విషయ పరిజ్ఞానం, పరిధి, వర్గీకరణ పద్ధతి, ఉత్పత్తి మొదలైనవి ఒక విజ్ఞాన సర్వస్వాన్ని ఏర్పరుస్తాయి..విజ్ఞాన ర్వస్వాలెప్పుడూ సర్వ సమగ్రాలు కావు. ఎంత చెప్పినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఒక వేళ అంతా చెప్పామనుకున్నా, అది కొంత కాలానికి పాతబడి కొత్త విజ్ఞానం వస్తూనే ఉంటుంది. అందువల్ల విజ్ఞాన సర్వస్వాల విశ్వ రూపాన్ని ఒక చిన్న సూత్రంలో నిబంధించి నిర్వచించడం అంత సులభం కాకపోవచ్చును.ఈదృష్టితో చూస్తే విజ్ఞాన సర్వస్వాల నిర్మాణంలో వాటికుండవలసిన లక్షణాలను ఈ క్రింది విధంగా చెప్పవచ్చు
ఇది అన్ని విషయాల గురించిన సమాచారం కలిగి ఉండవచ్చు. ఉదాహరణలు ఆంగ్లంలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, జర్మన్ లో బ్రాక్హస్ (Brockhaus) మొదలైనవి. ఇవే కొన్ని జాతులకు, సంస్కృతులకు సంబంధించిన సమాచారం కూడా కలిగి ఉండవచ్చు.
ఇవి ఒక రంగంలో ఇప్పటిదాకా కుడగట్టుకుంటూ వచ్చిన ముఖ్యమైన, అవసరమైన సమాచారాన్ని మాత్రమే భద్రపరచవచ్చు.
వీటికి ఒక ప్రామాణిక పద్ధతిలో విభజన, వర్గీకరణ కూడా అవసరం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దీనికి సంబంధించిన సమాచార సేకరణ, నిరూపణ, సంక్షిప్తీకరణ మొదలైన ప్రక్రియల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
అవసరమైన చోట్ల విజ్ఞాన సాధనాలను (Knowledge Aids) సమకూర్చు కోవాలి. (బొమ్మలు, ఫొటోలు, పటాలు, పట్టికలు మొదలైనవి)
విషయ వివరణలు సరళంగా సుగ్రాహ్యంగా ఉండాలి.
రచనా శైలి గ్రంథం సొంతం ఒకే విధంగా సాగాలి.
కొత్తగా వస్తుండే విజ్ఞానాంశాలను ఎప్పటికప్పుడు పొందు పర్చడం ద్వారా విజ్ఞాన సర్వస్వం పునర్నవీకృతం అవుతుండాలి.
చరిత్ర
ఇప్పుడు విజ్ఞాన సర్వస్వాలుగా భావిస్తున్న వన్నీ 18 వ శతాబ్దంలో నిఘంటువు ఆధారంగా రూపొందించబడ్డవే. చారిత్రకంగా నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు రెండూ విద్యాధికుల చేత వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులచే రాయబడ్డవే. కానీ వాటి కూర్పులో మాత్రం తేడాలున్నాయి. సాధారణంగా నిఘంటువులో అక్షర క్రమంలో అమర్చిన పదాలు, వాటి నిర్వచనాలు, పర్యాయ పదాలు ఉంటాయి. కానీ విజ్ఞాన సర్వస్వంలో ఒక పదం గురించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది. ఉదాహరణలు పద వ్యుత్పత్తి, దాని పూర్వాపరాలు మొదలైనవి.
ప్రపంచ విజ్ఞాన సర్వస్వాలు
ప్రపంచంలో ఇదీ మొదటి విజ్ఞాన సర్వస్వం అని ఇదమిత్తంగా చెప్పలేం. కానీ చాలా దేశాల్లో, అనేక భాషల్లో వచ్చిన అనేక విజ్ఞాన సర్వస్వాలకు బ్రిటీష్ వారి 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఆదర్శమని మాత్రం చెప్పవచ్చు.
భారతీయ విజ్ఞాన సర్వస్వాలు
భారతదేశంలో సా.శ6 వ శతాబ్ధిలో వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత మొదటి భారతీయ విజ్ఞాన సర్వస్వంగా చెప్పవచ్చు. ఆ తర్వాత 12 వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు రచించిన అభిలషితార్థ చింతామణిని మరో భారతీయ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనవచ్చును.
తెలుగు భాషా సమితి వారు విషయాల క్రమంలో 16 సంపుటాలుగా తెలుగు విజ్ఞాన సర్వస్వం పేరుతో వెలువరించారు. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయములో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది.
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం సంపాదకత్వంలో 8 సంపుటాలుగా సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం వెలువడింది. ఖండవల్లి లక్ష్మీరంజనం సంపాదకత్వంలోనే 3 సంపుటాలుగా ఆంధ్రదేశ చరిత్ర, భూగోళ సర్వస్వం వెలువడ్డాయి.
మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వం (1993) : ఇది ప్రముఖ పరిశోధకులు బి.ఎన్.శాస్త్రిసంపాదకత్వంలో వెలువడింది. కపిలవాయి లింగమూర్తి, మహ్మద్ హుస్సేన్, గంగాపురం హనుమచ్చర్మ మొదలగువారు ఈ సర్వస్వానికి తమ వంతు తోడ్పాటునందించారు.
This article uses material from the Wikipedia తెలుగు article విజ్ఞాన సర్వస్వం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.