విష్ణు వామన్ శిర్వాద్కర్ (మరాఠీ: विष्णु वामन शिरवाडकर) (1912 ఫిబ్రవరి 27 – 1999 మార్చి 10), కుసుమగ్రాజ్ కలంపేరుతో సుపరిచితులు.
ఆయన ప్రసిద్ధ మరాఠీ కవి, రచయిత, నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత, మానవతా వాది. ఆయన మానవతా వాదిగా న్యాయ, దారిద్ర్యం గల ప్రజల విముక్తి కోసం స్వాతంత్ర్యానికి పూర్వం ఐదు దశాబ్దాలుగా 10 సంపుటాలు కవితలు, మూడు నవలలు, ఎనిమిది సంపుటాల లఘు కథలు, ఏడు సంపుటాల వ్యాసాలు, 18 నాటకాలు, ఆరు ఏక పాత్రాభినయనాల నాటకాలు వ్రాసారు. ఆయన సాహితీ సేవలలో పాటక సంకలనం "విశాఖ" (1942) స్వాతంత్ర్యానికి పూర్వ ఉధ్యమంలో ఉద్యమకారులను, ప్రజలను స్ఫూర్తినిచ్చింది. అది ప్రస్తుతం భారత సాహితీ చరిత్రలో ఒక కళాఖండంగా నిలిచింది. ఆయన రచించిన నాటకం "నటసామ్రాట్"కు మరాఠీ సాహిత్యంలో ముఖ్యమైన స్థానం లభించింది. ఆయన అనేక రాష్ట్ర స్థాయి అవార్డులను, జాతీయ అవార్డులతో పాటు 1974 లో మరాఠీ సాహిత్య అకాడమీ అవార్డు , 1988 లో జ్ఞానపీఠ అవార్డులను అందుకున్నారు. ఆయన 1989 లో జరిగిన ప్రపంచ మరాఠీ సదస్సుకు చైర్ పర్సన్ గా పనిచేసారు. ఆయన మహారాష్ట్ర లోని పూణేలో జన్మిచారు , తన జీవితంలో అత్యధిక కాలాన్ని నాసిక్లో గడిపారు.
విష్ణు వామన్ శిర్వాద్కర్ | |
---|---|
జననం | పూణే, మాహారాష్ట్ర | 1912 ఫిబ్రవరి 27
మరణం | 1999 మార్చి 10 నాశిక్, మాహారాష్ట్ర | (వయసు 87)
వృత్తి | రచయిత, నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత, మానవతావాది |
గుర్తించదగిన సేవలు | విశాఖ (1942) నటసామ్రాట్ |
పురస్కారాలు | 1974 మరాఠీ సహిత్య అకాడమీ అవార్డు 1988 జ్ఞానపీఠ అవార్డు |
ఆయన 1912 ఫిబ్రవరి 27 న పూణేలో జన్మించారు. ఆయన బాల్యనామం విష్ణు వామన్ శిర్వాద్కర్. ఆ తరువాత ఆయన తన నామాన్ని "కుసుమాగ్రజ్"గా మార్చుకున్నారు. ఆయన ప్రాథమిక విద్యను పింపాల్గన్ లోనూ ఉన్నత విద్యను నాశిక్ లోని న్యూ ఇంగ్లీషు పాఠశాల (ప్రస్తుతం జె.ఎస్.రుంగ్తా ఉన్నత పాఠశాల) లోనూ పూర్తిచేసారు. ముంబై విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పూర్తిచేసారు.
ఆయన తన 20వ యేట నాశిక్ లోని దేవాలయాలలో బ్రాహ్మణ వర్గం దేవాలయాలలోనికి అంటరానివారిని వర్గాలను నిషేధించుటను వ్యతిరేకిస్తూ అహింసావిధానంలో నిరసన (సత్యాగ్రహం) లో పాల్గొన్నారు. అంతకు పూర్వం పూజారులు హిందూమతంలో అంటరానివారిగా భావిస్తున్న కొన్ని వర్గాలను దేవాలయ ప్రవేశానికి అనుమతినిచ్చేవారుకాదు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నాశిక్ లో జరిగిన ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడ్డారు.
