Butea frondosa Roxb.
మోదుగ | |
---|---|
In Bangalore, India | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | B. monosperma |
Binomial name | |
Butea monosperma (Lam.) Taub. | |
Synonyms | |
ex Willd. |
మోదుగ ఒక ఎర్రని పూల చెట్టు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా (Butea monosperma)
ఈ చెట్టు భారతదేశమంతట వ్యాపించి ఉంది.సముద్రమట్టంనుండి 1200 అడుగుల ఎత్తు వ్యాపించి పెరుగుతుంది.ఈచెట్టు పచ్చిక మైదానాలు/బయలు ప్రదేశాలలోను పెరుగుతుంది.విదేశాలలో పాకిస్తాన్, మయన్మార్, మరియుశ్రీలంకలలో వ్యాప్తి చెందివున్నది.
భారతదేశంలో ఆంగ్లేయుల పాలన సుస్థిరమవటానికి కారణమై, భారతీయ చరిత్ర గతిని మార్చివేసిన ప్లాసీయుద్ధం(సా. స. 1757) జరిగిన ప్రాంతమైన నేటి పశ్చిమ బంగరాష్టంలోని ప్లాసీ అనే చోటు యొక్క తొలి పేరు "పలాశిన్" లేక "పలాశి". ఈ మాటకర్థం పలాశ వృక్షములు కలిగిన చోటు అని. ఈ ప్రాంతంలో మోదుగ(పలాశ) చెట్లు యెక్కువగా ఉండటంతో ఆ పేరొచ్చియుండవచ్చు
చెట్టు :
చిన్న, మధ్య తరహ చెట్టు.ఆకురాల్చును.అసౌష్టంగా చెట్టుకొమ్మలు వ్యాపించివుండును.ఎత్తు10-15' అడగుల వరకుండును.పొద వైశాల్యం 5'-6'అడగులవరకుండును.లక్క పురుగులకు అతిథిచెట్టు.చెట్టుయొక్క కలపను ప్యాకింగ్ పెట్టెలను తయారుచేయుటకు, కర్రబొగ్గును తయారుచేయుటకుపయోగింతురు.ఈ చెట్టునుండి ఉత్పత్తిచేసిన బొగ్గును తుపాకిమందు (Gun powder) లో దట్టింపునకుపయోగింతురు.ఈ చెట్టునుండి వచ్చుబంక (gum) ను టానింగ్ (Tanning, రంగులఅద్దకం (dyeing) పరిశ్రమలలో వాడెదరు.కాండం యొక్క బెరడు (Bark) ను కూడా టానింగ్ పరిశ్రమలోనుపయోగింతురు.కాండంయొక్క బెరడునుండి నార (fibre) కూడా తీస్తారు.
పూలు:
పూలు ఫిబ్రవరి-మార్చినెలల్లో పూయును.స్కార్లెట్-ఆరెంజి రంగులో వుండును.నల్లటి గుండ్రని అండకోశంపై పుష్పదళాలు ఏర్పడి వుండును.ఈ పూలు చూచుటకు 'చిలుక ముక్కను'పోలివుండును. దగ్గరదగ్గరగా కొమ్మ అంతట గుత్తులుగా పూయును.పూల పుప్పొడి నుండి అబిర్ (Abir) అనే, హోలి రంగుల్లో కలిపే రంగును తయారుచేయుదురు.పూలమొగ్గలు ముదురు బ్రౌన్ రంగులో వుండును.చెట్టు శిఖరంలో పూలు విస్తరించి ఎర్రగా అగ్నిశిఖవలె వుండటం వలన వీటిని 'Flame of Forest'అంటారు.
పళ్ళు-గింజలు:
కాయలు/పళ్లు ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు ఏర్పడును.పొట్టుకాయ (pods) గా ఏర్పడును.కాయ 15-20 సెం.మీ.పొడవుండి,2.2-5 సెం, మీ వెడల్పు (Broad) వుండును.పాలిపోయిన పచ్చరంగులో వుండి, పండినప్పుడు పసుపు ఛాయతోకూడిన బ్రౌన్ రంగులోకి మారును.కాయ పైన తెల్లటి కేశంలవంటి నూగు వుండును.కాయ తేలికగా వుండును.కాయకు వైద్య, ఔషధ గుణాలున్నాయి.గింజలోపలి విత్తనం ఎరుపుతో కూడిన బ్రౌన్ రంగులో, చదునుగా (flat, అండాకారంగా (oval, మూత్రపిండాకారంలో వుండును.గింజలో నూనెశాతం 17-19% వరకుండును.చెట్టునుండి ఒక కేజి విత్తనంసేకరించు వీలున్నది.
