నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్టకు సమీపంలో భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలో ఈ ఆలయం ఉన్నది.
ఈ ఆలయాన్ని కుందా సత్యనారాయణ, 1991లో అనారోగ్యం బారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం సురేంద్రపురి పేరిట ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించాడు.
కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనుకనుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా 9 గుడులు కట్టినారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు. దేవాలయంలోపల హుండీలను చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇవి కలశాలను పోలి ఉంటుంది. ఒక కలశం మీద అష్టలక్ష్ములను చెక్కితే, మరో కలశంమీద, వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు. ఇక్కడ పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించిన గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.
అక్టోబర్ 2008 లో ఈ ప్రాగణానికి సందర్శకులను అనుమతించినప్పటికినీ, జనవరి 2009 వరకు మెరుగులుదిద్దుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 8, 2009 న దీనిని ప్రారంభించారు
వేపచెట్టు లక్ష్మీస్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపం. కనుక ఈ రెండు వృక్షాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేకాక వేప, రావి చెట్లకు వివాహం చేస్తారు. వేపచెట్టు రాత్రింబవళ్లు ప్రాణవాయును ఇస్తుంది. కాబట్టి ఈ వృక్షానికి దగ్గరగా నివాసం ఏర్పాటు చేసుకుంటే మంచిది.
నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్టకు సమీపంలో గల ఈ సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం తప్పక దర్శించదగిన క్షేత్రం. కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనుకనుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది.
ప్రపంచంలో మొదటిసారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మిది ఆలయాలను ఇక్కడ నిర్మించారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి ఈ దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు. దేవాలయంలోపల హుండీలను చాలా కళాత్మకంగా కలశాలను పోలినట్లుగా తీర్చిదిద్దారు.
ఈ హుండీలలో ఒక కలశం మీద అష్టలక్ష్మీదేవిలను చెక్కితే... మరో కలశంమీద, వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు. ఈ ఆలయంలో పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించినట్లయితే గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. వేపచెట్టు లక్ష్మీస్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపం కనుక ఈ రెండు వృక్షాలకు హనుమదీశ్వర ఆలయంలో పూజాది కార్యక్రమాలు... వేప, రావి చెట్లకు వివాహం చేస్తుంటారు.
ఆంజనేయస్వామిని కొలిచిన వారికి మానసిక దౌర్భల్యం నశించి, మనోధైర్యం సిద్ధిస్తుంది. బుద్ధి, బలం, శక్తి, యశస్సు, ఆయురారోగ్యాలు చేకూరతాయి. వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. అవివాహితులకు కళ్యాణం ప్రాప్తి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.
కుందా సత్యనారాయణ కళాధామము ఒక హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయము. సందర్శకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలిగిన హిందూధర్మ ప్రదర్శన శాల అని నిర్వాహకుల మాటలలో వర్ణించ బడింది. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్ని వేశాలు, అలాగే పురాణ ప్రాముఖ్యం కల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజింతంగా అలంకరించి చూపరులకు కను విందు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మ లోకము, విష్ణు లోకము, కైలాసము, స్వర్గ లోకము, నరక లోకము, పద్మద్వీపము, పద్మలోకము దృశ్యరూపంలో చూడవచ్చు. పద్మవ్యూహము అనేక దేవతా రూపాలు చూడవచ్చు. రామాయణము, మహాభారతము, భాగవతము వంటి పుపాణేతిహాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా మలచిన శిల్పాలతో దృశ్యాలుగా దర్శించ వచ్చు. మంధర పర్వత సాయంతో క్షీపసాగర మధనము చేస్తున్న దేవతలను రాక్షసులను కూర్మావతారములో ఉన్న విష్ణు మూర్తిని చూడవచ్చు. అలాగే గజేంద్ర మోక్ష సన్నివేశాలను తడ్రూపంగా మలచిన దృశ్యాలను చూడవచ్చు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల కృష్ణుడి విశ్వరూపదర్శనమును అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడిని చూడ వచ్చు. గోవర్ధనోద్ధరణ, గోపికా వస్త్రాపహరణ, రాక్షసంహారము, రాసలీలా దృశ్యాలను తిలకించ వచ్చు. భవిష్య బ్రహ్మ అయిన హనుమ బాల్య సన్ని వేశాలను అతడు రామునుతో చేరిన పిదప జరిగిన సన్ని వేశాలను చూడ వచ్చు. హనుమ సువర్చల కల్యాణం, లంకాదహనం, అక్షయకుమారులను సంహరించడం, రామలక్ష్మణులను భుజము మీదకు ఎత్తుకుని యుద్ధ భూమిలో వారికి సహకరించడం, బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వాటిలో కొన్ని. హనుమ చేతి ప్రసాదాన్ని అతడి స్వహస్తాలతో తీసుకోవచ్చు. ఆవు నుండి పడుతున్న పాలతో చేసిన కాఫీని త్రాగవచ్చు. ఇలాంటి అపురూప దృశ్యాలను అనేకము చూసి సందర్శకులు అద్భుత అధ్యాత్మిక ఆనందాను భూతిని పొందవచ్చు.
రాయ్ గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండు కు హైద్రాబాదు, వరంగల్, నల్గొండ లనుండి చాలా బస్సులు కలవు.
This article uses material from the Wikipedia తెలుగు article సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.