కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి.
తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.
ఇతడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.
తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. ఇతడు ప్రతిదినం పిఠాపురానికి వచ్చి కుక్కుటేశ్వరడుని సేవించేవాడు. సహస్రమాస జీవి. పిఠాపురాన్ని పరిపాలించిన ప్రభువులలో రావు పెదమాధవరావు, రావు నరసింహారావు, రావు వేంకటరావు, రావు వేంకటకృష్ణారావు, రావు చినమాధవరావు పాలనాసమయంలో ఇతడు జీవించి వున్నాడు. రావు చినమాధవరావు తిమ్మకవికి "కవి సార్వభౌమ" అనే బిరుదాన్నిచ్చాడు. అయినా తిమ్మకవి తన గ్రంథాలను పిఠాపురపు కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇతని చివరిదశలో భార్యావియోగంతో సన్యాసం స్వీకరించి శేషజీవితాన్ని పిఠాపురంలోని కుక్కుటేశ్వరాలయంలోనే గడిపాడు.
This article uses material from the Wikipedia తెలుగు article కూచిమంచి తిమ్మకవి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.