బ్రిక్స్

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు ప్రధాన జాతీయ ఆర్థిక వ్యవస్థల అనుబంధానికి సంక్షిప్త రూపం, బ్రిక్స్.

వాస్తవానికి మొదటి నలుగురిని 2010 లో దక్షిణాఫ్రికా ప్రవేశానికి ముందు " బ్రిక్ "గా వర్గీకరించారు. ప్రాంతీయ వ్యవహారాలపై వాటికున్నగణనీయమైన ప్రభావానికి గాను బ్రిక్స్ సభ్యులు ప్రసిద్ధి చెందాయి. ఇవన్నీ జి20 లో సభ్యులే. ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేదలు పాల్గొంటూ వుంటారు. 2009 నుండి, బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో కలుస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాల 6వ సమావేశం 2014 జూలై 13 నుంచి 17 వరకు బ్రెజిల్‌లో ఫోర్టాలెజా, బ్రసీలియాలో జరగింది. 2017 సెప్టెంబరు న జియామెన్‌లో 9 వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా ఆతిథ్యం ఇవ్వగా, బ్రెజిల్ 13- 2019 నవంబరు 14 న 11 వ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది.

బ్రిక్స్
బ్రిక్స్ సమావేశం లో

2015 లో, ఐదు బ్రిక్స్ దేశాలు 310 కోట్లకు పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించాయి. ప్రపంచ జనాభాలో ఇది 41%. ఐదుగురు సభ్యులలో నలుగురు (దక్షిణాఫ్రికా మినహా - అది 24 స్థానంలో ఉంది) జనాభా ప్రకారం ప్రపంచంలో మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి . 2018 నాటికి, ఈ ఐదు దేశాల నామమాత్రపు జిడిపి 18.6 ట్రిలియన్ డాలర్లు. స్థూల ప్రపంచ ఉత్పత్తిలో ఇది 23.2%. సంయుక్త జిడిపి (పిపిపి) సుమారు 40.55 ట్రిలియన్ డాలర్లు (ప్రపంచ జిడిపి పిపిపిలో ఇది 32%). వీటి సంయుక్త విదేశీ మారక నిల్వలు US$46 4.46 ట్రిలియన్లు. బ్రిక్స్ అనేక వ్యాఖ్యాతల నుండి ప్రశంసలను విమర్శలనూ అందుకుంది. బ్రిక్స్ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను జోక్యం చేసుకోని, సమానత్వంతో కూడిన, పరస్పర ప్రయోజనాల ఆధారంగా నిర్వహించుకుంటాయి .

ఐదు దేశాలలోని బ్యాంకుల ఆర్థికాభివృద్ధికి ఆయా దేశ ప్రధాన మంత్రుల బృందం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంక్ వంటి అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంక్‌ను నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు సన్నద్ధమవుతున్నాయి.

సభ్య దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం బ్రిక్స్ లక్ష్యం.

చరిత్ర

"బ్రిక్" అనే పదాన్ని 2001 లో అప్పటి గోల్డ్మన్ సాచ్స్ అసెట్ మేనేజ్మెంట్ ఛైర్మన్ జిమ్ ఓ'నీల్ తన బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్స్ అనే పుస్తకంలో ఉపయోగించాడు. కానీ, వాస్తవానికి, అసలు నివేదికలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉన్న రూప పురుషోత్తమన్ ఈ పదాన్ని కాయించింది. ప్రారంభ నాలుగు బ్రిక్ జనరల్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) విదేశాంగ మంత్రులు న్యూయార్క్ నగరంలో 2006 సెప్టెంబరులో ఐరాస అసెంబ్లీ జనరల్ డిబేట్ సమయంలో సమావేశమయ్యారు. వరుస ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించారు. 2009 జూన్ 16 న రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో పూర్తి స్థాయి దౌత్య సమావేశం జరిగింది.

మొదటి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం

యెకాటెరిన్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్ మొట్టమొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం 2009 జూన్ 16 న ప్రారంభమైంది, లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, డిమిత్రి మెద్వెదేవ్, మన్మోహన్ సింగ్, హు జింటావో హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఆర్థిక సంస్థలను సంస్కరించడం వంటి మార్గాలపై శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో నాలుగు దేశాలు ఎలా బాగా సహకరించుకోగలవో చర్చించారు.  

యెకాటెరిన్బర్గ్ శిఖరాగ్ర సమావేశం తరువాత, బ్రిక్ దేశాలు కొత్త గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవసరాన్ని ప్రకటించాయి, ఇది "విభిన్నంగా, స్థిరంగా, ఊహించగలిగేలా" ఉండాలి. ఈ ప్రకటనలో యుఎస్ డాలర్ "ఆధిపత్యాన్ని" ప్రత్యక్షంగా విమర్శించనప్పటికీ (రష్యా గతంలో విమర్శించింది) ఇది డాలర్ విలువలో పతనానికి దారితీసింది.