20 యేండ్ల వయస్సులో ఆయన మొదటిసారి "జీవనలహరి" అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఆ తరువాత ఆయన నాశిక్ లో "మరాఠీ సినిమా"లో కూడా పాలుపంచుకున్నారు. ఆయన పౌరాణిక చిత్రం "సతీ సులోచన"కు స్క్రిప్టు వ్రాసారు. అందులో నటించారు కూడా. ఆయన ప్రధాన రంగం అయిన కవిత్వ రచనకు ముందుగా జర్నలిజంలో కూడా పనిచేసారు. 1942 ఆయన జీవితంలో ముఖ్యమలుపు. ఆయన కుసుమగ్రాజ్ కవితా సంకలనాన్ని ప్రచురించి మరాఠీ సాహిత్యంలో పితామహునిగా వెలుగొందారు. ఆయన స్వంత ఖర్చులతో "విశాఖ" ప్రచుచించారు. ఇందులో ముందుమాటలో వ్రాసిన వాక్యాలను బట్టి ఆయన మానవతావాది అయిన రచయిత అని తెలుస్తుంది. ఆ పుస్తకం ముందుమాటలో "ఆయన మాటలు సామాజిక అసంతృప్తిని వ్యక్తం చేసాయి కానీ పురాతన ప్రపంచం కొత్తమార్గాన్ని ఇస్తుందనే ఆశావాద విశ్వాసాన్ని కలిగి ఉంటారు." అని ఉంది. ఇది క్విట్ ఇండియా ఉద్యమంలో వెలువడింది. ఈ రచన స్వాతంత్ర్యోద్యమంలో బానిస వ్యవస్థ నిర్మూలనకు ఒక సంకేతాన్ని అందించింది. ఈ రచనలోని వాక్యాలు యువతలో ప్రాముఖ్యత పొందాయి. ఈ కాలములో ఆయన రచనలు భారతీయ సాహిత్యంలో శాశ్వత వారసత్వం పొందేలా చేశాయి. 1943 తర్వాత మరాఠీ ధియేటర్లో ప్రదర్శితమవుతున్న ప్రముఖ ఆంగ్ల రచయితలైన ఆస్కార్ వైల్డ్, మోలీర్, మారిస్ మాటెర్లింక్, షేక్స్పియర్ ల నాటకాలలోని ముఖ్య పాత్రలను దత్తత తీసుకునుట ప్రారంభించారు. ఈ విధానాన్ని 1970క వరకు ఆయన రచన "నటసామ్రాట్" ప్రదర్శించేవరకూ కొనసాగించారు.
1950లలో ఆయన నాశిక్ లో "ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ గుడ్" --"లోకహితవాతి మండల్"ను ప్రారంభించారు. ఆయన సామాజికంగా అణగదొక్కబడినవారికి సామాజిక స్ఫూర్తి కలిగించే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు. కానీ ఆయన కవిత్వం , రచన రంగాలలో విశేష ప్రతిభావంతునిగా కొనసాగించారు. 1954 లో ఆయన షేక్స్పియర్ యొక్క రచన "మెక్బెత్"ను "రాజ్ముకుట్"గా స్వీకరించారు. అందులో నానాసాహెబ్ పాఠక్ , దుర్గా కోతేలు నటించారు. ఆ తరువాత "ఒథెల్లో" అనే నాటకాన్ని 1960 లో స్వీకరించారు. ఆయన మరాఠీ సినిమాకు పాటల రచయితగా కూడా పనిచేసారు.
ఆయన మరాఠీ సాహిత్యంలో చేసిన కృషికి ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 27 వ తేదీన "మరాఠీ భాషా దినం"గా జరుపుకుంటారు. 1987 లో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య అవార్డు "జ్ఞానపీఠ అవార్డు"ను అందజేసారు. ఆయన రచించిన నాటకం "నటసామ్రాట్"కు 1974 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1985లో ఆయనకు "గణేష్ గడ్కారీ అవార్డు" వచ్చింది. 1986లో పూణే విశ్వవిద్యాలయం ఆయనకు "డి.లిట్"ను అందజేసి సత్కరించింది. 1988 లో ఆయనకు సంగీత నాట్య లేఖన్ అవార్డు వచ్చింది.
ఆయన అసలుపేరు గజానన్ రంగనాథ్ సివాద్కర్ , ఆయన యొక్క మామయ్య ఆయనను దత్తత తీసుకున్నారు. ఆయన 1990 లో నాశిక్ లో "కుసుమాగ్రజ్ ప్రతిష్టాన్" అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం వివిధ సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే. ఈ సంస్థ సమాజంలో అణగారిన వర్గాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. 1972లో ఆయన భార్య "మనోరమాబాయి" మరణించారు. కుసుమాగ్రజ్ యొక్క జన్మదినాన్ని ప్రపంచ మరాఠీ దినంగా జరుపుకుంటారు.
ఆయన మార్చి 10, 1999 న మరణించారు. ఆయన నివాసం "కుసుమాగ్రజ్ ప్రతిష్టాన్" సంస్థకు కార్యాలయంగా ఉంది.
కవితా సంకలనాలు
సరిదిద్దిన కవితా సంకలనాల
కథల సంకలనాలు
నాటకాలు
ఏక పాత్రాభినయాలు
నవలలు
The translation of Meghadūta by Kusumagraj were visualised by watercolour artist Nana Joshi. These visualisations were published in the Menaka Diwali issue in 1979.
This article uses material from the Wikipedia తెలుగు article విష్ణు వామన్ శిర్వాద్కర్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.