2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.
ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్ లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది. దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు.
2019 పుల్వామా దాడి | |
---|---|
ప్రదేశం | లేథిపురా, పుల్వామా జిల్లా, జమ్ము కాశ్మీర్, భారతదేశం |
భౌగోళికాంశాలు | 33°57′53″N 74°57′52″E / 33.96472°N 74.96444°E |
తేదీ | 2019 ఫిబ్రవరి 14 15:15 ఇండియన్ స్టాండర్డ్ టైం (యూటీసీ+05:30) |
లక్ష్యం | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన రక్షణ దళ సైనికులు |
దాడి రకం | ఆత్మాహుతి దాడి, కారు బాంబు |
మరణాలు | 41 (40 సీఆర్పీఎఫ్ దళ సభ్యులు, 1 ఆత్మాహుతి బాంబర్) |
ప్రాణాపాయ గాయాలు | 35 |
నేరస్తులు | జైష్-ఎ-మహమ్మద్ |
This article uses material from the Wikipedia తెలుగు article 2019 పుల్వామా దాడి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.