పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.
ఆయన 2009 నుండి 2014 వరకు15వ లోకసభకు ఎన్నికై , 2009లో ఎన్నికైన ఎం.పి.లలో చిన్న వయస్కుడు.
పొన్నం ప్రభాకర్ గౌడ్ | |||
| |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 7 నుండి ప్రస్తుతం | |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 3 నుండి ప్రస్తుతం | |||
నియోజకవర్గం | హుస్నాబాద్ | ||
---|---|---|---|
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 2009 నుండి 2014 | |||
నియోజకవర్గం | కరీంనగర్ | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | కరీంనగర్, కరీంనగర్, తెలంగాణ | 1967 మే 8||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేస్ | ||
తల్లిదండ్రులు | పొన్నం సత్తయ్యగౌడ్, తల్లి మల్లమ్మ | ||
జీవిత భాగస్వామి | మంజుల పొన్నం | ||
బంధువులు | పొన్నం అశోక్ గౌడ్ (అన్నయ్య) , పొన్నం రవిచంద్ర (అన్నయ్య) | ||
సంతానం | ఇద్దరు కుమారులు (పృథ్వి, ప్రణవ్) | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ | ||
మతం | భారతీయుడు | ||
వెబ్సైటు | పొన్నం ప్రభాకర్ వెబ్ సైట్ |
ప్రభాకర్ 1967, మే 8న సత్తయ్య - మల్లమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ, ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.
ప్రభాకర్ కి 2000, ఏప్రిల్ 21న మంజులతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (పృథ్వి, ప్రణవ్).
పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యూఐ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసి తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించి లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యాడు.
పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ ఓడిపోయాడు. ఆయన 2018 సెప్టెంబరులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితుడై, 2019 జూన్ 28న రాజీనామా చేశాడు.
పొన్నం ప్రభాకర్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్గా 2023 ఆగస్ట్ 30న నియమితుడయ్యాడు. ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, డిసెంబర్ 7న మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, డిసెంబర్ 18న డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించాడు.
పొన్నం ప్రభాకర్ కు 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జ్గా, డిసెంబర్ 24న హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు.
This article uses material from the Wikipedia తెలుగు article పొన్నం ప్రభాకర్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.