ఒడిశా: భారతీయ రాష్ట్రం

ఒడిశా (ఒరియా: ଓଡ଼ିଶା) ( పాత పేరు ఒరిస్సా) తూర్పు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం .

దీనికి ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నాయి. ఇది విస్తీర్ణంలో 8 వ అతిపెద్ద రాష్ట్రం, జనాభా ప్రకారం 11 వ అతిపెద్ద రాష్ట్రం. షెడ్యూల్డ్ తెగల జనాభా పరంగా భారతదేశంలో మూడవ స్థానంలో ఉంది. ఉత్తరాన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హద్దులుగా ఉన్నాయి. బంగాళాఖాతం వెంబడి 485 kilometres (301 mi) తీరం ఉంది. ఈ ప్రాంతాన్ని ఉత్కల అని కూడా పిలుస్తారు. ఈ పదం భారతదేశ జాతీయ గీతం " జన గణ మన "లో ప్రస్తావించబడింది. ఒడిశా భాష ఒడియా, ఇది భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటి .

ఒడిశా
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతిఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతిఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతిఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతిఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతిఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Clockwise from top: Habalikhati Beach, Mukteshvara Temple, Bhitarkanika National Park, Dhauli, Chilika Lake, Rajarani Temple, Mahanadi, Jagannath Temple, Gundichaghagi Waterfall, Konark Temple
Official seal of ఒడిశా
Anthem: Bande Utkala Janani
(I Adore Thee, O Mother Utkala!)
Location of ఒడిశా
Coordinates (భువనేశ్వర్): 20°16′N 85°49′E / 20.27°N 85.82°E / 20.27; 85.82
దేశంఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి India
రాష్ట్రావతరణ1 ఏప్రిల్ 1936
(Utkala Dibasa)
రాజధాని
అతిపెద్ద నగరం
భువనేశ్వర్
Government
 • Bodyప్రభుత్వం
 • గవర్నర్గణేషి లాల్
 • ముఖ్యమంత్రినవీన్ పట్నాయక్ (BJD)
 • శాసన వ్యవస్థఏక సభ, (147 సీట్లు)
 • పార్లమెంట్ నియోజకవర్గాలులోక్‌సభ (21 seats)
రాజ్యసభ (10 సీట్లు)
 • ఉన్నత న్యాయస్థానంఒడిశా ఉన్నత న్యాయస్థానం
Area
 • Total1,55,707 km2 (60,119 sq mi)
 • Rank8వ
Population
 (2011)
 • Total4,19,74,218
 • Rank11th
Demonymఒడియావారు
GDP (2019–20)
 • మొత్తం5,33,822 crore (US$67 billion)
 • తలసరి జిడిపి1,16,614 (US$1,500)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-OR
HDI (2018)Increase 0.606
medium · 32nd
అక్షరాస్యత రేటు73.45%
అధికార భాషలుఒడియా
Symbols of Odisha
EmblemEmblem of Odisha
SongBande Utkala Janani
Bird
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Indian Roller
Fish
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Mahanadi mahseer
Flower
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Ashoka
Mammal
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Sambar
Tree
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Sacred Fig
Dance
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Odissi
Food
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Pakhala
Sweet
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి
Rasagola

సా.శ.పూ 261 లో మౌర్య చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధంలో ఖారవేలుడు రాజును ఓడించినా ఖారవేలుడు మరల రాజ్యాన్ని పొందాడు. ఈ యుద్ధం ప్రతీకారవాంఛగల చక్రవర్తి అశోకుడిని బౌద్ధమతం స్వీకరణతో ప్రశాంతుడిగా మార్చడానికి కారణమైంది., అప్పటి ప్రాంతం, ఆధునిక ఒడిశా సరిహద్దులతో సరిపోలుతుంది. బ్రిటిష్ భారత ప్రభుత్వం ఒడిస్సా ప్రావిన్స్ ను 1936 ఏప్రిల్ 1 న స్థాపించబడినప్పుడు ఒడిశా యొక్క ఆధునిక సరిహద్దులను గుర్తించింది. ఇందులో బీహార్, ఒరిస్సా ప్రావిన్స్ లో ఒడియా మాట్లాడే జిల్లాలు ఉన్నాయి. ఏప్రిల్ 1ని ఉత్కల దిబసగా జరుపుకుంటారు. సా.శ. 1135 లో అనంతవర్మన్ చోడగాంగ రాజు కటక్ రాజధానిగా పరిపాలించాడు. తరువాత బ్రిటిష్ శకం వరకు ఈ నగరాన్ని చాలా మంది పాలకులు రాజధానిగా ఉపయోగించారు. ఆ తరువాత భువనేశ్వర్ ఒడిశా రాజధాని అయ్యింది.

ఒడిశా ఆర్థిక స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ₹ 5.33 లక్షల కోట్లు, తలసరి స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ₹ 116.614 గా భారతదేశం లో16 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల రాష్ట్రంగా,ుంది.. మానవ అభివృద్ధి సూచికలో ఒడిశా భారత రాష్ట్రాలలో 32 వ స్థానంలో ఉంది.

