ఆపరేషన్ బ్లూస్టార్

ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 1 నుంచి 10 లోపల జరిగిన భారతీయ సైనిక చర్య.

ఇది పంజాబ్ లోని అమృత్‌సర్ లోగల హర్‌మందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) కాంప్లెక్స్ నుంచి సిఖ్ దాందానీ తక్సల్ నాయకుడైన జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే, అతని అనుచరులను బయటకు రప్పించడానికి చేసిన చర్య. అప్పటి భారత ప్రధాని అయిన ఇందిరా గాంధీ ఈ చర్యకు ఆదేశించింది. మాజీ జనరల్ ఎస్. కె. సిన్హా ప్రకారం ఇందిరా గాంధీ ఈ సంఘటనకు సుమారు 18 నెలల ముందు, అంటే తిరుగుబాటు దారులు ఆలయంలోని ప్రవేశించక ముందునుంచే సైన్యాన్ని ఆపరేషన్ కు సిద్ధం కమ్మని ఆదేశించింది. 1982 జూలైలో పంజాబ్ కు చెందిన అకాళీదళ్ పార్టీ అధినేత హరిచంద్ సింగ్ లోంగోవాల్, జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేను అరెస్టు నుంచి తప్పించుకునేందుకు గాను ఆలయం లోపల ఉండవల్సిందిగా ఆహ్వానించాడు.

ఆపరేషన్ బ్లూ స్టార్
పంజాబ్ తిరుగుబాటులో భాగము

దాడి జరిగిన తర్వాత అకాల్ తక్త్ ను పునర్నిర్మించడానికి భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే దాన్ని సిక్కు సమాజం పూర్తిగా కూలదోసి పునర్నిర్మించింది.
తేదీ1–10 జూన్ 1984 (1 వారం , 2 రోజులు)
ప్రదేశంహర్‌మందిర్ సాహిబ్, అమృత్‌సర్, పంజాబ్, భారతదేశం
ఫలితం* జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే మరణం
  • సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ చేత ఇందిరాగాంధీ హత్య, తదనంతరం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు
Parties to the civil conflict
ఆపరేషన్ బ్లూస్టార్ India
పాల్గొన్న యూనిట్లు:
  • భారతీయ సైన్యం
  • ఆపరేషన్ బ్లూస్టార్ సీఆర్పీఎఫ్ పోలీసులు
  • border= బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
  • పంజాబ్ పోలీసులు
సహకరించింది:
ఆపరేషన్ బ్లూస్టార్ Soviet Union (సోవియట్ యూనియన్ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ మీద ఎక్కుపెట్టిన ప్రచారం)
ఆపరేషన్ బ్లూస్టార్ United Kingdom (ఆయుధాలు, సమాచారం, గూఢచర్య సేవలు)
ఆపరేషన్ బ్లూస్టార్ Israel (శిక్షణ)
సిక్కు మిలిటెంట్లు
  • దాందామీ తక్సల్ ఇంకా ఇతర గ్రూపులు
  • మాజీ సిక్కు సైన్యాధికారులు
రహస్య సహకారం:
ఆపరేషన్ బ్లూస్టార్ Pakistan (ఆరోపణ)
సేనాపతులు, నాయకులు
India జెనరల్ అరుణ్ శ్రీధర్ వైద్య
India మేజర్ జనరల్ కుల్దీప్ సింగ్ బ్రార్
India లెఫ్టినెంట్ జనరల్ రంజిత్ సింగ్ దయాల్
India లెఫ్టినెంట్ జనరల్ కృష్ణస్వామి సుందర్జీ
జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే  
ఆమ్రిక్ సింగ్ 
షాబేగ్ సింగ్ 
బలం
  • 9వ డివిజన్ నుంచి 10,000 మంది సైనిక దళాలు
  • పారాచూట్ రెజిమెంట్ నుంచి 175 మంది, ఇంకా ఫిరంగులు
  • సీఆర్పీఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 700 దళాలు
  • 150 పంజాబ్ పోలీస్ ఆఫీసర్లు
  • 16వ కావల్రీ నుంచి 7 వైజయంత MBT లు
  • 8 BMP-1, 3 OT-64 SKOT APC
  • 200+ మిలిటెంట్లు: 35 
WW2 తుపాకులు, స్టెన్ గన్లతో కూడిన 100-150 విప్లవకారులు.
ప్రాణ నష్టం, నష్టాలు
భారతీయ సైన్యం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం 83 మంది మరణించారు
249 injured

1984 సెప్టెంబరులో రాజీవ్ గాంధీ విడుదల చేసిన సమాచారం ప్రకారం 700 మరణించారు.

1 OT-64 SKOT disabled
492 పై చిలుకు మరణించారు (వీరిలో సిక్కు యాత్రికులు కూడా ఉన్నారు)
ఈ ఆపరేషన్ లో సుమారు 5,000 మంది పైగా పౌరులు మరణించారు, స్వతంత్ర పరిశీలనల ప్రకారం రెండు నెలల వ్యవధిలో 18 నుంచి 20 వేల మంది సిక్కు పౌరులు గాయపడ్డారు; భారత ప్రభుత్వం మాత్రం 554 పౌరులు మాత్రమే గాయపడ్డారని తెలియజేసింది.

