేశ్వర స్వామిని పూజించాలన్నది వీరి విశ్వాసం. గతంలో ఈ రెండు రాజ కుటుంబాలు విడిపోయినా ఆనవాయితీగా దసరా సంబరాలను మాత్రం విస్మరించలేదు.
ఈ రెండు రాజరికపు కుటుంబాలతోపాటు యామన్న నగిరి అనే మరో రాజు కుటుంబం కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకుంటూ వస్తూంది. పేరుగాంచిన యాదవ రాజులు, తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. యాదవ రాజుల వంశీయులు దసరా పండుగ రోజున గుర్రాలపై కూర్చొని, తల పాగా, రాచరికపు దుస్తులు ధరించి ఖడ్గదారులై మేళతాళాలతో మద్దికేరకు 3 కి.మీ. దూరంలోని నాటి యాదవ రాజులు నిర్మించిన బొజ్జనాయినిపేట మజరా గ్రామంలోని భోగేశ్వరాలయానికి ఊరేగింపుగా వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. వీరికి మద్ది కులస్తులు సైన్యం వలె ఆయుధాలు ధరించి అంగరక్షకులుగా ఉంటారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి గుర్రాలపై వేగంగా వస్తారు. ఆ తరువాత మద్దికేరళో ప్రధాన రహదారుల్లో గుర్రాలపై స్వారీ చేస్తూ తమ రాచఠీవిని ప్రదర్శిస్తారు. మద్దికేర మద్దమంబ
మద్దికేర గ్రామములో మద్దమాంబ తిరుణాల చాలా ప్రసిద్ధి గాంచింది.ఈ గ్రామ దేవత పేరు మీదనే ఈ ఊరు పేరు మద్దికేరగా పిలువబడుచున్నది.రతోస్త్వవానికి ముందు ఈ గ్రామాన్ని పాలించిన యాదవ రాజులు ఊరేగింపుగా వెళుతారు.ఈ వుత్శావము ప్రతి సంవస్త్రం మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరుగును.
This article uses material from the Wikipedia తెలుగు article గొల్ల, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.