ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేది వాషింగ్టన్, DC లో ఉన్న నిష్పక్షపాత అమెరికన్ థింక్ ట్యాంక్ (దానిని ఫ్యాక్ట్ ట్యాంక్గా పిలుచుకుంటారు)
ఇది యునైటెడ్ స్టేట్స్ను, ప్రపంచాన్నీ రూపు దిద్దే సామాజిక సమస్యలు, ప్రజాభిప్రాయం, జనాభా ధోరణులపై సమాచారం అందిస్తుంది. ఇది ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది, జనాభా వివ్రాలను పరిశోధిస్తుంది, సెల్ ఫోన్, ల్యాండ్లైన్ నంబర్లపై ప్రజలకు యాదృచ్ఛికంగా కాల్ చేస్తుంది, మీడియా కంటెంట్ విశ్లేషణ, ఇతర అనుభావిక సామాజిక శాస్త్ర పరిశోధనలను కూడా నిర్వహిస్తుంది.
ప్యూ రీసెర్చ్ సెంటర్ విధానపరమైన అభిప్రాయాలను పెట్టుకోదు. ఇది ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్ల అనుబంధ సంస్థ .
1990లో, టైమ్స్ మిర్రర్ కంపెనీ టైమ్స్ మిర్రర్ సెంటర్ ఫర్ ది పీపుల్ & ప్రెస్ అనే ఒక పరిశోధన ప్రాజెక్టును స్థాపించింది. రాజకీయాలు, విధానాలకు సంబంధించిన సర్వేలను నిర్వహించే పనిలో ఉండేది. ఆండ్రూ కోహుట్ 1993లో దానికి డైరెక్టరయ్యాడు. 1996లో ది ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్లు దానికి ప్రాథమిక స్పాన్సర్గా మారాయి. దీని పేరును ప్యూ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది పీపుల్ & ప్రెస్గా మార్చారు.
2004 లో ట్రస్టు, వాషింగ్టన్లో ప్యూ రీసెర్చ్ సెంటర్ను స్థాపించింది. 2013 లో కోహుట్ అధ్యక్షుడిగా వైదొలిగి, వ్యవస్థాపక డైరెక్టరయ్యాడు. అలాన్ ముర్రే కేంద్రానికి రెండవ అధ్యక్షుడయ్యాడు. 2014 అక్టోబరులో ప్యూ రీసెర్చ్ సెంటర్లో 14 ఏళ్ల అనుభవజ్ఞుడైన మైఖేల్ డిమోక్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.
ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేది లాభాపేక్ష రహిత, పన్ను మినహాయింపు 501(సి)(3) సంస్థ. దానికి ప్రాథమిక నిధులు అందించే ది ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్లకు ఇది అనుబంధ సంస్థ. ప్రపంచంలోని మతాల జనాభాపై అది చేసే అధ్యయనాల కోసం, ప్యూ రీసెర్చ్ సెంటర్కు టెంపుల్టన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిధులు సమకూరుస్తుంది.
కేంద్రం కింది అంశాలపై పరిశోధన చేస్తుంది:
ప్యూ రీసెర్చ్ సెంటర్లోని పరిశోధకులు ఏటా పబ్లిక్గా అందుబాటులో ఉన్న సమాచారాన్ని, ప్రచురణలనూ జల్లెడ పడతారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్యూ-టెంపుల్టన్ గ్లోబల్ రిలిజియస్ ఫ్యూచర్స్ ప్రాజెక్ట్లో భాగంగా మతంపై ప్రపంచంలో ఉన్న పరిమితులపై తన 10వ వార్షిక నివేదికను విడుదల చేసింది. దీనికి ది ప్యూ ఛారిటబుల్ ట్రస్ట్లు, జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ లు నిధులు సమకూర్చాయి. వార్షిక నివేదిక ప్రచురణకు 18 నెలల నుండి రెండు సంవత్సరాల ముందు జరిగిన సంఘటనలను పరిశీలించింది. మునుపటి నివేదికలు సంవత్సరానికి సంబంధించిన మార్పుపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ఈ నివేదిక మాత్రం నిర్దిష్ట ప్రాంతాలలో, 198 దేశాలు, భూభాగాల్లోని పోకడలపై విస్తృత రూపాన్ని అందించింది. 2007 నుండి 2017 వరకు మతంపై ప్రభుత్వాల ఆంక్షలు, మతపరమైన సామాజిక శత్రుత్వాలు ఎలా మారాయి, ఎలా పెరిగాయి అనే విషయాన్ని నివేదికలో చూపింది. 52 ప్రభుత్వాలు మతంపై అధిక స్థాయి ఆంక్షలు విధించాయి, 2007లో ఇది 40 గా మాత్రమే ఉండేది. 2007లో 38 దేశాల్లో మతపరమైన సామాజిక ఘర్షణలు జరగ్గా, 2017 లో అది 56 కు చేరింది. నివేదిక ప్రకారం, మత స్వేచ్ఛను పరిమితం చేసే చట్టాలు విధానాలు మత సమూహాలకు ప్రభుత్వ అనుకూలత అనే రెండు రకాల ఆంక్షలు అత్యంత ప్రబలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆంక్షలు పెరుగుతున్నాయని, అయితే అన్ని భౌగోళిక ప్రాంతాలు లేదా అన్ని రకాల ఆంక్షలు అంత సమానంగా లేవని పోకడలు సూచిస్తున్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article ప్యూ రీసెర్చి సెంటర్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.