యేసుకు 12 మండి శిష్యులు.
పండ్రెండుమంది శిష్యులు/అపొస్తలుల పేర్లు మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంధ్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలోమయి తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరు గల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
“శిష్యుడు” అనే పదము నేర్చుకొనువాడు లేక అనుసరించువాడు అని సూచించును. “అపొస్తలుడు” అనే పదమునకు అర్థము “బయటకు పంపబడినవాడు.” యేసు భూమిమీద ఉన్నప్పుడు, అతని పండ్రెండు మంది అనుచరులు శిష్యులుగా పిలువ బడిరి. ఆ పండ్రెండు మంది శిష్యులు యేసుక్రీస్తును అనుసరించి, ఆయన నుండి నేర్చుకొని, ఆయనచే తర్ఫీదు పొందిరి. ఆయన పునరుత్థానము, ఆరోహణ తర్వాత, యేసు ఆయన శిష్యులను ఆయన సాక్షులుగా ఉండుటకు బయటకు పంపెను . అప్పుడు వారు పండ్రెండు అపొస్తలులుగా సూచించబడ్డారు. అయితే, యేసు ఇంకను భూమిపై ఉంటుండగా, “శిష్యులు”, “అపొస్తలులు” అనే పదములు కొంతమేరకు మార్చుకోదగినట్లు వాడబడెను.
ఆ పండ్రెండు మంది శిష్యులు/అపొస్తలులు దేవుడు అసాధారణ విధానములో వాడుకొన్న సాధారణ పురుషులు. ఆ పండ్రెండు మందిలో, చేపలను పట్టే జాలరులు, ఒక పన్ను వసూలుదారుడు,, ఒక విప్లవాత్మకుడు ఉండెను. యేసు యొక్క పునరుత్థానమును, పరలోకమునకు ఆరోహణను సాక్ష్యమిచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ శిష్యులు/అపొస్తలులను ప్రపంచమును తలక్రిందులు చేసే శక్తివంతమైన దేవుని వ్యక్తులుగా రూపాంతరము చెందిరి.
This article uses material from the Wikipedia తెలుగు article యేసు శిష్యులు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.