డెస్మండ్ టుటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బిషప్, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాటం చేసిన హక్కుల కార్యకర్త.
డెస్మండ్ టుటు దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1991 వరకు దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రజల వర్ణ వివక్షా విధానాలపై పోరాటాలు చేశాడు. ఆయన చేసిన పోరాటానికి గాను ఆయనకు 1984లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఆయన 2006 అక్టోబరులో మహాత్ముని 125వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతి భారత ప్రభుత్వం అవార్డును అందుకున్నాడు.
డెస్మండ్ టుటు జోహన్నెస్బర్గ్, క్లెర్క్స్డోర్ప్ పట్టణంలో 1931 అక్టోబరు 7న జన్మించాడు. ఆయన 1950లో ఉన్నత విద్యాభాస్యం 1954లో దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. టుటు మొదట ఉపాధ్యాయుడిగా పనిచేశారు. టుటు 1955 జూలై 2 న నోమాలిజో లేయాను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆతర్వాత 1985-86 మధ్య కాలంలో జోహన్నెస్బర్గ్ బిష్ప్గా, 1986 నుంచి 1996 వరకు కేప్టౌన్ ఆర్చి బిష్ప్గానూ, మొదటి నల్లజాతి బిషప్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన దక్షిణాఫ్రికాలో 1980 మధ్యకాలంలో నల్లజాతీయులపై క్రూరమైన అణచివేతకు, జాతివివక్షకు వ్యతిరేకంగా, ఎల్జీబీటీల హక్కుల కోసం ఆయన అవిశ్రాంత పోరాట చేశాడు.
డెస్మండ్ టుటు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ కేప్టౌన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 డిసెంబరు 26న మరణించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article డెస్మండ్ టుటు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.