దుర్గాబాయి దేశ్‌ముఖ్

దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త .

చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది. ఆమె భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌పర్సన్‌గా వ్యవహరించింది.

దుర్గాబాయి దేశ్‌ముఖ్
దుర్గాబాయి దేశ్‌ముఖ్
దుర్గాబాయి దేశ్‍ముఖ్ చిత్రపటం
జననంజూలై 15, 1909
మరణంమే 9, 1981
వృత్తిన్యాయవాది, సంఘసేవ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆంధ్ర మహిళా సభ
జీవిత భాగస్వామిసి.డి.దేశ్‌ముఖ్
తల్లిదండ్రులు
  • రామారావు (తండ్రి)
  • కృష్ణవేణమ్మ (తల్లి)

జీవిత విశేషాలు

దుర్గాబాయి దేశ్‌ముఖ్ మద్రాసు ప్రెసిడెన్సి (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) లోని రాజమండ్రిలో, 1909 జూలై 15 న మద్య తరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించింది. 8 ఏండ్ల వయసులో ఆమెకు తన మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు. బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించింది. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది.

స్వాతంత్ర్య పోరాటం

దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తన 12 యేండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచింది.

సామాజిక సేవలు

దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేసింది. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నపట్నంలో (ప్రస్తుత చెన్నై లో) ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు, వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పింది. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ఉదయవనం అను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచింది. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది. 1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసింది

అవార్డులు

స్మరణ

దుర్గాబాయి దేశ్‌ముఖ్ 
రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ విగ్రహం
  • కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది.
  • ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.

మరణం

దుర్గాబాయి 1981 మే 9వ తేదీన హైదరాబాదులో మరణించింది.

మూలాలు

బాహ్య లంకెలు

Tags:

దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవిత విశేషాలుదుర్గాబాయి దేశ్‌ముఖ్ స్వాతంత్ర్య పోరాటందుర్గాబాయి దేశ్‌ముఖ్ సామాజిక సేవలుదుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డులుదుర్గాబాయి దేశ్‌ముఖ్ స్మరణదుర్గాబాయి దేశ్‌ముఖ్ మరణందుర్గాబాయి దేశ్‌ముఖ్ మూలాలుదుర్గాబాయి దేశ్‌ముఖ్ బాహ్య లంకెలుదుర్గాబాయి దేశ్‌ముఖ్19091981చెన్నైజూలై 15ప్రణాళికా సంఘంభారత దేశముమే 9హైదరాబాదు

🔥 Trending searches on Wiki తెలుగు:

రామప్ప దేవాలయంబొడ్రాయిభగత్ సింగ్బుధుడు (జ్యోతిషం)మా తెలుగు తల్లికి మల్లె పూదండఎస్. పి. బాలసుబ్రహ్మణ్యందక్షిణామూర్తి ఆలయంప్రపంచ మలేరియా దినోత్సవంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలలితా సహస్రనామ స్తోత్రంనవరసాలుగుణింతంAకె. అన్నామలైవ్యతిరేక పదాల జాబితాఐక్యరాజ్య సమితిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంపునర్వసు నక్షత్రముకొమురం భీమ్భారత జాతీయ చిహ్నంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్మకరరాశిజాతీయములుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితారోనాల్డ్ రాస్హైదరాబాదువృత్తులునువ్వొస్తానంటే నేనొద్దంటానాఅనుష్క శెట్టిపాముకడియం కావ్యఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.అవకాడోగోదావరిపూర్వ ఫల్గుణి నక్షత్రముసచిన్ టెండుల్కర్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిమారేడుశివ కార్తీకేయన్తాజ్ మహల్ఆప్రికాట్సూర్య (నటుడు)వాల్మీకితెలుగు సినిమాలు 20242024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుధనూరాశినవగ్రహాలువిష్ణువువై.ఎస్.వివేకానందరెడ్డి హత్యవంగా గీతమిథాలి రాజ్యువరాజ్ సింగ్ఎఱ్రాప్రగడబొత్స సత్యనారాయణనీ మనసు నాకు తెలుసుసురేఖా వాణిఎల్లమ్మవిజయశాంతివేయి స్తంభాల గుడిమొఘల్ సామ్రాజ్యంపర్యావరణందొంగ మొగుడుఅక్బర్జూనియర్ ఎన్.టి.ఆర్నిర్వహణశ్రీ కృష్ణదేవ రాయలుబి.ఆర్. అంబేద్కర్జీలకర్రకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుశాసనసభభారత రాజ్యాంగంశార్దూల విక్రీడితమువిష్ణు సహస్రనామ స్తోత్రముఏప్రిల్ 25మృణాల్ ఠాకూర్పది ఆజ్ఞలుసామెతల జాబితా🡆 More