ఏలూరు (ఎల్లొర్ ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఏలూరు జిల్లా నగరం, జిల్లా కేంద్రం.
సమీపంలో గల కొల్లేరు సరస్సు ప్రముఖ పర్యాటక ఆకర్షణ.
ఏలూరు హేలాపురి | ||||||
---|---|---|---|---|---|---|
నగరం | ||||||
Coordinates: 16°42′42″N 81°06′11″E / 16.71167°N 81.10306°E | ||||||
దేశం | భారతదేశం | |||||
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ | |||||
జిల్లా | ఏలూరు | |||||
స్థాపితం | సా.శ. 2 వశతాబ్దం | |||||
పట్టణంగా గుర్తింపు | 1866 | |||||
నగరంగా గుర్తింపు | 2005 ఏప్రిల్ 9 | |||||
Government | ||||||
• Type | పట్టణ స్థానిక సంస్థ | |||||
• Body | ఏలూరు నగరపాలక సంస్థ | |||||
• పార్లమెంట్ సభ్యుడు | కోటగిరి శ్రీధర్ (YSRCP) | |||||
• శాసనసభ సభ్యుడు | ఆళ్ల నాని (YSRCP) | |||||
Area | ||||||
• నగరం | 11.52 km2 (4.45 sq mi) | |||||
• Urban | 154 km2 (59 sq mi) | |||||
• Metro | 3,328.99 km2 (1,285.33 sq mi) | |||||
Elevation | 22 మీ (72 అ.) | |||||
Population (2011) | ||||||
• నగరం | 2,14,414 | |||||
• Metro | 27,60,160 | |||||
Demonym | ఏలూరివారు | |||||
అక్షరాస్యత వివరాలు | ||||||
భాషలు | ||||||
• అధికారిక | తెలుగు | |||||
Time zone | UTC+05:30 (IST) | |||||
పిన్ | 534*** | |||||
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 8812 | |||||
Vehicle registration | AP–39 NEW |
ఏల అన్న చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించడంతో ఏలూరు అన్న పేరు ఏర్పడివుంటుందని బూదరాజు రాధాకృష్ణ భావించాడు.
తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినపుడు ఏలూరు వారి రాజ్యంలో భాగం. తరువాత కళింగ రాజ్యం, గజపతుల పరిపాలనలోకొచ్చింది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొన్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగి, గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.[ఆధారం చూపాలి]
బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరచినపుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది.
కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ, గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వద్ద కొల్లేరులో కలుస్తాయి. అందువలన హేలాపురి అనే పేరు సాహిత్యపరంగా వాడుకలోకి వుచ్చింది . తూర్పు లాకుల దాకా గోదావరి నీళ్ళు, పడమటి లాకుల దాకా కృష్ణ నీళ్ళూ. కృష్ణ ఎత్తు, గోదావరి పల్లం కావున నదులు కాలవలో సమతలంగా కలపడానికి తూర్పు లాకులు, పడమటి లాకులు ఉండేవి. ఆ లాకులు ముయ్యడం, తియ్యడం, పడవలని జాగ్రత్తగా కాలవలోకి పంపించడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. చైత్ర వైశాఖ మాసాల్లో లాకులు కట్టేసి కాలవ మూసేసే వాళ్ళు. అప్పుడు కాలవ ఎండి పోయేది. మళ్ళీ మృగశిర కార్తెలో, కాలవ వదిలే వాళ్ళు. ఆ కాలవ నీళ్ళే పంపుల చెరువుల్లోకి పట్టి ఉంచేవాళ్ళు. కాలక్రమేణా కాలవలో సమృద్ధిగా నీళ్ళు వుండకపోవడంతో, పడవలు తిరగడం ఆగిపోయింది. పంపుల చెరువులు పూడిపొయ్యాయి.
పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయి. ఆ విధంగా నగర జనాభా 3, 50, 000కు చేరుకొంది.[ఆధారం చూపాలి] 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఏలూరు లోక్సభ నియోజకవర్గ పరిధితో ఏలూరు జిల్లా కేంద్రంగా మారింది.
భౌగోళికంగా ఏలూరు అక్షాంశ రేఖాంశాలు 16°42′N 81°06′E / 16.7°N 81.1°E. సముద్ర తలం నుండి ఎత్తు 22మీటర్లు. (72అడుగులు) . బంగాళాఖాతం తీరం నుండి ఏలూరు 40 మైళ్ళ దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్యంగా 78 కి.మీ దూరంలో ఉంది. విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు నగరాల మధ్య ఉంది.
