ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు.
వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశం. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం,సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసులుబాటునిచ్చింది.
ప్రపంచం లోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచం లోనే అధిక శాతం ప్రజల వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.
ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు.ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు సా.శ. పూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి. సా.శ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు.
భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్ధతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక ముఖ్యోద్దేశం.
భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి
రసాయనిక ఎరువులు కర్మాగారాలలో తయారైన రసాయనాలు సహజ ఎరువులు మొక్కలను విచ్ఛిన్న పరచి సహజ ఎరువులను తయారు చేస్తారు.
వ్యవసాయ పనిముట్లు చాలా ఉన్నాయి.
నీటిని పైకి తోడి పంటలకు పారించే విధానం లో:
(ఇవి గతంలో విరివిగా వాడకంలో వుండేవి, ఇప్పుడు తక్కువ వాడుచున్నారు)
చేతి పనిముట్లు
చెరుకు నుండి రసం తీయడానికి వాడే యంత్రం,
గానుగ గింజల నుండి నూనె తీయడానికి వాడే యంత్రం,
గానుగ గింజల నుండి పప్పులను పిండి చేయడానికి వాడే యంత్రం,
రుబ్బు రోలు, విసుర్రాయి
ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవసాయంలో రెండేళ్ళ డిప్లొమా కోర్సులు అందజేస్తున్నాయి. 10 వ తరగతి 55శాతం (హిందీ మినహాయించి) తో, 1-10 తరగతులలో నాలుగు సంవత్సరాలు గ్రామాలలో చదివి, 15-22 సంవత్సరాల వయస్సుగల అభ్యర్థులు వీటికి అర్హులు. బోధన తెలుగులో వుంటుంది.
ఎమ్సెట్ పరీక్ష ద్వారా రకరకాల సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కోర్సులు:
స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో వివిధ ఉపాధి అవకాశాలున్నాయి. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకి సంబంధించిన వివిధ ప్రాంతీయ కేంద్రాలలో, కృషి విజ్ఞాన కేంద్రాలు, నేషనల్ డెయిరీ రీసెర్చ్, ఫారెస్ట్ రీసెర్చ్, వెటర్నరీ రీసెర్చ్, కమోడిటి బోర్డులు, సహకార సంస్థలలో వివిధ స్థాయిలలో ఉద్యోగాలుంటాయి. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, వ్యవసాయ క్షేత్ర మేనేజర్, విషయ నిపుణులు (అసోసియేట్ లేదా ఫెలో స్ధాయి), శాఖాధిపతి, ప్రిన్సిపల్ సైంటిష్టు, అసిస్టెంట్ కమీషనర్ ల పేర్లతో ఉపాధి అవకాశాలుంటాయి.
ప్రైవేటు రంగంలో విత్తనాల ఉత్పత్తి, పురుగు మందులు, ఎరువులు శాఖలలో, బ్యాంకులలో వ్యవసాయ ఋణాలు మంజూరుకు, బీమా సంస్థలలో, వివిధ మాధ్యమాలలో వ్యవసాయ కార్యక్రమాల రూపకల్పనకి విషయ నిపుణులుగా, వ్యవసాయానికి సంబంధించి రకరకాల ఉపాధి అవకాశాలున్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article వ్యవసాయం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.