దక్షిణాఫ్రికా చేరిక

2010 లో, దక్షిణాఫ్రికా బ్రిక్ సమూహంలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దాని అధికారిక ప్రవేశం ఆ సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. చేరాలని చైనా అధికారికంగా ఆహ్వానించిన తరువాత, 2010 డిసెంబరు 24 న దక్షిణాఫ్రికా అధికారికంగా సభ్య దేశంగా మారింది తరువాత ఇతర బ్రిక్ దేశాలు అంగీకరించాయి. సమూహం యొక్క విస్తరించిన సభ్యత్వాన్ని ప్రతిబింబించేలా ఈ బృందానికి బ్రిక్స్ అని పేరు పెట్టారు - దక్షిణాఫ్రికా కొరకు "ఎస్" చేరింది. 2011 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, చైనాలోని సాన్యాలో జరిగిన 2011 బ్రిక్స్ సదస్సుకు పూర్తి సభ్యునిగా హాజరయ్యాడు.

సమావేశాలు

  • బ్రిక్ మొదటి సమావేశం - 2009 జూన్‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌లో జరిగింది.
  • రెండో సమావేశం - బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో 2010 ఏప్రిల్‌లో జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది.
  • మూడో సమావేశం - చైనాలోని సన్యాలో 2011 ఏప్రిల్‌లో జరిగింది.
  • నాలుగో సమావేశం - న్యూఢిల్లీలో 2012 మార్చిలో జరిగింది.
  • ఐదో సమావేశం - దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో 2013 మార్చిలో జరిగింది.
  • ఆరో సమావేశం - బ్రెజిల్‌లోని ఫోర్ట్‌లెజాలో 2014 జూలైలో జరిగింది. ఈ సమావేశంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు.
  • ఏడో సమావేశం - రష్యాలోని ఉఫాలో 2015 జూలైలో జరిగింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, కంటింజెన్సీ రిజర్వులను ఏర్పాటు చేశారు.
  • ఎనిమిదో సమావేశం - గోవాలో 2016 అక్టోబర్‌లో జరిగింది.
  • తొమ్మిదో సమావేశం - చైనాలోని జియోమెన్ నగరంలో 2017 సెప్టెంబర్‌లో జరిగింది.


మూలాలు

Tags:

బ్రిక్స్ చరిత్రబ్రిక్స్ సమావేశాలుబ్రిక్స్ మూలాలుబ్రిక్స్ఐదుచైనాజీ20దక్షిణ ఆఫ్రికాబ్రెజిల్భారత దేశంరష్యావాణిజ్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

రాప్తాడు శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ చరిత్రబాబు మోహన్తెలుగు కవులు - బిరుదులుకన్యకా పరమేశ్వరిశ్రీలీల (నటి)కోదండ రామాలయం, ఒంటిమిట్టభారతీయ సంస్కృతితోటపల్లి మధువై.యస్.అవినాష్‌రెడ్డిమామిడిగర్భాశయముశ్రవణ కుమారుడుధర్మంత్రిష కృష్ణన్దాశరథి రంగాచార్యసంకటహర చతుర్థిఎస్. ఎస్. రాజమౌళియోగి ఆదిత్యనాథ్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంక్రిక్‌బజ్విజయసాయి రెడ్డిపరకాల ప్రభాకర్వై.ఎస్.వివేకానందరెడ్డితెలుగు పత్రికలుకంప్యూటరుగౌడనర్మదా నదిఅనూరాధ నక్షత్రంభారతదేశంభారత రాజ్యాంగ పీఠికమృణాల్ ఠాకూర్దశదిశలుయాదవనక్షత్రం (జ్యోతిషం)తిథిభారత ఆర్ధిక వ్యవస్థషష్టిపూర్తిరత్నం (2024 సినిమా)ఎల్లమ్మరుక్మిణీ కళ్యాణంసుభాష్ చంద్రబోస్న్యుమోనియాతెలంగాణ రాష్ట్ర సమితికర్నూలుఇందిరా గాంధీనాగార్జునసాగర్మానవ శాస్త్రంసరస్వతివ్యవసాయంభూమా అఖిల ప్రియధనూరాశిప్రజాస్వామ్యంభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఅలంకారంహస్తప్రయోగంనాయీ బ్రాహ్మణులుద్విగు సమాసముగొట్టిపాటి రవి కుమార్జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరస్వామి వివేకానందఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయందగ్గుబాటి పురంధేశ్వరిబైబిల్కాకతీయులుఎనుముల రేవంత్ రెడ్డికిలారి ఆనంద్ పాల్కాజల్ అగర్వాల్వంగవీటి రంగాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాప్రేమలుసిద్ధు జొన్నలగడ్డటంగుటూరి ప్రకాశంపార్శ్వపు తలనొప్పిరాజోలు శాసనసభ నియోజకవర్గంరవితేజశ్రేయా ధన్వంతరి🡆 More