ఇది ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతం. ఏప్రిల్, మే, జూన్ నెలలు బాగా వేడిగా ఉంటాయి. ఏలూరులో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 51.7 డిగ్రీలు సెంటీగ్రేడ్, అత్యల్ప ఉష్ణోగ్రత 12.9 0 డిగ్రీలు సెంటీగ్రేడ్.
నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది. మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర అశోక్ నగర్ వద్ద రెండుగా చీలుతుంది . ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు ప్రధాన నగరం వుంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్ కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది.[ఆధారం చూపాలి]
కృష్ణానదినుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. తమ్మిలేరు అనే యేరు ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలవుతుంది. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జల్లాలలో సుమారు 120 మైళ్ళు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. ఏలూరులో ఎఫ్.సి.ఐ. గోడౌనుల దగ్గర రెండుగా చీలుతుంది. ఆ చీలికలు మొండికోడు, పెదయడ్లగాడి అనే రెండు స్థలాల వద్ద కొల్లేరులో కలుస్తాయి.[ఆధారం చూపాలి]
నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణం మధ్యగా తమ్మిలేరు కాలువ ప్రవహిస్తుంది. స్థూలంగా పట్టణాన్ని I టౌన్ (తమ్మిలేరు కాలువకి ఆవల వున్న ప్రాంతం), II టౌన్ (తమ్మిలేరు కాలువకి ఇవతల వున్న ప్రాంతం) గా విభజించవచ్చు. అయితే పోస్టల్ వారి ప్రకారం ఏలూరు-1 (తమ్మిలేరు కాలువ నుండి తూర్పు వైపు వున్న ప్రాంతం), ఏలూరు-2 ( పవర్ పేట, ఆర్ ఆర్ పేట తదితర ప్రాంతాలు), ఏలూరు-3 (శనివారపు పేట), ఏలూరు-3 (చాటపర్రు ప్రాంతం), ఏలూరు-5 (రైల్వే స్టేషన్, ఆదివారపు పేట ప్రాంతాలు, తంగెళ్ళమూడి, ఏలూరు-6 (నరసింహారావు పేట, అమీనా పేట, అశోక్ నగర్ ప్రాంతాలు), ఏలూరు-7 (వట్లూరు, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు ప్రాంతాలు) లుగా విభజించబడింది. ప్రధాన విభాగాలు[ఆధారం చూపాలి]
2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 217, 876. 1901లో పట్ణ జనాభా 33, 521 మాత్రమే ఉండేది. 1991 నాటికి ఇది 2, 12, 866 కు చేరుకొంది. 1991 లెక్కల ప్రకారం అక్షరాస్యత 72%. 1981-91 మధ్యకాలంలో 26.63% అక్షరాస్యతా వృద్ధి నమోదయ్యింది. 2001లో జనాభా 2, 15, 642.
1866 లో మునిసిపాలిటిగా ఏర్పడింది. (దేశంలో రెండవ మోడల్ మునిసిపాలిటి) 2005 లో మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తించబడింది. ఏలూరు ప్రస్తుతం ఒక స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కార్పొరేషన్. ఏలూరు నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది.
ఏలూరు నగరం, రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ నగరాలు, పట్టణాలు చాలా బాగా అనుసంధానించబడి ఉంది.
జాతీయ రహదారి 16 పై ఈ నగరం ఉంది. ఏలూరు పాత బస్సు స్టేషన్, ఏలూరు కొత్త బస్సు స్టేషన్ల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సు నడుపుతోంది.
ఏలూరు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజన్లో దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక రైల్వే స్టేషను. పవర్పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషను నగరానికి చెందిన శాటిలైట్ స్టేషన్లు. ఈ స్టేషన్లు హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉన్నాయి.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏలూరుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం (35 కి.మీ).
జాతీయ జలమార్గం 4 గా ప్రకటించబడిన జలమార్గం తీర ప్రాంతం వెంబడి కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్హాం కాలువ ద్వారా వెళ్తుంది.
ఏలూరులో శాంతిభద్రతల కొరకు ఎనిమిది పోలీసు స్టేషన్లు నిర్వహించబడుతున్నవి. వీటిలో, ఒక మహిళా పోలీసు స్టేషను, ఒక ట్రాఫిక్ పోలీసు స్టేషనూ ఉన్నాయి. ఇవి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పరిధిలోకే ఉన్నాయి.
వాటిలో కొన్ని:
వెయ్యి సంవత్సరాలకు పైబడి చరిత్రవున్న ఆలయాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం, జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జనార్దన కన్యకాపరమేశ్వరీదేవి గుడి, మార్కండేయాలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article ఏలూరు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.