భారత నిఘా సంస్థలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ముగ్గురు ప్రముఖులు, భారతదేశం కోసం ప్రధాన యుద్ధాలలో పోరాడిన కోర్ట్-మార్షల్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ షబేగ్ సింగ్, బల్బీర్ సింగ్, అమ్రిక్ సింగ్ లను "ఖలిస్తాన్ ఉద్యమం యొక్క ప్రముఖ నాయకులు"గా నివేదికలలో ప్రస్తావించాయి. వీరు 1981, 1983 మధ్య పాకిస్తాన్కి కనీసం ఆరు పర్యటనలు చేశారు. షబేగ్ సింగ్ అకల్ తఖ్త్ సాహిబ్లో ఆయుధ శిక్షణను అందించాడు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని గురుద్వారాలలో వీరి బలగాలకు శిక్షణ అందిస్తున్నట్లు ఆరోపించింది. ఈ ఆరోపణలపై అమ్రిక్ సింగ్ స్పందిస్తూ, ఈ ప్రాంతాలలో గత నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులకు సాంప్రదాయ ఆయుధాల శిక్షణా శిబిరాలు జరుగుతూ ఉన్నాయని పేర్కొన్నాడు. అమెరికన్ గూఢచర్య సంస్థ CIA, పాకిస్థాన్ కు చెందిన ISI కలిసి పంజాబ్ కోసం ఒక ప్రణాళికపై పనిచేస్తున్నట్లు సోవియట్ గూఢచార సంస్థ కెజిబి భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కి సమాచారం అందించింది. రా అధికారులు ఒక పాకిస్తానీ ఆర్మీ అధికారిని విచారించినప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వెయ్యి మందికి పైగా శిక్షణ పొందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలను భింద్రన్‌వాలే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో సహాయం చేయడానికి పాకిస్తాన్ పంజాబ్‌లోకి పంపినట్లు సమాచారం అందింది. కానీ సరిహద్దులో ఉండే ఉన్నత స్థాయి భద్రత కారణంగా కేవలం సాధారణ సిక్కులు మాత్రమే భింద్రన్‌వాలే పక్షంలో చేరగలిగారు. అనేక మంది పాకిస్తానీ ఏజెంట్లు విధ్వంసానికి పాల్పడే ప్రణాళికలతో కాశ్మీర్, కచ్ ప్రాంతంలోని గుజరాత్ స్మగ్లింగ్ మార్గాల గుండా వచ్చారు.

1981లో సోవియట్‌ యూనియన్, ఒక స్వతంత్ర దేశాన్ని సృష్టించాలనుకునే సిక్కు తీవ్రవాదులకు ISI అందించిన ఆయుధాలు, డబ్బు వివరాలను కలిగి ఉన్న నకిలీ పత్రం ఆధారంగా ఆపరేషన్ కాంటాక్ట్‌ను ప్రారంభించింది. 1982 నవంబరు లో, కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, సోవియట్ యూనియన్ నాయకుడు యూరి ఆండ్రోపోవ్, పంజాబ్‌లో మతపరమైన అలజడులను ప్రేరేపించడానికి, ఖలిస్తాన్‌ను స్వతంత్ర సిక్కు రాజ్యంగా రూపొందించడానికి ISI ప్రణాళికలను వివరించే నకిలీ పాకిస్తానీ గూఢచార పత్రాలను రూపొందించే ప్రతిపాదనను ఆమోదించారు. సోవియట్‌లు అందించిన సమాచారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇందిరా గాంధీ సిక్కులకు CIA రహస్యంగా మద్దతు ఇస్తున్నారని భావించి పంజాబ్‌లోకి సైన్యాన్ని తరలించాలనే నిర్ణయం తీసుకుంది.

1984 జూన్ 1న, తీవ్రవాదులతో చర్చలు విఫలమైన తర్వాత, ఇందిరా గాంధీ ఆనంద్‌పూర్ తీర్మానాన్ని తిరస్కరించి ఆపరేషన్ బ్లూ స్టార్‌ను ప్రారంభించాలని సైన్యాన్ని ఆదేశించింది. పంజాబ్ అంతటా ఉన్న అనేక సిక్కు దేవాలయాలపై ఏకకాలంలో దాడులు మొదలయ్యాయి. మిలిటెంట్ల సామర్థ్యం గురించి తెలుసుకోవడానికి జరిపిన తొలి కాల్పులలో 8 మంది సాధారణ ప్రజలు మరణించారు. 1984 జూన్ 3 తేదికి వివిధ సైన్యాల విభాగాలు, పారామిలిటరీ దళాలు స్వర్ణదేవాలయాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ జరపడం కోసం సాధారణ యాత్రీకులను బయటకు రమ్మని సైన్యాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు, జూన్ 5 వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఎవరూ బయటికి రానట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. కానీ 2017లో అమృత్‌సర్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గుల్బీర్ సింగ్ ఇచ్చిన తీర్పులో ఆర్మీ అధికారులు అలాంటి హెచ్చరికను జారీ చేయలేదని పేర్కొన్నాడు. జూన్ 8 కల్లా ఆలయంపై సైనిక చర్య పూర్తయింది. తర్వాత పంజాబ్ మొత్తం విప్లవకారుల ఏరివేతకు ఆపరేషన్ వుడ్‌రోజ్ అమలు చేశారు.

