మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
ఆయన మధిర నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబరు 7 నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.
మల్లు భట్టివిక్రమార్క | |||
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 డిసెంబర్ 7 నుండి ప్రస్తుతం | |||
ముందు | కడియం శ్రీహరి | ||
---|---|---|---|
పదవీ కాలం 18 జనవరి 2019 – 6 జూన్ 2019 | |||
ముందు | కె. జానారెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్ | ||
తెలంగాణ శాసనసభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - ప్రస్తుతం | |||
ముందు | కట్టా వెంకట నర్సయ్య | ||
నియోజకవర్గం | మధిర | ||
డిప్యూటి స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు | |||
పదవీ కాలం 2011 – 2014 | |||
తరువాత | మండలి బుద్ధ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ | ||
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
నియోజకవర్గం | మధిర | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | స్నానాల లక్ష్మీపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ | 1961 జూన్ 15||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | అఖిలాండ, మాణిక్యమ్మ | ||
జీవిత భాగస్వామి | నందిని | ||
బంధువులు | మల్లు అనంత రాములు, మల్లు రవి (సోదరులు) | ||
సంతానం | సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య |
మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించాడు. ఈయన అన్న మల్లు అనంత రాములు నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు కాగా, మరో అన్న మల్లు రవి మాజీ పార్లమెంటు సభ్యుడు. విక్రమార్క హైదరాబాదులోని కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.
విక్రమార్కకు నందీనితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య) ఉన్నారు.
భట్టి విక్రమార్క భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో మధిర నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై చీఫ్ విప్గా పనిచేశాడు. భట్టి విక్రమార్క 2011 జూన్ 04 నుండి 2014 మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీనుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 12,329 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచాడు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యాడు.
భట్టి విక్రమార్క 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మధిర నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, డిసెంబరు 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనను 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో డిసెంబరు 18న సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గల ఇన్చార్జ్గా నియమించారు.
మల్లు భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేసి పాదయాత్రకు గుర్తుగా ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ ను ఆవిష్కరించి ముగింపు సందర్భంగా ఖమ్మంలో 2023 జూలై 2న రాహుల్ గాంధీ ముఖ్యఅతిధిగా జన గర్జన సభను నిర్వహించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article మల్లు భట్టివిక్రమార్క, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.