అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా.
జిల్లా కేంద్రం అనంతపురం. 2022 లో ఈ జిల్లాను విభజించి కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిరప,అరటి,నువ్వులు, చెరుకు, పట్టు. ఇక్కడి ముఖ్యమైన పరిశ్రమలలో సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం, ఆటోమొబైల్ ఉన్నాయి.
అనంతపురం జిల్లా | |
---|---|
Coordinates: 14°42′N 77°35′E / 14.7°N 77.59°E | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | రాయలసీమ |
ప్రధాన కార్యాలయం | అనంతపురం |
Area | |
• Total | 10,205 km2 (3,940 sq mi) |
Population (2011) | |
• Total | 22,41,100 |
• Density | 220/km2 (570/sq mi) |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
ఈ పేజీలో గతంలో ఉన్న సమాచారం స్థానే కొత్త సమాచారాన్ని చేర్చినట్లుగా తోస్తోంది. అయితే, విజ్ఞానసర్వస్వ వ్యాసాల్లో చారిత్రిక సమాచారం ముఖ్యమైనది కాబట్టి, తీసేసిన పాత సమాచారాన్ని కూడా తిరిగి చేర్చి, ఈ వ్యాసం అభివృద్ధిలో తోడ్పడండి. ఏయే సమాచారాన్ని చేర్చాలనే విషయాన్ని చర్చా పేజీలో చర్చించండి. |
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.
పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు. ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.
తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రాన్ని కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారానికి కాపలాగా ఉన్న మొదటి హరిహరరాయలు, బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది. బుక్కరాయల పేరు మీదుగా ఈ ప్రాంతంలో ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది. ఈ ప్రాంతపు పట్టణానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశపు అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది.
1677 లో ఈ ప్రాంతం మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్థులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్ధతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి,మదిగుబ్బ,నల్లమాడ,నంబులిపులికుంట,తలుపుల,నల్లచెరువు, ఓబులదేవరచెరువు,తనకల్లు,ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాల్, కణేకల్లు, బొమ్మనహళ్, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.
2022 ఏప్రిల్ 4 న శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుకు జిల్లా నుండి 29 మండలాలను విడదీశారు.
జిల్లా విస్తీర్ణం: 10,205 చ.కి.మీ
2011 జనాభా లెక్కల ప్రకారం 2022 లో సవరించిన హద్దులపు అనంతపురం జిల్లా జనాభా 22.411 లక్షలు.
భౌగోళికంగా జిల్లాను 3 రెవెన్యూ డివిజన్లుగాను,31 మండలాలుగా విభజించారు. గుంతకల్ రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటైంది.
మొత్తం 8 శాసనసభ నియోజకవర్గాలు:
NH-44, NH-42 జాతీయ రహదారులు జిల్లాలో అనంతపురం గుండా పోతున్నాయి. జిల్లాకు రైలు సదుపాయం కూడా ఉంది, జిల్లాలో ఉన్న గుంతకల్లు రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే డివిజన్ లో రెండవ అతిపెద్ద జంక్షన్, ఇక్కడినుండి దేశ నలుమూలలకు రైలు సదుపాయం ఉంది.
దక్షిణ మధ్య రైల్వేలో 3 వ పెద్ద డివిజన్ అయిన గుంతకల్లు ఈ జిల్లాలో ఉంది. ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి.
168 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు లోని దేవనహళ్ళి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. జిల్లాలో అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో గుత్త విమానయాన సేవలకు మాత్రమే పరిమితమైన పుట్టపర్తి విమానాశ్రయం ఉంది.
అనంతపురం లోని గవర్న్మెంట్ ఆర్ట్స్ కాలేజిని 1916లో స్థాపించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వ్యక్తులు ఈ కాలేజీలో చదివారు.
ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థల వివరాలు:
సంఖ్య | విద్యాసంస్థ | వివరణ | సంఖ్య |
1 | ప్రాథమిక పాఠశాలలు | ఆంగ్ల మాద్య పాఠశాలలు | 3 |
2 | హైస్కూల్స్ | ప్రభుత్వ, ప్రవేట్ హైస్కూపాఠశాల రెసిడెన్షియల్ | 7 |
3 | జూనియర్ కాలేజులు | బాలల, బాలబాలికల జూనియర్ | 3 |
4 | కళాశాలలు | ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు | 6 |
5 | ఉన్నతకళాశాలలు | ఎమ్ ఎస్ సి, పి జి, డిగ్రీ, పిజి కాలేజులు | 4 |
6 | విశ్వవిద్యాలయాలు | కేంద్ర, జవహర్లాల్ | 2 |
7 | మెడికల్ కాలేజీలు | ప్రభుత్వ మెడికల్ కాలేజ్ | 1 |
8 | ఫార్మసీ | రాఘవేంద్రా కాలేజ్ 1 | 1 |
9 | ఇంజనీరింగ్ కాలేజీలు | ఇంజనీరింగ్ కాలేజీలు | 4 |
10 | పోలీస్ ట్రైనింగ్ | పోలీస్ ట్రైనింగ్ | 1 |
11 | నర్సింగ్ | శ్రీ సాయీ నర్సింగ్ | 1 |
12 | ఇన్స్టిట్యూట్స్ | ఎజ్యుకేషనల్, టెక్నో డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ | 10 |
13 | టీచర్ ట్రైనింగ్ | సత్యసాయీ, లిటిల్ ఫ్లవర్ సంస్థలకు చెందినవి | 2 |
14 | ఫిజియోథెరఫీ | కస్తూర్భా ఫిజియోథెరఫీ | 1 |
1963-1964 లో ఇరానీ కప్పు, పలు బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు అనంతపురంలో జరిగాయి.
This article uses material from the Wikipedia తెలుగు article అనంతపురం జిల్లా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.