భారత-పాకిస్తాన్ సరిహద్దు, భారతదేశం, పాకిస్తాన్లను వేరుచేసే అంతర్జాతీయ సరిహద్దు.
ఈ సరిహద్దుకు ఉత్తర కొసన నియంత్రణ రేఖ ఉంది. ఇది కాశ్మీర్ను పాక ఆక్రమిత కాశ్మీర్ నుండి వేరు చేస్తుంది. సరిహద్దుకు దక్షిణ చివరలో సర్ క్రీక్ ఉంది, ఇది గుజరాత్ రాష్ట్రానికి, పాకిస్తానీ రాష్ట్రమైన సింధ్ కు మధ్య రాన్ ఆఫ్ కచ్లోని ఒక ఉప్పు కయ్య.
భారత-పాకిస్తాన్ సరిహద్దు | |
---|---|
లక్షణాలు | |
పక్షాలు | India Pakistan |
పొడవు | 3,323 kilometres (2,065 mi) |
History | |
ఏర్పాటు | 1947 ఆగస్టు 17 భారతదేశ విభజన లో భాగంగా సిరిల్ రాడ్క్లిఫ్ సృష్టించిన రాడ్క్లిఫ్ రేఖ |
ప్రస్తుత రూపు | 1972 జూలై 2 సిమ్లా ఒడంబడిక లో అంగీకరించిన విధంగా నియంత్రణ రేఖ గుర్తింపు |
ఒడంబడికలు | కరాచీ ఒప్పందం (1949), సిమ్లా ఒడంబడిక (1972) |
గమనికలు | నియంత్రణ రేఖ కాశ్మీరును, పాక్ ఆక్రమిత కాశ్మీరును విభజిస్తూ సాగుతుంది. కాశ్మీరు సమస్య కారణంగా అది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దులో భాగం కాదు. |
తొలుత 1947లో బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో రాడ్క్లిఫ్ లైన్ ఆధారంగా ఈ సరిహద్దును గుర్తించారు. ఈ సరిహద్దు, ప్రధానమైన పట్టణ ప్రాంతాల నుండి నిర్జనమైన ఎడారుల వరకు అనేక రకాల భూభాగాల గుండా వెళుతుంది. రెండు దేశాలకూ స్వాతంత్ర్యం లభించిన తర్వాత కొద్దికాలానికే భారతదేశం-పాకిస్తాన్ వివాదం ప్రారంభమైనప్పటి నుండి, ఇది అనేక సరిహద్దు సైనిక ప్రతిష్టంభనలకు, పూర్తి స్థాయి యుద్ధాలకూ వేదికగా నిలిచింది. PBS ఇచ్చిన గణాంకాల ప్రకారం, ఈ సరిహద్దు మొత్తం పొడవు 3,323 kilometres (2,065 mi). 2011లో ఫారిన్ పాలసీ పత్రికలో రాసిన ఒక కథనం ఆధారంగా, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ సరిహద్దులలో ఇది ఒకటి. భారతదేశం ఈ సరిహద్దు వెంట సుమారు 50,000 దీప స్తంభాలపై 1క్వ్వ్,50,000 ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేసింది. ఈ కారణంగా రాత్రి సమయంలో, భారత-పాకిస్తాన్ సరిహద్దు అంతరిక్షం నుండి స్పష్టంగా కనిపిస్తుంది.
రెండు దేశాల మధ్య, గుజరాత్/సింధ్ నుండి మొదలయ్యే సరిహద్దు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దుగా ఉంది. నియంత్రణ రేఖకు మాత్రం అంతర్జాతీయ గుర్తింపు లేదు. 1947 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత కాశ్మీర్ఉ పాక్ ఆక్రమిత కాశ్మీరు గాను, కాశ్మీరు గానూ విభజించబడింది. 1949 లో ఐరాస మధ్యవర్తిత్వంలో వెలసిన కాల్పుల విరమణ రేఖ, రెండు ప్రాంతాల మధ్య వాస్తవ సరిహద్దుగా పనిచేసింది. 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత దీన్ని నియంత్రణ రేఖగా మార్చారు.
