సింగపూర్ జాతి పితగా ప్రసిద్ధుడైన లీ క్వాన్ యూ 1923 సెప్టెంబరు 16న పుట్టి, 91వ ఏట 2015, మార్చి 23న మరణించారు.సంపన్న సుందర సింగపూర్ నగర నిర్మాతగా ఖ్యాతి దక్కించుకున్నారు.
1959లో బ్రిటిష్ వారి నుంచి విముక్తమైన సింగపూర్కు మొదటి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన లీ 1990 వరకు ఆ పదవిలో ఉన్నారు. ప్రజలు ప్రేమగా ఎంఎంలీ (మినిష్టర్, మెంటర్ లీ) అని పిలిచే వారు. ఆర్థిక వాణిజ్య కేంద్రంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషిని ఎంతోవున్నది. ఎఫిషియంట్, అన్సెంటిమెంటల్, ఇన్కరప్ట్, ఇన్వెంటివ్, ఫార్వర్డ్ లుకింగ్ అండ్ ప్రాగ్మటిక్ అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక 2007 లో లీని కీర్తించింది. వి ఆర్ ఐడియాలజీ ఫ్రి అని లీ న్యూయార్క్ టైంస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.36వ ఏట ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 31 ఏళ్లు కొనసాగారు. ఆయన మీద కూడా అప్రజాస్వామికవాది, నియంత అనే విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
1959 నుంచి 1990 వరకూ అంటే మూడు దశాబ్దాలు పైబడి సింగపూర్కు ప్రధానమంత్రిగా పనిచేసిన లీ క్వాన్ యూ తన దీక్షా దక్షతలతో ఆ దేశాన్ని భాగ్యసీమగా మార్చేశాడు. అభివృద్ధి అంతా ఏకవ్యక్తి పాలనలో, ఏకపార్టీ ఏలుబడిలోనే జరిగింది.
ఆరేళ్ల వయసులో, కట్టెతో చేసిన ఎద్దుల బండిలో, సరైన రహదారి కూడా లేని మార్గంలో ప్రయాణం చేసి, తండ్రి పొలంలో పనిచేసిన లీ క్వాన్ యూ, ఏబై ఏళ్ల తరువాత, సూపర్ సానిక్ విమానంలో, మూడు గంటలు మాత్రమే ప్రయాణం చేసి లండన్ నుంచి న్యూయార్క్ చేరుకున్న విషయం తన పుస్తకంలో ప్రస్తావించి, దానికి కారణం విశ్వవ్యాప్తంగా జరిగిన సాంకేతికాభివృద్ధి అంటారు. మొదటి సారి అధికారాన్ని చేపట్టినప్పుడు, తమకు పాలనానుభవం లేకపోయినా, తమ నిబద్ధత, సమాజాన్ని బాగుచేయాలన్న తపన, ముందుకు సాగిపోయే ట్లు చేసిందంటారు. "ఆన్ ద జాబ్ ట్రెయినింగ్" లాగా, పదవిలో వుండగానే తానెంతో నేర్చుకున్నానంటారు. విమర్శలనెప్పుడూ ఆయన లెక్క చేయలేదు. రాజకీయ వారసత్వం ఎలా రూపుదిద్దుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. 30-40 ఏళ్ల వయసున్న వారిని రాజకీయాలలోకి లాగడంలో ఆయన దిట్ట. ఒక పథకం ప్రకారమే, తన వారసత్వాన్ని 1990 లో, గో చోక్ టోంగ్ కు బదలాయించారు. గో చోక్ తరువాత 2004 లో, తన పెద్ద కుమారుడు, లీ సూన్ లూంగ్ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేశాడు. 1942-1945 మధ్య కాలంలో, జపాన్ ఆక్రమణ కింద సింగపూర్ మగ్గుతున్న రోజుల్లో, బ్రిటన్లో విద్యాభ్యాసం చేస్తుండేవాడు లీ క్వాన్ యూ. సింగపూర్ ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకున్న లీ మదిలో జాతీయ భావాలు, ఆత్మగౌరవ ఆవేశం పెల్లుబుకింది. 1950 లో సింగపూర్ తిరిగొచ్చిన లీ, కార్మిక సంఘాల-రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు. కేవలం 35 సంవత్సరాల పిన్న వయసులో సింగపూర్ ప్రధానిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీతో ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత విడిపోయారు. లీ క్వాన్ యూ, ఆయన సహచరులు, సింగపూర్ను మలయాళో విలీనం చేస్తే బాగుంటుందని నమ్మడం, సెప్టెంబరు 1963 లో కలవడం, అలా కలిసిన ఇరు దేశాలు మలేసియాగా పిలవబడడం జరిగింది. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలు, సైద్ధాంతిక విభేదాలు, మలేసియా నుంచి సింగపూర్ వేరు పడడానికి దారితీశాయి. ఫలితంగా, ఆగస్టు 1965 లో సింగపూర్, ప్రపంచంలోనే, ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా, ద్వీప దేశంగా ఏర్పడింది. 42 సంవత్సరాల లీ క్వాన్ యూ దేశ ప్ర ప్రథమ ప్రధానిగా, ఇరవై లక్షల మంది ప్రజల రక్షకుడిగా బాధ్యతలు చేపట్టారు. 1990 నవంబరు 28 వరకు ఆ పదవిలో కొనసాగి, తన వారసుడిగా గో చోక్ టోంగ్ ను ప్రధానిని చేసి, ఆయన మంత్రివర్గంలోనే సీనియర్ మినిస్టర్ గా పనిచేశారు.
ప్రధాని పదవి వదిలేశాక ప్రపంచం నలుమూలల పర్యటించి దేశదేశాల నాయకులతో తన అనుభవాన్ని పంచుకున్నారు. దీనిలో భాగంగా లీ భారతదేశానికి పలుమార్లు వచ్చాడు. 1960 మొదలుకొని లీ పలుమార్లు భారతదేశానికి వచ్చాడు. చివరగా 2005లో భారత్ను సందర్శించాడు.
{{cite book}}
: CS1 maint: ref duplicates default (link){{cite book}}
: CS1 maint: ref duplicates default (link)This article uses material from the Wikipedia తెలుగు article లీ క్వాన్ యూ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.