మోదుకూరి జాన్సన్ (ఆగష్టు 8, 1936 - డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత.
1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన 'మరో ప్రపంచం' సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు.
మోదుకూరి జాన్సన్ | |
---|---|
జననం | ఆగష్టు 8, 1936 కొలకలూరు గ్రామం, గుంటూరు జిల్లా |
మరణం | డిసెంబరు 24, 1988 |
మరణ కారణం | గుండెపోటు |
ప్రసిద్ధి | నటులు, నాటక కర్త |
తండ్రి | మోదుకూరి గరువయ్య (పేటూరు) |
తల్లి | రత్తమ్మ |
వీరు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో 1936, ఆగష్టు 8 తేదీన జన్మించారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం దుగ్గిరాల, గుంటూరులో చేసిన తర్వాత ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తెనాలి లో కొంతకాలం న్యాయవాది గా పనిచేశారు,
ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. వీరు నటనాలయం, దేవాలయం, హృదయాలయ, సిలువభారం మొదలైన నాటకాలు రాసి ప్రదర్శించారు. ఢక్కాభిషేకం నవల రాశారు. రాగ హృదయం అనే రూపకానికి నేపథ్యగానం అందించారు. ఛండాలిక, పైరుపాట సంగీత రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.
మోదుకూరి రాసిన నటనాలయం నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే అక్కినేని నాగేశ్వరరావు - ఆదుర్తి సుబ్బారావు లు తమ సొంత చిత్రమైన మరో ప్రపంచం సినిమాకు సంభాషణల రచయితగా అవకాశం ఇచ్చారు. వీరు కరుణామయుడు (1978), ఇంద్రధనుస్సు (1978), మానవుడు - దానవుడు (1972), విచిత్ర దాంపత్యం (1971), డబ్బుకు లోకం దాసోహం (1973), ఆంధ్ర కేసరి, దేశోద్ధారకులు మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు.
వీరు 1988, డిసెంబరు 24 తేదీన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
This article uses material from the Wikipedia తెలుగు article మోదుకూరి జాన్సన్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.