సైన్యం మిలిటెంట్ల దగ్గరున్న ఆయుధాలను తక్కువ అంచనా వేసింది. వారి దగ్గర చైనాలో తయారైన, సైనికుల కవచాలను కూడా ఛేదించగల రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ లాంచర్లు కూడా ఉన్నాయి. సైన్యం యుద్ధ ట్యాంకులు, భారీ ఫిరంగిలు తీవ్రవాదులపై దాడి చేయడానికి ఉపయోగించారు. దానికి ప్రతిగా వారు బలీయమైన కట్టడమైన అకల్ తఖ్త్ నుండి ట్యాంక్ వ్యతిరేక మెషిన్-గన్ కాల్పులతో ప్రతిస్పందించారు. 24 గంటల పోరాటం తర్వాత సైన్యం ఆలయాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 83 మంది సైనికులు మరణించగా, 249 మంది గాయపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం 1592 మంది మిలిటెంట్లు పట్టుబడ్డారు. మిలిటెంట్లు, సాధారణ పౌరులు కలిపి 554 మంది మరణించారు. ఈ సంఖ్య స్వతంత్ర పరిశీలకులు పేర్కొన్న 18,000 నుంచి 20,000 సంఖ్య కన్నా చాలా తక్కువ. ప్రభుత్వ నివేదిక ప్రకారం ఎక్కువమంది సాధారణ పౌరులు మరణించడానికి కారణం మిలిటెంట్లు ఆలయంలో చిక్కుకుపోయిన వారిని తమకు రక్షణగా ఉపయోగించుకోవడం.

బ్రిటీష్ వారి జోక్యం

యునైటెడ్ కింగ్‌డమ్ లోని మార్గరెట్ థాచర్ ప్రభుత్వం ఈ దాడికి భారత ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నదని తెలుసుకుని ప్రత్యేక ఎయిర్ సర్వీసు అధికారిని సహాయం కోసం పంపింది.

మూలాలు

Tags:

అమృత్‌సర్ఇందిరా గాంధీపంజాబ్శిరోమణి అకాలీ దళ్హర్మందిర్ సాహిబ్

🔥 Trending searches on Wiki తెలుగు:

వాయు కాలుష్యందశరథుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునాయకత్వంబలి చక్రవర్తిYక్లోమముఉండి శాసనసభ నియోజకవర్గంద్విగు సమాసమువిభక్తిహనుమాన్ చాలీసాఅదితిరావు హైదరీపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలువికీపీడియాఛందస్సువెంట్రుకనారా చంద్రబాబునాయుడునాయుడురష్మికా మందన్నపి.వెంక‌ట్రామి రెడ్డిప్రజా రాజ్యం పార్టీమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఅనూరాధ నక్షత్రంపోషకాహార లోపంమౌర్య సామ్రాజ్యంఆర్టికల్ 370 రద్దుతిథిఐక్యరాజ్య సమితిసమ్మక్క సారక్క జాతరమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిరతన్ టాటాఅంగుళంవెంకటేశ్ అయ్యర్వృశ్చిక రాశిత్రిఫల చూర్ణంసంకటహర చతుర్థిశాసనసభకల్క్యావతారముమొదటి పేజీనువ్వు లేక నేను లేనుకర్ర పెండలంరాకేష్ మాస్టర్చేతబడిఎయిడ్స్అక్షయ తృతీయబలగంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగరుడ పురాణంఆది పర్వముకేతిరెడ్డి పెద్దారెడ్డినరసింహ శతకముమేషరాశిఅల్లు అరవింద్దొమ్మరాజు గుకేష్చతుర్యుగాలునామవాచకం (తెలుగు వ్యాకరణం)కొండా సురేఖస్వర్ణ దేవాలయం, శ్రీపురంవారాహిభారతీయ సంస్కృతిఎఱ్రాప్రగడఫ్లిప్‌కార్ట్నారా బ్రహ్మణిజైన మతంసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్రోహిణి నక్షత్రంవరంగల్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిటంగుటూరి ప్రకాశంఅ ఆఉపనయనముతులారాశినాయీ బ్రాహ్మణులుతన్నీరు హరీశ్ రావుతెలంగాణా బీసీ కులాల జాబితాసుభాష్ చంద్రబోస్అశోకుడునవధాన్యాలు🡆 More