ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం -2009 (RTE-2009) అనేది 4 ఆగస్టు 2009న రూపొందించబడిన భారత పార్లమెంటు చట్టం, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A లో ఉంది.
భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టం 1 ఏప్రిల్ 2010న అమల్లోకి వచ్చినప్పటి నుండి విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కుగా అందించే 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.
విద్యా హక్కు చట్టం, 2009 | |
---|---|
ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే చట్టం. | |
Citation | Act No. 35 of 2009 |
Enacted by | భారత పార్లమెంటు |
Date assented to | 26 ఆగస్టు 2009 |
అమలు లోకి వచ్చిన తేదీ | 1 ఏప్రిల్ 2010 |
Related legislation | |
భారత రాజ్యాంగం 86వ సవరణ (2002) | |
Status: Unknown |
భారత రాజ్యాంగంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం, రాష్ట్రాలు రెండూ ఈ చట్టంలో సవరణలు చేయవచ్చు. చట్టం అమలు కోసం కేంద్రం, రాష్ట్ర, స్థానిక సంస్థలకు నిర్దిష్ట బాధ్యతలను నిర్దేశిస్తుంది.
ఈ బిల్లును 2 జూలై 2009న మంత్రివర్గం ఆమోదించింది. రాజ్యసభ 20 జూలై 2009న బిల్లును ఆమోదించింది. లోక్సభ 4 ఆగస్టు 2009న ఆమోదించింది. 26 ఆగస్ట్ 2009న రాష్ట్రపతి ఆమోదం పొంది, చట్టంగా నోటిఫై చేయబడింది.
ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు విద్యలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article విద్యా హక్కు చట్టం - 2009, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.