మోదుగు ఆకులే కాదు మోదుగు కాడలు, కొమ్మలను సైతం హిందువులు పూజా కార్యాక్రమాల్లో ఉపయోగిస్తారు. ఇంటిలో చెడు పోయి మంచి జరగాలని కోరుకుంటూ చేసే యజ్ఞాలు, యాగాలు, హోమాల్లో పూజారులు ముఖ్యంగా ఎండిపోయిన మోదుగు కొమ్మలను విరిచి కాలుస్తారు.వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో వుండే చెడును సంహరించి మంచి కలిగిస్తుందని హిందూ సంప్రదాయాల్లో నమ్ముతారు.మోదుగు చెట్టుకు పూసే పువ్వును మోదుగు పువ్వు అంటారు. ప్రతియేటా హోలి పండుగకు ముందుగా ఈ పువ్వు చెట్లకు పూస్తుంది. ఈ పువ్వులను హిందువులు ఎంతో పవిత్రమైన పువ్వుగా చూస్తారు. అడవుల్లో, మైదానాల్లో వుండే ఈ చెట్లకు పూసే పువ్వులు ఒకరకమైన సువాసతోపాటు అందంగా వుంటాయి.ముదురు నారింజ రంగులో కనిపించే ఈ పువ్వులను చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. మోదుగు పువ్వులు అంటే పరమశివుడికి యెంతో ప్రీతి.అందుకే శివాలయాల్లో పూజలు చేసే క్రమంలో పూజారులు మోదుగు పువ్వులను శివుడికి సమర్పిస్తుంటారు. అంతేకాదు మోదుగు పువ్వులో వచ్చే కొద్ది పాటి నీటి బిందువులను సైతం శివుడికి ప్రీతిపాత్రంగా భావిస్తారు.ఇక మోదుగు పువ్వులకు హోలీ పండుగకు విడదీయరాని బంధం ఉంది. కొన్నేళ్ళ క్రితం హోలీ పండుగ వస్తుందంటే, వారం రోజుల ముందుగానే పిల్లలు,యువకులు మోదుగు పువ్వులను తీసుకొచ్చి నీటిలో నానబెట్టేవారు.తర్వాత రేపు హోలీ పండుగ అనగా బాగా ఉడకబెట్టేవారు.ఉడికిన తర్వాత వచ్చే రంగునీళ్లను చల్లారిన తర్వాత సీసాల్లో, డబ్బాల్లో నింపుకునేవారు. హోలీ పండుగకు రసాయన రంగుల కన్నా మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్లను వాడడం వల్ల చర్మరోగాలు రావు.కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు హోలీ పండుగ రోజు మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్ళను వాడడం లేదు. రసాయన పదార్థాల తో తయారయ్యే రంగులను వాడుతున్నారు.దీని వలన, చాలా వరకు హోలీ పండుగ రోజు హోలీ ఆడి కంటిలో రంగులు పడేసుకోవడం, చర్మరోగాలకు గురికావడం జరుగుతుంది.
ప్రముఖ సాహితీవేత్త,పండితులూ అయిన దాశరథి రంగాచార్యులు "మోదుగపూలు" అను పేర తెలంగాణా ప్రాంతంలో,నిజాం పాలనలోని నిరంకుశత్వానికీ,అణచివేతకూ అద్దంపడుతూ చక్కటి నవలను వ్రాసారు. ఎర్రటి మోదుగ పూలను సామాన్యులలోని విప్లవ కాంక్షకు ప్రతీకగా ఎంచుకున్నారు.
యుద్ధాల్లో గాయపడి రక్తమోడుతూ ఉన్న యోధులను వర్ణించేటపుడు కవులు ఆ యోధుడి "దేహం నిండుగా పూచిన మోదుగ చెట్టులా ఉంది" అని వర్ణించడం కద్దు. దీన్ని విమర్శిస్తూ గరికిపాటి నరసింహారావు తన సాగరఘోష పద్యకావ్యంలో ఒక పద్యం వ్రాసారు.
దూసిన కత్తి దూకుడులు దూసెను గుండెల దూటబిళ్ళల
ట్లాసురలోక భోగముల నందగ పోరిరి వెర్రి పీనుగుల్
పూసిన మోదుగల్ బ్రతుకు పూయని దండుగ పూల చెట్లుగా
మోసి నృపాల కీర్తులను మూసిరి కన్నులు మోసబోవుచున్
This article uses material from the Wikipedia తెలుగు article మోదుగ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.