ఈరోడ్ జిల్లా, ఒకప్పుడు పెరియార్ జిల్లా గా ఉండేది.
ఈ జిల్లా భారతీయ రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్రం కొంగునాడు పడమటి భూభాగంగా ఉండేది. జిల్లా ప్రధాన పరిపాలా కేంద్రం ఈరోడ్. జిల్లా " ఈరోడ్ విభాగం " , " గోబిచెట్టి పాలెం విభాగం " అనే రెండు విభాగాలుగా పనిచేస్తుంది. ఒకప్పుడు పెరియార్ జిల్లా కోయంబత్తూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. 1979 సెప్టెంబరు 17న పెరియార్ జిల్లాగా అవతరించింది. 1986న పెరియార్ జిల్లా పేరు ఈరోడ్ జిల్లాగా మార్చారు. గణిత మేధావి రామానుజం , పెరియార్ అని పిలువబడిన ఇ.వి రామస్వామి ఈరోడ్ జిల్లాకు చెందినవారే.
ఈరోడ్ జిల్లా ஈரோடு மாவட்டம் Irotu district | |
---|---|
District | |
Country | భారత దేశము |
రాష్ట్రం | తమిళనాడు |
ప్రాంతం | Western Tamil Nadu (Kongu Nadu) |
ప్రధాన కార్యాలయం | Erode |
Revenue Division | Erode, Gobichettipalayam |
Government | |
• Collector | V K Shanmugam IAS |
Area | |
• Total | 2,198 sq mi (5,692 km2) |
Population (2011) | |
• Total | 22,59,608 |
• Density | 1,030/sq mi (397/km2) |
భాషలు | |
• అధికార | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 638*** |
టెలిఫోన్ కోడ్ | 0424 (Erode) 04285 (Gobichettipalayam) 04256 (Bhavani) 04295 (Sathyamangalam) |
ISO 3166 code | ISO 3166-2:IN |
Vehicle registration | TN 33 (Erode East) TN 36 (Gobichettipalayam) TN 56 (Perundurai) TN 86 (Erode West) |
Largest city | Erode |
లింగ నిష్పత్తి | M-51%/F-49% ♂/♀ |
అక్షరాస్యత | 72.96% |
Lok Sabha seats | 3 |
Vidhan Sabha seats | 8 |
Central location: | 11°15′N 77°19′E / 11.250°N 77.317°E |
Precipitation | 700 millimetres (28 in) |
Avg. summer temperature | 35 °C (95 °F) |
Avg. winter temperature | 18 °C (64 °F) |
ఈరోడ్ నగరం ఉత్తర సరిహద్దులలో కర్నాటక రాష్ట్ర జిల్లాలలో ఒకటి అయిన చామరాజనగర్ జిల్లా, తూర్పు సరిహద్దులో కావేరీ నది నది దాటగానే సేలం, నమక్కల్ , కరూర్ జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులలో తిరుపూర్ జిల్లా , పడమర సరిహద్దులో కోయంబత్తూరు , నీలగిరి జిల్లాలు ఉన్నాయి. భూ అంతర్ఘతంగా ఉపస్థితమై ఉన్న ఈరోడ్ జిల్లా 10 36”, 11 58” ఉత్తర రేఖాశం, 76 49” తూర్పు 77 58 అక్షాంశాల వద్ద ఉంది. జిల్లా మధ్యభాగంలో విస్తరించి ఉన్న పడమర కనుమల కారణంగా జిల్లాలో కొండలు గుట్టలు అధికంగా ఉన్నాయి. నగరానికి ఆగ్నేయ భూభాగం కావేరీ నది వైపు సాగుతున్న ఏటవాలు మైదానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో కావేరీ నది ఉపనదులైన భవానీ, నొయ్యల్, అమరావతి ప్రవహిస్తున్నాయి. నగరానికి ఉత్తరదిశలో ప్రవహిస్తున్న పాలారు నది నరానికి కర్నాటక రాష్ట్రానికి మధ్యప్రవహిస్తుంది. భావానీసాగర్ ఆనకట్ట, కొడివెరి ఆనకట్ట ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ ఆనకట్టలద్వారా లభ్యమౌతున్న నీటితో పంటకాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీరు సరఫరా ఔతుంది. అంతే కాక నదీతీరాలలో ఉన్న సారవంతమైన భూమి జిల్లాను సస్యశ్యామలం చేస్తుంది.
