ధామ్నగర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి.
ఈ నియోజకవర్గం భద్రక్ లోక్సభ నియోజకవర్గం, భద్రక్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ధామ్నగర్ బ్లాక్, తిహిడి బ్లాక్కు చెందిన 12 గ్రామపంచాయితీలు పలియాబింధ, అచక్, డోలాసాహి, గ్వామల్, తలపడ, కుబేర, బిలియానా, బారో, బోడక్, కాన్పడ, శ్యాంసుందర్పూర్, తలగోపబింధ ఉన్నాయి.
2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ మరణంతో 2022లో ఉప ఎన్నిక జరగగా ఆయన కుమారుడు సూర్యవంశీ సూరజ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి అవంతీ దాస్ పై 9,881 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఒడిశా అసెంబ్లీ ఉప ఎన్నిక, 2022: ధామ్నగర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ||
బీజేపీ | సూర్యబంషి సూరజ్ | 80351 | 49.09 | ||
బీజేడీ | అబంతి దాస్ | 70470 | 43.09 | ||
స్వతంత్ర | రాజేంద్ర దాస్ | 8153 | 4.98 | ||
కాంగ్రెస్ | హరేకృష్ణ సేథి | 3533 | 2.18 |
This article uses material from the Wikipedia తెలుగు article ధామ్నగర్ శాసనసభ నియోజకవర్గం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.