అర్చన జోయిస్ (జననం: 1994 డిసెంబరు 24) భారతీయ సినిమా నటి.
ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటించే ఆమె కె.జి.ఎఫ్ ఫిల్మ్ సిరీస్లో శాంతమ్మగా, రాకీ తల్లి పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి.
అర్చన జోయిస్ | |
---|---|
జననం | అర్చన జోయిస్ 1994 డిసెంబరు 24 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శ్రేయాస్ జె ఉడుప |
2023 అక్టోబరు 19న తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఘోస్ట్ చిత్రంలో శివ రాజ్కుమార్, అనుపమ్ ఖేర్, జయరాం తదితరులతో అర్చన జోయిస్ ప్రధాన పాత్రలో నటించింది.
చిన్న వయస్సులోనే తల్లి పాత్రలు పోషించిన అతికొద్ది మంది భారతీయ నటీమణులలో ఆమె ఒకరు. మొదటి సినిమాలోని ఆమె డైలాగ్ చక్కని ప్రజాదరణ పొందింది. ఆ డైలాగ్ ని తెలుగులోకి అనువాదం,"వెయ్యి మంది మీ వెనుక నిలబడితే మీకు ధైర్యం వస్తే, మీరు యుద్ధంలో మాత్రమే గెలవగలరు. కానీ మీరు వారి ముందు నిలబడితే వెయ్యి మందికి ధైర్యం ఉంటే, మీరు ప్రపంచాన్ని జయించగలరు".
ఆమె టెలివిజన్ ధారావాహికలైన దుర్గా, మహాదేవిలలో ప్రధాన పాత్రలు పోషించడం ద్వారా తన బుల్లితెర వృత్తిని ప్రారంభించింది. ఆమె విజయరథ, మరాఠీ చిత్రం రాజ్కుమార్ వంటి చిత్రాలలో రెండవ మహిళా ప్రధాన పాత్ర పోషించింది.
ఆమె హోండిసి బరేయిరి, #మ్యూట్లతో పాటు నిర్మాణంలో ఉన్న నక్షే, కలంకటా వంటి చిత్రాలలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
This article uses material from the Wikipedia తెలుగు article అర్చన జోయిస్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.