అఖిలేష్ యాదవ్ (pronunciation (help·info) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.
ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అఖిలేష్ యాదవ్ 2022 ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు.
అఖిలేష్ యాదవ్ | |||
సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1 జనవరి 2017 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
---|---|---|---|
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 15 మార్చి 2012 – 19 మార్చి 2017 | |||
గవర్నరు | రామ్ నాయక్ అజిజ్ క్కురేషి బన్వారి లాల్ జోషి | ||
ముందు | మాయావతి | ||
తరువాత | యోగి ఆదిత్యనాథ్ | ||
లోక్ సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
నియోజకవర్గం | అజంగఢ్ | ||
పదవీ కాలం 2000 – 2012 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
తరువాత | డింపుల్ యాదవ్ | ||
నియోజకవర్గం | కన్నౌజ్ | ||
శాసనమండలి సభ్యుడు | |||
పదవీ కాలం 2012 – 2018 | |||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | సైఫాయి, ఇటావా జిల్లా, ఉత్తర ప్రదేశ్,భారతదేశం | 1973 జూలై 1||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | సమాజ్వాది పార్టీ | ||
జీవిత భాగస్వామి | డింపుల్ యాదవ్ | ||
సంతానం | 3 | ||
నివాసం | 1 విక్రమాదిత్య మార్గ్ , లక్నో, ఉత్తర ప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అఖిలేష్ యాదవ్ 1973 జూలై 1న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, సైఫాయ్ గ్రామంలో ములాయం సింగ్ యాదవ్, మాల్తీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఇటావాలోని సెయింట్ మేరీస్ స్కూల్లో తరువాత రాజస్థాన్లోని ధోల్పూర్ మిలిటరీ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసి, మైసూరు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ నుండి ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశాడు.
అఖిలేష్ యాదవ్ 1999 నవంబరు 24న డింపుల్ యాదవ్ను వివాహం చేసుకున్నాడు. వారికీ ఇద్దరు కుమార్తెలు అదితి, టీనా ఒక కుమారుడు అర్జున్ ఉన్నారు.
అఖిలేష్ యాదవ్ 2000లో లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలో సమాజ్ వాదీ పార్టీ తరపున కన్నౌజ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, గెలిచి తొలిసారి ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 2004లో రెండోసారి, 2009 లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ & ఫిరోజాబాద్ లోక్సభ నియోజకవర్గాల నుండి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించాడు. అఖిలేష్ ఆ తర్వాత ఫిరోజాబాద్ సీటుకు రాజీనామా చేశాడు.
అఖిలేష్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ గెలుపులో కీలకంగా పనిచేశాడు. సమాజ్వాదీ పార్టీ 224 సీట్లు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిరావడంతో ఆయన 2012 మే 3న కన్నౌజ్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసి 2012 మార్చి 15న రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. ఆయన 2012 మే 5న ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అఖిలేష్ యాదవ్ 2019 లోక్సభ ఎన్నికల్లో అజంగఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
This article uses material from the Wikipedia తెలుగు article అఖిలేష్ యాదవ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.