కోణార్క, పూరి, భువనేశ్వర్లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు.

భౌగోళికం

ఒడిశా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివసిస్తున్నారు. తూర్పు కనుమలకు, సముద్రానికి మధ్యభాగంలోని మైదాన ప్రాంతం సారవంతమైన వ్వవసాయభూమి. తీరప్రాంత మైదానాలు ప్రధాన జనావాసకేంద్రాలు. మహానది, బ్రాహ్మణి నది, బైతరణి నది డెల్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తీర రేఖ తిన్నగా (చీలకుండా) ఉండడంవల్ల మంచి నౌకాశ్రయాలకు అవకాశంలేదు. ఒక్క పరదీప్ మాత్రం నౌకలకు అనుకూలమైనది. తీర ప్రాంతాలు, మహానది డెల్టా సారవంతమైన నేలలు. సక్రమంగా మంచి వర్షపాతం ఉండడంవల్ల ఏటా రెండు వరి పంటలు పండుతాయి.

బంగాళాఖాతంలో జనించే తుఫానుల తాకిడికి ఒరిస్సా తీరప్రాంతం తరచు నష్టపోతూ ఉంటుంది. 1999 అక్టోబరులో వచ్చిన తుఫాను వల్ల 10,000 మంది మరణించాఱు. తీవ్రమైన నష్టం వాటిల్లింది

చరిత్ర

ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి 
ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిశా

ఎక్కువ కాలం ఒడిశా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉంది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.

  • మురుంద వంశము
  • మరాఠ వంశము
  • నల వంశము
  • విగ్రహ, ముద్గల వంశము
  • శైలోద్భవ వంశము
  • భౌమకార వంశము
  • నందోద్భవ వంశము
  • సోమవంశి వంశము
  • తూర్పు గంగుల వంశము
  • సూర్య వంశి వంశము ( vaddi,od,vadde rajulu)

ముస్లిం దండయాత్రల ప్రధానమార్గానికి ప్రక్కగా ఉన్నందువల్లా, కొద్ది దండయాత్రలకు బలమైన ప్రతిఘటన చేయగలగడం వల్లా ఈ ప్రాంతం చాలా కాలం మహమ్మదీయుల పాలనలోకి రాలేదు. కాని 1568లో ముఘల్ సామ్రాజ్యంలో కలుపబడింది.

ముఘల్ రాజుల పతనం తరువాత ఒడిశాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో బీహారులో కొంతభాగం చేర్చి ఒడిశా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒడిశా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.

1950లో ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

2011 నవంబరు 4 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిశాగా మార్చారు.

సంస్కృతి

ఒడియా అధికారిక భాష. ఒడిశాలో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, కటక్ వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదిమవాసుల (కొండజాతుల) వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒడిశా సాంస్కృతిక ప్రతీకలు.

జన విస్తరణ

ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి 
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని షెడ్యూల్డు తెగల ప్రజలు

ఒడిశా జనాభాలో దాదాపు 24% వరకు ఆదిమవాసులు. ఇది చాలా రాష్ట్రాలకంటే ఎక్కువ. 87% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఎక్కువ భూమి కొద్ది మంది అధినంలో ఉండడంవలనా, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసి ప్రాంతాలకు విస్తరిచకపోవడం వలనా ఒరిస్సాలో పేదరికం బాగా ఎక్కువనే చెప్పవచ్చును.

24% వరకు ఉన్న ఆదివాసజనులలో 62 వివిధ తెగలున్నాయి. వీరి జీవనవిధానం వన్య సంపద కేంద్రంగా ఉంటుంది. రైల్వేలు, ఆనకట్టలు, ఖనిజాల త్రవ్వకం వంటి ఆధునిక కార్యక్రమాలు వీరి బ్రతుకుతెరువును దుర్భరంచేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

16% వరకు ఉన్న దళితులు దేశమంతటా ఉన్న సామాజిక వివక్షతల్ల, ఆర్థిక అసమానతల వల్ల బాగా వెనుకబడి ఉన్నారు.

ఒడిశాలో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒడిశా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు.

క్రీడాకారులు

పర్యాటక స్థలాలు

  • రాజధాని భువనేశ్వర్: మందిరాల నగరమని దీనికి పేరు. ఇక్కడ సుమారు 1000 మందిరాలున్నాయి.
  • పూరి: జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం ఉంది. జగన్నాధ రధయాత్ర ఏటా ఒక ముఖ్యమైన ఉత్సవం. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతారు.
  • కోణార్క సూర్య మందిరం - ఒరిస్సా శిల్పకళా నైపుణ్యానికి, నిర్మాణకౌశలానికి ఒక చక్కని తార్కాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలోని శిల్పాలలో ఆనాటి సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబిస్తుంది.
ఒడిశా: భౌగోళికం, చరిత్ర, సంస్కృతి 
Stone work at Konark
  • చిల్కా సరస్సు: మహానది ముఖద్వారానికి దక్షిణాన ఉన్న ఉప్పునీటి సరస్సు. ఎన్నో విధాల పక్షులకు ఆవాసం. రక్షితవనం. ఇక్కడ దాదాపు 150 జాతుల పక్షులు వలసకు వస్తుంటాయి.
  • చర్చికా మాత మందిరం: రేణుకా నది ఒడ్డున రుచికా పర్వతంపై, బంకి వద్ద, సుందర ప్రకృతి సౌందర్యానికి దీటుగా నిర్మింపబడ్డ మందిరం. కటక్ కు 52 కి.మీ., భువనేశ్వర్ కు 60 కి.మీ. దూరంలో ఉంది.
  • సునాదేయి మందిరం: మహానది ఒడ్డున ఉంది. వలస పక్షులకు ఆవాసం కూడాను. పిక్నిక్ లకు జనప్రియమైనది.

