సి.ఆనందారామం ఆగస్టు 20వ తేదీ 1935వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు పట్టణంలో జన్మించేరు.
60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శ గ్రంథాలు రాసేరు. ఈమె వ్రాసిన నవల ఆత్మబలి సంసార బంధం సినిమాగా, అదే నవల జీవనతరంగాలు టీవీ సీరియల్గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమాగా తీశారు.
సి.ఆనందారామం | |
---|---|
జననం | ఆనందలక్ష్మి 1935 ఆగస్టు 20 ఏలూరు,పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
మరణం | 2021 ఫిబ్రవరి 10 తెలంగాణ రాష్ట్రం |
వృత్తి | అధ్యాపకురాలు |
ప్రసిద్ధి | కథా రచయిత్రి, నవలా రచయిత్రి |
పదవి పేరు | ప్రొఫెసర్ |
మతం | హిందూ |
భార్య / భర్త | చిలకమఱ్ఱి రామం |
పిల్లలు | ఇద్దరుకుమారులు |
తండ్రి | ముడుంబై రంగాచార్యులు |
తల్లి | గోపాలమ్మ |
ఈమె అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు ఈమె తల్లిదండ్రులు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పాస్ అయ్యింది. బి.ఏ. పూర్తయ్యాక సి.ఆర్.ఆర్. కాలేజీలో తెలుగు ట్యూటర్గా కొన్నాళ్లు పనిచేసింది. 1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాం మార్చింది. 1958-60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివింది.సి.నారాయణరెడ్డి గైడుగా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సంపాదించింది. హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్గా పనిచేసింది. సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీవిరమణ చేసింది.
This article uses material from the Wikipedia తెలుగు article సి. ఆనందారామం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.