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 6,29,892 | — |
1911 | 6,67,968 | +0.59% |
1921 | 7,25,434 | +0.83% |
1931 | 7,69,455 | +0.59% |
1941 | 8,86,108 | +1.42% |
1951 | 10,10,616 | +1.32% |
1961 | 11,06,528 | +0.91% |
1971 | 13,56,092 | +2.05% |
1981 | 15,87,604 | +1.59% |
1991 | 18,02,939 | +1.28% |
2001 | 20,16,582 | +1.13% |
2011 | 22,51,744 | +1.11% |
ఆధారం: |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈరోడ్ జిల్లాలో 2,251,744 మంది జనాభా ఉన్నారు, ప్రతి 1,000 మంది పురుషులకు, స్త్రీల లింగ నిష్పత్తి 993 గా ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే ఎక్కువ.929. జిల్లాలోని మొత్తం జనాభాలో ఆరేళ్లలోపు వారు 195,213 మంది ఉన్నారు.వారిలో 99,943 మంది పురుషులు కాగా, 95,270 మంది మహిళలు ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 16.41% మంది ఉండగా, 0.97% షెడ్యూల్డ్ తెగలు వారు ఉన్నారు.జిల్లా అక్షరాస్యత రేటు 66.29%, ఇది జాతీయ సగటు 72.99%.కంటే తక్కువ. జిల్లాలో మొత్తం 658,071 గృహాలు ఉన్నాయి. 1,195,773 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 173,376 మంది రైతులు, 331,414 మంది ప్రధాన వ్యవసాయకార్మికులు ,48,960 గృహ పరిశ్రమలకార్మికులు ,557,304 ఇతర కార్మికులు , 84,722 ఉపాంత కార్మికులు ,35,768 కార్మికులు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం, జనాభాలో 81.76% మంది తమిళం, 10.32% తెలుగు, 5.40% కన్నడం, 1.14% ఉర్దూ వారి మొదటి భాషగా మాట్లాడతారు.
2001 గణాంకాలను అనుసరించి జిల్లాలోని 46.25% నగరీకరణ చేయబడింది. అలాగే జిల్లా అక్షరాస్యతా శాతం 72.96%. జిల్లాలో ఈరోడ్ నగరం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో గోపిచెట్టి పాళయం ఉంది.
ఈరోడ్ జిల్లా ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. జిల్లాలో పండిస్తున్న ప్రధానపంటలు వడ్లు, మొక్కల పెంపకం, వేరుశనగ, పత్తి, పసుపు, కొబ్బరి తోటలు, చెరుకు మొదలైనవి. తమిళనాడులో పండిస్తున్న పసుపు పంటలో 43% ఈరోడ్ జిల్లాలో పండించబడుతుంది. అందువలన ఈరోడ్ అతి పెద్ద పసుపు ఉత్పత్తి నగరంగా గుర్తించబడుతూ " పసుపు నగరం " అని అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచింది. భారతదేశంలో వంటలలో ఉపయోగించే సుగంధద్రవ్యాలలో ప్రధానమైంది. ఆచారవ్యవహారాలలో ప్రథమ స్థానం వహిస్తుంది. విశిష్టమైన ఔషధగుణాలు కలిగిన పసుపుకు ప్రధాన వాణిజ్యకేంద్రంగా ఈరోడ్ భాసిల్లుతుంది. పసుపును వస్త్రాలకు ఉపయోగించే వర్ణాలలో ఒకటిగా ఉపయోగిస్తారు.ఈరోడ్ నగరం తమిళనాడులో అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, శ్వేతవర్ణ పట్టుకు, ప్రసిద్ధి. గోబిచెట్టిపాళయం కూడా అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, పత్తి, పట్టుకు, ప్రసిద్ధి. దేశంలోని మొదటి పట్టు కండెల తయారీ పరిశ్రమ గోబిచెట్టిపాళయంలో స్థాపించబడింది. ఈరోడ్ చేనేత, పవర్లూం వస్త్రాల తయారీకి, రెడీమేడ్ దుస్తుల తయారీకి ప్రసిద్ధి చెందింది. భారతదేశ పవర్లూం నగరంగా ఈరోడ్ నగరానికి మరొక ప్రత్యేకత ఉంది. చేనేత చీరెలు, దుప్పట్లు, తివాసీలు, లుంగీలు, ప్రింటింగ్ వస్త్రాలు, తుండుగుడ్డలు, పంచలు మొదలైన వాణిజ్యానికి ఈరోడ్ ప్రముఖకేంద్రంగా భాసిల్లుతుంది. 