భైరాన్సింగ్ షెకావత్,1923, అక్టోబర్ 23 న జన్మించాడు.
షెకావత్ భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. కృష్ణకాంత్ మరణానంతరం 2002 ఆగస్టులో నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెల్చి 2007 జూలై 21 వరకు రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో ప్రతిభా పాటిల్ చేతిలో ఓడి రాజీనామా సమర్పించే వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1977 నుంచి 1980, 1990 నుంచి 1992, 1993 నుంచి 1998 వరకు 3 పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించాడు. తన హయంలో ప్రారంభించిన పేదరిక నిర్మూలన కార్యక్రమమైన అంతోద్యయ పథకం ఆయనకు ఎంతో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.87 సంవత్సరాల వయస్సులో శ్వాససంబంధ సమస్యలతో 2010, మే 15 న జైపూర్లో మరణించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article భైరాన్సింగ్ షెకావత్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.