తుమ్మల రంగారెడ్డి నిజామాబాదు జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధుడు, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు.
అతను రంగారెడ్డి ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు గెలవగా, బాల్కొండ నియోజకవర్గం నుండి ఒకసారి, మొత్తం నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికలలో గెలిచాడు. రంగారెడ్డి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనతను కూడా సాధించాడు.
1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా బాల్కొండ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప పి.డి.ఎఫ్ అభర్థి రాజాగౌడ్ పై 12331 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 25399 ఓట్లను సాధించాడు. ఈ ఎన్నికలలో సమీప స్వతంత్ర అభ్యర్థి జి.ఎస్.రావుకు 15767 ఓట్లు లభించాయి. అతను 9632 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి సుదర్శనరావుపై 18042 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article తుమ్మల రంగారెడ్డి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.