అథర్వణాచార్యుడు మహా భారతాన్ని తెలుగులో వ్రాసిన కవి.
ఇతను వ్రాసిన మహా భారతంఇప్పుడు లభించడంలేదు, కానీ ఇతని తరువాతి కవులు ఈ గ్రంథంలోని పద్యాలను ఉదహరించడం వల్ల మనకు ఇతని రచన గురించి తెలుస్తుంది.
సా.శ.1445 కాలంలో జీవించి, లక్షణదీపిక అనే ఛందోగ్రంథాన్ని రచించిన గౌరన అథర్వణచ్ఛందాన్ని తెలిపినాడు. కనుక అథర్వణాచార్యుడు పదమూడవ శతాబ్దం వాడు అయి ఉంటాడు.
అను పధ్యము వల్ల కనీసం కర్ణ పర్వము వరకూ తెనిగించి ఉంటాదు అని చెప్పవచ్చు.
అను పధ్యము వల్ల ఆదిపర్వం నుండి మొదలుపెట్టినాడని చెప్పవచ్చు.
అను పద్యము వల్ల అరణ్యపర్వాన్ని అందులోని ఉపాఖ్యాలనూ అనువదించినట్టు తెలుస్తుంది.
సుమారుగా మొత్తం భారతం తెనిగించి ఉండవచ్చు అని చెప్పవచ్చు.
అథర్వుని శైలి చాలా కఠినమనీ, సమాసజటిలమఇన ఇతని కవిత కవిత్రయంవారి భారతం ముందు నిలబడలేక పొయిందనీ, తత్కారణముననే ఇతని భారతం కవిత్రయం వారి భారతం అంత ప్రచారం లభించలేదనీ పండితులు భావిస్తున్నారు.
" మొత్తం మీద ఈ ఉదాహరణలన్నీ చూస్తూ ఉంటే ఒక చక్కని భారతరచన మనకు దక్కలేదే అన్న చింత ప్రతిసాహిత్యప్రియునికీ కలుగుతుంది. ఇతని ఛందస్సులోనివని లాక్షణికులు ఉదాహరించిన పదాలను గమనిస్తే ఇతని గ్రంథం సమగ్రమైన దేమో అనిపిస్తుంది. ఒక్క ఆనందరంగరాట్ఛందంలోనే ఇతనివి 26 పద్యాలు పేర్కొన్నాడు.
అధర్వణుని భారతమో, లేక కనీసం ఛందస్సో ముందు ముందు లభించాలని ఆశిద్దాం. ఇప్పటికి దొరికిన ఆక్షరాలనుబట్టి ఇతణ్ణిగురించి ఇంతకన్నా ఎక్కువ మనకు తెలియదు.
"
This article uses material from the Wikipedia తెలుగు article అథర్వణాచార్యుడు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.