రాజకీయాలు

ఒడిశా రాష్ట్రపాలన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పాలనా విధానాన్ని అనుసరించే ఉంటుంది (గవర్నరు, ముఖ్య మంత్రి, కాబినెట్, అసెంబ్లీ మొదలగునవి)

రాజకీయ నాయకులు

ఆర్థిక పరిస్థితి

చారిత్రక జనాభా
జనగణన జనాభా
19511,46,46,100
19611,75,49,50019.8%
19712,19,44,62525.0%
19812,63,70,27020.2%
19913,16,59,74020.1%
20013,67,07,90015.9%
20114,19,47,35814.3%

ఒడిశా ఆర్థిక స్థితికి ముఖ్యమైన వనరులు:

కొన్ని గణాంకాలు:

  • అభివృద్ధి రేటు 4.3 % (భారతదేశం సగటు 6.7 %)
  • మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్వసాయం పాలు 32% . మొత్తం జనాభాలో 62% వ్యసాయ పనులపై ఆధారపడి ఉన్నారు.
  • సుమారు 1,75,000 మంది దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారు
  • అక్షరాస్యత 50% (భారతదేశం సగటు 66%)

జిల్లాలు

ఇవికూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

ఒడిశా భౌగోళికంఒడిశా చరిత్రఒడిశా సంస్కృతిఒడిశా జన విస్తరణఒడిశా క్రీడాకారులుఒడిశా పర్యాటక స్థలాలుఒడిశా రాజకీయాలుఒడిశా ఆర్థిక పరిస్థితిఒడిశా జిల్లాలుఒడిశా ఇవికూడా చూడండిఒడిశా మూలాలుఒడిశా బయటి లింకులుఒడిశాఆంధ్రప్రదేశ్ఒడియా భాషఒరియా భాషఛత్తీస్‌గఢ్జార్ఖండ్ఝార్ఖండ్పశ్చిమ బెంగాల్బంగాళాఖాతంభారత జాతీయగీతంభారతదేశ అధికారిక భాషలుభారతదేశ రాష్ట్రాల జనాభాభారతదేశ రాష్ట్రాల విస్తీర్ణంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

బరాక్ ఒబామాసర్పిబ్రహ్మంగారి కాలజ్ఞానంషిర్డీ సాయిబాబాఅనసూయ భరధ్వాజ్తిథిరజాకార్తొట్టెంపూడి గోపీచంద్శని (జ్యోతిషం)తెలుగు కథకింజరాపు అచ్చెన్నాయుడుఉత్తర ఫల్గుణి నక్షత్రముహనుమంతుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిజాతిరత్నాలు (2021 సినిమా)ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాఅమ్మల గన్నయమ్మ (పద్యం)మారేడుపుచ్చఅయోధ్య రామమందిరంతెలుగు సినిమాలు 2023జీలకర్రగూగుల్వామనావతారమురమణ మహర్షితాజ్ మహల్శ్రీలీల (నటి)నువ్వు నాకు నచ్చావ్అక్షరమాలలవంగముఎమ్.ఎ. చిదంబరం స్టేడియంకాలేయంఆటలమ్మనువ్వొస్తానంటే నేనొద్దంటానాసద్గురుకర్కాటకరాశితెలుగు సాహిత్యంభగత్ సింగ్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)చిరుత (సినిమా)విశాఖ నక్షత్రముభారత కేంద్ర మంత్రిమండలిమెరుపురక్షకుడుసర్పంచిసామజవరగమనహలో గురు ప్రేమకోసమేగోత్రాలుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారతదేశంగురువు (జ్యోతిషం)కలమట వెంకటరమణ మూర్తితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాప్రధాన సంఖ్యపాములపర్తి వెంకట నరసింహారావుకుష్టు వ్యాధితిరువణ్ణామలైమాంగల్య బలం (1958 సినిమా)రోహిత్ శర్మరమ్య పసుపులేటిఅల్లు అర్జున్పంచభూతాలుగుణింతంసోంపుగాలి జనార్ధన్ రెడ్డినరసింహ శతకముతిరుమల తిరుపతి దేవస్థానంశాతవాహనులుయాదవమౌర్య సామ్రాజ్యంద్వాదశ జ్యోతిర్లింగాలురాజ్యసభదానం నాగేందర్త్యాగరాజుమాల్దీవులు2023ఇంటి పేర్లువిజయ్ (నటుడు)🡆 More