భారత ఆధీనంలో ఉన్న కాశ్మీరుకు, పాకిస్తాన్ రాష్ట్రమైన పంజాబ్ కూ మధ్య ఉన్న సరిహద్దును ఐరాస, అధికారికంగా "వర్కింగ్ బౌండరీ" అని పిలుస్తుంది. భారతదేశం దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది.
ఉత్తరం నుండి దక్షిణానికి భారత-పాకిస్తాన్ సరిహద్దులోని విభాగాలు:
సరిహద్దును దాటే కింది ప్రదేశాలలో బీటింగ్ రిట్రీట్ జెండా వేడుకలు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు రెండు దేశాల సైన్యాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇవి ప్రజలకు పర్యాటక ఆకర్షణలుగా మారాయి. వీటిని చూసేందుకు ప్రత్యేక అనుమతి లేదా టిక్కెట్ అవసరం లేదు. కింది వేడుక స్థలాలు ఉన్నాయి (ఉత్తరం నుండి దక్షిణానికి):
వాగా గ్రామంలో జెండా అవతరణ కార్యక్రమం ప్రతి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు భారతదేశం (సరిహద్దు భద్రతా దళం), పాకిస్తాన్ (పాకిస్తాన్ రేంజర్స్) ల సరిహద్దు దళాలు నిర్వహిస్తాయి. ఇది 1959 నుండి వస్తున్న సంప్రదాయం. సరిహద్దు కాపలాదార్లు బిగ్గరగా చేసే అరుపుల రూపంలో రెండు వైపుల నుండి యుద్ధ పిలుపులతో వేడుక ప్రారంభమవుతుంది. దీని తర్వాత ఒక పద్ధతి ప్రకారం కాళ్ళను ఎత్తుగా లేపి గాల్లోకి తన్నడం, తొక్కడం, నాట్య పూర్వకమైన కదలికలూ ఉంటాయి. ఈ సమయంలో ప్రత్యర్థి దళాలు ఒకరినొకరు కళ్ళలోకి చూసుకుంటాయి. జెండాలను అవనతం చేయడంతో పాటు హెడ్ గార్డులు పరస్పరం కరచాలనం చేసుకోవడంతో కార్యక్రమం ముగుస్తుంది. ప్రేక్షకులందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడతారు. ఈ ఆచారం అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సౌభ్రాతృత్వానికీ, అలాగే శత్రుత్వానికీ ఇది ప్రతీక. దీపావళి, ఈద్ల సందర్భంగా ఇరు దళాలు ప్రత్యర్థికి స్వీట్లు పంచుతాయి. అయితే 2016, 2018 లలో సైనిక ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో BSF అలా పంచలేదు. 2014 వాఘా సరిహద్దు ఆత్మాహుతి దాడిలో 60 మంది మరణించారు, 110 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడి శాంతియుత వాతావరణంలో ఇది ఒక దుస్సంఘటన. 2019 భారత-పాకిస్తాన్ ప్రతిష్టంభన సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం (పిఎఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విమానాన్ని కూల్చివేసి, అతన్ని బందీగా పట్టుకుని, ఆ తరువాత అతన్ని తిరిగి భారతదేశానికి అప్పగించినప్పుడు కూడా దీన్ని రద్దు చేసారు.
భారతదేశం (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్), పాకిస్తాన్ (పాకిస్తాన్ రేంజర్లు) నిర్వహించే ఇలాంటి సరిహద్దు వేడుకలు ఫజిల్కా (భారతదేశం వైపు) / సులైమాంకి సరిహద్దు వద్ద, హుస్సేనివాలా పంజాబ్ (భారతదేశం వైపు) / గండా సింగ్ వాలా సరిహద్దు వద్ద, కసూర్ జిల్లా (పాకిస్తాన్ వైపు) వద్ద జరుగుతాయి. ఈ ఆచారాలకు ప్రధానంగా స్థానిక గ్రామస్తులు హాజరవుతారు. పర్యాటకులు చాలా తక్కువ మంది ఉంటారు.
|
This article uses material from the Wikipedia తెలుగు article భారత-పాకిస్తాన్ సరిహద్దు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.