2005లో భవానీ జంకానాను భారతదేశ గియోగ్రాఫికల్ చిహ్నంగా గుర్తించబడింది. చెన్నైమలై కూడా వస్త్రాలకు ప్రాముఖ్యత సంతరుంచుకుంది. పుజై, పులియంపట్టు లలో సండే మార్కెట్లు ప్రత్యేకత కలిగి ఉన్నాయి. 12.75 ఎకరాల ప్రదేశంలో నిర్వహించబడుతున్న ఆదివారం సంత ద్వారా పురపాలకానికి సంవత్సరానికి 23.75 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ సంత తమిళనాడులో రెండవ స్థానంలో ఉంది. తమిళనాడులో పొగాకు ఉత్పత్తికి ఈరోడ్కు ప్రాముఖ్యత ఉంది. అందియూరు, మడిచూరు సండే సంతలు పశువుల వ్యాపారానికి ముఖ్యత్వం ఇస్తుంది.
ఈరోడ్ ప్రధాన కేంద్రం నుండి 15 కి.మీ. దూరంలో భవాని, 35 కి.మీ దూరంలో గోబిచెట్టి పాలెయం, 20 కి.మీ. దూరంలో పెరుంగుడి, 65 కి.మీ. దూరంలో సత్యమంగళం, 30 కి.మీ. దూరంలో అందియార్ పట్టణాలు ఉన్నాయి.
ఈరోడ్ జిల్లా ఈరోడ్ పార్లమెంటరీ నియోజక వర్గం, నీలగిరి పార్లమెంటరీ నియోజక వర్గం, తిరుపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం అనే మూడు పార్లమెంటరీ విభాగాలుగా విభజించబడింది.అలాగే జిల్లా అందియూర్, భవాని, భవానీ సాగర్, తూర్పు ఈరోడ్, పడమర ఈరోడ్, గోబిచెట్టిపాళయం, మొదకురుచ్చి, పెరుందురై అనే 8 అసెంబ్లీ నియోజక వర్గాలుగా విభజించబడింది.
పరిపాలనా ప్రయోజనాల కోసం, ఈరోడ్ జిల్లా రెండు రెవెన్యూ డివిజన్ల క్రింద పది తాలూకాలుగా విభజించబడింది.
ఈరోడ్ జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, నాలుగు పురపాలికలు ఉన్నాయి.
విమాన రవాణా మినహా అన్ని ఆధునిక రవాణా మార్గాలతో బాగా అనుసంధానించబడి ఉంది. జిల్లాకు రాష్ట్ర రాజధాని చెన్నై, ఇతర ప్రధాన నగరాల నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
రైల్వే మార్గం: జిల్లాలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్, ఈరోడ్ జంక్షన్ ఉంది. భారతదేశ పశ్చిమ తూర్పు తీరాలను కలుపుతూ బ్రిటిష్ వారు దీనిని నిర్మించారు. ఈరోడ్ జంక్షన్లో ఐెస్ఒ సర్టిఫైడ్ డీజిల్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్లు ఉన్నాయి. భారతదేశంలోని మూడవ అత్యంత పరిశుభ్రమైన రైల్వే జంక్షన్గా గుర్తింపు పొందిన ఈరోడ్ జంక్షన్, నీటిని నింపే సౌకర్యాలు, ఆహార సదుపాయాలకు కేంద్రంగా పనిచేస్తుంది.
రోడ్డు మార్గం:xజిల్లా రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
వాయుమార్గం: సమీప విమానాశ్రయం సమీపంలోని కోయంబత్తూర్ జిల్లాలో ఉన్న కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం.
జలమార్గం: జిల్లాలో నెరింజిపేటై, నట్టత్రీశ్వర దేవాలయం వద్ద నౌకాయాన జలమార్గాలు అందుబాటులో ఉన్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article ఈరోడ్ జిల్లా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.