భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code: IPC) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం.
భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు. భారతీయ శిక్షాస్మృతి ( IPC ) భారతదేశ అధికారిక క్రిమినల్ కోడ్ . ఇది క్రిమినల్ చట్టంలోని అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేయడానికి ఉద్దేశించిన సమగ్ర కోడ్ . థామస్ బాబింగ్టన్ మెకాలే అధ్యక్షతన 1833 చార్టర్ చట్టం ప్రకారం 1834లో ఏర్పాటైన భారతదేశపు మొదటి లా కమిషన్ సిఫార్సుల మేరకు ఈ కోడ్ రూపొందించబడింది . ఇది 1862 లో ప్రారంభ బ్రిటీష్ రాజ్ కాలంలో బ్రిటీష్ ఇండియాలో అమల్లోకి వచ్చింది . అయితే, ఇది వారి స్వంత న్యాయస్థానాలను కలిగి ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్లో స్వయంచాలకంగా వర్తించదు.1940ల వరకు న్యాయ వ్యవస్థలు . అప్పటి నుండి కోడ్ అనేక సార్లు సవరించబడింది , ఇప్పుడు ఇతర క్రిమినల్ నిబంధనల ద్వారా భర్తీ చేయబడింది. బ్రిటీష్ ఇండియన్ సామ్రాజ్యం విభజన తర్వాత, భారత శిక్షాస్మృతి భారతదేశం , పాకిస్తాన్లచే వారసత్వంగా పొందబడింది, ఇక్కడ అది స్వతంత్రంగా పాకిస్తాన్ శిక్షాస్మృతి వలె కొనసాగుతుంది . పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత , అక్కడ కోడ్ అమలులో కొనసాగింది . ఈ కోడ్ను కలోనియల్ బర్మా , సిలోన్ (ఆధునిక శ్రీలంక), స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ (ప్రస్తుతం మలేషియాలో భాగం), సింగపూర్ , బ్రూనైలో బ్రిటిష్ కలోనియల్ అధికారులు ఆమోదించారు, ఆ దేశాల్లోని క్రిమినల్ కోడ్లకు ఆధారం.
ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు 6 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) మొదలైంది.
ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము కాశ్మీర్లో కూడా అమలులో ఉంది. కానీ, ఈ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. రన్బీర్ పీనల్ కోడ్ (ఆర్.పి.సి) అని పిలుస్తారు.
ఇండియన్ పీనల్ కోడ్ మూలాలు 1860 నాటి ఆంగ్లేయుల వలస పాలనలో (బ్రిటిష్ ఇండియా) ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి 1860 లో, మొదటి లా కమిషన్ అజమాయిషిలో జరిగింది.మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు). మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచంలోను, భారతీయ సమాజాలలోను, విద్యాపరంగా, వైజ్ఞానికంగా, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసీ లోను, ప్రయాణ వాహనాలలోను, న్యాయపరంగా, వైద్యరంగంలోను, ఉద్యోగ రంగంలోను, బ్యాంక్ లావాదేవీలు (ఏ.టి.ఎమ్), సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాలలో జరిగిన సమస్తమైన మార్పులను, మన భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు, చేర్పులకు గురి అవుతూ, నేటి రూపాన్ని పొందింది. గృహ హింస సెక్షన్ 498-ఎ ఒక ఉదాహరణ. మన భారతీయ శిక్షాస్మృతిలో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం చట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, ఐరోపా, అమెరికా దేశాలలో లేదు కాబట్టి, వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షాస్మృతిలో లేవు.
లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంథాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'చిత్తుప్రతి'ని తయారుచేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి ని, యాజ్ఞవల్క్య స్మృతిని, నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆ నాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారత దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆచార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్సుతో 'ఇండియన్ పీనల్ కోడ్' చిత్తుప్రతి తయారు చేశాడు. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు.
లార్డ్ మెకాలే తయారుచేసిన 'చిత్తుప్రతి' ని, నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకతా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి (ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా) సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించాడు. వారి పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 1860 అక్టోబరు 6 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్టవశాత్తు, ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే తన కృషి, చట్టమై, అమలు జరగటం చూడలేదు. కారణం మెకాలే 1859 డిసెంబరు 28 న, తన 59వ ఏట, మరణించాడు. ఇతను అవివాహితుడు.
ఇండియన్ పీనల్ కోడ్1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ - కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. 1830కి ముందు, భారతదేశంలో, 'ది ఇంగ్లీష్ క్రిమినల్ లా', అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో (బొంబాయి, కలకత్తా, మద్రాసు అమలు జరిగేది.
ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచమే కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంథం ఆయా దేశాలకు శిక్షాస్మృతి నిర్వహణ వ్వవహారాలకువేదం, బైబిల్, ఖురాను, జెండ్ అవెస్తా భాగమయ్యింది.
కొన్ని సంస్కరణలు
2003 సంవత్సరములో, మలిమత్ కమిటీ రిపోర్ట్[permanent dead link] భారతీయ శిక్షాస్మృతికి కొన్ని సంస్కరణలను ప్రభుత్వానికి 2003 మార్చి నెలలో ఇచ్చింది. నేర పరిశోధనను, ప్రాసిక్యూషన్ ను విభజించమని ( బ్రిటన్ లోని సి.పి.ఎస్.న్ వలె) దానివలన నేరాలు, శిక్షలు తొందరగా పరిష్కారం అవుతాయి. యూరోపియన్ క్రిమినల్ జస్టిస్ పద్ధతి ఈ రిపోర్ట్ కి ఆధారం.
This article uses material from the Wikipedia తెలుగు article భారతీయ శిక్షాస్మృతి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.