నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలను తిరుపతిలో 2012వ సంవత్సరం డిసెంబరు 27, 28, 29 తేదీలలో నిర్వహించారు.
దీని ఖర్చు 25కోట్లుగా ప్రతపాదించారు. డిసెంబరు 27,28, 29, 2012లో తిరుపతిలో జరప నిశ్చయించింది. ఈ సభను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సభలను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని శ్రీవేంకటేశ్వర ప్రాంగణములో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ.యస్.ఎల్.నరసింహన్, సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఈ ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు కొన్ని ఉపవేదికలను ఏర్పటుచేసి తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రి చిరంజీవి అధ్యక్షత వహించగా, విశిష్ట అతిథిగా తమిళనాడు గవర్నరు కొణిజేటి రోశయ్య, ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి హాజరయ్యారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య, సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను ప్రభుత్వం అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి
This article uses material from the Wikipedia తెలుగు article నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.