ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి (జులై 9, 1918 - మార్చి 22, 2007) ఒక సుప్రసిద్ధ తత్త్వవేత్త.
యూజీగా సుప్రసిద్ధుడు.
ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి | |
---|---|
జననం | మచిలీపట్నం, భారతదేశం | 1918 జూలై 9
మరణం | 2007 మార్చి 22 వల్లెక్రోసియా, ఇటలీ | (వయసు 88)
వృత్తి | తత్వవేత్త |
బంధువులు | సౌమ్య బొల్లాప్రగడ (మనవరాలు) |
ఆయన జులై 9, 1918 న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మచిలీపట్నంలో జన్మించాడు. గుడివాడలో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. దివ్యజ్ఞాన సమాజం కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీకి కూడా బాల్యం లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.
ఎక్కువకాలము విదేశాలలో గడిపి తనదైన తత్త్వాన్ని ప్రజలకు పంచిన వ్యక్తి యు.జి. మార్చి 22, 2007లో ఆయన మరణించారు. తర్వాతనె తెలుగువారు అటువంటి తత్త్వవేత్త ఒకరున్నారని తెలుసుకున్నారు. యు.జి. తత్త్వం ఏదీ అసత్యము కాదు.. ఏదీ సత్యము కాదు అంతా మిధ్య అన్నట్టుగా సాగుతుంది. జ్ఞానోదయం " అనేది లేనే లేదంటారు. దినవారీ కార్యక్రమాల నిర్వహణకు జ్ఞానము అవసరమే. ఐతే ఆ జ్ఞానము రావడమే జ్ఞానోదయమా! అని ప్రశ్నిస్తారు . ఆలోచనల ప్రభావం తాత్కాలికమే తప్పించి శాశ్వత పరిష్కారం చూపించే ఆలోచనలే లేవన్నారు. ఆలోచన అనేది ఏ రూపంలో ఉన్నా అంగీకరించలేదు. ఆలోచనాపరమైన విజ్ఞానము కూడా మిధ్యేనని అన్నారు.
This article uses material from the Wikipedia తెలుగు article ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.