మెట్ల సత్యనారాయణ రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇటీవలే జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం కమిటీలను ప్రకటించినప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.
మెట్ల సత్యనారాయణ రావు | |||
| |||
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు | |||
వ్యక్తిగత వివరాలు | |||
---|---|---|---|
జననం | అల్లవరం మండలం కొమరగిరిపట్నం, తూర్పుగోదావరి జిల్లా | 1942 జనవరి 4||
మరణం | 2015 డిసెంబరు 25 హైదరాబాదులోని నిమ్స్ | (వయసు 73)||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
మతం | హిందూ |
ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో 1942 జనవరి 4 న మెట్ల రామ్మూర్తి, సరస్వతి దంపతులకు జన్మించారు. 1974లో రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు.
ఆయన రాజకీయ జీవితం 1982లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైనది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ఆయన గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో ఆయన అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. తరువాత 1994, 1999 లలో కూడా శాసనసభ్యునిగా ఎన్నికైనారు.] 1996 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మెట్ల సత్యనారాయణ ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. కొంతకాలం పాటు ప్రజారాజ్యం పార్టీలోనికి చేరినా 2009 లో తిరిగి తెలుగుదేశం పార్టీలోనికి తిరిగి వచ్చి ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు.
ఆయన డిసెంబరు 25 2015 న ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
This article uses material from the Wikipedia తెలుగు article మెట్ల సత్యనారాయణ రావు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.